పంచాయతీ ఎన్నికలల్లో స్త్రీలకు 33% రేజర్వేషన్లు ప్రకటించటంతో స్త్రీలు అధికారంలోకి రావటం మొదలైనప్పుడు, "ఈ ఆడవాళ్ళకేం తెలుస్తుంది. వెనుక భర్తలు ఉంది వాళ్ళెలా చేయమంటే ఆలా చేస్తార" నే విమర్శ అన్ని చోట్ల నుండి వచ్చింది. ఐతే పంచాయితీలలో స్ధానం సంపాదించిన కొద్దీ రోజులలోనే స్త్రీలు పంచాయతీ పనితీరుని అర్ధం చేసుకుని సమర్ధంగా తమ అధికార విధులను నిర్వహించటం ప్రారంభించారు. 1998 వ సంవత్సరంలో న్యూయర్స్ వెళ్ళి యు.ఎన్.డి.పి. "బీదరికానికి వ్యతిరేకంగా వేసే ముందడుగు" పేరుతో ఇచ్చిన అవార్డును తీసుకున్న ఫాతిమాబీ రాజకీయరంగంలో స్త్రీల సామర్ధ్యానికి ఒక మంచి ఉదాహరణ.
1995 వ సంవత్సరంలో ఫాతిమా బీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని 'కాల్వ' గ్రామా సర్వంచ్ అయ్యారు. అసలు జరిగిన విషయం ఏమిటంటే - ఫాతిమాబీ భర్త సయ్యద్ మొహియుద్దీన్ భాషా సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాడు. ఆయనకు భూములున్నాయి. వ్యాపారం ఉంది. తీరా అయన పోటీకి దిగే సరికి ఆ పదవి స్త్రీల కోసం రిజర్వ్ చేయబడిందని తెలిసింది. దాంతో అయన నామినేషన్ ఫారాలు ఇంటికి తెచ్చి, అంతవరకు పర్దాలో ఉన్న ఫాతిమాబీ కి కాగితాలిచ్చి సంతకం చేయమన్నాడు. సంతకం చేస్తున్నప్పుడు ఫాతిమా బీ కూడా వ్యవహారాలన్నీ భర్త చూసుకుంటాడనే అనుకున్నారు.
ఆ సమయంలోనే ఆ గ్రామంలో యు.ఎన్.డి.పి. ప్రారంభించిన రుణ సదుపాయం, పొదుపు కార్యక్రమాలలోకి వెచ్చే స్త్రీల సమాఖ్య బాగా పెరుగుతోంది. పాతిమాబీ కి ఊరి పరిస్ధితిని అర్ధం చూసుకునేందుకు ఒక సంవత్సరం పట్టింది. సంవత్సరంలో ఆ గ్రామంలోని పొడువు సంఘాల స్త్రీలు పాతిమాబీ. కాల్వ గ్రామా స్త్రీలు, ఆ గ్రామాన్ని తమ జీవితాలను మార్చుకున్నారు.
ఆ గ్రామంలోని స్త్రీలందరు కలిసి నీళ్ళ ట్యంకును మరమ్మత్తు చెంచుకున్నాడు. రోడ్లు వేశారు. చెక్ డ్యాంలు నిర్మించారు. పాఠశాల భవనాలు బాగుచేసుకున్నారు. చిన్న వ్యాపారాలకు, దుకాణాలకు అప్పులిచ్చారు. వ్యవసాయ కూలీలా పిల్లల కోసం "అమ్మబడి" పేరుతో క్రేష్ ఏర్పాటు చేసుకున్నారు. "జీవనజ్యోతి" పేరుతో ఏ ఆధారము లేకుండా ఒంటరిగా జీవించే స్త్రీలకు ఇల్లు కట్టించటం, జీవనోపాధి చూపించటం వంటి పనులు చేశారు. ఆ గ్రామంలోని ఐదువందల ఎకరాలకు నీళ్ళు వచ్చే కాలువను తవ్వారు. యు.ఎన్.డి.పి. కార్యక్రమంలో భాగమైన స్వయం సహాయ సంఘాలు కూడా వేగంగా అభివృద్ధి చెందాయి. మూడు వందల మంది స్త్రీలు రెండు లక్షల రూపాయలు పొదుపు చేశారు.
ఈ స్త్రీల ఉత్సాహం చూసి యు.ఎన్.డి.పి. కొత్త కార్యక్రమాన్ని ప్రయేగాత్మకంగా చేయాలనీ తలపెట్టింది. పంచాయితీ సర్పంచ్ అయిన ఫాతిమా బీ నాయకత్వంలో గ్రామాభివృద్ధి సంగుము ఏర్పడి యు.ఎన్.డి.పి. నుంచి పన్నెండు లక్షల సీడ్ క్యాపిటల్ ను, రాయలసీమ గ్రామీణ బ్యాంకు నుంచి ఐదు లక్షలను సంపాదించి గ్రామాభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేశారు. పంట కాలవ నిర్మాణం కోసం స్త్రీలందరూ కలిసి ముప్పైవేల రూపాయలు పోగుచేశారు. జన్మభూమి కార్యక్రమం కింద ప్రభుత్వ సహాయంతో ఆ పని పూర్తిచేశారు. ఈ పనులన్నిటి వల్లనే ఫాతిమాబీ యు.ఎన్.డి.పి. అవార్డుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్మి కోఫీ అన్నన్ నుండి అందుకున్నారు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020