జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి ( నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ) : జాతీయ అత్యవసర విపత్తులు ఎదుర్కొనడానికి ఈ నిధి ఏర్పాటు చేసారు. జాతీయ అత్యవసర పన్నుల విధానం కింద వివిధ రకాలైన దిగుమతులపై వేసిన పన్నుల ద్వారా ఈ నిధి ఏర్పాటు చేసారు. రాష్ట్ర ప్రభుత్వ పరిదిలోనున్న రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధులు పూర్తిగా ఖర్చుచేసిన తరువాత లేదా కేటాయించిన నిధులు చాలనప్పుడు రాష్ట్రంలో సంభవించిన విపత్తులపై నివేదిక సమర్పించడం ద్వారా జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వం సహాయం కోరవచ్చు. పశుసంపద నష్టపోయిన సన్న మరియు చిన్నకారు రైతులకు /వ్యవసాయ కూలీలకు సహాయం. పశువులు, పాడి పశువులు లేక పనులకు ఉపయోగించే పశువులు కోల్పోయినప్పుడు : పాడి పశువులు : గేదె/ఆవు/ఒంటె - రూ. 16,400/- గొర్రె,మేక - రూ. 1,650/- ఒక పెద్ద పాడి పశువు లేక నాలుగు చిన్న పాడి పశువులకు మాత్రమే నష్ట పరిహారం ఇస్తారు.(సంభందిత రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఆ పశువుల నష్టాన్ని ధృవీకరించాలి.) పశు శిబిరాలకు పశుగ్రాసం/దాన సరఫరా రూ.32/-లకు, పశు శిబిరాలకు నీటిని మరియు మందులు/మాత్రలు/వ్యాక్సిన్, పశు శిబిరాల్లో లేని పశువులకు పశుగ్రాసం సరఫరా అదేవిధంగా రాష్ట్ర స్తాయి కమిటి అంచనాల ఆధారంగా కేంద్ర బృందం సూచన మేరకు వాస్తవ ఖర్చు చెల్లిస్తారు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యుడు - విజ్ఞాన్