పాత .500 మరియు Rs.1,000 రద్దు పరిణామాల నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలు క్రెడిట్ / డెబిట్ కార్డులు మరియు మొబైల్ ఫోన్ అప్లికేషన్ / ఇ-పర్సులు వినియోగం పెరిగింది . దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక ప్రమోషన్ కోసం ఒక ప్యాకేజీ నీ నిర్ణయించింది. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: పెట్రోల్ / డీజిల్ కొనుగోలుపై డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు చెసె వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోలియం పిఎస్ యు లో విక్రయ ధర పై 0.75% డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించా రు . రోజుకు దాదాపు 4.5 కోట్ల వినియోగదారులు పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తున్నారు . ఈ 4.5 కోట్ల వినియోగదారులు డిజిటల్ మార్గాల ద్వారా నగదు రహిత లావాదేవీలు చేయడం ద్వారా ఈ పథకం ప్రయోజనం పొందగలరు. ఒక అంచనా ప్రకారం ప్రతి రోజు 1800 కోట్ల రూపాయలు పెట్రోల్ / డీజిల్ అమ్ముడవుతోంది. ఈ 1800 కోట్ల రూపాయలు లావాదేవీలలో 20% డిజిటల్ మార్గాల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. నవంబర్ 2016 నెలలో పెట్రోల్ పంపులు వద్ద రోజుకు నగదు రహిత లావాదేవీల 40% పెరిగింది దీనివల్ల రోజుకు Rs.360 కోట్లు నగదు లావాదేవీ నగదు రహిత లావాదేవిలాగా మారాయి. ఈ ప్రోత్సాహక పథకం ద్వారా కనీసం మరింత 30% వినియోగదారులు డిజిటల్ చెల్లింపు ఛైసయ్ల ప్రోత్సహించవచ్చు . దీనివల్ల పెట్రోల్ పంపులు వద్ద సంవత్సరానికి 2 లక్షల కోట్లు నగదు అవసరం తగ్గిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపు మౌలిక సదుపాయాల అభివృద్ధి విస్తరించుటకు, నాబార్డ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హత ఉన్న బ్యాంకులకు నాబార్డ్ 10,000 కంటే తక్కువ జనాభా ఉన్న లక్ష గ్రామాలలో ప్రతి గ్రామానికి 2 POS పరికరాలు అందిస్తుంది . ఈ POS యంత్రాలు ప్రాధమిక సహకార సంఘాలు/పాల సంఘాలు/వ్యవసాయ ఇన్పుట్ డీలర్స్ ద్వారా అగ్రి సంబంధించిన లావాదేవీలు చేస్కుండై సదుపాయం కల్గిస్తాయి . దీనివల్ల దాదాపు లక్ష గ్రామాల్లో ఉన్న 75 కోట్ల జనాభా నగదు రహిత లావాదేవీలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ ద్వారా గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు మరియు సహకార బ్యాంకులు కు 4.32 కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతా ఉన్నవారు కు కోట్ల "Rupay కిసాన్ కార్డులు" జారీ చేయటంలో మద్దతు చేస్తుంది. దీనివల్ల గ్రామస్తులు POS యంత్రాలు / మైక్రోATMs/ ATMs వద్ద డిజిటల్ లావాదేవీలు చేయవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ జనవరి 1, 2017 నుండి సబర్బన్ రైల్వే నెలవారీ లేదా సీజనల్ టిక్కెట్ల డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు చేసిన వినియోగదారులకు 0.5% డిస్కౌంట్ అందిస్తుంది. దాదాపు 80 లక్షల మంది ప్రయాణికులకు సీజనల్ టిక్కెట్ల లేదా నెలవారీ టికెట్ కొనుటకు ఏడాదికి 2000 కోట్ల విలువ నగదు ఖర్చు పెడతారు .సమీప భవిష్యత్తులో డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు ఛైసాయ్ ప్రయాణికులు మరింత పెరిగాయ్ అవకాశం ఉంది. దీనివల్ల నగదు అవసరం Rs.1,000 కోట్లు తగ్గించవచ్చు. ఆన్లైన్ టికెట్ కొనుగోలు చేసిన రైలు ప్రయాణీకులకు 10 లక్షల ఉచిత ఐసీసిడెంటల్ భీమా కవర్ ఇవ్వబడుతుంది. దాదాపు 14 లక్షల రైల్వే ప్రయాణికులు లో 58% రైల్వే ప్రయాణికులు ఆన్లైన్ టిక్కెట్లు కొంటున్నారు . సమీప భవిష్యత్తులో మరొక 20% ప్రయాణీకులు డిజిటల్ చెల్లింపు పద్ధతులకు మారవచ్చు. కనుక 11 లక్షల మంది ప్రయాణికులకు ఐసీసిడెంటల్ భీమా పథకం కింద లాభం పొంద వచ్చు. రైల్వే శాఖ అనుబంధిత సంస్థల/కార్పొరేషన్లు ద్వారా క్యాటరింగ్, వసతి, రిటైర్ గదులు మొదలైనవాటిని చెల్లింపు సేవలు పై డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు పై 5% డిస్కౌంట్ అందిస్తుంది. ప్రయాణీకులు ఈ సేవలను నియోగించు కో వచ్చు . ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు సాధారణ బీమా పాలసీ ప్రీమియంలో 10% మరియు కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ బీమా పాలసీ ప్రీమియంలో 8% వరకు తగ్గింపు లేదా క్రెడిట్ డిజిటల్ మార్గాల ద్వారా చెలింపు చేసిన వారికీ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం విభాగాలు మరియు కేంద్ర పబ్లిక్ రంగ సంస్థలు లో డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు పై ఫీజు/MDR చార్జులు భారం కస్టమర్ పై పెట్టకుండా ఆ ఆ విభాగాలే భారీస్థాయి . రాష్ట్ర ప్రభుత్వాలు ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వా సంస్థలు లో డిజిటల్ మార్గాల ద్వారా చెల్లింపు పై ఫీజు/MDR చార్జులు భారం కస్టమర్ పై పెట్టకుండా ఆ ఆ విభాగాలే భరించాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు చిన్న వ్యాపారులను డిజిటల్ చెల్లింపు వ్యవస్థ లోకి తేవడానికి పిఓఎస్ టెర్మినల్స్ / మైక్రో ATM / మొబైల్ POS పై నెలవారీ అద్దె 100 Rs కన్నా ఎక్కువ తీసుకో రాదు అని సూచించారు. 2000రూ వరకు డిజిటల్ లావాదేవీలు పై డిజిటల్ లావాదేవీ ఛార్జీలు/MDR ఛార్జీలు రద్దు. 2016-17 సంవత్సరంలో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలలో RFID కార్డును / ఫాస్ట్ టాగ్లు ఉపయోగించి చెల్లింపు పై వినియోగదారులు 10% డిస్కౌంట్ పొందవచ్చు ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం