గిరిజన సంక్షేమ శాఖలోని వివిధ విద్యాసంస్థలను ఒకే గొడుగు కిందకి తీచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గిరజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ ఆదేశాలతో అధికారులు కసరత్తు చేసి ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీడీఏ జిల్లాలోని అన్నీ గిరిజన సంక్షేమ విద్యా సంస్థలు ఆయా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి(పీవో), మిగిలిన జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఐటీడీఏ జిల్లాల్లో పీవోకు గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు, ఇతర జిల్లాల్లో కలెక్టర్కు జిల్లా గిరిజనసంక్షేమ అధికారి ఈ విద్యాసంస్థల నిర్వహణలో సహకారమందిస్తాయి
ఆధారం : ఆంధ్ర జ్యోతి