- కాల్షియమ్ బలవైున ఎముకల నిర్మాణానికి, ఆరోగ్యకరమైన దంతాల ధృఢత్వానికి దోహదం చేస్తుంది.
- అస్థికండరాల మరియు హృదయకండరాలు పనిచేయుటకు రక్తం గడ్డకట్టడానికి , ఇతర కార్యకలాపాలకు కాల్షియమ్ ఆవశ్యకత ఉంది.
కాల్షియమ్ అత్యధికంగా ఉండే ఆహార పదార్ధాలు.
- పాలు, జున్ను, పెరుగు (యొగర్ట్) వంటి పాల ఉత్పత్తులలో(జంతు సంబంధపు అహారాలలో అధికం)
- పుదీన లేదా తోటకూర లేదా ముల్లంగి ఆకులు వంటి ఆకు కూరలలో (కాయగూరలలో అధికంగా)
- రాగుల వంటి చిరు ధాన్యాలు
- జామ ,పియర్స్, మరియు సీతాఫలం వంటి పండ్లు,
- వీటన్నింటిలొ కాల్షిమ్ ఉంటుంది.
కాల్షియమ్ను మన శరీరం ఎలా వినియోగించుకుంటుందిః
- బాల్య, కౌమా రదశలలొ గల పిల్లలకు కాల్షియమ్ను ప్రతీరోజు క్రమం తప్పకుండా తగినంతగా అందిస్తే ఎదుగుదలలో లోపం ఎముకల బలహీనత లేకుండా చేయవచ్చు.
- ఒక వ్యక్తికి పదిహేడేళ్ళు నిండే నాటికి తన శరీరం లోని ఎముకలు తాను వయస్కుడైనప్పుడు కావలిసిన పూర్తి కాల్షియమ్ పరిమాణం లోని 91% కాల్షియమ్ ను సమకూర్చుకుంటాయి.
- పదిహేడేళ్ళ వయస్సు నాటికి వయస్కుల కాల్షియం సాంద్రతలోని 91శాతం కాల్షియమ్ నిల్వ ఉంటుంది.
- 35 ఏళ్ళ వయసులో స్త్రీ పురుషులిద్దరి లో ఎముకలు పూర్తి స్థాయి సాంద్రతను కల్గి ఉంటాయి.
- 40వ పడికి వచ్చేటప్పటికి ఎముకలలో గల కాల్షియమ్ పరిమాణం తగ్గె ప్రమదం ఉంది. దీనిని నివారించుకునేందుకు శరీరంలో కాల్షియమ్ సాంద్రతను పెంచుకోవడం అవసరం.
- వరి, గోధువు వంటి ప్రధాన ఆహార ధాన్యాలలోలేదా ఆకు కూరలలొ ఫైటేట్లు, ఆక్జలేట్లు ఉండి కాల్షియమ్ను బంధించడం వలన శోషణప్రక్రియ లో అవరోధం ఏర్పడుతుంది.
- కాల్షియమ్ లోపం వలన ఎముకలు గుల్లబరుతాయి.
వివిధ వయసుల వారికి అవసరమగు కాల్షియమ్
సంవత్సరం లోపు |
525 |
1 - 3 సంవత్సరాలు |
350 |
4 – 6 సంవత్సరాలు |
450 |
7 – 10 సంవత్సరాలు |
550 |
గుర్తుంచుకోవలసిన ఆరోగ్య చిట్కా
చూలింతలు, బాలింతలకు కాల్షియమ్ ఆవశ్యకత అధికంగా ఉంటుంది. కాబట్టి కాల్షియమ్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ఎందుకో మీకు తెలుసా?
- పిండం పెరుగుదలకు కావలసిన కాల్షియమ్ను గర్భవతులు తీసుకోవలసి ఉంటుంది. అట్లాగె పాల ద్వారా బాలింతలనుంచి బిడ్డకు కాల్షియమ్ చేరుతుంది.
- ఆహారం లో తల్లికి గనుక తగినంత కాల్షియమం అందకపోతే ఆమె ఎముకలనుండి పీల్చబడిన కాల్షియమ్ పిండం పెరుగుదలకు సరిపడుతుంది. అదేవిధంగా పసిపిల్లలకు పాలిచ్చేటప్పుడు పాలద్వారా కాల్షియమ్ అందుతుంది. దీని ఫలితంగా ఆమె ఎముకలు పెళుసుబారి, బలహీనమౌతాయి.
- సరిపడినంతగా పాలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించడవైునది.
- భారత దేశంలో గల స్త్రీలలొ చూలింతలకు, బాలింతలకు తడి సున్నం పూసిన తవులపాకులు నమలడమనే అభ్యాసం సాధారణంగా ఉండడంతో వారిలొ కాల్షియమ్ వృద్ధి చెందుతుంది.
ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు
చివరిసారిగా మార్పు చేయబడిన : 4/24/2020
0 రేటింగ్స్ మరియు 0 వ్యాఖ్యలు
నక్షత్రాలపై రోల్ చేసి, ఆపై రేట్ చేయడానికి క్లిక్ చేయండి
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.