సుస్థిర వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువులు ప్రాధాన్యత
విజయనగరం జిల్లాలో 95 % భూములలో సేంద్రియ పదార్ధం తక్కువగావుంది. భూమిలో సేంద్రియ పదార్ధం తక్కువగా వుంది. భూమిలో సేంద్రియ పదార్ధం పుష్మలముగా ఉంటేనే సుష్మ జీవుల అభివృద్ధి. మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాల లభ్యత, నీటిని నిల్వయుంచే గుణము, బెట్టాను తట్టుకునే గుణము, భూమికి సుస్ధిరంగా దిగుబడినిచ్చే గుణము ఉంటాయి. అలాగే మొక్కకు కావాల్సిన 18 రకాల మూలకాలలో రైతాంగము కేవలం 3 రకాలు పోషకాలు (ఎరువులు) మాత్రమే వాడుతున్నారు. మిగితా 15 రకాల మూలకాలు మొక్కకు భూమే సమకూరుస్తుంది. భూమిలో సేంద్రియ పదార్ధము లేకుండా,నత్రజని, భాస్వరం, పోటాష్ ఎవులను మోతాదు మించి వేసినట్లయితే, భూమికి సుస్దిరముగా దిగుబడినిచ్చే శక్తి కోల్పోయి, ముందు తరాలకు పంటలు పండించడానికి ముబులు పనికిరాకుండా పోతాయి.