অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శకుంతలాదేవి

శకుంతలాదేవి

కంప్యూటర్లకే కంప్యూటర్ అయిన శ్రీమతి శకుంతలాదేవి కర్ణాటకలోని సుప్రసిద్దులైన బ్రాహ్మణా భాగవతుల ఇంత పుట్టింది.

కూచిపూడి భాగవతుల వంశంవారు ప్రాచీనకాలంలో నేలటూరు, శూలమంగళం గ్రామాలకు వెళ్ళి అక్కడ స్దిరపడి భాగవత నాట్యకళను ఉద్దరించారు. అక్కడ ఈమె కుటుంబీకులు వేషాలు వేసుకుని తమ తమ సంగీత నాట్యకళ నైపీణ్యులను చూపిస్తూ ప్రజలకు వినోదం కలిగిస్తూ మాన్యాలు, బహుమానాలు పొంది జీవించడం వీరి వృత్తి. బాల్యంలో ఈమె కొన్నాళ్ళు వారితో పటు ఊళ్ళు తిరుగుతుండేది.

బాల్యంలో చిన్న చిన్న మేజిక్ లతో ప్రారంభమైన ఈమె విద్య, రాను రాను ఎన్నెన్నో అడ్డుతలు చేసి అందర్నీ ఆశ్చర్య చకితులను చేసుండేది.

ఓసారి మైసూర్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు చేస్తుండే గణితలను చేసి అందిరిని ఆశ్చర్యపరిచింది. ఎవరికీ అంతుబట్టని లెక్కలను తీసుకుని అతి సులువుగా సెకన్లలో చేసి చూపేది.

గణిత శాస్త్రంలో ప్రపంచంలో ఈమెకు సాటి పోటీ ఎవ్వరు లేరు.

అలాగే క్రీస్తుపూర్వం పాలనా సంవత్సరంలో పాలనా నెలలో ఓ తేదీ చెప్పి - ఆ రోజు ఏ వారం అంటే ఆ వారం పేరు సెకన్లలో చెప్పగలదు. అలాగే రానున్న శతాబ్దాలలో ఓ తేదీ చెప్పి - ఆ రోజు ఏ వారం వస్తుందన్న సెకన్లలో అద్భుతంగా చెప్పగలుగుతుంది.

ఈమె మేధాశక్తికి ప్రపంచ మేధావులే ఎంతో ఆశ్చర్యపడుతున్నారు. ఇదేదో మంత్రశక్తి అని అన్నవారికి ఇది తనకు భగవంతుడిచ్చిన కనుక అని చెప్పుకుంటుంది శకుంతలాదేవి.

ఈమెను ప్రపంచంలోని అనేక దేశాలవారు ఆహ్వానించి ఈమె అత్యద్భుత మేధాశక్తిని స్వయంగా చూచి పరిశించి తన్మయులైనారు.

1977 లో అమెరికాలోని వాషింగ్ తాన్ డి.సి. వారు కొత్తగా తాము కనిపెట్టిన అత్యంత అధునాతమైన యూనివ ఎ.సి. 1108 కంప్యూటర్ ను కనిపెట్టి శకుంతలాదేవిని పోటీకి పిలిచారు. అది ఎంత ఆధునికమైనదంటే మానవుల మేధస్సు కంటే వేగంగా పనిచేస్తుందది.

శ్రీమతి శకుంతలాదేవికిది గొప్ప పరీక్ష సమయం. అయితే ఆమె తొణకక, బెణకక తన సామర్ధ్యానికి సవాల్ గా తీసుకుంది. 201 స్ధానాలు గల ఆ అంకెను 23 కు తీసుకురావాలి.

ఇది సాధించడానికి ఆధునికమైన ఆ కంప్యూటర్ కు ఒక నిమిషం ఒక సెకండు పట్టగా - ఈమెకు 50 సెకూన్లు మాత్రమే పట్టింది. ఆమె అద్భుత తెలివికి అక్కడివారు ఆశ్ఛర్యపోయారు. కంప్యూటర్ కంపెనీవారు తాము సాధించామనుకున్న ప్రగతికి సిగ్గుపడ్డారు.

ఈ అద్భుత సంఘాతనను అమెరికా పత్రికలు వేనోళ్ళ ప్రశంసించినవి. ముఖ్యంగా 'డాళ్లను థైమ్స్' పత్రిక Most Authetic Heroine of 20th Century అని పతాక శీర్షిక పెర్రీ వార్త ప్రచురించారు. (20 వ శతాబ్దపు నిజమైన గణిత శాస్త్రజరాలు).

ఈమె ప్రపంచ వ్యాప్తంగా పొందిన ఖ్యాతిక 'గిన్నెస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్' లో ఎక్కింది.

ఈమె తాను స్వయంకృషితో సాధించిన తన మేధస్సును వృధాగా పోకుండా సాటి ప్రజానీకానికి ఉపయెగపడాలని అనేక పుస్తకాలు రాసింది.

గుక్క తిప్పుకోకుండా లెక్క ఏదైనా చేయకుండానే అవలీలగా జవాబిస్తుంది.

ఈమె మంచి సంప్రదాయవాదిని. ఆ మధ్య యిలసైటుటెడ్ వీక్లి ప్రతీక ఈమెను - దేశంలో బ్రాహ్మణీకం ఇంకా ఈ కాలంలో కూడా ఉండాలా - కులాలు మతాలు భేదాలు లేకుండా ఒక్కటైతే బాగుంటుంది కదా అని ఈమెను ప్రశ్నిమ్చినప్పుడు - బ్రాహ్మణులూ ప్రత్యేకంగానే ఉండాలి ఉంటేనే దేశానికి మంచిది. అసలు బ్రాహ్మణకాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని ఎదురు ప్రశ్నించింది.

కుల, వర్ణ, ధర్మాలు, స్వష్టమైన, ఉపయెగకరమైన అంతరివభజనగా నేనంగీకరిస్తాను. వ్యక్తులకంటే కుటుంబములు, వడలు, సంఘుమునకు సహజ భాగములని ఒప్పుకుంటాను అన్న మిస్ ఏ.ఎమ్ హార్డ్ కాజల్ మాటలే శ్రీమతి శకుంతలాదేవి అభిప్రాయాలూ.

ఈమె ఎన్ని దేశాలు తిరిగినా, ఎవరితో మాట్లాడిన, తన ఆచారాలనే పాటించే ఉత్తమ ఇల్లాలు.

ఆధారం : రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్ధ

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/16/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate