సెల్ఫోన్తో తెలుగులో సంక్షిప్త సందేశాలను పంపేందుకు వీలుగా రూపొందించిన 'తెలుగు మాట' అప్లికేషన్(యాప్)ను రాష్ట్ర ఐటీశాఖ తయారు చేశారు. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ సాఫ్ట్వేర్తో నడిచే ఫోన్లు, ట్యాబ్లెట్లలో పనిచేస్తుంది. ఆంగ్ల భాష పై పట్టులేనివారు 'తెలుగు మాట'తో వేగంగా సమాచారాన్ని టైప్ చేసి ఎస్ఎంఎస్లు పంపించేందుకు వీలవుతుందన్నారు. సెల్ఫోన్లలో ఎస్ఎంఎస్లు పంపించుకోవడంతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక అనుసంధాన వేదికల్లోనూ దీని ద్వారా తెలుగు వినియోగించుకోవచ్చని వివరించారు. త్వరలో సాధారణ మొబైల్ ఫోన్లలోనూ ఈ సౌకర్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాషను సపోర్ట్చేసే ఫోన్లలో మాత్రమే ఇది పనిచేస్తుందని. మిగతా ఫోన్లలో అక్షరాలు కనిపించవని చెప్పారు. ఐటీ శాఖ పరిధిలోని 'ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జి నెట్వర్క్' ఈ యాప్ను అభివృద్ధి చేసింది. ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను తెలుగులోకి మార్చ మని ఐటీ శాఖ మంత్రి ఇప్పటికే తెలిపారు. ఆధారము: ఈనాడు