ఆంధ్రప్రదేశ్ లో రాగి 1.13 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ 49 వేల టన్నుల ఉత్పత్తినిస్తుంది. సరాసరి దిగుబడి ఎకరాకు 4.35 క్వింటాళ్ళ వస్తుంది. విత్తే సమయం రాగిని ఖరీఫ్ లో జూలై-ఆగష్టు మాసాల్లో, రబీలో నవంబరు-డిసెంబరు మాసాల్లో వేసవిలో జనవరి-ఫిబ్రవరి మాసాల్లో విత్తుకోవచ్చు. నేలలు రాగిని తేలిక రకం ఇసుక నేలలయందు మరియు బరువు నేలల్లో పండించవచ్చు. నీరు నిల్వఉండే భూములు అనువైనవికావు. రకాలు రకం ఋతువు పంటకాలం (రోజుల్లో) దిగుబడి (క్వి/ఎ) గుణగణాలు గోదావరి ఖరీఫ్, రబీ 120 – 125 12 - 16 అన్ని ఋతువుల్లో పండించవచ్చు, పైరు ఎక్కువగా పిలకలు వేస్తుంది. మొక్క పచ్చగా ఉండి, వెన్నులు పెద్దగా, ముద్దగా ఉంటాయి. గింజలు ఎరుపు గోధుమ రంగు కలిగి, మధ్యస్థ మైన లావుంటాయి. రత్నగిరి ఖరీఫ్, వేసవి 110 – 115 12 - 16 పైరు ఎక్కువగా పిలకలు వేస్తుంది. మొక్క ఆకుపచ్చగా వేసవి ఉండి 90 సెం.మీ. ఎత్తువరకు ఎదుగుతుంది. వెన్నులు పెద్దగా మద్దగా ఉంటాయి. గింజలు ఎరుపు గోధుమ రంగులోఉండి, మధ్యస్థమైన లావుగా ఉంటాయి. సప్తగిరి ఖరీఫ్, రబీ 110 – 115 12 - 16 పైరు ఎత్తుగా పెరిగి, పిలకలు ఎక్కువగా వేస్తుంది. చిత్తూరు జిల్లాకు అనుకూలం. మారుతి ఖరీఫ్, వేసవి 85 - 90 10 - 12 బెట్టను, అగ్గి తెగులును అన్ని దశల్లోను తట్టుకొంటుంది. చంపావతి అన్ని కాలలకు 50 – 85 10 - 12 రాగి పండించే అన్ని ప్రాంతాలకు అనువైనది. బెట్టను తటు కొంటుంది. అంతర పంటగా కందితో పండించేందుకు అనువైనది. భారతి అన్ని కాలలకు 105 – 110 14 – 16 అన్ని ఋతువులలో పండించవచ్చు. వెన్నులు పెద్దగా ముద్దగా ఉంటాయి. అగ్గి తెగులును కొంత వరకు తట్టుకోగలదు. శ్రీ చైతన్య ఖరీఫ్ 110 - 115 12 - 16 పైరు ఎత్తుగా పెరిగి పిలకలు ఎక్కువగా వేస్తుంది. ఖరీఫ్లో .అన్ని ప్రాంతాలకు అనువైనది. విత్తనం 2.5 కిలోల విత్తనంతో 5 సెంట్లలో పెంచిన నారు ఎకరా పొలంలో నాటడానికి సరిపోతుంది. వెదజల్లే పద్ధతిలో ఎకరాకు 3-4 కిలోల విత్తనం కావాలి. విత్తన శుద్ధి కిలో విత్తనాన్ని 2 గ్రా, కార్బండైజిమ్ లేదా 3 గ్రా, మాంకోజెబ్తో కలిపి విత్తనశుద్ధి చేయాలి. విత్తటం తేలిక పాటి దుక్కిచేసి విత్తనం చల్లి, పట్టె తోలాలి. నారుపోసి నాటుకోవాలి. మరుగు నీటిపారుదల సౌకర్యంగల నేలల్లో నారుపోసుకోవాలి. నాటటం 85-90 రోజుల స్వల్పకాలిక రకాలకు 21 రోజుల వయసుకల్గిన మొక్కలను, 105-125 రోజుల దీర్ఘ కాలిక రకాలకు 30 రోజుల వయసు కల్గిన మొక్కలను నాటుకోవాలి. ఎకరాకు దీర్ఘకాలిక రకాలకు లక్ష ముప్పె మూడు వేల మొక్కలు, స్వల్పకాలిక రకాలకు రెండు లక్షల అరవై ఆరువేల మొక్కలు ఉంచాలి. విత్తే దూరం స్వల్పకాలిక రకాలకు వరుసల మధ్య 15 సెం.మీ. వరుసలో 10 సెం.మీ., దీర్ఘకాలిక రకాలకు వరుసల మధ్య 15-20 సెం.మీ. వరుసలో 15 సెం.మీ. దూరం పాటించి విత్తుకోవాలి. ఎరువులు నారుమడిలో : 5 సెంట్ల నారుమడి ఎకరాకు సరిపోయే నారును ఇస్తుంది. 640 గ్రాముల నత్రజని, 640 గ్రాముల భాస్వరం మరియు 480 గ్రాముల పొటాష్నిచ్చే ఎరువులను వేయాల్సి ఉంటుంది. పొలంలో : ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్మిలో కలియదున్నాలి. ఎకరాకు 12 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ నాటేటప్పడు వేయాలి. నాటిన 30 రోజులకు మరో 12 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి. విత్తనం వెదజల్లే పద్ధతి బాగా మెత్తగా తయారైన భూమిలో విత్తనాన్ని సమానంగా చల్లుకోవాలి. విత్తనం చల్లిన తరువాత బల్లతోగాని, చెట్టుకొమ్మతోగాని, నేలను చదును చేయాలి. లేనిచో విత్తనానికి తగినంత తేమ లబించక మొలక శాతం తగ్గుతుంది. కలుపు నివారణ, అంతర కృషి విత్తిన రెండు వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తనం వేసేదానికి మరియు నారు నాటటానికి ముందు పెండిమిథాలిన్ 30% ఎకరాకు 600 మి.లీ. వేసేదానికి చొప్పన 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును నివారించవచ్చు. నాటిన 25, 30 రోజులకు వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు ఎకరాకు 400 గ్రా. 24 డి సోడియం సాల్ట్ 80% పొడి మందు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. నీటి యాజమాన్యం నాటిన పైరు బాగా వేర్లు తొడిగిన తర్వాత 10 రోజులు నీరు పెట్టరాదు. పూత, గింజ పాలు పోసుకునే దశల్లో పైరు నీటి ఎద్దడికి గురికాకుండా చూడాలి. అంతర పంటలు రాగితో కందిని 8:2 నిష్పత్తిలో సాగుచేయవచ్చు. దీనిలో రాగి వరసల మధ్య దూరం 30 సెం.మీ., మొక్కల మధ్యదూరం 10 సెం.మీ. కంది వరసల మధ్యదూరం 60 సెం.మీ., మొక్కల మధ్యదూరం 20 సెం.మీ. పాటించాలి. రాగితో చిక్కుడును 8:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. వరుసల మధ్యదూరం 30 సెం.మీ. వరసల్లో మొక్కల మధ్యదూరం 10 సెం.మీ. మరియు చిక్కుడు మొక్కల మధ్యదూరం 20 సెం.మీ. పాటించాలి. సస్యరక్షణ పురుగులు గులాబి రంగు పురుగు : ఈ పురుగు సజ్జ, జొన్న కొర్ర పంటలను కూడ ఆశిస్తుంది. . బాగా ఎదిగిన లార్వాలు లేత గులాబి రంగులో ఉంటాయి. లార్వాలు కాండాన్ని తొలచి సొరంగాలు చేసి లోపలి భాగాలను తినడం వలన మొవ్వ చనిపోతుంది. పంటను కంకి దశలో ఆశిస్తే అవి తెల్ల కంకులుగా మారుతాయి. ఈ లార్వా పరుగులు ఒక మొక్క నుంచి యింకొక మొక్కకు పాకి నష్టపరుస్తాయి. దీని నివారణకు ఈ పురుగు ఆశించిన మొక్కలను గుర్తించి ఏరివేయాలి. మొక్కల అవశేషాలను కాల్చివేయడం ద్వారా వీటివల్ల కలిగే నష్టం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి ఒకటి, రెండు శాతం మొక్కల్లో పురుగు ఆశించినప్పడు లీటరు నీటికి ఎండోసల్ఫాన్ 2 మి.లీ. కలిపి పిచికారి చేయాలి. శనగ పచ్చ పురుగు : ఇది రాగి పంటని కంకి దశలో ఆశించి పూత, గింజలను తిని నష్టపరుస్తుంది. నివారణకు పురుగు ఆశించినపుడు కంకులను దులిపి లేదా చేతితో ఏరివేసి నాశనం చేయాలి. లీటరు నీటికి 2 మి.లీ. ఎండోసల్ఫాన్ లేదా 3 గ్రా. కార్బరిల్ 50 శాతం పొడి మందు కలిపి పిచికారి చేయాలి. ఎకరాకి 8 కిలోల వంతున మలాథియాన్ 5% పొడి మందు కంకులపై చల్లికూడ నివారించ వచ్చును. చెదలు : రాగి, కొర్ర పంటలను చెదలు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. తేలిక నేలల్లో వరాభావ పరిస్థితుల్లో ఈ పంటను పండించినప్పడు చెదలు ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. వీటి నివారణకు పంటల చుటూ అక్కడక్కడ ఎత్తుగా కనిపించే పుట్టను నాశనం చేయాలి. ఆ పుట్టల పై భాగంలో రంధ్రం చేసి లీటరు నీటికి 5 మి.లీ. చొప్పన క్లోరిపైరిఫాస్ మందును కలిపి ఒక్కొక్క పుట్టలో 10-12 లీటర్ల మందు ద్రావణం పోయడం ద్వారా చెదలను నివారించవచ్చు. ఈ చెదలు ఎక్కువగా నష్టపరిచే ప్రాంతాల్లో పంటలు వేసే ముందు ఆఖరి దుక్కిలో లిండేన్ పొడి మందును ఎకరాకు 10 కిలోల చొప్పన భూమిపై చల్లి కలియదున్నాలి. తెగుళ్ళు అగ్గి తెగులు : ఈ తెగులు నారుమడిలోను, తరువాత నాటిన పంటను ఆశిస్తుంది. వర్షపు జల్లలు పడుతూ గాలిలో అధిక తేమ ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నప్పడు అగ్గితెగులు ఉధృతి ఎక్కువవుతుంది. వాతావరణం ఈ విధంగా ఉంటే అధిక నత్రజని వాడిన పంటల్లో తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. ఎదిగిన మొక్కల ఆకులు, కణుపులు, వెన్నులపైన దారపుకండె మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు చుటూ ఎరుపు గోధుమరంగు అంచులు కలిగి ఉంటాయి. కణుపులపై తెగులు ఆశిస్తే కణుపులు విరగడం, వెన్నుపై ఆశిస్తే గింజలు తాలు గింజలుగా మారుతాయి. దీని నివారణకు పంట పొలాల్లో కలుపు మొక్కలు లేకుండా చూడాలి. ముందు జాగ్రత్త చర్యగా విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. తెగులును తట్టుకొనే రత్నగిరి, శ్రీచైతన్య భారతి రకాలను ఎన్నుకోవాలి. మొక్కలపై అక్కడక్కడ మచ్చలు కనిపించినప్పడు లీటరు నీటికి 1 గ్రా. కార్బండైజిమ్ లేదా 1 మి.లీ. ఎడిఫెన్ ఫాస్ మందు కలిపి పిచికారి చేయాలి. నత్రజని ఎరువులను సిఫారసుకు మించి వాడకూడదు. నారునాటే ముందు బైటాక్స్ లేదా మాంకోజెబ్ మందును 3 గ్రా. లీటరు నీటికి చొప్పన కలిపి ఆ ద్రావణంలో నారును ముంచి శుద్ధి చేసి నాటుకుంటే పంటను మొదటి దశల్లో ఆశించే తెగుళ్ళ నుండి కాపాడుకోవచ్చు. వెదజల్లి విత్తేపద్ధతిలో 3 గ్రా, ధైరమ్ లేదా కాష్ట్రాన్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఆకుమాడు తెగులు : లేత మొక్కల వేర్లు, మొదళ్ళపై తెగులు ఆశించి మొక్కలు కుళ్ళిపోతాయి. ఆకులపై చిన్న అండాకారపు లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత ఆకులు ఎండుతాయి. దీని నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేయాలి. సస్యరక్షణతో మంచి ఫలితాలు పొందాలంటే, ఒక ఎకరకు 200 లీటర్ల నీటితో సిషార్సు చేయబడిన మోతాదులో క్రిమినాశక/ శిలీంద్రనాశక మందులను కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయవలసి వుంటుంది. పంటకోత రాగి పంటను సరైన సమయంలో కోతను ప్రారంభించాలి. గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నప్పడు, వెన్నుకు దగ్గరి ఆకులు పండినట్లుగా ఉన్నప్పడు పంటను కోయవచ్చు. పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది. కాబట్టి 2 లేక 3 దశల్లో కంకులను కోయాలి. పొలంలోనే చొప్పను కోసి 2-3 రోజులు ఆరిన తరువాత వెన్నులను విడదీయవచ్చు లేదా నేరుగా చొప్పను కోయకుండ వెన్నులనే కోసి 2-3 రోజులు పొలంలో ఆరబెట్టవచ్చు. బాగా ఆరిన వెన్నులను కర్రలతో కొట్టిగాని, ట్రాక్టరు నడపడం ద్వారా గాని గింజలను సేకరించాలి. అలా సేకరించిన గింజలను గాలికి తూర్పారబెట్టి నాణ్యమైన గింజలను పొందవచ్చు. రాగి పంటసాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రిన్సిపల్ సైంటిస్ట్ (చిరుధాన్యాలు), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పెరుమాళ్ల పల్లె - 517 505, ఫోన్ నెం. (077)-2276240, సేల్ నెం. 9989625227. (లేదా) ప్రిన్సిపల్ సైంటిస్ట్ (బ్రీడింగ్) & హెడ్, వ్యవసాయ పరిశోధనాస్థానం, విజయనగరం - 535 001, ఫోన్ నెం. 08922-225983