మన రాష్ట్రంలో ఖరిఫ్ లో మొదటి పంట తర్వాత వర్షాధారంగా లేదా ఏ పంట వేయడానికి అనువుగా లేనప్పుడు, తొలి దశలో వున్న పండ్ల తోటలలో ఉలవ పంటను సాగుచేయువచ్చు . ఈ పంటను మహబూబ్ నగర్, నల్గొండ మరియు రంగారెడ్డి జిల్లాల్లో సాగుచేస్తారు. నేలలు నీరు బాగా పట్టి ఉంచే చల్కా, ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు అనుకూలం. మురుగు నీరు నిల్వ ఉండి ఎక్కువగా చౌడు కల్గిన నేలలు పనికిరావు. పంటకాలం/అనువైన సమయం సాధారణంగా లేట్ ఖరిఫ్/రాబీకి ముందు మరియు రబీలో పండించవచ్చు. ఆగష్టు రెండవ పక్షం నుండి మొదలుకొని అక్టోబర్ మొదటి పక్షం వరకు వేసుకోవచ్చును. నేల నీరును/తేమను నిలుపుకునే స్వభావాన్ని మరియు ఆయా ప్రాంతాలలో మొదటి పంటను దృష్టిలో వుంచుకొని సకాలంలో విత్తిన మిగులు తేమను లేదా ఆలస్యంగా కురిసే వర్షాన్ని ఆధారం చేసుకొని మంచి పంటను పండించవచ్చును. రకాలు రకంఋతువు / పంటకాలం (రోజుల్లో) దిగుబడి (క్వి/ఎ) లక్షణాలు పి.డి.యం – 1 105 2-2.5 గింజలు బూడిద తెలుపు ఉంటాయి. పి.జడ్.యం. – 1 90-95 2-2.5 గింజలు నలుపు రంగులో ఉంటాయి. పి.హెచ్.జి. – 62 85 2-2.5 గింజలు నలుపు రంగులో ఉంటాయి. పి.హెచ్.జి – 9 90-100 2-3.0 గింజలు బూడిద తెలుపు రంగులో ఉంటాయి. పల్లాకు తెగులును తట్టుకొంటుంది. సి.ఆర్.హెచ్.జి – 19 80-90 3-4.0 గింజలు బూడిద రంగు కలిగి మొక్కలు మధ్యస్థ ఎత్తు పెరిగి కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. బూడిద తెగులు, పల్లాకు, ఆకు మచ్చ తెగులును తట్టుకొనును. తెల్లదోమను కూడా కొంత వరకు తట్టుకొనును. కాయలు చిట్లవు, బెట్టను కూడా తట్టుకొని అధిక దిగుబదినిచ్చును. విత్తన మోతాదు సాళ్ళ పద్ధతిలో గోర్రుతో ఎదపెట్టినపుడు 8-10 కిలోలు, వెదజల్లి దున్నే పద్ధతిలో ఎకరానికి 12-15 కిలోల విత్తనం వాడాలి. విత్తనశుద్ధి ప్రతి కిలో విత్తనానికి 1 గ్రా. కార్బండాజిమ్ లేదా థైరమ్ తో విత్తనశుద్ది చేసి విత్తుకోవాలి. విత్తే దూరం సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. దూరంలో విత్తుకోవాలి. మొక్కల సాంద్రత సాళ్ళ పద్ధతిలో విత్తినప్పుడు ఎకరానికి 1,33,333 మొక్కలు ఉండేలా చూడాలి. విత్తు పద్ధతి సాధారణంగా తొలకరి పంట తీసిన తర్వాత గాని , వర్షాలు తగు స్ధాయిలో కురవనప్పుడు గాని ఉలవలు విత్తడం జరుగుతుంది. కావున భూమిలో తగినంత తేమ చూసుకొని నాగలితో లేదా కల్టివేటరుతో ఒకసారి గొర్రు తోలి దుక్కి మెత్తగా తయారుచేసి విత్తుకోవాలి. నాగలి లేదా గోర్రుతో సాళ్ళ పద్ధతిలో సాళ్ళ మధ్య 30 సెం.మీ. ఎడంలో గింజలు సమంగా పడేటట్లు తగు పదనులో విత్తుకోవాలి. అంతర పంటలు / పంటల సరళి ఉలవలు తొలకరి వేసిన వర్షాధార స్వల్పకాలిక పంటలైన పెసర , మినుము మరియు జొన్న, మొక్కజొన్న తదితర పంటల తర్వాత మరియు తొలకరిలో ఏ పంట వేయకుండా, లేటు ఖరిఫ్ లో ఉలవలు విత్తుకోవచ్చును. అలాగే ఉలవలతో ఇతర అంతర పంటలుగా కాకుండా ఉలవలను పండ్ల తోటలలో అంతర పంటలుగా విత్తుకోన్నచో పచ్చిరోట్ట, పశువుల మేత మరియు భూసారం పెరిగి పండ్ల తోటల ఎదుగుదలకు, దిగుబడికి దోహదపడును. సమగ్ర ఎరువుల యాజమాన్యం సేంద్రియ ఎరువులు చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మోళ్ళను రోటావేటర్ తో భూమిలో కలియ దున్నాలి. జీవన ఎరువులు రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించవలెను. 100 మి.లీ. నీటిలో 10 గ్రా. పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడెర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లర్చవలెను. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాల పై చల్లి దానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలియ బెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను. ఈ ప్రక్రియను పాలిథీన్ సంచులను ఉపయోగించి చేసుకోవలెను. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టర్ ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గాని, విత్తనం విత్తేటప్పుడు గాని సాళ్ళల్లో పడేటట్లు వేసుకొనవలెను. ఈ ఎరువు భూమిలో మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరమును లభ్యమగు రూపంలోకి మర్చి మొక్కలకు అందుబాటులోకి తెచ్చును. రసాయనిక ఎరువులు ఎకరాకు 4 కిలోల నత్రజని, 10 కిలోల పోటాష్ నిచ్చు ఎరువులు వేయాలి. 10 కిలోల యూరియా, 63 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ ఎరువులు ఆఖరి దుక్కిలో వేయాలి. భుసార పరీక్షూ ఆధారంగా రసాయనిక ఎరువులు వేసుకోవాలి. సమగ్ర కలుపు యాజమాన్యం ఉలవలు వర్షాధారంగా లేదా మిగులు తేమ ఆధారంగా ఎక్కువగా పండిస్తారు. కావున విత్తిన తొలి 30-40 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. కలుపు సమస్యాత్మక ప్రాంతాలలో దుక్కి పై ప్లూక్లోరాలిన్ 45% ఎకరాకు 1 నుండి 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేల పై పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. అవసరం మేరకు విత్తన 25-30 రోజుల్లో భూమిలో తేమ తగినంతగా ఉన్నప్పుడు అంతరకృషి చేసి కలుపు నివారించి, బోదె ఎక్కించినచో అడపాదడపా కురిసిన వర్షపు నీరు బాగా ఇంకి పంట దిగుడిని పెంచాడానికి దోహపడును. నీటి యాజమాన్యం సాధారణంగా మరియు వివిధ నేలలలో పండించే పంట కాని అవసరం మేరకు కీలక దశలలో (మొగ్గ, కాయ తయారగు దశ) నీటి తడి ఇచ్చినచో దిగుబడి పెరుగును. పంట కాలంలో సుమారు 250-300 మి. మీ. నీరు అవసరం. బెట్ట పరిస్థితులో పంటలో హరిత వర్ణం తగ్గిన, మొక్కలు సారం కోల్పోయినచొ మేగ్నిషియం క్లోరైడ్ 6 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు మూడు సార్లు 5 రోజులు వ్యవధిలో పిచికారి చేస్తే బాగా ఉపయోగకరంగా ఉండును,. సమగ్ర సస్యరక్షణ ఉలవలలో పూత, పిందే సమయంలో కాయ తొలుచు పురుగు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. వీటి నష్టపరిచే లక్షణాలు, అనుకూల వాతావరణ పరిస్థితులు మరియు నివారణ చర్యలు పెసర, మినుములో సూచించిన విధంగా పాటించవలెను. పంటకోత పంట పరిపక్వత దశలో కాయలు ఆకుపచ్చ నుండి పసుపు రంగుకు మారి ఎండిపోవును. క్రమేపి క్రింది నుండి పైకి ఆకులు కూడా హరితాన్ని కోలోయి పూర్తిగా రాలిపోవును. సుమారు 80% వరకుకాయలు ఎండిన తరువాత పంటను కోసినచో నాణ్యమైన దిగుబడి పొందవచ్చును. పంటను కొడవలితో పూర్తిగా మొదలు వరకు పొడి వాతావరణంలో కోయాలి. కోతానంతర జాగ్రత్తలు కోసిన పంటను 3-4 రోజుల వరకు పంట చేనులో గాని లేదా కళ్లం పై ఎండనిచ్చి ఆ తర్వాత కర్రలతో కొట్టిగాని, పశువులతో తొక్కించి లేదా ట్రాక్టర్ తో తోక్కించి లేదా ఆల్ క్రాప్ త్రేషర్ ను ఉపయోగించి నూర్పిడి చేయాలి. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరచి 2-3 రోజులు ఎండనిచ్చి గింజలలో తేమ 9 శాతం కన్నా మించకుండా చూసుకొని నిల్వ చేయవలెను. ధాన్యం / ఉత్పత్తుల నిల్వ మెళకువలు మరియు సస్యరక్షణ బాగా ఎండిన గింజలు (8-9 తేమ శాతం) బిన్స్ లో గాని, గొనె సంచులలో గాని, పాలిథీన్ సంచులలో గాని నిల్వ చేయవచ్చును. నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనాలను (గొనె సంచులు) శుభ్రపరుచుకోవాలి. గొనె సంచులను 10 శాతం వేప ద్రావణం పిచికారి చేసి వాడుకోవాలి లేదా 5% వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గొనె సంచులను వాడాలి లేదా సంచుల పై మాలధియాన్ 10 మి.లీ. లేదా డేల్టామెత్రిన్ 2 మి.లీ. లేదా డైక్లోరోవాస్ (0.05%) ఒక మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసి తరువాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి. బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన క్రింద 20 మి.లీ. మలాధియాన్ ద్రావణం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి,. నింపిన బస్తాలు చెక్క బల్లల పై వరుసలలో పేర్చి తేమ తగులకుండా జాగ్రత్త వహించాలి. ధీర్ఘకాలం నిల్వచేసినప్పుడు ఎప్పట్టికప్పుడు గమనించి అవసరం మేరకు అప్పుడప్పుడు ఎండబెట్టి నిల్వ చేయాలి. ముఖ్య సూచనలు ఆయా ప్రాంతానికి అనువైన అధిక దిగుబదినిచ్చు రకాలను ఎన్నుకొని సాగుచేయాలి. వర్షాధారంగా/మిగులు తేమ ఆధారంగా పండించినప్పుడు సకాలంలో అంతరకృషి చేసి బోదె ఎక్కించి వర్షపు నీరు యింకింపచేసినచో అధిక దిగబడికి దోహదపడును. సాళ పద్ధతి అవలంభించావలెను. విధిగా విత్తనశుద్ది చేసి విత్తుకోనవలెను. విత్తన 25-30 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడవలెను. అవసరం మేరకు కీలక దశలో నీటి తడులు ఇవ్వవలెను. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. ఎట్టి పరిస్థితులలో పొలంలో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి. బెట్ట పరిస్థితులలో పంటలో హరితవర్ణం తగ్గినా మొక్కలు సారం కోలోయినచో మెగ్నీషియం క్లోరైడ్ 6 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు మూడు సార్లు 5 రోజులు వ్యవధిలో పిచికారి చేస్తే బాగా ఉపయోగకరంగా ఉండును. రసం పిల్చే పురుగులైన తామర పురుగు, తెల్లదోమ మరియు పేనుబంకలను సకాలంలో అదుపుచేయాలి. సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి శనగపచ్చ పురుగును మరియు మారుక మచ్చల పురుగును నివారించావలెను. విత్తడం, అంతరకృషి, నూర్పిడి తదితర పనులలో యాంత్రిక పద్దతులు అవలంభించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగును. విత్తనోత్పతి నీటి వసతి కలిగి ఉన్నప్పుడు రబీ విత్తనోత్పతి చేపట్టినట్లయితే నాణ్యమైన విత్తనం పొందవచ్చు. నీరు బాగా యింకే తటస్థ నేలల్లో విత్తనోత్పత్తి చేపట్టాలి, మురుగు నీరు నిల్చే చౌడు నేలలు పనికిరావు. నాణ్యమైన విత్తనాన్ని పరిశోధనా లేదా గుర్తింపు పొందిన సంస్ద నుండి సేకరించి విత్తనోత్పత్తికి వాడుకోవాలి. ప్రధాన పొలము బాగా తయారుచేసి సిఫార్సు మేరకు సేంద్రియ మరియు రసాయనిక ఎరువులు వేయవలెను. నాణ్యమైన అధిక దిగుబదికై పంటకు సిఫార్సు చేయబడిన అత్యుత్తమ సేద్య పద్ధతులు పాటించాలి . తమ ప్రాంతానికి అనువైన, చీడపీడలు – రోగ నిరోధక శక్తి కలిగిన దిగుబడి నిచ్చు రకాలు ఎన్నుకోవాలి. ఉలవల విత్తనోత్పత్తికి ఎన్నుకొన్న పొలము ఇతర ఉలవల పొలము నుండి మూల విత్తనోత్పత్తి కనీసం 10 మి., ధృవికరణ విత్తనోత్పత్తి కనీసం 5 మీటర్లు వేర్పాటు దూరం ఉండేలా చూడాలి. ఎకరానికి 8 కిలోల విత్తనం వాడి విధిగా విత్తన శుద్ధి చేసి వరుసలలో విత్తవలెను. విత్తేటప్పుడు రంగులో తేడా ఉన్న విత్తనాలు, రంగు మారిన విత్తనాలు, పుచ్చులు వేరు చేసి ఒకే రకవైన విత్తనం విత్తుకోవాలి. తద్వారా ఆదిలోనే కేళీలను నివారించవచ్చు. విత్తనపు పంటకు అంతరకృషి సకాలంలో చేసి 25-30 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. కిలక దశలో పైరు బెట్టకు రాకుండా జాగ్రత్తపడాలి. పైరు మొలక దశ నుండి కోత సమయం వరకు బెరకు మొక్కలను, ఎత్తు, రంగు, పూత, కాయ మరే విధంగా నైన తేడాగా ఉన్న మొక్కలు కనిపిస్తే పీకి వేయాలి. అదే విధంగా తెగులు సోకిన మొక్కల్ని తీసివేయాలి. అవసరమైన సస్యరక్షణ చర్యలును సకాలంలో చేపట్టాలి. పరిపక్వదశకు చేరినప్పుడే (కయలు పూర్తిగా ఎండు గడ్డి రంగుకు మారుతాయి) పైరును కోసి, ప్రత్యేకముగా నూర్పి , సూచించిన తేమ శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి. కోత సమయంలో గాని, కళ్ళలో గాని తగు వేర్పాటు దూరాన్ని పాటించి కల్తిలకు తావు లేకుండా చూడాలి. విత్తనం నిల్వ చేసుకొనుటకు కొత్త సంచులను మాత్రమే వాడి కల్తిని నిరోధించడమే కాకుండా ధాన్యపు నిల్వలో పురుగు రాకుండా నిరోధించ వచ్చును. విత్తన సంచులను గాలి వెలుతురు పుష్కలంగా లభించే పరిశుభ్రమైన ప్రదేశములలో నిల్వ ఉంచాలి. సంచులను నెల పై కాకుండా బల్లల పై ఉంచినట్లయితే తేమ శాతంలో మార్పు రాదు. విత్తనం ఆరోగ్య కరంగా ఉంటుంది. క్రమ సంఖ్య ప్రమాణాలుమూల విత్తనం సర్టిఫైడ్ విత్తనం 1. విత్తన భౌతిక స్వచ్చత 98% 98% 2. భౌతిక ఇతర పదార్దాలు (అత్యధికంగా) 2% 2% 3. ఇతర పంటలు విత్తనాలు (అత్యధికంగా) - 10/కిలో విత్తనానికి 4. కలుపు మొక్కల విత్తనాలు (అత్యధికంగా) - - 5. ఇతర గుర్తించదగిన రకాలు (అత్యధికంగా) 5/కిలో విత్తనానికి 10/కిలో విత్తనానికి 6. మొలక శాతం (గట్టి గింజలు కలుపుకొని) 80 80 7. తేమ శాతం 9 9 ఖరిఫ్ లో విత్తిన కంది స్వల్పకాలిక రకాలు పూత – పిందే దశలోను, మధ్యకాలిక రకాలు మొగ్గ నుండి పూత దాశాలోను ఉన్నవి. ఈ దశలో శనగ పచ్చ పురుగు మరియు మరుకా మచ్చల పురుగులు ఆశించి నష్టపరుస్తాయి. మరుకా మచ్చల పురుగు నివారణకు మొగ్గ దశలో ఉన్నట్లయితే వేప సంబంధిత (వేప నూనె/వేప గింజల కషాయం 5 శాతం) మందులు పిచికారీ చేయాలి. తొలి పూత దశలో క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. పురుగు ఉధృతిని బట్టి గూళ్ళు ఎక్కువగా ఉన్నచో లర్విన్ 1.0 గ్రా. లేదా నోవాల్యురాన్ 1.0 మి.లీ లేదా స్పైనోసాడ్ 0.3 మి.లీ తో పాటు డైక్లోరోవాస్ 1.0 మి.లీ/ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారీ చేసిపురుగును నివారించవలెను. వాతావరణం అనుకూలంగా వున్నప్పుడు (మేఘావృతమై, చిరుజల్లులు కురిసినచో లేదా పొగ మంచు కురిసినప్పుడు) పురుగు ఉధృతి పెరగవచ్చు. నిండు పూత లేదా తొలి పిందే సమయంలో అవసరం మేరకు క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ లేదా ఫ్లూబెండమైడ 0.2 గ్రా/ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఖరిఫ్ కందిలో భూమి గుణాన్ని బట్టి బెట్ట పరిస్దితులలో మొగ్గ దశలో ఒక తేలిక పాటి తడి ఇచ్చినచో తొలి పూత ఒకే సారి వచ్చి కాయ నిల్వడానికి దోహదపైది దిగుబడి పెరుగును. నిండు పూత సమయంలో నీరు పెట్టరాదు. రబీలో విత్తిన కందిలో కలుపు లేకుండా చూడాలి. అవసరం మేరకు గుంటక/గొర్రుతొలి అంతరకృషి చేసి 50 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. అవసరం మేరకు నీటి తడులు పెట్టాలి. రబీలో విత్తిన పెసర/మినుములో తామర పురుగులు గమనించినచో ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2.0 మి.లీ ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పల్లాకు తెగులు వ్యాపింపచేసే తెల్లదోమ గమనించినచొ నివారణకై ట్రైజోఫాస్ 1.5 మి.లీ లేదా డైఫేన్త్యురాన్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. రబీలో విత్తిన శనగ పంటను పచ్చ రబ్బరు పురుగు ఆశించి నష్టపరుచును. నివారణుకు క్వినాల్ఫాస్ 2.0 మి.లీ లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ ప్రతి లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రవిలో ఆలస్యంగా విత్తుకునే పరిస్దితులలో శనగ పంటను నవంబరు మొదటి పక్షంలోపు విత్తుకోవాలి. నల్ల రేగడి భూములు అనుకూలం. జేజి-11 జెఎకెఐ-9218, ఎన్ బిఇజి-3, ఎన్ బిఇజి-47 రకాలు అనుకూలం. ఎకరానికి 30 కిలోల విత్తనం వాడి, విత్తే ముందు కిలో విత్తనానికి 2.5 గ్రా మాంకోజేబ్ మరియు 1.5 గ్రా. విటావాక్స్, 8గ్రా. ట్రైకోడర్మావిరిడి తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఆఖరి దుక్కిలో సేంద్రియ ఎరువుతో పాటు ఎకరానికి 18-20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ మరియు 16 కిలోల గంధకం నిచ్చే ఎరువులు వేయాలి. పూర్వపు పంట కోత సమయంలో కాని ఆ తర్వాతగాని అవకాశమున్నచో నేలను బాగా తడిపి దుక్కి తయారు చేసుకొని నిండు పదనులో విత్తినచో మొలక శాతం బాగా వుండును. లేని పక్షంలో విత్తనచొ 12 గంటలు నానబెట్టి, తర్వాత వడగట్టి విత్తినచో మొలక శాతం బాగా వుండును. చదరపు మిటరుకు 33-40 మొక్కలు వుండేలా సాళ్ళ మధ్య 30 సెం.మి మొక్కల మధ్య 10 సెం.మి ఎడంతో విధిగా గొర్రు లేదా సిడ్ తో విత్తుకోవాలి. శనగ – ధనియాలు 16:4 నిష్పత్తిలో పండించవచ్చును. విత్తిన 24-36 గంటలలో కలుపు నివారణకై పెండిమీధాలిన్ 1.25 లీటర్లు/ఎకరానికి 200 లీటర్ల నీటితో కలిపి పిచికారి చేయాలి (లీటరు నీటికి 5 మి.లీ చొప్పున కలపాలి.) ఉలవలు సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత (అపరాలు), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం. వరంగల్, ఫోన్ నెం. 9704222742, 9849133493 ఆధారం: వ్యవసాయ పంచాంగం