విద్య
వ్యక్తి ప్రగతికే కాదు, మొత్తం జాతి నిర్మాణానికి , పురోగతికి కూడా ప్రాథమిక విద్య పునాది వంటిది. ప్రాథమిక విద్యను నేర్చుకునే పిల్లలను మరింతమందిని చేర్చుకోవడంలో, వారు మధ్యలో మానకుండా కొనసాగేలా చూడడంలో, హాజరు శాతాన్ని మెరుగుపరచడంలో, దేశ జనాభాలో దాదాపుగా మూడింట రెండువంతులమందికి అక్షరాస్యతను విస్తరించడంలో ఇటీవలి సంవత్సరాలలో ఇండియా ఎంతో ప్రగతి సాధించింది. ఇండియా ఆర్ధిక ప్రగతికి ఒక ప్రధాన సాధనంగా మనదేశంలో విద్యా వ్యవస్థ మెరుగుదలను తరచు ప్రస్తావించడంకూడా జరుగుతున్నది. అయితే, అదేసమయంలో, మనదేశంలో ప్రాథమిక విద్య నాణ్యతాపరంగా ఇంకా ఆందోళన కలిగిస్తూనేవున్నది.