অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

భారతదేశ చరిత్రలో ముఖ్యమైన తారీఖులు

భారతదేశంలో ముఖ్యమైన దినోత్సవాలు

క్రీస్తు పూర్వము

3000-1500 సింధూ నాగరికత కాలము

576 గౌతమ్ బుద్ధుడు జన్మము

527 మహావీర్ జన్మము

327-326 అలెగ్జాండరు భారత దేశం పై దండయాత్ర. భారతదేశం మరియు యూరప్ ల మధ్య నేల మార్గము ప్రారంభం

313 జెయిన్ ఇతిహాసాల ప్రకారం చంద్రగుప్తా మౌర్య ప్రవేశము

305 చంద్రగుప్త మౌర్య చేతిలో సెల్యూకస్ అపజయము

273-232 అశోక రాజ్యపాలన

261 కళింగను ఆక్రమించుట

145-101 ఎల్లోరా ప్రదేశము, శ్రీలంకకు చోళరాజు

58 విక్రమ్ కాలము ప్రారంభము

క్రీస్తు శకము

78 సాక కాలము ప్రారంభము

120 కనిష్క ప్రవేశము

320 గుప్తుల కాలము ప్రారంభము. భారత దేశ హిందువుల స్వర్ణ యుగము

380 విక్రమాదిత్య ప్రవేశము

405-411 చైనా యాత్రికుడు ఫాహీన్ సందర్శన

415 మొదటి కుమార గుప్త ప్రవేశము

455 స్కాండో గుప్త ప్రవేశము

606-647 హర్షవర్ధన రాజ్యపాలన

712 అరబ్లు సింధ్ లో మొదటి దండయాత్ర

836 కన్నౌజ్ కు భోజ రాజు ప్రవేశము

85 ఛోళ పరిపాలకుడు రాజరాజ ప్రవేశము,

998 సుల్తాన్ మెహమూద్ ప్రవేశము

1000 – 1499

1001 పంజాబ్ పరిపాలకుడు, జైపాల్ ను ఓడించిన, మెహమూద్ ఛజ్ని చేత భారతదేశం మొదటి దండయాత్ర

1025 మెహమూద్ గజనీ సొమనాధ్ ఆలయాన్ని నాశనము చేయుట

1191 టెహరాన్ మొదటి యుద్ధము

1192 టెహరాన్ రెండవ యుద్ధము

1206 ఢిల్లీ సింహాసనానికి కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ ప్రవేశము

1210 కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ మరణం

1221 ఛెంగిస్ ఖాన్ భారతదేశాన్ని దండయాత్ర చేసాడు (మంగోల్ దండయాత్ర)

1236 ఢిల్లీ సింహాసనానికి రజియా సుల్తానా ప్రనేశము

1240 రజియా సుల్తానా మరణం

1296 అల్లా-ఉద్-దిన్ ఖిల్జి ప్రవేశము

1316 అల్లా-ఉద్-దిన్ ఖిల్జి మరణం

1325 ముహమద్-బిన్ తుగ్లక్ ప్రవేశము

1327 తుగ్లక్ చే ప్రధాన నగరం ఢిల్లీ నుండి దౌలతాబాద్ కు, అక్కడ నుండి దక్కన్ కు మార్చడం

1336 దక్షిణంలో విజయనగరం సామ్రాజ్యం స్థాపించడం

1351 ఫిరోజ్ షా ప్రవేశము

1398 తైమూరు లాంగ్ భారతదేశం పై దండయాత్ర

1469 గురు నానక్ జన్మము

1494 ఫార్గనాలోకి బాబర్ ప్రవేశము

1497-98 భారతదేశానికి వాస్కొడిగామ మొదటి ప్రయాణం (వయా కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా భారతదేశానికి సముద్ర మార్గము కొనుగొనుట)

1500 – 1799

1526 మొదటి పానిపట్ యుద్ధము, బాబర్ ఇబ్రహిమ్ లోడిని ఓడించాడు బాబర్ చే మొగల్ పరిపాలనని స్థాపించడం

1527 కాణ్వా యుద్ధం. బాబర్ రాణా సంగాని ఓడించాడు

1530 బాబర్ మరణం మరియు హుమాయున్ ప్రవేశము

1539 హుమాయున్ ని ఓడించి మరియు షేర్ షా సూరి భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు

1540 కన్నౌజ్ యుద్ధము

1555 ఢిల్లీ సింహాసనాన్ని హుమయూన్ తిరిగి చేజిక్కించుకున్నాడు

1556 రెండవ పానిపట్ యుద్ధము

1565 తాలికోట యుద్ధము

1576 హల్దిఘాట్ యుద్ధము; అక్బర్ చేతిలొ రాణా ప్రతాప్ ఓడిపోవుట

1582 దీన్ – ఎ – ఇల్లాహిని అక్బర్ స్థాపించాడు

1597 రాణా ప్రతాప్ మరణం

1600 ఈస్ట్ ఇండియా కంపనీ స్థాపించబడింది

1605 అక్బర్ మరణం మరియు జహంగీర్ ప్రవేశము

1606 గురు అర్జున్ దేవ్ ను ఉరితీయుట

1611 నూర్జహాన్ తో జహంగీర్ పెళ్ళి

1616 జహంగీర్ ను సర్ థామస్ సందర్శించుట

1627 జహింగీర్ మరణం మరియు శివాజీ జననం

1628 షాజహాన్ భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు

1631 ముంతాజ్ మరణం

1634 బెంగాల్ లో వ్యాపారం చేసుకునటకు బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చారు

1659 ఔరంగజేబు ప్రవేశము, షాజహన్ ని చెరసాలలో బంధించుట

1665 ఔరంగజేబు శివాజీని చెరసాలలో బంధించుట

1666 షాజహన్ మరణం

1675 సిక్కుల తొమ్మిదవ గురువు, తేగ్ బహుధూర్ ని ఉరితీయుట ,

1680 శివాజీ మరణం

1707 ఔరంగజేబు మరణం

1708 గురు గోబింద్ సింగ్ మరణం

1739 భారతదేశం పై నధీర్ షా దండయాత్ర

1757 ప్లాసీ యుద్ధం, లార్డ్ క్లైవ్ చేతిలో భారతదేశ రాజకీయ పాలనలో బ్రిటిష్ స్థాపన

1761 మూడవ పానిపట్ యుద్ధం; షా అలమ్ II భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు

1764 బక్సార్ యుద్ధం

1765 భారతదేశంలో కంపెనీ గవర్నరుని క్లైవ్ నియమించాడు

1767-69 మొదటి మైసూర్ యుద్ధం

1770 బెంగాల్ లొ పెద్ద కరువు

1780 మహరాజా రంజిత్ సింగ్ జననం

1780-84 రెండవ మైసూర్ యుద్ధం

1784 పిట్స్ ఓమ్డోవా చట్టం

1790-92 మూడవ మైసూర్ యుద్ధం

1793 బెంగాలులో శాశ్వత నిర్ణయ పద్ధతి

1799 నాలుగవ మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాను మరణం

1800 – 1900

1802 బేసెయిన్ ఒప్పందం

1809 అమృత్ సర్ ఒప్పందం

1829 సతి దురాచారముని నిషేధించారు

1830 బ్రహ్మ సమాజ స్థాపకుడు, రాజా రామ్మోహనరాయ్ ఇంగ్లాండుని సందర్శించాడు

1833 రాజా రామ్మోహనరాయ్ మరణము

1839 మహరాజా రంజిత్ సింగ్ మరణము

1839-42 మొదటి ఆఫ్ఘన్ యుద్ధం

1845-46 మొదటి ఆంగ్లో - సిక్కుల యుద్ధం

1852 రెండవ ఆంగ్లో - బర్మాల యుద్ధం

1853 మొదటి రైల్వే లైన్ బొంబాయి మరియు థానె మధ్యన ప్రారంభించారు మరియు కలకత్తాలో ఒక తంతి-తపాలా ( telegraph) లైన్ ప్రారంభించారు

1857 సిపాయిల తిరుగుబాటు లేదా మొదటి స్వాతంత్ర యుద్ధం

1861 రవీంద్రనాథ్ ఠాగూర్ జననం

1869 మహాత్మగాంధి జననం

1885 భారతదేశ జాతీయ కాంగ్రెస్ స్థాపన

1889 జవాహర్ లాల్ జననం

1897 సుభాష్ చంద్ర బోస్ జననం

1900 - 1970

1904 టిబెట్ యాత్ర

1905 లార్డ్ కర్జన్ అధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన

1906 ముస్లిం లీగ్ స్థాపన

1911 ఢిల్లీ దర్బారు; భారతదేశాన్ని రాజు మరియు రాణి సందర్శించారు; ఢిల్లీ భారతదేశానికి ప్రధాన నగరం అయ్యింది

1916 మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది

1916 ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ లచే లక్నో ఒప్పందం

1918 మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది

1919 మాంటేగ్ – జేమ్స్ సంస్కరణల ప్రవేశపెట్టారు, అమృత్ సర్ వద్ద జలియన్ వాలాబాగ్ సామూహిక హత్య

1920 ఖిలావత్ ఉద్యమ ప్రారంభం

1927 సైమన్ కమిషన్ నిషేధింపు, రేడియో ప్రసారాల ప్రారంభం

1928 లాలా లజపత్ రాయ్ (షేర్- ఎ-పంజాబ్)

1929 లార్డ్ ఓర్ఓమ్స్ ఒప్పందం, లాహోర్ కాంగ్రెస్ లో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం

1930 పురజనుల అవిధేయత (civil dis-obedience) ఉద్యమ ప్రారంభం; మహాత్మ గాంధిచే దండి యాత్ర (ఏప్రిల్ 6వ తేదీన, 1970)

1931 గాంధి - ఇర్విన్ ఒప్పందం

1935 భారత ప్రభుత్వ చట్టం అమలులోకి వచ్చింది

1937 రాష్ట్రాలలో స్వతంత్రత, కాంగ్రెస్ మంత్రులను ఏర్పాటు చేసింది

1939 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం (సెప్టెంబర్)

1941 రవీంద్రనాధ్ ఠాగుర్ మరణం, భారతదేశం నుండి సుభాష్ చంద్ర బోస్ తప్పించు కోవడం

1942 భారతదేశంలో క్రిప్స్ మిషన్ రావడం,‘క్విట్ ఇండియా’ ఉద్యమం ప్రారంభం (8వ తారీఖు ఆగష్టున)

1943-44 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ప్రొవిన్షియల్ అజాద్ హిందు హుకూమత్ మరియు భారత జాతీయ సైన్యం ( Indian national army ) ఏర్పాటు చేసారు, బెంగాల్ లొ చిన్న కరువు

1945 ఎర్ర కోట వద్ద ఇండియన్ ఆర్మీ న్యాయ విచారణ; సిమ్లా సమావేశము, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది

1946 భారతదేశానికి బ్రిటిష్ కేబినెట్ మిషన్ సందర్శన; కేంద్రలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు

1947 భారతదేశ విభజన; భారతదేశం మరియు పాకిస్థాన్ ప్రత్యేకమైన స్వతంత్ర అధినివేశములుగా ఏర్పాటు

1948 మహాత్మ గాంధి హత్య (30 వ తారీఖు జనవరిన); అతిఘనమైన రాష్ట్రాల కూర్పు

1949 కాశ్మీరులో కాల్పుల విరమణ, భారత రాజ్యాంగం సంతకం చేసి అమలు పరచడం (26 వ తేదీ నవంబరున)

1950 భారతదేశం సావరీన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అయ్యింది (26 వ తారీఖు జనవరి) మరియు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది

1951 మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా గేమ్స్ నిర్వహణ

1952 లోక్ సభ మొదటి సాధారణ ఎన్నికలు

1953 టెన్సింగ్ నార్కె మరియు సర్ ఎడ్మండ్ లు మౌంట్ ఎవరెస్టుని అధిరోహణ

1956 రెండవ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం

1957 రెండవ సాధారణ ఎన్నికలు; డెసిమల్ నాణాల ప్రవేశం, గోవా విడుదల

1962 భారత దేశంలో మూడవ సాధారణ ఎన్నికలు; భారత దేశంపై చైనా ముట్టడి (20 వ తేదీ డిసెంబరున)

1963 నాగాలాండ్ భారత దేశం యొక్క 16వ రాష్ట్రం అవ్వడం

1964 పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ మరణం

1965 భారత దేశంపై పాకిస్థాన్ ముట్టడి

1966 తాష్కెంట్ ఒప్పందం; లాల్ బహాదుర్ శాస్త్రి మరణం; భారత దేశానికి శ్రీమతి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ఎన్నికవడం

1967 నాలుగవ సాధారణ ఎన్నికలు; భారత దేశానికి మూడవ రాష్ట్రపతిగా డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఎన్నికవడం

1969 భారతదేశానికి రాష్ట్రపతిగా వి.వి.గిరి ఎన్నికవడం, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ముందున్న మంచి బ్యాంకులను జాతీయకరణ

1970 స్వతంత్ర రాష్ట్రంగా మేఘాలయని చేయడం

1971 - 2004

1971 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అవడం; భారత-పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పడడం

1972 సిమ్లా ఒప్పందం; సి.రాజగోపాలాచారి మరణం

1973 మైసూర్ రాష్ట్రాన్ని కర్ణాటకగా తిరిగి నామకరణం చేయడం

1974 భారతదేశం పరమాణు పరికరాన్ని పేల్చింది; ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఐదవ భారత రాష్ట్రపతిగా ఎన్నికవడం, సిక్కిం భారతదేశ సహ రాష్ట్రమవ్వడం

1975 భారతదేశం ‘ఆర్యభట్ట’ని పంపింది; సిక్కిం భారత యూనియన్ 22వ రాష్ట్రం అయ్యింది; అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది

1976 భారతదేశం మరియు చైనా దౌత్య సంబంధాల స్థాపన

1977 ఆరవ సాధారణ ఎన్నికలు; లోక్ సభలో జనతా పార్టీకి మెజారిటీ పొందింది; నీలం సంజీవ రెడ్డి ఆరవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు

1979 మొరార్జీ దేశాయి ప్రధాన మంత్రిగా రాజీనామా చేసారు, చరణ్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు; చరణ్ సింగ్ (20వ తేదీ ఆగస్టున) రాజీనామా చేసారు, ఆరవ లోక్ సభని చాలించారు

1980 ఏడవ సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ ఐ వచ్చింది; శ్రీమతి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధి మరణించారు, భారతదేశం ఎస్ ఎల్ వి – 3 ని రోహిణి సేటెలైట్ తోపాటు అంతరిక్షంలోకి పంపింది

1982 ఆసియాలోనే అతి పొడవైన బ్రిడ్జిని (మార్చి 2వ తేదీన) ప్రారంభంచారు; ఆచార్య జె. బి. క్రిపలాని (మార్చి 19వ తేదీన) మరణించారు, ఇన్సాట్ – 1ఎ ని పంపారు; జ్ఞాని జెయిల్ సింగ్ భారత రాష్ట్రపతిగా (జూలై 15వ తేదీన) ఎన్నికయ్యారు, గుజరాత్ తుఫాన్లో ( నవంబరు 5న) 500 కన్నా ఎక్కువమంది మరణించారు; ఆచార్య వినోభా ( నవంబరు 15న) మరణించారు; తొమ్మిదవ ఆసియా ఆటల పోటీలు ( నవంబరు 19న) ప్రారంభించారు

1983 కొత్త ఢిల్లీలో సి ఎచ్ ఒ జి ఎమ్ నిర్వహించబడింది

1984 పంజాబ్ లో ఆపరేషన్ బ్లూ స్టార్; రాకేష్ అంతరిక్షంలోకి వెళ్ళారు; శ్రీమతి ఇందిరా గాంధి హత్యగావిచబడింది; రాజీవ్ గాంధి ప్రధాన మంత్రి అయ్యారు

1985 రాజీవ్ – లోంగోవాల్ ఒప్పందం సంతకం చేసారు; పంజాబ్ ఎన్నికలలో సంత్ హెచ్.ఎస్. లోంగోవాల్ ని చంపివేశారు; అస్సాం ఒప్పందం; ఏడవ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభించారు

1986 మిజోరం ఒప్పందం.

1987 ఆర్. వెంకటరాఘవన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; శంకర్ దయాళ్ శర్మ భారత ఉప - రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; బోఫోర్స్ తుపాకి మరియు ఫెయిర్ పేక్స్ వివాదాలు

1989 అయోధ్య వద్ద రామ శిలల పూజ; భారతదేశ మొదటి ఐ ఆర్ బి ఎమ్, ఒరిస్సా నుండి ‘అగ్ని’ ని విజయవంతంగా (మే 22 తేదీన) ప్రయోగించారు; త్రిశూల్ క్షిపణి (జూన్ 5 వ తేదీన) పరీక్షించారు; పృథ్వి రెండవసారి విజయవంతంగా (సెప్టెంబరు 27 తేదీన) ప్రయోగించారు; రాజీవ్ ప్రభుత్వం ఎన్నికలలో ఓడిపోయింది మరియు రాజీవ్ (నవంబరు 29 తేదీన)రాజీనామా చేసారు; జవాహర్ రోజ్ గార్ పథకం (నవంబరు 29 తేదీన) ప్రారంభించారు; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసారు, (డిసెంబరు2 తేదీన) కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణము, తొమ్మిదవ లోక్ సభ నియమించబడింది

1990 (మార్చి 25 తేదీన) చివరి భారతదేశ శాంతి భద్రతలను కాపాడే దళం (ఐ పి కె ఎఫ్) తిరిగి రావడం; ఇండియన్ ఎయిర్ లైన్స్ ఏ-320 ఎయిర్ బస్ దుర్ఘటన (ఫిబ్రవరి 14 తేదీన); జనతా దళ్ విడిపోయింది; ప్రభుత్వానికి బిజెపి మద్దతు విరమించుకుంది; అద్వానీ రధ యాత్ర చేసినందుకు పట్టుకున్నారు, మండల్ నివేదిక అమలు చేసినట్లు వి.పి. సింగ్ ప్రకటించారు; రామ జన్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం వలన అయోధ్య లో జరిగిన హింసాకాండ

1991 (జనవరి, 17 తేదీన) గల్ఫ్ యుద్ధం ప్రారంభం; (మే 21వ తేదీన)రాజీవ్ గాంధీని హత్య చేయబడటం; పదవ లోక్ సభ (జూన్ 20వ తేదీన) నియమించబడింది; పి.వి. నరసింహరావు ప్రధాన మంత్రి అయ్యారు.

1992 (జనవరి 29వ తేదీన)భారతదేశం పూర్తి దౌత్య సంబంధాలు ఇజ్రాయిల్ తో స్థాపించుకుంది; (ఏప్రిల్, 23వ తేదీన)భారతరత్న మరియు ఆస్కార్ విజేత సత్యజిత్ రే మరణం; (జులై 25 తేదీన) ఎన్.డి.శర్మ రాష్ట్రప్రతిగా ఎన్నికయ్యారు; ఫిబ్రవరి 7న తేదీన మొదట స్వదేశీయంగా నిర్మించిన ఐ ఎన్ ఎస్ శక్తి సబ్ మెరీన్ పంపారు.

1993 (జనవరి 7వ తేదీన) అయోధ్యలో 67.33 ఎకరాలు పొందడానికి ఆర్డినెన్స్; బిజెపి ర్యాలీలో, పెద్దమొత్తంలో సురక్ష విఫలం; బొంబాయిలో వరుస బాంబుల వలన 300 మంది చనిపోయారు; ఇన్సాట్-2బి పూర్తిగా ఆపరేషన్ లోకి వచ్చింది; మహారాష్ట్రంలో భూకంపం.

1994 పౌర విమాన సేవల మీద ప్రభుత్వం యొక్క మోనోపొలి ముగిసింది. ధరలు మరియు వ్యాపారం మీద సాధారణ (జి ఏ టి టి) ఒప్పందం మీద దుమారం, ప్లేగు వ్యాధి ప్రారంభం, విశ్వ సుందరి సుష్మితా సేన్, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ అయ్యారు.

1995 మాయావతి ఉత్తరప్రదేశ్ కి మొదటి హరిజన ముఖ్యమంత్రి; గుజరాత్ మరియు మహారాష్ట్రలలో బిజెపి కర్ణాటకలో జనతాదళ్ మరియు ఒరిస్సాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి;ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (టి) ఏర్పాటు, మాయావతి దిగిపోయేక ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పరిపాలన; ఇన్సాట్ 2సి మరియు ఐ ఆర్ ఎస్ ఐ- సి పంపారు.

1996 అనేక కేంద్ర మంత్రులు మరియు ప్రతిపక్ష నాయుకులు హవాలాలో దెబ్బ తిన్నారు; మార్చ్21 తేదీన ఐ ఆర్ ఎస్ పి తో పి ఎస్ ఎల్ వి డి 3 ని అంతరిక్షంలోకి పంపి, భారత దేశ అంతరిక్ష కార్యక్రమాలలో కొత్త యుగంలోకి అడుగు పెట్టారు ప్రవేశపెట్టడం; ఏప్రిల్ 12వ తేదీన పదకొండవ లోక్ సభ ఎన్నికలు జరిగాయి, బిజెపి ఒక అతి పెద్ద పార్టీగా వెలువరించింది

1997 ఆగస్టు 15వ తేదీన, భారతదేశం తన 50వ స్వతంత్రం సంవత్సరం జరుపుకుంది.

1998 మదర్ తెరిసా మరణం; వాజ్ పాయి ప్రధాన మంత్రి అయ్యారు; భారతదేశం తన రెండవ పరమాణు పరికరాన్ని (పోక్రాన్ II) పేల్చింది.

1999 ఇండియా ఎయిర్ లైన్స్ ఐసి – 814 విమానం తీవ్రవాదులచేత హైజాక్ చేయబడి, డిసెంబర్ 24న, 1999 న కాందహార్ , ఆఫ్ఘానిస్తాన్ కి తీసుకుని వెళ్ళారు. బంధీలుగా ఉంచిన ప్రయాణికుల స్వేచ్ఛ కొరకు భారత ప్రభుత్వం ముగ్గురు తీవ్రవాదులను విడిచిపెట్టారు. జూన్ 1999లో, పట్టుకొనబడిన లెఫ్టినెంట్ కె. నచికేత, భారతదేశపు పైలట్ , బందించి ఉంచిన ఎనిమిది రోజుల తరువాత పాకిస్తాన్ విడిచి పెట్టింది. జమ్మూ & కాశ్మీర్ లోని కార్గిల్ సెక్టరులో చొరబడిన పాకిస్తాన్లను పంపివేయడానికి భారత సేన ఆపరేషన్ విజయ్ ని ప్రారంభించింది. భారతదేశం విజయం సాధించింది.

2000 మార్చ్ 2000 లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంటు భారతదేశానికి సందర్శించారు. మూడు కొత్త రాష్ట్రాలు ఛత్తీస్ గఢ్, ఉత్తారాంచల్, జార్ఖండ్ ఏర్పాటయ్యాయి. భారత దేశం జనాభా ఒక బిలియన్ ని మించింది

2001 జులై 2001 లో భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య ‘ఆగ్ర శిఖరాగ్ర సమావేశం’; భారతదేశంలో ఘోరమైన ప్రకృతిసిద్ధమైన ఆపద, జనవరి 2001 లో గుజరాత్ భూకంపం; మార్చ్ 2001లో ఆయుధాల చీకటి వ్యాపారం మరియు భారత ఆర్మీ ఆఫీసర్లకు, మంత్రులకు, మరియు రాజకీయవేత్తలకు ముడుపులు గురించి తెలిపే వీడియో టేపులను తెహల్కా.కామ్ చిత్రీకరణ (screening) చేసింది; మార్చి 2001 న నాలుగవ భారత దేశపు జనాభా లెక్కలు (స్వతంత్రం నుండి) ముగిసాయి; ఆగస్టు 2001లో ఎన్రాన్ భారతదేశ శక్తి వర్గానికి వీడ్కోలు చెప్పింది; ఏప్రిల్ 2001న జి ఎస్ ఎల్ వి ని విజయవంతంగా పంపించారు మరియు అక్టోబరు 2001న పి ఎస్ ఎల్ సి - సి3 ని పంపడానికి నిర్వహణ చేసారు.

2002 71-సంవత్సరాల వయస్సుగల క్షిపణి శాస్త్రవేత్త, అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలామ్, భారత దేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; ఇటీవల చరిత్రలో అతి భయంకరమైన కులాల దాడులలో ఒకటి, గోద్ర సంఘటన; 2002 ఫిబ్రవరి 27వ తేదీన,గుజరాత్ లో జరిగింది; కావలసినంత మరియు నిరంతరం ఉండేలా వాడడానికి నీటి వనరుల వికాసం మరియు యాజమాన్యం సమన్వయ పరిచేలా లక్ష్యంగా పెట్టే, జాతీయ నీటి పోలసీని ఏప్రిల్ లో ప్రకటించారు.

2003 ఇండియాలో స్ట్రేటెజిక్ కమాండ్ దళాలు (ఎస్ ఎఫ్ సి) మరియు పరమాణు కమాండ్ ఆథారిటీ (ఎన్ సి ఏ) ఏర్పాటు; ఎస్ ఎఫ్ సి కి మొదటి ముఖ్య కమాండర్ గా ఎయిర్ మార్షల్ తేజా మోహన్ ఆస్తానాని నియమించారు; అభివృద్ధి చేసిన వివిధ ఉపయోగాలు కలిగిన సేటెలైట్, ఇన్సాట్ – 3ఏ ని ఫ్రెంచ్ గయానా లోని కొరో నుండి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు; జూన్ లో వైట్ కాలర్ నేరాలని నిరోధించడానికి, సిబిఐ ఒక అర్ధశాస్త్ర నేరపరిశోధన విభాగం ( economic intelligence wing ) ని ఏర్పరిచింది; డిసెంబరులో ఫ్రెంచ్ గయానా లోని కొరో స్పేస్ పోర్ట్ నుండి ఒక యూరోపియన్ రాకెట్ ద్వారా ఇండియా అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ సేటెలైట్ ఇన్సాట్ – 3ఇ ని పంపారు.

2004 సాధారణ ఎన్నికలో కాంగ్రెస్ మరియు దాని మిత్రమండలాలు, ఎన్ డి ఏ ప్రభుత్వాన్ని తీసివేశాయి; కాంగ్రెస్ అధినేత శ్రీమతి సోనియా గాంధి బలమైన స్థానములో ఉన్నప్పటికి భారతదేశ ప్రధానమంత్రి అవడానికి నిరాకరించారు; కాంగ్రెస్ మరియు దాని మిత్రమండలాలు, ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్వర్యంలో, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి.

ఆధారము: 123oye

భారతదేశంలో ముఖ్యమైన దినోత్సవాలు

  • జనవరి 12- జాతీయ యువకుల దినోత్సవం
  • జనవరి15 – సైనిక దినోత్సవం
  • జనవరి26 - గణతంత్ర దినోత్సవం
  • జనవరి 30 – అమర వీరుల సంస్మరణ దినోత్సవం
  • ఫిబ్రవరి 24- సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం
  • ఫిబ్రవరి 28- జాతీయ శాస్త్ర దినోత్సవం
  • ఏప్రిల్ 5- జాతీయ నౌక రవాణా దినోత్సవం
  • మే 11 – జాతీయ సాంకేతిక విజ్ఞాన శాస్త్ర దినోత్సవం
  • ఆగస్టు 9- క్విట్ ఇండియా దినం
  • ఆగస్టు 15- భారత స్వాతంత్ర దినోత్సవం
  • ఆగస్టు 29 – జాతీయ క్రీడల దినోత్సవం
  • సెప్టెంబరు 5 – ఉపాధ్యాయ దినోత్సవం మరియు సంస్కృతి దినోత్సవం
  • అక్టోబర్ 8 – భారత వైమానిక దళ దినోత్సవం
  • అక్టోబర్ 10 – జాతీయ తపాలా దినోత్సవం
  • నవంబర్ 14- బాలల దినోత్సవం
  • డిసెంబర్ 18 – బడుగు వర్గాల హక్కుల దినోత్సవం
  • డిసెంబర్ 23 – వ్యవసాయదారుల దినోత్సవం

ప్రపంచ ముఖ్యమైన దినోత్సవాలు

  • జనవరి 10- ప్రపంచ నవ్వుల దినోత్సవం
  • జనవరి 26 – అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం
  • జనవరి 30 – ప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలన దినం
  • మార్చ్ 8 – అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
  • మార్చ్15 – ప్రపంచ వికలాంగుల దినోత్సవం మరియు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
  • మార్చ్21 - ప్రపంచ అటవీ దినోత్సవం మరియూ ప్రపంచ జాతి భేదాల నిర్మూలన దినోత్సవం
  • మార్చ్22 - ప్రపంచ జల దినోత్సవం
  • మార్చ్ 23 - ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం
  • మార్చ్24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం
  • ఏప్రిల్ 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
  • ఏప్రిల్ 17- ప్రపంచ హేమోఫిలియా దినం
  • ఏప్రిల్ 18 - ప్రపంచ వారసత్వ దినోత్సవం
  • ఏప్రిల్ 22 – ప్రపంచ భూదినోత్సవం
  • ఏప్రిల్ 23 - ప్రపంచ పుస్తక దినోత్సవం
  • మే 1 – అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
  • మే 3- పత్రిక స్వేచ్ఛ దినోత్సవం
  • మే 8- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం
  • మే 12- అంతర్జాతీయ నర్సుల దినోత్సవం
  • మే 15 - అంతర్జాతీయ కుటంబ దినోత్సవం
  • మే 24- కామన్ వెల్త్ దినోత్సవం
  • మే 31 – పొగాకు వ్యతిరేక దినోత్సవం
  • జూన్ 5- ప్రపంచ పర్యావరణ దినోత్సవం
  • జూన్ 20- ( జూన్ లో మూడవ (ఆదివారం)పితృల దినోత్సవం
  • జులై 1 - అంతర్జాతీయ జోక్ దినోత్సవం
  • జులై 11 – ప్రపంచ జనాభా దినోత్సవం
  • జులై మూడవ ఆదివారం జాతీయ ఐస్ క్రీమ్ దినోత్సవం
  • ఆగస్టు 6- హిరోషిమా దినం
  • ఆగస్టు 9 – నాగసాకి దినం
  • సెప్టెంబరు 8- ప్రపంచ అక్షరాస్యతా దినం
  • సెప్టెంబరు 16- ప్రపంచ ఓజోన్ దినం
  • సెప్టెంబరు 26 – చెవిటివారి దినం
  • సెప్టెంబరు 27 – ప్రపంచ పర్యాటక దినం
  • అక్టోబరు 1 – ప్రపంచ వృద్ధుల దినోత్సవం
  • అక్టోబరు3- ప్రపంచ నివాస దినం
  • అక్టోబరు 4- ప్రపంచ జంతువుల సంక్షేమ దినోత్సవం
  • అక్టోబరు12 - ప్రపంచ దృష్టి దినం
  • అక్టోబరు 16 - ప్రపంచ ఆహార దినోత్సవం
  • అక్టోబరు 24- ఐక్యరాజ్యసమితి దినోత్సవం
  • అక్టోబరు30 - ప్రపంచ పొదుపు దినోత్సవం
  • నవంబరు 14- అతిసారవ్యాధి దినం
  • నవంబరు 29 - అంతర్జాతీయ పాలస్తీనియన్లతో ఏకత్వ అంతర్జాతీయ దినం
  • డిసెంబరు 1- ప్రపంచ సుఖవ్యాధుల దినం
  • డిసెంబరు 3 – ప్రపంచ వికలాంగుల దినం
  • డిసెంబరు 10- అంతర్జాతీయ ప్రసార దినం, మానవ హక్కుల దినం

ఆధారము: www.indianofficer.com

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate