విత్తే సమయం మొదటి పంట - జూన్ – నవంబర్ రెండవ పంట - డిశంబర్ – ఏప్రిల్ మూడో పంట - మార్చి – జూలై రకాలు రకం ఋతువు పంటకాలం (రోజులు) దిగుబడి (క్వి.హెక్టారుకు) గుణగణాలు రాశి ఖరీఫ్, రబీ 115 – 120 5 జింకు మరియు భాస్వరం లోపమును, నీటిఎద్దటిని తట్టుకుటుంది కాటన్ దొర రబీ 120 6.7 సుడిదోమను తట్టుకుటుంది ఐ.ఆర్ 64 రబీ 120 6 అతిసన్న బియ్యం అగ్గి తెగులును తట్టుకుంటుంది హంస అన్నికాలాలకు 125 6 పెరిగే దశలో చలిని తట్టుకుంటుంది క్రిష్ణ హంస ఖరీఫ్ 120 - 125 6 చలి, నీటి ఎద్దటిని, అగ్గి తెగులును తట్టుకుటుంది సోనామసూరి ఖరీఫ్ 145 6 అగ్గి తెగులును తట్టుకుటుంది సాంబ మసూరి ఖరీఫ్, రబీ 145 - 150 6.0 - 6.5 సన్నబియ్యము సతీమ ఖరీఫ్ 135 6.5 అగ్గి,ఎండాకు తెగులును తట్టుకుంటుంది సుమతి ఖరీఫ్ 135 - 140 5.3 ఉల్లికోడు, అగ్గి తెగులును తట్టు కుంటుంది స్వర్ణ ఖరీఫ్ 150 6.5 ఎండాకు తెగులును తట్టు కుంటుంది. చౌడు భూములకు, వివిధ వాతావరణాలకు అనుకూలమైనది వికాస్ ఖరీఫ్ 120 - 125 5.5 చౌడు భూములను తట్టుకుంటుంది రాజవడ్లు ఖరీఫ్ 135 6.0 - 6.5 ఆకు ఎండు, అగ్గి తెగులును తట్టుకుంటుంది ఎ.పి.హెచ్. - ఆర్ .2 ఖరీఫ్, రబీ 120 8.0 - 8.5 ఎండాకు తెగులును తట్టుకుంటుంది డి.ఆర్ ఆర్ ఖరీఫ్, రబీ 125 - 130 8 బియ్యం చాలా సన్నగా ఉంటుంది. విత్తనం -విత్తే పద్దతి హెక్టారుకు 50 కిలోల గట్టి విత్తనాన్ని 1. 08 సాంద్రత గల ఉఫ్ఫును 10.లీ నీరు)లో ముంచి ఎన్నుకొని నారు పోవాలి. విత్తనాన్ని 24 గం నీటిలో నానబెట్టి బయటకు తీసి చీకటి గల వెచ్చటి ప్రదేశములో 48 గం|| మండెకట్టి ఉంచాలి. నేలను ఒకటి రెండు సార్లు దున్ని మడి నిండా నీరు పెట్టాలి. ఒక అందగుళం నీరు ఉంచి 3-4 సార్లు దున్ని మెత్తగ దమ్ము చేయాలి. మురుగు నీటిని తేసివేయడానికి నారుమడి మధ్య కాలువలతో ప్రతి మడి 1మీ. వెడల్పు 15-20 మీ. పొడవు ఉండేటట్లు చేయాలి. మొలకెత్తిన విత్తనాలు బురద మళ్ళలో పలుచగ చల్లాలి. మొలకలు 1 -2 సెం.మీ. ఎత్తు ఎదిగే వరకు నీరు పలుచగ పెట్టాలి. తరువాత 2 సెం. మీ. వరకు నీరు పెట్టవచ్చును. ప్రతి 100 చ.మీ.నారుమడికి 2 కిలోల యూరియా, 3 కిలోల సూపర్ ఫాస్పేట్ , 1కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్, చలి ప్రాంతములలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు 0.5 కిలోల భాస్వరము అదనంగా ఇచ్చే ఎరువులు వేయాలి. 4 – 5 ఆకుల దశలో నారుమడి నుండి నారు తీసి 2 – 3 సెం.మీ.లోతులో పైపైన నాట్లు వేయాలి. దీర్ఘకాలిక రకాలు 20 X 14 సెం.మీ. దూరములో మధ్యకాలిక రకాలు 15 X 15 సెం.మీ. దూరములో స్వల్పకాలిక రకాలు 15 X 10 సెం.మీ. దూరములో నాటాలి. నాటిన 10 – 15 రోజులకు చనిపోయిన మొక్కల స్థానంలో క్రొత్త మొక్కలను నాటాలి. పిలకలు పెట్టునప్పుడు 2 – 3 సెం.మీ. మొవ్వ దశ నుండి గింజ పూర్తిగా పాలు పోసుకునే వరకు 4 – 5 సెం.మీ. వరకు నీతు ఉంచాలి. నాటిన తరువాత ప్రతి రెండు మీ.కు 20 సెం.మీ బాటలు తీయాలి. అంతర కృషి నాటిన 3 – 4 వారముల వరకు కలుపు లేకుండా చూడాలి. కూలీల కొరత ఉన్న ప్రాంతములో కలుపు నివారణ మందులు వాడాలి. కలుపు మందు మోతాదు(లీ) వాడే సమయం(నాటిన). బ్యూటాక్లోర్ (50ఇ.సి) 3(లీ) 4 – 7 రోజులలో బె0ధియోకార్బ్ (50 ఇ.సి) 3 (లీ) 4 – 7 రోజులలో అనిలోఫాస్ (30 ఇ.సి) 1.25 (లీ) 4 – 7 రోజులలో 2,4- డి (80డబ్ల్యూ.సి) 0.8 (లీ) 20రోజులలో కలుపు మందులను 50 కిలోల ఇసుకతో కలిపి పొలంలో చల్లాలి ఎరువులు హెక్టారుకు 110 కిలోల నత్రజని, 60కిలోల భాస్వరం, 40కిలోల పొటాష్ (ఖరీఫ్) హెక్టారుకు 120 కిలోల నత్రజని, 60కిలోల భాస్వర0, 40కిలోల పొటాష్ (రబీ) ఖరీఫ్ ముందుగా జీలుగ – బొబ్బర్లు మరియు పెసరను పచ్చి రొట్టగా కాని వర్షాధార పంటగా కాని వేసిన నత్రజనిని ఆదా చేయవచ్చు. 5 – 10 టన్నుల పశువుల ఎరువు నాట్లకు రెండు వారాల ముందు వేసి దమ్ము చేయాలి. నత్రజనిలో సగభాగం దమ్ములోను, మిగిలిన దానిలో సగభాగం పిలకతొడిగి దుబ్బు సే దశలోను మిగతా సగం అంకురం ఏర్పడునప్పుడు వేసుకోవాలి. హైబ్రిడ్ వంగడాలను నాలుగు దఫాలుగా వేస్తే మంచిది. నాలుగో భాగం పూత దశలో వేయాలి. నత్రజని ఎరువులు పై పాటుగ వేయునపుడు పొలం నుండి నీరు తీసివేసి, ఎరువు వేసిన ఒకరోజు తరువాత తిరిగి నీతు పెట్టాలి. జింకు లోపాన్ని సవరించుటకు దుక్కిలో హెక్టారుకు 50 కిలోల జింక్ సల్ఫేట్ ప్రతి మూడు పంటలకు ఒకసారి వేయాలి. చవుడు నేలల్లో జింకు లోపము సవరణకు 4 – 5 టన్నుల జిప్సం వాడి తదుపరి మొదటి పంటకు 100 కిలోల జింక్ సల్ఫేట్ దుక్కిలో కలియ దున్నాలి. పంటకోతకు కనీసము వారం రోజుల ముందు పూర్తిగా నీరు తీసి వేయాలి. సస్యరక్షణ విత్తనాన్ని 2.5 గ్రా. కార్బన్ డైజిమ్ లేక థైరమ్ 2గ్రా. ఒక కిలో విత్తనములో కలిపు శుద్ధి చేయాలి. నారు వేర్లను క్లోరోఫైరిఫాస్ 0.02 శాతం మందు ద్రావణములో 12 గం|| వుంచి నాటిన యెడల లేత పైరును మొగు పురుగు, ఉల్లికోడు, కాండము తొలుచు పురుగుల నుండి కాపాడవచ్చును. కాండము తొలిచే పురుగు పిలక దశలో మొవ్వ చనిపోతుంది. ఈనిన దశలో తెల్ల కంకులు వస్తాయి. కార్బోఫ్యూరాన్ (3 శాతం) 12 కిలోల లేక ఫోరేటు (10 శాతం) 5 కిలోల గుళికలు లేదా మొనోక్రోటోఫాస్ (36 శాత0) 1.5 శాతం మె.లీ. లేదా క్లోరోఫైరిఫాస్ (36 శాతం) 2.5 మి.లీ. నీటికి కలిపి పిచికారి చేసి నివారణ చేయవచ్చు. ఉల్లి కోడు అంకురం ఉల్లికాడవలె పొడువైన గొట్టంగా మారి బయటకు వస్తుంది. కంకి వెయ్యదు. ఫ్యూరడాన్ (3 శాతం) 10కిలోలు లేదా ఫారేటు (10శాతం) 4 కిలోల గుళికలు వేసి ఉల్లికోడును నివారించవచ్చును. సుడిదోమ దుబ్బుల నుండి రసాన్ని పీలుస్తాయి. పైరు సుడులు సుడులుగా ఎండిపోతుంది. ప్రతి 2 మీటర్లకు 20 సెం.మీ. బాటలు వదలాలి. ఇతోఫెన్ ప్రాక్స్ 1.5 మి.లీ. లేక ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేక ఎసిఫేట్ 1.5 గ్రా లీటరు నీటికి వాడి సుడిదోమను నివారించవచ్చును. ఆకుమడత గొంగళి పురుగు ఆకు మడతలో ఉండి పత్రహరితాన్ని గోకి తిని వేయటం వలనా అకులు తెల్ల బడతాయి. పొట్ట దశలో నష్టం ఎక్కువ. మొనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీ. లేక క్వినాల్ ఫాస్ 2 మి.లీ. నీటిలో కలిపి పిచికారి చేసి ఆకు ముడత తగ్గించవచ్చును. తాటాకు పురుగు పిల్ల, పెద్ద పురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తిని వేయడం వలన తెల్లని మచ్చలు చారలు ఏర్ప్డి ఆకులు ఎండిపోతాయి. క్లోరోఫైరిఫాస్ 2.5 మి.లీ., లేక ఎండోసల్ఫాన్ 2.5 మి.లీ, లేక మొనోక్రోటోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి తాటాకు పురుగును నివారించవచ్చును. అగ్గి తెగలు ఆకులపై ముదుగు గోధుమ రంగు అంచుతో మధ్యలో బూడిద రంగు గల మూలు కండె ఆకారపు మచ్చలు ఏర్పడి, ఆకులు ఎండిపోయి తగులబడినట్లు కనిపిస్తాయి. వెన్నుల మెడ భాగంలో ఈ తెగులు ఆశిస్తుంది. వెన్నులు విరిగిపోతాయి. ఎడఫెన్ ఫాస్ 1 మి.లీ. లేక ట్రైసైక్లోజోల్ 75 శాతం 0.6 గ్రా ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేసి అగ్గి తెగలును నివారించవచ్చును. పొడతెగలు దుబ్బుదశ నుండి కాండం మరియు ఆకులపై మచ్చలు పెద్దవై పాముపొడ మచ్చలుగా ఏర్పడతాయి. మొక్కలు, పైరు పూర్తిగా ఎండిపోతుంది. కార్బన్ డైజిమ్ 1గ్రా. లేదా వెలిడామైసిన్ 2 మి.లీ 1 లీ.నీటికి కలిపి పిచికారి చేసి పొడ తెగలును నివారించవచ్చును. టుంగోవైరస్ ఈ వైరస్ పచ్చ్ దీపపు పురుగుల వలన వ్యాపిస్తుంది. వైరస్ సోకిన మొక్కలు కురచగ ఉండి సరిగా ఎదగవు. పిలకలు తగ్గిపోయి, ఆకుల చివరల నుండి లేత ఆకుపచ్చ్ లేక నారింజ రంగులోకి మారతాయి.వైరస్ ఆశించిన మొక్కల నుండి వన్నులు రావు. వచ్చినా చిన్నవిగా, గింజలు గట్టి పడక తాలుగ మారుతాయి. ఈ వైరస్ ఆశించిన మొక్కలను గురించి వెంటనే తీసి నాశన చేసి, దీపపు పురుగుల నివారణకు ప్యూరడ్యాన్ (3 శాతం) 30 కిలోలు ఒక హెక్టారుకు లేదా ఫోరెట్ (10శాతం) 10 కిలోలు ఒక హెక్టారుకు లేదా మొనోక్రోటోఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి టుంగోవైరస్ నివారిచవచ్చును. ఆధారము: కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.