అజోల్లా ఆకుపచ్చ పేర్న చెందిన మొక్క ఇది నీటిమీద తేలుతూ ఉంటుంది. అజోల్లాకు పచ్చిరొట్టగా మారియ జీవన ఎరువుగా ప్ప్రధానత ఉంది. రైజోబియం, పప్పుదినుసులకు ఉన్న సంబంధమే అజోల్లా, ఆలెకు ఉంది. అజోల్లా పెరుగుదల, నీలి ఆకుపచ్చ నాచు నత్రజని సిరిసరణ శక్త మీద ఆధారపడి ఉంటుంది. అయితే నీలి ఆకుపచ్చ నాచులో ఉన్న రకాల్లో ఒక రకమైన జివి అజొల్లాలో బతుకుతుంది. ఇవి గాలిలోని నత్రజనిని, బొగ్గు పులుసు వాయువును పోషక పదారాధలుగా మారీచగల ఏకైక జీవులు. అజోల్లా జీవన ఎరువును మాగాణి వరిపొలంలో ఉపయాగించడం వలన వరి దిగుబడులు 20 శాతం వరకు పెంచవచ్చు. వరిపొలంలో దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ పాసేతును వేసి పలుచగా నీరు నిలువకట్టి 100 - 150 కిలోల అజోల్లా వేసి 2 నుండి 3 వారాల పెరగనిచ్చి నెలలో కలియదున్నాలి. ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్ట, 12 కిలోల నత్రజనిని నేలకు చేరవేస్తుంది. అజోల్లా పచ్చిరొట్టి ఎరువుగా, జీవన ఎరువుగా మాత్రమే కాకుండా ప్రతయమ్మాయా పశువుల దాణాగా కూడా చాలా ప్రాముఖ్కాత సంతరించుసుంది. పశువుల దాణాగా అజోల్లా ప్రాముఖ్కత: ఎండబెట్టిన అజోల్లా పొడిలో 25 - 35 శాతం మాంసకవత్తులు, 10 - 15 శాతం మినరల్స్, 7 - 10 శతాం అమినో అమాళ్ళు మరియు కెరోటిన్, బి - 12 నిటమినులు ఉన్నాయి. అజొల్లాలో తక్కువగా లిగిన్ ఉండడం వలన పశువులు దీనిని తేలికగా జైరాం చేసు కుంటాయి. ప్రతి రోజు1 ½ కిలోల నుండి 2 కిలోల అజోల్లా పాడి పశువులకు పెట్టినచో పాల దిగుబడిలో 15 - 20 శాతం వద్ది కినిపించినటులు పరిశీలనలో తెలిసింది. అలాగే పశువుల దాణాలో నేరుశన పిండికి బదులుగా అదే పరిమాణంలో అజోల్లా వాడవచ్చని, దీనివలన నానేత పెంచడమే కాకుండా పశువుల అర్యోగం వ్రద్ది చెందుతుందని నిరాదరించారు. అజొల్లాను దాణాగా వాడుట వలన దాణా ఖారుచు 20 - 25 శాతం తగ్గడమే కాకుండా వెన్న శాతం మరియు ఎస్.ఎన్.ఎఫ్. కూడా పెరుగడం వలన ప్రతి లీటరు పాలకు 60 - 150 పైసలు అధిక ఆదాయాన్ని పొందవచ్చు. గొర్రెలు,మేకలు, పందులు, కుందేళ్ళ, కోళ్ళు, వంటి కూడా అజోల్లా మెత్తగా ఉపాయాగపడుతుంది. 1 : 1 నిశతిలో పశువుల దాణాలో కిలిసి వాడకం సగానికి సగం తగ్గించవచ్చు. ఒక కిలో అజోల్లా ఉతాపత్తికి 33 పైసల నుండి 50 పైసల వరకు ఖారుచు అవుతుంది. వ్యవసాయానికి ఉపయాగించడానికి సరాసరి బెడ్స్ / అజోల్లా ఉత్తత్తి: అజొల్లాను పెంచే భూమిని చదును చేసి 20 మీటర్ల పోడవు * 2 మీటర్ల వేదాలతో మడులు ఏరపరచుసున్న తరువాత, ఆ స్దలంలో 10 సెంటీమీటర్ల లోతు నీరు నిలువ ఉంచాలి. తాజా పేడ 10 కిలోల తీసుకుని 20 లీటర్ల నీటిలో కిలిపి ఆ మదుల మీద చల్లాలి. ఈ మొదలు మీద 8 కిలోల అజోల్లా (ఒక్కొక్క మడిలో) పరిచాలి. సూపర్ పాసెటు 100 గ్రాములు ఒక్కొక్క మడిలో పైపాటు ఎరువుగా 3 సార్లుగా 4 రోజుల వ్వవధిలో చల్లాలి. అజోల్లా ఇనాక్కులేషన్ చేసిన 7 రోజులకు చీడపీడల నుండి రచన కొరకు 1 కిలో పూయరాదాన్ గుళికలు ఒక్కొక్క మడికి చల్లాలి. 15 రోజులలో అజోల్లా ప్రధాన పొలంలో వేయడానికి తయారవుతుంది. ఒక్కొక్క మడి నుంచి సుమారు 40 - 50 కిలోల అజోల్లా లాభాయమవుతుంది. అవసరాన్ని బట్టి నర్సరీ బెడ్స్ సంఖ్య పెంచుకోవాలి. దమ్ములో అజొల్లాను పచ్చిరొట్టగా ఉపయాగించుకోవచ్చు. అజోల్లా జీవన ఎరువుగా కూడా మంచి ఫలితాలనిస్తుంది. కాబట్టి దీనికి ప్ర్రామూఖ్యత ఏర్పడింది. పశువుల దాణాగా అజోల్లా ఉత్పత్తి విధానం: మన పశువులకు ప్రతి రోజు 4 కిలోల అజోల్లా అవసరం అనుకుంటే, ఈ మేతాదూ తయారు చేయడానికి 2 . 25 *1 . 5 మీటర్ల సైజులో మూడు తొట్లు తయారు చేసుకోవాలి. ముందుగా భూమి పై కలుపును పూర్తిగా తొలిగించి సమానంగా చదును చేయాలి. భామి మీద 10 సెంటీమీటర్ల ఎత్తు వచ్చునట్లు ఇటుకలు నిలబెట్టి 2 . 25 మీటర్ల పొడవు 1 . 5 మీటర్ల వెడల్పు ఉండునట్లు తొట్టిని తయారు చేసుకోవాలి. బయట నుండి వేళ్ళు లోనికి రాకుండా పిలాస్టిక్ సంచిని గోతి లోపల పరచాలి. దీని మీద 150 జి.ఎస్.ఎం. మందము గల సైల్పాలిన్ షిట్ వేసి,షిట్ చివరలు ఇటుకల అంచుల వరకు వచ్చునట్లు చూడాలి. (2.50*1.8 మీటర్ల సైజుగల శిల్పాలిన్ షీటు). శిల్పాలిన్ షిట్ కప్పిన తొట్టి లోతు 10 సేం.మీ. ఉండాలి. తరువాత 30-35 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి, ఆ మట్టిని షిట్ మీద గోతిలో సమానంగా ఉండేలా పరచాలి. (మొత్తం మట్టి 10 కిలోల చ.మీ.కు) తరువాత 4-5 కిలోల పరిమాణం గల 2-5 రోజుల నిలువ ఉంచిన పశువుల పేడను 10-20 లీటర్ల నీటిలో కలిపి గుజ్జగా తయారుచేని దీనికి 40 గ్రాముల మినరల్ మిక్చర్ కలిపి ఆ మట్టిమీద పోయాలి. 7 నుండి 10 సెం.మీ. నీటి లెవల్ ఉండేలా చూడాలి. తరువాత బెడ్ మిట్టిని నీటిని కలియతిప్పాలి. నీటి లేనల్ 7-10 సేం.మీ ఉండునట్ల చూసి 1–1.5 కిలోల తాజా మదర్ కల్చర్ అజొల్లాను ఈ బెడ్ మీద సమానంగా పరిచి మంచినీటిని అజొల్లాపై చిలికించాలి. అజోల్లా త్వరగా పెరిగే స్వభావం కలది. తొట్టి మొత్తాన్ని 7 నుండి 10 రోజులలో ఆక్రమిస్తుంది. ఒక కిలో అజోల్లా నుండి వారం రోజులలో 8 - 10 కిలోలు వస్తుంది. 7వ రోజు నుండి అజొల్లను ప్రతి రోజు స్వీకరించవచ్చు.ఆ తరువాత 7 రోజులకు ఒకసారి ఒక కిలో పేడను + 20 గ్రాముల మినరల్ మిక్చర్ 5 లిటీర్ల నీటిలో కలిపి గుజ్జుగా చేసి అజోల్లా తొట్టిలో పోయాలి. అజోల్లా పెంపకం జాగ్రత్తలు: నేరుగా సూర్యకాంతి పడే చోట మరియు ఎక్కువ నీడ గల ప్రదేశంలో కాకుండా అజొల్లాను పెంచాలి. అజోల్లా పెంచు గుంటలు ఆకులు రాలని ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. అలాకాని యెడల గుంటలలో ఆకురాలినట్లయితే అజోల్లా కుళ్ళిపోమే ప్రమాదం ఉంది. నీటిమట్టం కనీసం 5 సేం.మీ. తక్కువ కాకుండా గుంట యెక్క ప్రతి ములలో సమానంగా ఉండేట్లు చూడాలి. పోషకాలతో లోపం లేకుండా చూడాలి.తెగుశ్శ నిరోధక చర్యలు చేపట్టాలి. 10 రోజులకు ఒకసారి బెడ్ లో 4వ వంతు నీటిని తీసి కొత్తనీటిలో మరలా నింపాలి. 60 రోజులకు ఒకసారి 5 కిలోల బెడ్ మట్టిని తొలగించి తిరిగి 5 కిలోల కొత్త మట్టిని బెడ్ అంతా పరచాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి మట్టిని, నీటిని తొలగించి మళ్ళీ కొత్తగా వేయాలి. పూరైగా తొలగించి తాజా అజొల్లాను వేయాలి.చీడపీడలు ఆశించిన అజొల్లాను, పురుగు మందులు వాడిన అజొల్లాను మెత్తగా వాడరాదు. కుళ్ళుడు వ్యాధి: ఇది ఫంగస్ వలన వస్తుంది. మనం అజోల్లా తయారుచేసే విధానం వల్ల వచ్చే ప్రధానమైన వ్యాధి. ఈ వ్యాధి సోకినా అజొల్లాను బెడ్ నుండి తీసివేయాలి. అజోల్లా మేతగా మేపుట: చదురపు సెంటీమీటరు వెడల్పయిన రంధ్రాలు గల పిలాస్టిక్ ట్రేలో సేకరించిన అజొల్లాను ఉంచాలి. సగం నీరు నింపి బక్కెట్ మీద ట్రేను ఉంచి పై నుండి నీటిని పోసి ఆవు పేడ వాసన పోయేటట్లుగా కడగాలి. చిన్న అజోల్లా మొక్కలు రంధ్రాల ద్వారా బక్కెట్లోకి వెళతాయి. ఆ నీటిని మరలా బెడ్ లో పోయుట ద్వారా అజొల్లాను తిరిగి పెంచవచ్చు. అజొల్లాను పశువుల దాణాతో పాటు 1:1 నిష్పత్తిలో వాడడం చాలా లాభదాయకమని శాస్ర్తవేత్తలు పరిశీలన. ఆధారం: వ్యవసాయ సాంకేతిక యాజమాన్నా సంస్ధ