అనేది కలుషితమైన నీటి నుండి అవసరము లేని రసాయనాలను, పదార్ధాలను, మరియు జీవావరణమును కలుషితము చేసే తీసివేసే ప్రక్రియ. దీని యొక్క లక్ష్యము నీటిని ఒక ప్రత్యేకమైన పనికి ఉపయోగపడేలా చేయటము. చాలా వరకు నీటిని మనుషులు ఉపయోగించుటకు మరియు తాగు నీటి కొరకు శుద్ధి చేయటము జరుగుతుంది. అంతే కాక అనేక ఇతర ఔషదాలు, మందుల తయారీ, రసాయనిక మరియు పరిశ్రమల అవసరాల దృష్ట్యా కూడా నీటి శుద్ధీకరణ చేయటము అనేది జరుగుతుంది. సాధారణముగా నీటి శుద్దీకరణకు ఉపయోగించే పద్దతులు ఏవంటే, భౌతిక ప్రక్రియలు అయినటువంటి వడకట్టుట మరియు తేర్చుట, ప్రకృతి సిద్దమైన పద్దతులు అయినటువంటి ఉపరితల నీటిని శుద్ధి చేయుటకు వాడే ఇసుక అమరికల ద్వారా వడపోత లేదా యాక్టివేటెడ్ స్లడ్జ్ పద్ధతి, రసాయనిక పద్ధతులు అయినటువంటి ఫ్లోక్కులేషన్ మరియు క్లోరినేషన్ మరియు ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ పద్ధతి అయినటువంటి ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేయటము.
నీటిలో కలసిన అవసరము లేని రేణువులను, పరాన్న జీవులను, ఆల్గేని, వైరస్ లను, ఫంగి; మరియు వర్షము లాగా పడిన తరువాత నీరు ఉపరితలములో కలిసేటటువంటి ఇతర శ్రేణి కరిగిపోయే మరియు రేణువుల వంటి పదార్ధాలను నీటి శుద్ధీకరణ పద్ధతి ద్వారా తగ్గించవచ్చు.
తాగు నీరు యొక్క నాణ్యత స్థాయిలు ప్రభుత్వము చేత లేదా అంతర్జాతీయ స్థాయిలలో ఆనవాలుగా నిర్ణయించబడతాయి. ఈ స్థాయిలు ఉపయోగించు నీటిలో ఉండే కలుషితాలు ఎంత తక్కువ స్థాయి నుండి ఎంత ఎక్కువ స్థాయి వరకు ఉండవచ్చు అనే దానిని ఆనవాలుగా నిర్ణయిస్తాయి.
నీటిని చూచి పరిక్షించుట ద్వారా నీరు తగిన నాణ్యత కలిగినది అని చెప్పుట సాధ్యము కాదు. తెలియనటువంటి ప్రదేశములోని నీటిలో ఉన్నటువంటి కలుషితాలను సాధారణ పద్దతులైనటువంటి నీటిని మరిగించుట, కాచుట లేదా ఇంటివద్ద ఉపయోగించు యాక్టివేటెడ్ కార్బన్ వంటి వాటి ద్వారా తొలగించుట సాధ్యపడదు. 1800 సంవత్సరాలలో అన్ని అవసరాలకు రక్షితమైనది అని భావించిన సహజ సిద్ద భూగర్భ జలము కూడా ఈ రోజులలో ఒక వేళ శుద్ధీకరణ అవసరమైనట్లయితే ఏ విధమైన శుద్ధీకరణ అవసరము అనేది నిర్ణయించే ముందు పరీక్షించవలెను. ఖర్చుతో కూడినది అయినప్పటికీ రసాయనిక విశ్లేషణ ఒక్కటే తగిన శుద్దీకరణ విధానాన్ని నిర్ణయించు సమాచారాన్ని తెలుసుకొనే మార్గము.
2007 ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారము, 1.1 బిలియను ప్రజలకు అభివృద్ధి పరచిన తాగు నీరు సరఫరా అందుబాటులో లేదు, సంవత్సరములో నమోదైన 4 బిలియన్ల అతిసార వ్యాధి కేసులలో 88% రక్షిత నీరు మరియు తగినంతగా లేని ఆరోగ్యకరమైన వాతావరణము మరియు పరిశుభ్రత లేకపోవటము వల్లనే సంభవించినవి అని ఆపాదించటము జరిగినది, మరియు ప్రతి సంవత్సరము 1.8 మిలియన్ల ప్రజలు అతిసార వ్యాదితో మరణిస్తున్నారు. WHO ఈ అతిసార వ్యాధి కేసులలో 94% కేసులను రక్షిత నీటితో సహా పర్యావరణానికి సవరణలు చేయుట ద్వారా అరికట్టవచ్చునని అంచనా వేసినది. సాధారణ ఉపాయాలైనటువంటి క్లోరినేషన్, వడపోత పరికరాలు, సూర్యరశ్మి ద్వారా క్రిములను తొలగించుట, మరియు రక్షిత నిలువ సామాగ్రులలో నీటిని నిలువ ఉంచుట వంటి ఇంటి వద్ద పాటించేటటు వంటి పద్దతుల ద్వారా యేటా అతి పెద్ద సంఖ్యలో జీవితాలను కాపాడవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో నీటి ద్వారా సంభవించే వ్యాధులను అరికట్టటము ఒక పెద్ద ప్రజారోగ్య లక్ష్యము.
లాక్ డే బ్రెట్, స్విట్జర్లాండ్ యొక్క నీటి శుద్దీకరణ ప్లాంట్ యొక్క నియంత్రణ గది మరియు నిర్మాణ రూపాలు.
ఈ క్రింద ఉన్న విధానాలు ఒకప్పుడు నీటి శుద్దీకరణ ప్లాంట్లలో సర్వసాధారణముగా ఉపయోగించబడినవి. ప్లాంటు యొక్క విస్తృతి మరియు నీటి నాణ్యత వంటి వాటి పై ఆదారపడి కొన్ని లేదా చాలా విధానాలను ఉపయోగించకపోవచ్చు.
అతిచిన్న ఘన పదార్దాలను, సూక్ష్మ జీవులను మరియు కరిగిఉన్న నిర్జీవ మరియు సజీవ పదార్ధాలను తొలగించుటకు అనేక విస్తృత విధానాలు అందుబాటులో ఉన్నాయి. శుద్దీకరించ వలసిన నీటి నాణ్యత, శుద్దీకరణ విధానపు ఖరీదు మరియు శుద్దీకరించ బడవలసిన నీటి నుండి శుద్దీకరించబడిన తరువాత ఆశిస్తున్న నాణ్యత వంటి వాటి మీద ఆధారపడి శుద్దీకరణ విధానాన్ని ఎన్నుకోవటము జరుగుతుంది.
ఉప్పు మరియు ఇతర లవణాలు తొలగించబడిన నీరు 7 pH ని కలిగి ఉంటుంది (ఆల్కలిన్ కాని యాసిడ్ కాని ఉండదు) మరియు సముద్ర జలాలలో సాధారణముగా 8 .3 pH ఉంటుంది (కొద్దిగా ఆల్కలిన్ గుణాన్ని కలిగి ఉంటుంది). నీరు కనుక యాసిడ్ లక్షణాన్ని కలిగి ఉంటే (7 కంటే తక్కువ), లైమ్, షోడా యాష్ లేదా సోడియం హైడ్రాక్సైడ్ ను pH స్థాయిని పెంచుటకు కలుపుట జరుగుతుంది. యాసిడ్ మరియు ఆల్కలిన్ లక్షణాన్ని కొంతవరకు కలిగిన నీటి యొక్క (6 .5 కన్నా తక్కువ pH ) pH ను పెంచుటకు ఫోర్సుడ్ డ్రాఫ్ట్ డి గ్యాసిఫయర్స్ అతి తక్కువ ఖర్చు తో కూడిన విధానాలు. ఇవి నీటిలోని కరిగి ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ (కార్బోనిక్ యాసిడ్) ను వికేంద్రీకరించటము ద్వారా నీటిలోని pH స్థాయిని పెంచుతాయి. పురపాలక నీటి యొక్క pH స్థాయిని క్రమబద్దీకరించుటకు సాధారణముగా లైమ్ ను వాడతారు లేదా ఇది తక్కువ ఖర్చు తో కూడినందు వల్ల నీటిని శుద్దీకరించే ముందు శుద్దీకరణ ప్లాంట్ వద్ద దీనిని వాడతారు. అయితే ఇది నీటి యొక్క ఘాఢతను పెంచుట ద్వారా అయానిక్ స్థాయిని పెంచుతుంది. నీటికి కొద్దిగా క్షార గుణమును కలిగించుట అనేది తేర్చుట మరియు ఫ్లోక్కులేషణ్ వంటి విధానాలు సమర్ధవంతముగా పనిచేయునట్లు చేస్తుంది మరియు సీసపు పైపుల నుండి మరియు పైపులను అతికించు సీసము కరిగి నీటిలో కలుచుట వంటి ప్రమాదాలను తగ్గించవచ్చు. కొన్ని సందర్బాలలో క్షార గుణము కలిగినటువంటి నీటి యొక్క pH స్థాయిని తగ్గించుటకు ఆ నీటికి యాసిడ్ (HCI లేదా H2SO4 )ని కలపవచ్చు. క్షార గుణము కలిగినటువంటి నీటిని ఉపయోగించటము వలన ఖచ్చితముగా పైపులనుండి సీసము మరియు రాగి నీటిలో కరుగవు అనుటకు వీలు లేదు కాని సాధారణముగా 7 కంటే ఎక్కువ pH స్థాయి ఉన్నటువంటి నీరు బరువైన లోహాలను కరిగించు అవకాశము pH 7 కంటే తక్కువ ఉన్న నీటి కంటే తక్కువ.
గుంటల ఉపరితలము పై తేలుతున్న మలినములు
గుంటల నుండి మలినములను బయటికి నెట్టి వేయు యాంత్రిక విధానాలు
ఫ్లోక్కులేషన్ అనేది నీటిని స్వచ్చముగా చేయు పద్దతి. స్వచ్చముగా తయారుచేయుట అనగా నీటినుండి బురదను లేదా రంగును తొలగించుట ద్వారా నీటిని స్వచ్చముగా రంగు లేకుండా చేయుట. స్వచ్చతను కలిగించుట అనేది నీటిలోని అణువులను క్రిందికి తేరు కొనేటట్లు చేసి తేరుకున్న దాన్ని భౌతిక విదానాలను ఉపయోగించి తీసివేయుట. ప్రారంభములో ఈ తేరుకోనే పదార్ధము చిన్న చిన్న కణాలుగా ఏర్పడుతుంది కాని నీటిని చిన్నగా కలుపుట వలన ఈ అణువులు అన్నీ ఒక దానితో ఒకటి కలిసి పెద్ద అణువులుగా ఏర్పడతాయి- ఈ ప్రక్రియ కొన్ని సార్లు ఫ్లోక్కులేషన్ అని కుడా పిలవబడుతుంది. శుద్ధి చేయని నీటిలో సహజముగా ఉన్నటువంటి చిన్న చిన్న కణాలు కిందకి తేరుకున్నటువంటి అణువుల పైన చేరుతాయి మరియు అవి తేర్చు పద్దతిలో ఏర్పడినటువంటి పెద్ద అణువులతో కలిసి పోతాయి. ఈ విధముగా తేర్చు విధానము చాలా వరకు అవసరము లేని పదార్ధాన్ని నీటి నుండి తీసి వేస్తుంది మరియు ఆ తరువాత సాధారణముగా గట్టి ఇసుక ద్వారా వడపోయుట లేదా కొన్ని సార్లు ఇసుక మరియు ఎక్కువ కార్బన్ తక్కువ ఆవిరి గుణము కలిగిన యాన్త్రసైట్ (ఎక్కువ కార్బన్ మరియు తక్కువ ఆవిరి గుణము కలిగిన బొగ్గు) కణాల ద్వారా నీరు వడకట్టబడుతుంది. తేర్చుటకు/ఫ్లోక్కులేషన్ కు ఉపయోగించు మాధ్యమాలు:
ఫ్లాక్కులేషను తొట్టి నుండి బయటకు వచ్చు నీరు క్లారిఫైర్ లేదా సెట్ట్లింగ్ తోట్టిగా పిలవబడే తేర్చు తొట్టి లోనికి ప్రవేశిస్తుంది. ఇది బురదను అడుగున చేరుటకు అవకాశము కల్పించే నిదానమైన ప్రవాహము కలిగిన ఒక పెద్ద తొట్టె. తేర్చు తొట్టె, ఫ్లోక్కులేషను తొట్టె పక్కనే ఉంటే మంచిది ఎందువల్లనంటే బురద లేదా తేరిన పదార్ధము బయటకు పోకుండా ఇది మార్గమును సుగమము చేస్తుంది. తేర్చు తొట్టెలు దీర్ఘచతురస్త్రముగా ఉంటే నీరు ఈ చివర నుండి ఆ చివరకు ప్రవహిస్తుంది లేదా గుండ్రముగా ఉంటే అది మధ్యలోనుండి బయట వైపుకు ప్రవహిస్తుంది. తేర్చు తొట్టె నుండి బయటకు ప్రవహించుట అనేది సన్నని చుక్కలుగా జరుగుతుంది కాబట్టి కేవలము ఒక సన్నని పై పొర ద్వారా మాత్రమే తేరిన పదార్ధము బయటకు రాగలుగుతుంది. నీటి నుండి తేరుకునే పదార్ధము యొక్క పరిమాణము తొట్టె యొక్క నిలువ కాలము మరియు తొట్టె లోతుపై ఆధారపడి ఉంటుంది. నీటి నిలువ కాలము పెద్ద తొట్టె యొక్క ఖరీదు తో సమతూకము గావించబడాలి. కనీస క్లారిఫైర్ నిలువ కాలము సాదారణముగా 4 గంటలు. లోతైన తొట్టె చిన్న తొట్టె కంటే ఎక్కువ వ్యర్ధాన్ని తేర్చుతుంది. ఎందువల్ల నంటే పెద్ద కణాలు చిన్న వాటి కంటే వేగముగా తేరుకుంటాయి, కాబట్టి పెద్ద కణాలు డీకొని చిన్న కణాలను అవి తేరుకోనే కొద్ది తమలో కలుపుకుంటాయి. దీని వల్ల పెద్ద కణాలు తొట్టె కి నిలువుగా వీస్తాయి మరియు చిన్న కన్నాలను అవి క్రిందికి చేరే మార్గములో శుభ్ర పరుస్తాయి.
కణాలు తొట్టె అడుగుకి చేరాక టాంకు యొక్క నేలపై బురద పొర ఏర్పడుతుంది. ఈ బురద పొరను తొలగించాలి మరియు శుద్దీకరించాలి. ఈ తేరుకున్న బురద పరిమాణము గుర్తించదగినది మరియు శుద్ధి చేసిన నీటి పరిమాణములో 3 నుండి 5 వంతులు ఉంటుంది. ఈ తేరుకున్న పదార్దాన్ని శుభ్రపరచుట మరియు పారవేయుట అనేది శుద్దీకరణ ప్లాంటు నిర్వహణ ఖర్చులో ముఖ్య భాగము. టాంకు యొక్క అడుగు భాగాన్ని నిరంతరముగా శుభ్ర పరచుటకు యాంత్రిక పరికరాలను ఏర్పరచవచ్చు లేదా ఎప్పుడైతే టాంకును శుభ్రపరచవలెనో అప్పుడు టాంకును ఉపయోగించకుండా ఉండవలెను.
ఒక దగ్గరికి చేరిన వ్యర్ధమును చాలా వరకు తీసివేసిన తరువాత చివరిదశగా నీటిలోని మిగిలి ఉన్న అవసరము లేని పదార్ధాలను మరియు ఇంకా తేరుకొని వ్యర్ధాలను తొలగించుటకు వడపోయటం జరుగుతుంది.
ఖచ్చితమైన ఇసుక వడపోత యొక్క కట్ యవే వ్యూ
సర్వసాధారణమైన వడపోత యంత్రము వేగవంతమైన ఇసుక వడపోత యంత్రము. యాక్తివేటేడ్ కార్బన్ లేదా ఆన్త్రసైట్ బొగ్గు పొరను పైభాగములో తరచుగా కలిగి ఉండే ఇసుక ద్వారా నీరు పైకి క్రిందికి కదులుతుంది. పైన ఉన్న పొర రుచికి మరియు రంగుకి కారకమైన జీవ సంభంద పదార్ధాలను తొలగిస్తుంది. ఇసుక రేణువులకు మధ్యలో ఉండే స్థలము అతిచిన్న అవసరము లేని వ్యర్ధ అణువుల కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణ వడపోత సరిపోదు. చాలా వ్యర్ధ అణువులు ఉపరితలములోని పొరను దాటుకొని వస్తాయి కాని ఇవి రంద్రాలలో బంధించ బడటము లేదా ఇసుక అణువులకు అతుకుకొనుట జరుగును. సమర్ధ వంతమైన వడపోత లోతులలో జరిగే వడపోతలో ఉంటుంది. ఈ లోతులో ఉండే వనరులు వడపోత యంత్రము యొక్క సమర్ధవంతమైన పనితీరుకు కీలకము: పై పొరలోని ఇసుక అన్ని కణాలను ఆపివేసినట్లయితే వడపోత యంత్రము వేగముగా ఆగిపోతుంది.
వడపోత యంత్రమును శుభ్రపరచుటకు నీరు వేగముగా సాధారణ దిశకు వ్యతిరేకముగా పైకి ఆక్రమించిన అణువులను తొలగించుటకు ప్రవహిస్తుంది (ఇది వెనుకకు నెట్టుట లేదా వెనుకకు కడుగుట అని పిలువబడుతుంది). దీనికి ముందు కేంద్రీకృతమైన గాలి కింద నుండి వడపోత యంత్రము యొక్క చిక్కని మాద్యమమును తెరుచుట ద్వారా వెనుకకు కడుగు ప్రక్రియకు సహాయముగా పైకి చిమ్ముతుంది; ఇది ఎయిర్ స్కవురింగ్ అని పిలువబడుతుంది. ఈ కలుషిత నీటిని తేర్చబడిన పదార్ధము ఉన్న తొట్టెలోని వ్యర్ధముతో పాటుగా పడబోయవచ్చు లేదా ఈ నీటిని వడపోత యంత్రములోనికి ప్రవేశించు కొత్త నీటితో కలిపి శుభ్రపరచవచ్చు.
కొన్ని నీటి శుద్దీకరణ యంత్రాలు వత్తిడిని వడపోయు యంత్రాలను కలిగి ఉంటాయి. ఇవి వేగ వంతమైన భుమ్యాకర్షక వడపోత యంత్రాల సిద్దాంతములపై ఆధారపడి పనిచేస్తాయి. కాని యంత్రము యొక్క మాధ్యమము స్టీలు పాత్రను కలిగి ఉంటుంది మరియు నీరు వత్తిడి ద్వారా దీనిగుండా నెట్టబడుతుంది.
ప్రయోజనాలు
వాహక వడపోత యంత్రాలు తాగు నీటిని వడపోయుటకు మరియు మురికి నీటిని (తిరిగి ఉపయోగించుట కొరకు) వడపోయుటకు విస్తృతముగా ఉపయోగిస్తున్నారు. తాగు నీటికొరకు వాహక వడ పోత యంత్రాలు 0 .2 um కంటే పెద్దవైన అన్నిరకాల అణువులను గార్దియా మరియు క్రిప్తోస్పోరిడియం తో సహా సమర్దవంతముగా తొలగించగలవు. వాహక వడపోత యంత్రాలు మూడవ స్థాయిలో నీటిని శుద్దీకరించుటకు అత్యంత ప్రభావవంతమైనవి. నీటిని పారిశ్రామిక, కొన్ని పరిమితమైన గృహ అవసరాలకు, లేదా నీటిని నదుల పక్కన ఉండే పట్టణ ప్రాంతాలు ఉపయోగించే నదులలోనికి వదులునప్పుడు ఈ పద్ధతి పాటించబడుతుంది. ఇవి పరిశ్రమలలో ముఖ్యముగా ద్రవాలను తయారుచేయు పరిశ్రమలలో ఉపయోగించ బడుతున్నాయి (సీసా నీటితో సహా). ఏదియేమయినప్పటికి నీటిలో స్వతహాగా కరిగి ఉన్న ఫాస్ఫరస్, నైట్రేటు మరియు భరువైన లోహపు అయానుల వంటివాటిని ఏ వడపోత విధానము కూడా తొలగించలేదు.
నిదానమైన కుత్రిమ భూగర్భ నీటి వడపోత (నది ఒడ్డు వడపోత కు భిన్నమైనది), చెక్ రిపబ్లిక్ లోని కరని లోని నీటి శుద్దీకరణ ప్లాంట్
నిదానమైన ఇసుక వడ పోత విధానము నీరు వడపోత నిర్మాణము గుండా నిదానముగా ప్రవహించాలి కనుక ఎక్కడైతే సరిపడినంత భూమి మరియు స్థలము ఉంటాయో అక్కడ ఉపయోగించబడతాయి. ఇవి బౌతిక వడపోత ప్రక్రియల మీద కంటే జీవ సంభంద శుద్దీకరణ ప్రక్రియల మీద ఆధారపడతాయి. ఈ వడపోత నిర్మాణాలు సేకరించబడిన మంచి ఖటినమైన ఇసుక పొరలు, అడుగు భాగాన గ్రావెల్ తో మరియు పైన సన్నని ఇసుకతో ఏర్పరచిన పొరలతో జాగ్రత్తగా నిర్మించబడతాయి. అడుగు భాగాన ఉన్న ప్రవాహ మార్గాలు శుద్దీకరించబడిన నీటిని క్రిములు తొలగింపబడుటకు పంపిస్తాయి. వడపోత, నిర్మాణము యొక్క ఉపరితలముnపై వృద్ది చెందే జూగ్లియల్ లేదా schmutzdecke గా పిలువబడే జీవావరణ పొర మీద ఆధారపడి ఉంటుంది. ఒక సమర్ధవంతమైన నిదానమైన ఇసుక వడపోత విధానము కొన్ని వారాలు లేదా కొన్ని నెలల వరకు పనిచేస్తుంది. శుద్దీకరణకు ముందు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇది బౌతిక పద్దతులు సాధించ లేనటువంటి తక్కువ స్థాయిలో లవణాలు ఉన్నటువంటి నీటిని అందిస్తుంది. తక్కువ స్థాయిలో లవణాలను కలిగి ఉండుట వలన నీటిని సరఫరా వ్యవస్థ ద్వారా సురక్షితముగా తక్కువ స్థాయిలో క్రిమిసంహారకములను ఉపయోగించుట ద్వారా పంపించవచ్చు. తద్వారా క్లోరిన్ మరియు క్లోరిన్ ఉప ఉత్పాదనలను ఎక్కువ స్థాయిలో ఉపయోగించారు అనే వినియోగదారుని అసంతృప్తిని తగ్గించవచ్చు. నిదానమైన ఇసుక వడ పోత విధానము వెనుకకు కడుగ లేనిది; వాటిని పై పొర పై జీవము పెరిగి అవరోదిస్తున్నప్పుడు పై పొరలోని ఇసుకను తొలగించుట ద్వారా వీటిని నిర్వహించటము జరుగుతుంది.
నిదానమైన ఇసుక వడపోత విధానము యొక్క ఒక ప్రత్యేకమైన పెద్ద స్థాయి రూపము ఏమిటంటే నది వడ్డున వడపోత విధానము. దీనిలో నదివడ్డున సహజ సిద్ధముగా ఉండే పదార్ధాలను ఉపయోగించి కలుషితాలను తొలగించుటకు మొదటి దశ వడపోత జరుగుతుంది. కాని ఈ నీరు తాగుటకు పనికి వచ్చేంత శుద్దమైనది కాదు కాని దీనికి అనుబంధముగా ఉన్న బావుల నుండి తీసుకునే నీరు కాలువల నుండి సరాసరి ఎక్కడైతే వడ్డున వడపోత తరచుగా జరుగుతుందో ఆ నీటి కంటే తక్కువ సమస్యాత్మకమైనది.
లావా వడకట్టు సాధనాలు ఇసుక వడకట్టు సాధనాల వంటివి మరియు అవి సరిపడినంత భూమి మరియు సరిపడినంత ఖాళీ స్థలము ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుటకు అనువైనవి. నిదానమైన ఇసుక వడకట్టు సాధనాల వలే ఇవి కూడా భౌతిక శుద్దీకరణ ప్రక్రియలకంటే జీవావరణ సంబంద శుద్దీకరణ ప్రక్రియల పై వాటి యొక్క చర్యలకు ఆధారపడతాయి. నిదానమైన ఇసుక వడకట్టు సాధనాల వలే కాకుండా ఇవి లావా గులక రాళ్ళతో రెండు పొరలు మరియు లవణాలు లేని మట్టితో నిర్మించబడతాయి (కేవలము ప్లాంటు మూలాలలో). పైన ఐరిస్ స్యుడకోరాస్ మరియు స్పార్గేనియం ఎరేక్టం వంటి నీటి శుద్దీకరణ ప్లాంట్లు స్థాపించబడతాయి. సాదారణముగా 1 /4 దృక్కోణము కలిగిన లావా రాళ్ళు నీటిని శుద్దీకరించుటకు అవసరము. నిదానమైన ఇసుక ద్వారా నీటిని వడకట్టు విధానములో వలెనే దీనిలో కూడా వరుస క్రమములో ఒక శ్రేణి నీరు బయటకు పంపు వాహకాలు ఉంటాయి (లావా ఫిల్టర్లలో ఇవి అడుగు పొరలో ఉంచబడతాయి).
ఆల్ట్రా వడపోత వాహకాలు రాసాయనికముగా తయారయిన అతి సూక్ష్మ రంద్రాలను కలిగిన పాలిమర్ వాహకాలను నీటిలో కరిగి ఉన్న పదార్ధాలను వాటిని మార్పు చేయ వలసిన అవసరము లేకుండా తొలగించుటకు ఉపయోగించ బడుతుంది. వాహక మాధ్యమము యొక్క రకము నీటిని నెట్టుటకు ఎంత వత్తిడి అవసరము అనే దానిని మరియు ఎంత పరిమాణములో ఉన్న సూక్ష్మ క్రిమి వడ పోయబడుతుంది అనే దానిని నిర్ణయిస్తుంది.
అయాను బదిలీ: అయాను మార్పు విధానము అయాను మార్పు రెసిన్-లేదా జియోలైట్-పాక్ద్ కాలమ్స్ ని అవసరము లేని అయానులను తొలగించుటకు ఉపయోగిస్తుంది. చాలా సాధారణ సందర్భము నీటిని సున్నిత పరచుట అనేది Ca2 + మరియు Mg2 + అయానులను బినైన్ (సబ్బు కు అనుకూలమైన) Na + లేదా K + అనే అయానుల చేత పునర్ స్థాపించుట. అయాను బదిలీ రేసిన్స్ ను కూడా నైట్రేటు, సీసము, మెర్క్యురి, ఆర్సెనిక్ మరియు ఇంకా అనేక విషపూరిత రసాయనాలను తొలగించుటకు ఉపయోగించుట జరుగుతుంది.
ఎలెక్ట్రోడిఅయానైజేషను: నీరు ఒక పోజిటివ్ ఎలక్ట్రోడ్ మరియు నెగెటివ్ ఎలేక్త్రోడ్ మధ్య ప్రవహిస్తుంది. అయాను బదిలీ వాహకములు కేవలము పోజిటివ్ అయానులను శుద్దపరచబడిన నీటి నుండి నెగెటివ్ ఎలక్ట్రోడ్ ల వైపు నెగెటివ్ అయానులను పోజిటివ్ ఎలేక్త్రోడ్ ల వైపు వలస వెళ్ళేటట్లు అనుమతిస్థాయి. అత్యంత ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన నీరు కేవలము అయాను బదిలీ శుద్దీకరణ విధానము కంటే కొద్ది భిన్నమైన విధానము ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. నీటిని అయానులను పూర్తిగా తొలగించుట ఎలక్త్రోడైయాలసిస్ అని పిలువబడుతుంది. నీరు తరచుగా రివర్స్ ఓస్మోసిస్ విభాగము ద్వారా అయానులు లేని జీవ సంభంద కాలుష్యాన్ని తొలగించుటకు ముందుగా శుద్దీకరించబడుతుంది.
నీటిని పెద్ద స్థాయిలో శుద్ధి చేయుటకు ఉపయోగించు వివిధ పద్దతులతో పాటుగా అనేక తక్కువ స్థాయి, తక్కువ (లేదా కాలుష్యాన్ని కలిగించని) కాలుష్యాన్ని కలిగించే పద్దతులు నీటిని శుద్దీకరించుటకు ఉపయోగించబడుతున్నాయి. ఈ పద్దతులు యాంత్రిక మరియు జీవసంబదమైన ప్రక్రియలను కలిగినవి. అవలోకనము
నీటిని తగినంత శుభ్రపరచుటకు వీటిలోని చాలా వ్యవస్థలు సాధారణముగా కలిపి సమర్దవంతముగా పనిచేయుటకు ఉపయోగించబడతాయి. ఈ వ్యవస్థలను కలుపుట అనేది రెండు లేదా మూడు స్థాయిలలో జరుగుతుంది ఇది ప్రాధమిక మరియు రెండవ దశ శుద్దీకరణ అని పిలవబడుతుంది. కొన్ని సార్లు మూడవ దశ శుద్దీకరణ విధానము కూడా కలపబడుతుంది.
క్రిములను నాశనము చేయుట అనేది ప్రమాధకారకమైన వ్యాధికారక క్రిములను వడపోత ద్వారా బయటకు పంపుట మరియు క్రిమిసంహారక రసాయనాలను నీటి శుద్దీకరణ చివరి దశలో నీటికి కలుపుట అనే రెండు విధానాల ద్వారా కూడా సాధ్యపడుతుంది. క్రిమిసంహారకాలను నీటిలో ఉంచుట అనేది వడపోత ద్వారా కూడా నీటిలోనికి ప్రవహించి నటువంటి వ్యాధికారక క్రిములను చంపుట కొరకు జరుగుతుంది. వైరస్లు, ఎస్కేరిశియ కోలి , క్యంపాలోబ్యాక్టార్ , మరియు షిగెల్ల వంటి బ్యాక్టీరియా మరియు గియార్డియా లాంబ్లియ మరియు క్రిప్తోస్పోరిడియా వంటి ప్రోటోజువా లు ఈ వ్యాధి కారకాలలోనివి. చాలా అభివృద్ధి చెందిన దేశాలలో నీరు వినియోగదారునికి చేరే ముందు కొన్ని రోజుల వరకు నిలువ ఉంటుంది కాబట్టి ప్రజా నీటి సఫరా నందు ఈ క్రిమిసంహారాలను ఉపయోగించవలసి ఉంది. ఈ క్రిమిసంహారక రసాయనాలను కలిపిన తరువాత నీరు కొన్ని రోజులు కాంటాక్ట్ తొట్టి లేదా క్లియర్ వెల్ అని పిలువబడే నిలువ సాధనాలలో ఈ క్రిమిసంహారక చర్య పూర్తి అగుట కొరకు తాత్కాలికముగా నిలువ ఉంచటము జరుగుతుంది.
చాలా వరకు క్రిమిసంహారక విధానాలు సర్వ సాధారనముగా క్లోరిన్ ను లేదా దాని సంబదిత పదార్దాలైనటువంటి క్లోరోమిన్ లేదా క్లోరిన్ డై ఆక్సైడ్ ను ఉపయోగించుతాయి. క్లోరిన్ ఒక శక్తివంతమైన ఆక్సిడెంటు ఇది అత్యంత వేగముగా అనేక వ్యాధి కారక సూక్ష్మ క్రిములను చంపుతుంది. ఎందువల్లనంటే క్లోరిన్ ఒక విషపూరిత వాయువు మరియు దీనిని ఉపయోగిస్తున్నప్పుడు ఈ విష వాయువు వెలువడే ప్రమాదము కూడా ఉన్నది. ఈ సమస్య సోడియం హైపోక్లోరైట్ అనే తక్కువ ఖర్చుతో కూడిన ద్రవమును ఉపయోగించుట ద్వారా పరిష్కరించబడుతుంది. ఎలాగంటే ఈ ద్రావణము నీటిలో కరిగినప్పుడు ఫ్రీ క్లోరిన్ ను విడుదల చేస్తుంది. సాధారణ ఉప్పు ద్రావణములను విద్యుత్ వాహకముల ద్వారా రసాయనిక చర్య గావించుట ద్వారా క్లోరిన్ ను అప్పటికి అప్పుడు తయారు చేయవచ్చు. ఘన రూపములో ఉన్న కాల్షియం హైపోక్లోరైట్ అనేది నీటిలో కలిసిన వెంటనే క్లోరిన్ ను విడుదల చేస్తుంది. ఈ ఘన పదార్దాన్ని ఉపయోగించుట అనేది ఎక్కువ మానవ శక్తి పైన ఆధారపడి ఉన్నది ఎందువల్లనంటే సంచులను తెరచుట మరియు పోయుట వంటివి వాయు సిలిండర్లు లేదా బ్లీచ్ వంటి సులభముగా యంత్రాలతో చేయగలిగే వాటిలా కాకుండా మానవులచే నిర్వహించబడాలి. ద్రవ రూపములో ఉన్న సోడియం హైపోక్లోరైట్ ను తయారు చేయుట తక్కువ ఖర్చుతో కూడినది మరియు వాయువు లేదా ఘన రూపములో ఉన్న క్లోరిన్ ల లాగా కాక ఉపయోగించుటకు సురక్షితమైనది. క్లోరిన్ ఉపయోగములో కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ కూడా క్లోరిన్ యొక్క అన్ని రూపాలు విస్తృతముగా ఉపయోగించబడుతున్నాయి. క్లోరిన్ ను ఏవిధమైన రూపములో ఉపయోగించినప్పటికీ ఒక ముఖ్యమైన ప్రతికూలత ఏమిటంటే ఇది ప్రాకృతిక జీవులతో నీటిలో కలిసినప్పుడు ప్రతి చర్య జరిగి ట్రైహాలోమీథేన్ లు (THMs ) మరియు హాలోఏసిటిక్ యాసిడ్ (HAAs ) లు అనే ప్రమాదకర రసాయన ఉప ఉత్పాదనలను తయారు చేస్తుంది. ఇవి రెండూ కూడా ఎక్కువ మొత్తములో కాన్సర్ కారకాలు మరియు యునైటెడ్ స్టేట్స్ వాతావరణ పరిరక్షణ విభాగము (EPA ) మరియు యుకే లోని తాగు నీటి తనిఖీ విభాగాలు దీనిని నియంత్రించినవి. ట్రైహాలోమీథేన్ లు (THMs ) మరియు హాలోఏసిటిక్ యాసిడ్ (HAAs ) లు ఏర్పడుటను తగ్గించుటకు నీటినుండి సాధ్యమైనంత వరకు ఎక్కువ క్రిములను క్లోరిన్ ను కలుపుటకు ముందే సమర్ధ వంతముగా తొలగించవలెను. క్లోరిన్ బ్యాక్టీరియా ను సమర్ధ వంతముగా చంపగలిగినప్పటికి నీటిలో గడ్డల వలే ఏర్పడే ప్రోటోజువాను ఎదుర్కొనుటలో దీనికి పరిమిత ప్రభావము ఉన్నది (గియార్దియా లాంబ్లియ మరియు క్రిప్తోస్పోరిడియం రెండూ కూడా వ్యాధి కారకాలు).
ఎలిమెంటల్ క్లోరిన్ కన్నా క్లోరిన్ డైఆక్సైడ్ అత్యంత వేగముగా పనిచేసే క్రిమి సంహారకము, ఏమయినప్పటికీ ఇది చాలా అరుదుగా ఉపయోగించ బడుతుంది, ఎందువల్ల నంటే ఇది కొన్ని పరిస్థితులలో యునైటెడ్ స్టేట్స్ లో తక్కువ స్థాయిలో అనుమతించబడిన క్లోరైట్ ను అధిక మొత్తములో ఉత్పత్తి చేస్తుంది. క్లోరిన్ డైఆక్సైడ్ నీరువంటి ద్రవ రూపములో లభిస్తుంది మరియు అది ఉత్పత్తి చేసే గ్యాస్ ను నియంత్రించే సమస్యలను తప్పించుకొనుటకు దీనిని ద్రవ రూపములో నీటికి కలుపుట జరుగుతుంది; క్లోరిన్ డైఆక్సైడ్ యొక్క గ్యాస్ సేకరణలు ఊహించ కుండా పేలే ప్రమాదము ఉంది.
క్రిమిసంహారిణిగా క్లోరోమిన్ ను వాడటము సర్వ సాధారణముగా మారుతుంది. క్లోరోమిన్ బలమైన యాంటి ఆక్సిడెంటు కాక పోయినప్పటికీ ఇది క్లోరిన్ కంటే ఎక్కువ కాలము ఉండే ప్రభావాన్ని కలిగిస్తుంది మరియు ఇది THMs లేదా హాలోయసిటిక్ యాసిడ్లను ఏర్పరచదు. క్లోరిన్ కలిపిన నీటికి అమ్మోనియాను కలుపుట ద్వారా క్లోరిన్ ను క్లోరోమిన్ గా మార్చుట సాధ్యపడుతుంది. క్లోరిను మరియు అమ్మోనియా ప్రతిచర్య జరుపుట ద్వారా క్లోరోమిన్ ను ఏర్పరుస్తాయి. క్లోరోమైన ద్వారా క్రిమిసంహరణ కావించిన నీటి పంపిణీ వ్యవస్థ నైట్రిఫికేషణ్ ను ఎదుర్కొనవచ్చు, ఎందువల్లనంటే అమ్మోనియా బ్యాక్టీరియా పెరుగుదలకు పోషణగా పనిచేస్తుంది తద్వారా దాని యొక్క ఉపఉత్పాదనగా నైట్రెట్లు ఏర్పరచబడతాయి.
O3 అనేది స్థిరము లేని పరమాణువు. ఇది అనేక నీటిలో ఉద్భవించు జీవులకు విషకారకముగా పనిచేసే శక్తివంతమైన ఆక్సిడైజింగ్ ఏజంటును ఒక ఆక్సిజన్ పరమాణువు ద్వారా ఏర్పరుస్తుంది. ఇది యురోపులో విస్తృతముగా ఉపయోగించబడుతున్న ఒక బలమైన, విస్త్రుత పరిధి కలిగిన క్రిమిసంహారకము. ఇది ప్రమాదకరమైన గడ్డలను కలిగించు ప్రోటోజువా ను నిస్తేజము చేయుటకు ఒక శక్తివంతమైన పద్ధతి. ఇది దాదాపు అన్ని రకాలైన వ్యాదికారకాలపై సమర్ధవంతముగా పనిచేస్తుంది. ఓజోన్ అనేది ఆక్సిజన్ ను ఆల్ట్రావయొలెట్ కిరణము ద్వారా ప్రసరింప చేయుటవలన లేదా ఒక "చల్లని" విద్యుత్ వాహకము ద్వారా ప్రసరింప చేయుట ద్వారా తయారు చేయబడుతుంది. ఓజోన్ ను క్రిమిసంహారిణి గా వాడుటకు దానిని తప్పనిసరిగా నీటిని శుద్ధి చేయు ప్రదేశములోనే తయారు చేయాలి మరియు దానిని బుడగల ద్వారా నీటికి కలపాలి. ఓజోన్ యొక్క కొన్ని ఉపయోగాలు ఏమిటంటే అది ప్రమాదకరమైన ఉప ఉత్పాదనలను చాలా తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేస్తుంది (క్లోరినేషనుతో పోల్చిచూసినప్పుడు) మరియు ఓజోనైజేషను వల్ల రుచి మరియు వాసన ఏర్పరచబడవు. ఓజోనైజేషను చాలా తక్కువ ఉపఉత్పాదనలను ఏర్పరచినప్పటికి ఓజోన్ తక్కువ స్థాయిలో అనుమానించదగిన కార్సినోజన్ బ్రోమేట్ ను నీటిలో ఉత్పత్తి చేస్తుంది అని ఈ మధ్య కనిపెట్టబడింది. కానీ శుద్ధి చేయబడిన నీటిలో బ్రోమైన్ అసలు ఉండరాదు. ఓజోన్ యొక్క ఇంకొక ప్రతికూలత ఏమిటంటే ఇది నీటిలో క్రిమిసంహారకాలు ఏవి మిగలకుండా చేస్తుంది. 1906 నుండి ఓజోన్ ను తాగు నీటి ప్లాంట్లలో ఉపయోగిస్తున్నారు. మొట్టమొదటి పారిశ్రామిక ఓజోనైజేషను ప్లాంట్ ఫ్రాన్స్ యొక్క నైస్ లో కట్టబడినది. యు.ఎస్ ఆహార మరియు మందుల నిర్వహణ విభాగము ఓజోన్ ని సురక్షితమైనదిగా అంగీకరించినది; ఆహారాల యొక్క శుద్దీకరణ, నిలువ ఉంచు ప్రక్రియలో దీనిని యాంటి మైక్రోబయోలాజికల్ ఏజంటుగా ఉపయోగిస్తున్నారు.
ఆల్ట్రా వైయోలేట్ కిరణాలు గడ్డలను నిస్తేజము చేయుటలో అత్యంత ప్రభావవంతమైనవి. నీరు తక్కువ స్థాయిలో రంగును కలిగి ఉన్నంత కాలము UV నీటి చేత గ్రహింపబడకుండా ప్రయాణిస్తుంది. UV రేడియేషన్ యొక్క ప్రధానమైన ప్రతికూలత ఏమిటంటే ఇది కూడా ఓజోన్ శుద్దీకరణ వలెనే క్రిమిసంహారకాలను నీటిలో మిగల్చదు. ఓజోన్ కానీ UV రేడియేషను కానీ ఏవిధమైన క్రిమిసంహారకాలను నీటిలో మిగల్చనందున కొన్ని సార్లు తప్పని సరిగా వీటిని ఉపయోగించిన తరువాత కొన్ని క్రిమిసంహారకాలను నీటిలో కలప వలెను. పైన చర్చించిన ప్రాధమిక క్రిమిసంహారకమైన క్లోరోమిన్ ను కలుపుట ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ విధముగా క్లోరోమిన్ ను ఉపయోగించి క్లోరినేషను చేసినప్పుడు చాలా కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ క్లోరోమిన్ సమర్ధవంతమైన నీటిలో ఉండే క్రిమిసంహారకముగా పని చేస్తుంది.
ఓజోన్ మార్గములోనే పని చేస్తుంది. ఉత్తేజితాలైనటువంటి ఫార్మిక్ ఆసిడ్ వంటి వాటిని క్రిమిసంహారక సామర్ధ్యమును పెంచుటకు తరచుగా కలుపుట జరుగుతుంది. దీనికున్న ఒక లోపము ఏమిటంటే ఇది చిన్నగా పనిచేస్తుంది, ఫైటోటాక్సిక్ ఎక్కువ మొత్తములో ఉంటుంది, మరియు ఇది శుభ్రపరచిన నీటి యొక్క pH స్థాయిని తగ్గిస్తుంది.
ఇవి అత్యవసర పరిస్థితికి మరియు లోపలి దూరముగా ఉన్న ప్రదేశాలకు అందుబాటులో ఉన్నవి. క్రిములను చంపుట అనేది దీని యొక్క ప్రధానమైన లక్ష్యము ఎందువల్లనంటే చూచుట వల్ల నిర్దారించే రుచి, వాసన, ఆకారము మరియు రసాయనిక కాలుష్యము అనేవి తాగు నీటి యొక్క సురక్షితత్వమును తక్కువ కాలానికి ప్రభావితము చేయలేవు.
ప్రాంతీయముగా లభించు వస్తువులతో సౌర శక్తి ద్వారా నీటిలోని క్రిములను చంపుట(SODIS ) అనేది తక్కువ ఖర్చుతో కూడిన క్రిమిసంహారక పద్ధతి. ఇది వంట చెరకు మీద ఆధారపడిన విధానాల లాగా కాకుండా వాతావరణము మీద తక్కువ ప్రభావాన్ని కలిగిస్తుంది.
ఈమధ్య కాలములోని ఒక అధ్యయనము ఏమి కనిపెట్టినది అంటే సౌర శక్తి ద్వారా క్రిములను చంపి వెలుతురు తగలని ప్రదేశములో నిలువ వుంచిన నీటిలో వేగ వంతముగా పునరుత్పత్తి చేసే వైల్డ్ సాల్మొనెల్ల అనేది ఈ నీటిలో కేవలము మిలియనులో పదవ వంతు హైడ్రోజను పెరాక్సయిడ్ ను కలుపుట వల్ల నిరోధించబడుతుంది.
ఇతర నీటి శుద్దీకరణ పద్ధతులు ముఖ్యముగా స్థానిక వ్యక్తిగత సరఫరా విధానాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. కొన్ని దేశాలలో వీటిలో కొన్ని పద్దతులు పెద్ద స్థాయిలో జరుగు పురపాలక నీటి సరఫరాకు కూడా ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకించి ముఖ్యమైనవి డిస్టిలేషన్ (సముద్ర జాలాలలోని ఉప్పును మరియు లవణాలను తొలగించుట) మరియు రివర్సు ఓస్మోసిస్.
తక్కువ స్థాయిలో హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయుటకు, ఎలక్ట్రోడుల యొక్క ఉపరితలముపై లవణాలు ఏర్పడకుండా మరియు క్రిములను మరియు క్లోరిన్ ను ఉపయోగించు నీటినుండి తొలగించుటకు నీటి శుద్దీకరణ యంత్రాలు స్థాపించబడి ఉంటాయి. మొదట నీరు ఇసుక మరియు చెత్త కణాలను తొలగించుటకు 20 మిక్రో మిల్లిమీటర్లు ఉన్న అవరోధమును కలిగించు (జల్లెడ లేదా తెర వడపోత యంత్రము)వడపోత యంత్రము ద్వారా ప్రవహిస్తుంది తరువాత క్రిములను మరియు క్లోరిన్ ను తొలగించుటకు ఉత్తేజిత కార్బన్ ను ఉపయోగించిన బొగ్గు వడపోత యంత్రముగుండా ప్రవహిస్తుంది చివరగా లోహసంబంద అయానులను తొలగించుటకు అయానులను తొలగించు వడపోత యంత్రము గుండా ప్రవహిస్తుంది. బేరియం, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం మరియు సిలికాలను సంర్ధవంతముగా తొలగించామా లేదా అనునది సరిచూచుకొనుటకు వడపోతకు ముందు మరియు వడపోత తరువాత పరిక్షను నిర్వహించవచ్చు.
దీనికి ఉపయోగించు ఇంకొక పద్ధతి రివర్సు ఓస్మోసిస్.
నీటి యొక్క కాలుష్యాన్ని గుర్తించు రైన్బో ట్రవుట్ (ఆన్కోరించాస్ మైకిస్)ని నీటి శుద్దీకరణ ప్లాంట్ల లో సున్నితమైన నీటి కాలుష్యాన్ని గుర్తించుటకు ఉపయోగిస్తారు
2007 ఏప్రియల్ లో స్పెన్సర్, మెస్సాచుసేట్స్ నందు శుద్దీకరణ యంత్రాలు సరిగా పనిచేయక పోవటము వలన సోడియము హైడ్రాక్సైడ్ (lye ) ఎక్కువగా ఉపయోగించబడి నీరు కలుషితమైనది
చాల పురపాలక సంస్థలు క్రిమిసంహారకముగా క్లోరిన్ ను ఉపయోగించుటకు బదులు క్లోరమిన్ ను ఉపయోగించుట మొదలుపెట్టాయి. ఏమయినప్పటికీ క్లోరోమిన్ కొన్ని నీటి వ్యవస్థలలో హానికారకమైనదిగా గుర్తించబడినది. క్లోరోమిన్ పాత నీటిని సరఫరా చేయు పైపుల లోని రక్షణ కొరకు ఏర్పరచిన ఫిల్మ్ ను మానవ నివాసాలలోని పైపులకు ఉన్న వాల్వు లలోని సీసమును విడుదల చేయుట ద్వారా కరిగించ గలదు. ఇది ప్రమాదకరమైన సీసము భారిన పడుటకు దారి తీస్తుంది, దాని యొక్క ఫలితముగా రక్తము లోని సీసము స్థాయిలు పెరుగుతాయి. సీసము నరాలకు మరియు నరాలలోని కణాలకు ప్రమద్దాన్ని కలిగించే న్యురోటాక్సిన్ గా పేరుపొందినది.
డిస్టిలేషను నీటి నుండి అన్ని మినరల్స్ ను తొలగిస్తుంది మరియు వాహక విదానాలైనటువంటి రివర్స్ ఓస్మోసిస్ మరియు నానో వడపోత వంటివి చాలా నుండి అన్ని మినరల్స్ ను తొలగిస్తాయి. ఇది మినరల్సు లేని తాగుటకు సరిపడనటువంటి తాగు నీటికి దారి తీస్తుంది. 1980 నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ మినరల్స్ తొలగించిన నీటి యొక్క ప్రభావాలను అధ్యయనము చేసినది. మానవుల పై చేసిన ప్రయోగాలు మినరల్స్ లేని నీరు అతి మూత్రమును కలిగించుట మరియు మరియు రక్తములోని సీరం ను మరియు పొటాషియం స్థాయిలను తగ్గించి ఎలేక్త్రోలైట్ లను తొలగిస్తుంది. నీటిలోని మెగ్నీషియం, కాల్షియం మరియు ఇతర మినరల్సు పోషకాహార లోపమునకు వ్యతిరేకముగా రక్షణ కల్పిస్తాయి. మినరల్సును తొలగించినటువంటి నీరు సులభముగా విష కారక లోహాలైనటువంటి సీసము మరియు కాడ్మియం లను సులభముగా సంగ్రహిస్తుంది. దీనిని నీటిలో కరిగి ఉన్న కాల్షియం మరియు మెగ్నీషియం ద్వారా అరికట్టవచ్చు. తక్కువ స్థాయిలో మినరల్సు ను కలిగిన నీరు కొన్ని సందర్భాలలో చిన్న పిల్లలను సీసము చేత విషప్రయోగానికి గురి చేసింది. ఇది సీసము ఎక్కువ మొత్తాలలో పైపుల నుండి నీటిలోనికి చేరినప్పుడు సంభవిస్తుంది. మెగ్నీషియం కనీసం 10 మిల్లీ గ్రాములు నుండి 20 -30 మిల్లీ గ్రాములు వరకు ఒక లీటరుకి నీటికి; కాల్షియం 20 మిల్లీగ్రాములు కనీసముగా మరియు 40 -80 మిల్లీగ్రాములు వరకు ఉండాలి మరియు నీటి ఘాడత 2 నుండి 4 mmol/L లీటరుకి ఉండాలి అని సిఫార్సు చేయబడినది. లీటరుకి 5 mmol ఘాడత కలిగిన నీటివలన పిత్తాశయము నందు రాళ్ళు, ఊపిరి తిత్తులలో రాళ్ళు, మూత్రాశయములో రాళ్ళు కీళ్ళ నొప్పులు మరియు కీళ్ళ జబ్బులు రావటము గమనించబడినది. అదనముగా ఈ లవణములను తొలగించు ప్రక్రియ బ్యాక్టీరియాతో కలుషితమయ్యే ప్రమాదాన్ని ఎక్కువ చేస్తుంది.
గ్రుహోపయోగ డిస్టిల్లర్స్ ను తయారు చేసే వారు దీనికి భిన్నముగా చెపుతారు. వారు చెప్పేది ఏమిటంటే నీటిలోని మినరల్సు అనేక వ్యాదులకు కారణము ప్రయోజనకారకమైన ఖనిజాలు ఆహారము నుండి రావాలి కానీ నీటి నుండి కాదు. వారు అమెరికన్ మెడికల్ అసోసియేషను చెప్పిన "మానవ శరీరమునకు కావలసిన ఖనిజాల యొక్క అవసరము ఎక్కువగా ఆహారము ద్వారా తీరుతుంది తాగు నీటి ద్వారా కాదు" అనే దానిని ఉటంకిస్తారు. WHO నివేదిక కూడా కొన్ని తక్కువ మినహాయింపులతో "తాగు నీరు మానవులకు కావలసిన ఖనిజాలకు ప్రధాన మూలము కాదు మరియు మనము తీసుకొనే కాల్షియం మరియు మెగ్నీషియంలకు ఇది ప్రధాన మూలము కాదు" అని అంగీకరిస్తుంది. అంగీకరిస్తూనే ఖనిజాలు తీసివేసిన నీరు ప్రమాదకరమని సూచిస్తుంది. దీని అదనపు ఆధారాలు అనేక దేశాలలో జంతువుల మీద చేసిన ప్రయోగాలు మరియు వైధ్యశాలలలో గమనించినటువంటి అంశాల నుండి లభించాయి. నీటి ద్వారా జింకు మరియు మెగ్నీషియం మోతాదులు ఇవ్వబడిన జంతువుల సీరములో ఈ పదార్ధాల యొక్క అవక్షేపాలు ఆహారము ద్వారా ఈ ఖనిజాలను ఎక్కువ మొత్తములో తీసుకుని తక్కువ ఖనిజాలు కలిగిన నీటిని తాగిన జంతువులలో కన్నా ఎక్కువ మొత్తములో ఉన్నాయి."
ఆధారము: వికిపీడియా
నీటి కాలుష్యం వలన వచ్చే వ్యాధులు