కరవు ఏర్పడుతుందనడానికి సంకేతాలు అనుభవం ప్రాతిపదికగా, మన వ్యవసాయ చక్రంలోని వివిధ దశలలో కరువు ఏర్పడుతుందనడానికి కొన్ని ప్రమాద సూచనలను గుర్తించడం జరిగింది. అవి: ఖరీఫ్ సీజన్ (విత్తనకాలం: జూన్ నుంచి ఆగస్టు వరకు) నైరుతి రుతుపవనాలు ఏర్పడడంలో జాప్యం నైరుతి రుతుపవనాల సమయంలో మొదట్లో వానలు పడినా, తర్వాత చాలా కాలం వానలు పడకపోవడం జులై నెలలో తగినంత వర్షపాతం లేకపోవడం పశువుల దాణా ధరలు పెరగడం జలవనరుల నీటిమట్టంలో పెరుగుదల లేకపోవడం గ్రామీణ మంచినీటి సరఫరా వనరులు ఎండిపోవడం ''సాధారణ సాగు" సంవత్సరాలతో పోల్చి చూస్తే, ఆ ఏడాదిలో గడచిన కొన్ని వారాలుగా విత్తనాలు వేసే స్థాయి తగ్గుతుండడం రబి సీజన్ ( విత్తనకాలం:నవంబర్ నుంచి జనవరి వరకు) మొత్తం నైరుతి రుతుపవన కాలంలో (సెప్టెంబర్ 30 నాటికి) వర్ష పాతం తగ్గుదల ''సాధారణ సంవత్సరాలతో" పోల్చిచూస్తే, భూగర్భ నీటిమట్టం బాగా పడిపోవడం ''సాధారణ సంవత్సరాలలో" ఇదే సీజన్తో పోల్చిచూస్తే, జలవనరులలో నీటిమట్టం స్థాయి పడిపోవడం. నైరుతి రుతుపన వర్షాలవల్ల జలవనరులలోకి నీటి ప్రవాహాలు బాగా తగ్గిపోయాయనడానికి ఇది సూచన. భూమిలో తేమ బాగా తగ్గిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుండడం పశువుల దాణా ధరల పెరుగుదల టాంకర్ల ద్వారా నీటి సరఫరా పెరగడం (తమిళనాడుకు, పుదుచ్చేరికి అక్టోబర్-డిసెంబర్ మధ్య వచ్చే ఈశాన్య రుతుపవనాలు కీలకమైనవి) ఇతర సీజన్లలో గుజరాత్, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఉత్తర లోతట్టు కర్ణాటక ప్రాంతాలలో, మార్చి / ఏప్రిల్ సీజన్ కీలకమైనది. ఈ సమయంలో ఈ ప్రాంతాలలో నీటి కరవుతో , మంచినీటికి తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం వుంటుంది. కొన్ని నిర్దిష్ట రాష్ట్రాలలో, కొన్ని పంటల విషయంలో, ఏడాదిలో కొన్ని నిర్దిష్టమైన సీజన్లలో వానలు ఎంతైనా అవసరమవుతాయి. ఉదాహరణకు కేరళలో అరటి సాగుకు ఫిబ్రవరినెలలో వానలు ఎంతైనా అవసరం. భారతదేశంలో కరవు-కొన్ని వాస్తవాలు నైరుతీ రుతుపవనాల (జూన్-సెప్టెంబర్) వైఫల్యం వల్లనే భారతదేశంలో కరవు ఏర్పడుతుంది. దేశంలో 73 % వర్షపాతం నైరుతీరుతుపవనాల వల్లనే వుంటున్నందువల్ల, వానలు పడని ప్రాంతాలు వానలకోసం మళ్ళీ వచ్చే రుతుపవనాల వరకు నిరీక్షించక తప్పదు. వర్షపాతానికి సంబంధించి అందుబాటులోవున్న సమాచారం ప్రకారం కరువు దృశ్యం ఇలా వుంటుంది: దేశం మొత్తం విస్తీర్ణంలో 16 % కరువు పీడిత ప్రాంతం . దేశంలో ఏడాదికి దాదాపు 5 కోట్ల మంది ( 50 మిలియన్ల మంది ) ప్రజలు కరువు బారిన పడుతున్నారు. విత్తనాలు వేసే మొత్తం విస్తీర్ణంలో 68 % వివిధ స్థాయిలలో కరువుకు గురవుతుంది. 35 % విస్తీర్ణంలో 750-1125 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. అందువల్ల ఈ ప్రాంతం కరువుకు లోనవుతుంది. భారతదేశ భూ విస్తీర్ణం మొత్తం 329 మిలియన్ హెక్టార్లు. ఇందులో 77.6 % ఉష్ణ మండలాలు (యారిడ్), అల్ప వర్షపాత ప్రాంతాలు(సెమి యారిడ్) , భూమిలో తేమ తగినంత లేని (సబ్ హ్యుమిడ్) ప్రాంతాలు వుంటాయి. కరవు పీడిత ప్రాంతాలు చాలావరకు ఈ 77.6 % విస్తీర్ణంలోనే వుంటాయి. ఉష్ణ మండలంలో 19.6%, అల్ప వర్షపాత ప్రాంతంలో 37 %, తగినంత తేమలేని ప్రాంతంలొ 21%. దేశంలో ఏడాది సగటు వర్షపాతం 1160 మిల్లీ మీటర్లు. అయితే, ఇందులో 85 % వర్షం కేవలం 100-120 రోజులలోనే ( నైరుతీ రుతుపవనాలలో) కురుస్తుంది. 750 మిల్లీ మీటర్లకంటె తక్కువ వర్షపాతం పొందుతూ, 33% భూభాగం తీవ్రమైన కరవును ఎదుర్కొంటుంటుంది. 21 % భూభాగంలో 750 మిల్లీ మీటర్లకంటె తక్కువ వర్షం కురుస్తుంది. ( దక్షిణ భారతదేశం ... పెనిన్సులర్ ఇండియా, రాజస్థాన్తో కూడిన విస్తృత ప్రాంతం) 10 ఏళ్లలో 4 ఏళ్ళు వర్షపాతం అనిశ్చితంగా వుంటుంది. నీటిపారుదల సామర్ధ్యం 140 మిలియన్ హెక్టార్లు. (76 మిలియన్ హెక్టార్ల ఉపరితలం + 64 మిలియన్ హెక్టార్ల భూగర్భం) భూగర్భ నీటిమట్టం పడిపోతుండడం, ఉపరితల జలాలు పరిమితమైపోతుండడం వల్ల విత్తనాలు వేసే నికర విస్తీర్ణాని కంతటికి నీటి వసతి వుండకపోవచ్చు. జనాభా పెరగడం, పారిశ్రామీకరణ ఎక్కువకావడం, పట్టణాలు విస్తరిస్తుండడం, ఎక్కువ పంటలు పండిస్తుండడం, భూగర్భ జలాలు తరిగిపోతుండడం...వీటన్నిటివల్ల తలసరి నీటిలభ్యత క్రమేణా తగ్గుతున్నది. సమస్య మరింత తీవ్రమయ్యే పరిస్థితి పొంచివుంది. పర్యవసానం...దేశంలో ఏదో ఒక ప్రాంతంలో కరువు తప్పకపోవడం ఆధారం: సంక్షోభ యాజమాన్య ప్రణాళిక (క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్)- కరవు(జాతీయ స్థాయి) ; వ్యవసాయ, సహకార శాఖ; వ్యవసాయ మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం వాతావరణం, వాతావరణానుగుణమైన వ్యవసాయ నిర్వహణ ప్రణాళిక రుతుపవనాల స్ధితిని తెలుసుకోండి పంటలకు సంబంధించి రోజువారీ వాతావరణ నివేదిక ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు