ఈ సంవత్సరం 2016 జనవరి3న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ 103వ ఇండియన్సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభిస్తూ టెక్నాలజీ విజన్ 2035 ను ఆవిష్కరించారు. 2035లో సాంకేతిక రంగంలో భారతీయులు ఏ స్థాయిలోవుంటారు?, వారి అవసరాలనుతీర్చడానికి ఎలాంటి సాంకేతికతలు కావాల్సి ఉంటుంది? మొదలైన విషయాలను ఈ డాక్యుమెంటు తెలియజేస్తోంది. 2035లో భారతీయులకు అందుబాటులో ఉండే సాంకేతికతల్నిదృశ్యమానం చేయడం ఒక్కటే ఈ డాక్యుమెంటు ఉద్దేశం కాదు.. ఈ దార్శనికత అనేది 2035లో దేశం, దేశ పౌరులు చేరుకోవాల్సిన స్థాయి గురించి, ఆస్థాయిని చేరుకోవడానికి సాంకేతికత పోషించే పాత్రను గురించి సమగ్రంగా స్పష్టంచేసింది. ఈ డాక్యుమెంటునుభారతదేశ పూర్వ రాష్ట్రపతి కీర్తిశేషుడు శ్రీ డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాంకుఅంకితం చేయడం జరిగింది. ఈ డాక్యుమెంటకుముందుమాటను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాశారు. టెక్నాలజీ విజన్ -2035 డాక్యుమెంటును టెక్నాలజీ ఇన్ఫర్మేషన్,ఫోర్ కాస్టింగ్ అండ్అసెస్మెంట్ కౌన్సిల్ (టిఐఎఫ్ ఏసి) సంస్థ రూపొందించింది. ఇందులో ఆయా విభాగాలకుచెందిన పన్నెండు టెక్నాలజీ రోడ్డుమ్యాపులు మన శాస్త్రవేత్తలకు, విధాన నిర్ణేతలకు స్ఫూర్తినిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. రాబోయే దశాబ్దాల్లో భారతదేశం యువతదే. యువతీయువకులుప్రదర్శించే పూర్తిస్థాయి సామర్థ్యం దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి ధీమా వ్యక్తం చేశారు. మన పిల్లలు, యువతకు అవసరమయ్యే పౌష్టిక, ఆరోగ్య, విజ్ఞాన, నైపుణ్య, అనుసంధానాలను అందించినప్పుడే వారుదేశాభివృద్ధికి పాటుపడగలరని ఆయన అన్నారు. దేశంలోని బుద్ధి జీవులు, విశ్వవిద్యాలయాలు, మేధావులు చాలా చురుకుగా పని చేసి సాంకేతిక రంగదార్శనికతను సాకారం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాన్నివీలయినన్ని రంగాల్లో సమ్మిళితం చేయడానికి ఈ రంగం అభివృద్ధికి ఉపయోగపడేఅన్ని రకాల వ్యూహాలను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా కృషిచేస్తుందని డాక్యుమెంటును ఆవిష్కరించిన తర్వాత ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. విజన్ డాక్యుమెంటులో పేర్కొన్న 12 రంగాలు విద్యారంగం వైద్యశాస్త్రం -ఆరోగ్య సంరక్షణ రంగం ఆహార - వ్యవసాయ రంగం నీటి రంగం శక్తి రంగం పర్యావరణ రంగం ఆవాసాల రంగం రవాణారంగం మౌళిక వసతుల కల్పన రంగం తయారీరంగం మెటీరియల్స్ రంగం ఇన్ఫర్మేషన్అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగం. రోడ్డు మ్యాపులుతయారుకాగానే వాటిని కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వంవీటిపైన చర్చించి ఆయా రంగాల్లో సాంకేతికతల్ని అమలు చేయడంపైన నిర్ణయంతీసుకుంటుంది. టెక్నాలజీ అనేదిదేశంలోని ప్రతి పౌరుడికి సాధికారత ఇవ్వాలని ఈ డాక్యుమెంటు పేర్కొంటున్నది. తద్వారాదేశానికి అవసరమయ్యే సాధికారత సమకూరుతుంది. ప్రతి భారతీయ పౌరునికి భద్రతనిచ్చేలా,సౌభాగ్యంతో ఉండేలా,వారి అస్తిత్వాన్ని పెంచగలిగేలాచూడడమే టెక్నాలజీ విజన్ -2035 డాక్యుమెంట్ఉద్దేశం. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోతెలిపిన మన సంకల్పం లేదా విజన్ స్టేట్ మెంట్కు అనుగుణంగా ఈ డాక్యుమెంట్ ఉద్దేశాన్నితీర్చిదిద్దారు. అందుకనుగుణంగా విజన్ డాక్యుమెంట్ పన్నెండు ప్రిరాగటివ్స్ (తప్పకుండా అమలులోకి తేవాల్సిన హక్కులు) నుప్రతి భారతీయునికిఅందుబాటులోకి తెచ్చింది. వీటిలో ఆరు వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి,మిగతా ఆరు ఉమ్మడి అవసరాలనుతీర్చడానికి ఉద్దేశించినవి. ఇవి ఏవంటే... వ్యక్తిగత అవసరాలనుతీర్చే ప్రిరాగటివ్స్ స్వచ్ఛమైనగాలి- తాగునీరు ఆహార భద్రత, పౌష్టికభద్రత అందరికీ ఆరోగ్యభద్రత- పారిశుద్ధ్యం నిరంతర విద్యుత్ ( 24 బై 7 విద్యుత్) ఆరోగ్యకరమైననివాసం నాణ్యతగల విద్య-ఉపాధి-సృజనాత్మక అవకాశాలు. ఉమ్మడి అవసరాలనుతీర్చే ప్రిరాగటివ్స్ క్షేమానికి,వేగానికి ప్రాధాన్యతనిచ్చేరవాణా ప్రజల భద్రత-దేశభద్రత సాంస్కృతికవైవిధ్యం, విశిష్టత పారదర్శకమైన,సమర్థవంతమైన పరిపాలన ప్రకృతి విధ్వంసాలను,వాతావరణ మార్పులను తట్టుకునేసామర్థ్యం పర్యావరణహితాన్నికోరుతూ సహజవనరుల సంరక్షణ ఈ పన్నెండు ప్రిరాగటివ్స్నుఅమలు చేయగలమనే ధీమాను ఇవ్వగలగడమే విజన్ డాక్యుమెంట్ ప్రకారం భారతదేశసాంకేతిక దార్శనికతలోని ప్రధానమైన అంశం. ఈ పని చేయాలంటే సాంకేతికతలమ్యాపింగును నాలుగు అంశాల ఆధారంగా తయారు చేయాలి. అమలు చేయడానికి లేదా పాటించడానికి వీలుగాసిద్ధంగా ఉన్న సాంకేతికతలు ప్రయోగశాల నుంచిక్షేత్రానికి తరలించడానికి సిద్ధంగా ఉన్నవి నిర్దేశించిన పరిశోధన చేయాల్సిన సాంకేతికతలు ఊహాస్థాయిలో ఉన్నసాంకేతికతలు. ఈ నాలుగింటిలో నాలుగవ కేటగిరీ సాంకేతికతలు మనిషి కుతూహలం నుంచిరూపుదిద్దుకుంటున్నవి. ఒక లక్ష్యం లేకుండా చేసే పరిశోధనల ద్వారా వెలుగులోకివస్తున్నవి. పదార్థాలకు సంబంధించినఇంటర్నెట్, ధరించగలిగేసాంకేతికత, సింథటిక్ బయాలజీ,బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్,బయో ప్రింటింగ్,రీజనరేటివ్ మెడిసిన్మొదలైనవి. ప్రిసిషన్ అగ్రికల్చర్, రోబోటిక్ ఫార్మింగ్, వర్టికల్ఫార్మింగ్, ఇంటరాక్టివ్ఫుడ్స్, అటానమస్ వెహికల్స్,బయోల్యూమినిసెన్స్,బిల్డింగ్ (భవనం) 3 డి ప్రింటింగ్, భూకంపాలను ముందే పసిగట్టడం, వాతావరణాన్ని మార్చే సాంకేతికలు, గ్రీన్ మైనింగ్ మొదలైన సాంకేతికతలు అందుబాటులోకి వచ్చి మానవాళి అవసరాలనుతీర్చుతాయని భావిస్తున్నారు. ఈ పట్టిక స్వచ్ఛమైనగాలి, తాగునీరు అవసరాలనుతీర్చగలిగే సాంకేతికతకు సంబంధించినది. అభివృద్ధిపరిచిన స్వచ్ఛమైన బొగ్గు సాంకేతికతలు # $ ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత రవాణా ~ # $ వినూత్నమైన ప్రొపల్షన్ సాంకేతికతలు # $ పర్యావరణ హిత తయారీ ~ ఇంటలిజెంట్ రవాణా వ్యవస్థ ~ అతితక్కువ స్థాయిలో దుమ్ము ధూళీకి కారణమయ్యే నిర్మాణరంగ సాంకేతికతలు ~ # వాస్తవ సమయం ప్రకారం అంతరిక్షం నుంచే గాలి నాణ్యత పర్యవేక్షణ # $ ఉప్పునీటి ప్రభావంతో సహా వాస్తవ సమయంలో అక్విఫెర్ (నీటివనరు) పర్యవేక్షణ # $ తక్షణమే తాగునీటి నాణ్యత పరీక్షను చేసే విధానం ~ # $ అందుబాటులో ఉప్పునీటి ప్రభావాన్ని తగ్గించగలిగే సాంకేతికత # $ మెంబ్రేన్ ఆధారిత వ్యర్థ జల శుద్ధి సాంకేతికత ~ అందుబాటులో నీటి వనరుల ఒండ్రును తొలగించే సాంకేతికత # $ వరదనీటిని నియంత్రించే సాంకేతికత ~ # $ ఉపయోగించగలిగే నీటి శుద్ధి సాంకేతికత స్కేలబుల్ పాయింట్ టెక్నాలజీ # $ మంచు బిందువుల ద్వారా నీటి సేకరణ సాంకేతికత # $ పైపులైనులోనే సరైన ప్రాంతంలో నీటి శుద్ధి సాంకేతికత $ నీటి వ్యర్థాన్ని స్వయంగా అరికట్టగలిగే పైపులైన్లు $ % స్వచ్ఛమైన గాలి,తాగునీటికి సంబంధించినసాంకేతికతలు, భావనలు,కార్యక్రమాల వివరణఇలా ఉంది. ~ అమలు చేయడానికిసిద్ధంగా ఉన్నాయి # ల్యాబ్ నుంచిక్షేత్రానికి తరలించడానికి సిద్ధంగా ఉన్నాయి. $ నిర్దేశిత పరిశోధనఅవసరం % ఇంకా ఊహల్లోనే ఉన్నాయి. ప్రధానమైన,అతి ముఖ్యమైన ట్రాన్స్వర్సల్టెక్నాలజీ గురించి విజన్ డాక్యుమెంటు పేర్కొన్నది. పరికరాలు, వాటి తయారీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీఈ మూడు ముఖ్యమైన అంశాలు వేసే పునాది మీద నుంచే అన్ని సాంకేతికతలను నిర్మించవచ్చు. నిర్దేశిత లక్ష్యాన్నిచేరుకోవడానికి కావలసిన మౌలిక వసతులపైన కూడా ఈ డాక్యుమెంటు ప్రధానంగా చర్చించింది.విజ్ఞాన సంస్థలతోపాటు నౌకాశ్రయాలు, ప్రధాన రహదారులు, విమానాశ్రయాలు,రైల్వేలు, శీతలీకరణ గిడ్డంగుల మొదలైన వాటి ఆవశ్యకతగురించి ఈ డాక్యుమెంటు స్పష్టంగా పేర్కొంది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం..ఇంకా ఇతర సంబంధిత శాస్త్రరంగాల్లో ప్రాథమికమైన పరిశోధన జరగాలని డాక్యుమెంటు వివరించింది. సాంకేతిక రంగంలోదేశం ఎదుర్కొనబోయే సవాళ్ల గురించి ఈ డాక్యుమెంటు సవివరంగా పేర్కొంది. దేశమంతాఒక తాటిపైన నిలిచి ఈ సవాళ్లను ఎదుర్కొనాలని డాక్యుమెంటు పేర్కొంది. డాక్యుమెంటుపేర్కొన్న సవాళ్లు ఏవంటే... అందరికీ పోషకాహారభద్రత, స్త్రీలలోనుపిల్లల్లోను వచ్చే రక్తహీనత రూపుమాపడం. అన్ని నదుల్లోను,నీటివనరుల్లోను సమృద్ధిగాను,నాణ్యతగాను నీరుండేలాచూడడం. విద్యార్థికేంద్రంగా, భాషా వివక్షలేకుండా అందరికీ సంపూర్ణమైన విద్య వాణిజ్యపరంగాచూసినప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ఇంధనం శిలాజేతర ఇంధనఆధారిత దేశంగా ఇండియాను రూపొందించడం దేశానికి కావలసినముఖ్యమైన వనరులను తగిన స్థాయిలో అందుబాటులోకి తెచ్చుకోవడం వ్యర్థాల నిర్వహణఅంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ హితంగా ఉండేలా చూడడం రైల్వే వ్యవస్థనులెహ్, తవాంగ్ ప్రాంతాలకుతీసుకుపోవడం జాతీయ వాతావరణమార్పులను అవగాహన చేసుకొని వాటికి తగ్గట్టుగా తయారుగా కావడం. ఏ ప్రాంతమైనా సరేఎన్నికలపరంగాను, ఆర్థికపరంగానుసాధికారిత కలిగి ఉండేలా చూడడం. సాంకేతికత చూపేసామాజిక ప్రభావంపైన తీవ్రస్థాయిలోనే చర్చ జరుగుతోంది. కేపిటల్ ఇంటెన్సివ్టెక్నాలజీ ముఖ్యమా? మ్యా న్పవర్ఇంటెన్సివ్ టెక్నాలజీ ముఖ్యమా? అని మల్లగుల్లాలుపడుతున్నారు. మానవ వనరులు తగినంతగా ఉన్న భారతదేశంలాంటి దేశాల్లో కేపిటల్ఇంటెన్సివ్ టెక్నాలజీ విమర్శలకు గురవుతోంది. ఎందుకంటే అది ఉద్యోగాల సంఖ్యను తగ్గించిమానవవనరులపై తీవ్రమైన ప్రభావం చూపుతుందనే అభిప్రాయం ఉంది. అయితే విజన్డాక్యుమెంటు ఈ అభిప్రాయం అపోహేనని అంటోంది. ఉద్యోగులకు అవసరమయ్యే కొత్తనైపుణ్యాలను నేర్పాలంటే టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. సాంకేతికతఅనేది సమాజంలోని అసమానతలను తగ్గిస్తుంది కానీ వాటిని పెంచదని టెక్నాలజీడాక్యుమెంటు పేర్కొన్నది. పైన పేర్కొన్న సవాళ్లను ఎదుర్కొనడానికిగానుభారతదేశ సాంకేతిక రంగానికిగల సామర్థ్యాలు, అడ్డంకుల గురించి విజన్ 2035 డాక్యుమెంటు ఒక శాస్త్రీయ మదింపును చేసింది.భారతదేశ దృక్పథం నుంచి సాంకేతికతల్ని ఆరు విభాగాలుగా వర్గీకరించింది. ఆ ఆరువిభాగాలు ఇలా ఉన్నాయి. సాంకేతికరంగంలోనాయకత్వం- కీలకమైన సామర్థ్యాలు గలప్రధానమైన సాంకేతికతలు, నైపుణ్యం గల మానవవనరులు, మౌలిక వసతులు, సంప్రదాయ విజ్ఞాన పునాది. ఉదాహరణకు అణుశక్తి,అంతరిక్ష శాస్త్రం. సాంకేతికరంగానస్వావలంబన- ఇతర దేశాల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేకుండా సొంతగా అభివృద్ధిచేసుకోవడానికి వీలుగా ఉండే వ్యూహాత్మక సాంకేతికతలు. ఉదాహరణకు రక్షణ రంగం. సాంకేతిక పరిశోధన-వేరు వేరుగా ఉండే సాంకేతికతల్ని ఒక చోటుకు చేర్చి ఒక సాంకేతికతను రూపొందించడంజరుగుతుంటుంది. అటువంటి సాంకేతితకతను గానీ లేదా ఒక సాంకేతికత విషయంలోసాధించిన విజయాన్నిగానీ మరో రంగంలో వాడుకోవాలి. ఉదాహరణకు క్లోరోఫిల్ ఆధారితసింథటిక్ పాత్వేను ఉపయోగించుకొని తయారు చేసిన సోలార్ బ్యాటరీలు భవిష్యత్శక్తి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడలవు. మన అవసరాలకుఅనుగుణంగా సాంకేతికతను మార్చుకోవడం- ఇతర దేశాల నుంచి సాంకేతికతల్ని సేకరించివాటిని స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలి. తద్వారా ఇతర వనరుల మీదఆధారపడడం తగ్గుతుంది. ఉదాహరణకు వాననీటి సంరక్షణ రంగంలో విదేశీ సంస్థలతో ఒప్పందం, అగ్రి బయోటెక్, నీటి నుంచి ఉప్పుదనాన్ని తొలగించడం, శక్తిని సమర్థవంతంగా వాడుకునే భవనాలు. సాంకేతికపరమైనఅడ్డంకులు- సమాజం మీద దుష్ప్రభావం చూపే సాంకేతికతలున్నాయి. ఇవి మానవాళికి సమస్యాత్మకంగాతయారు కావచ్చు. పర్యావరణ పరంగా హాని జరగవచ్చు. న్యాయపరమైన సమస్యలకుకారణం కావచ్చు. ఉదాహరణకు జెనిటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ (జిఎం). జన్యువులలోమార్పులు చేర్పులు చేయడం ద్వారా సృష్టించే పంటలు. లక్ష్యాన్నిచేరుకోవడానికిగాను శ్రమించాల్సిన ప్రధానమైన సంస్థలన్నిటినీ భాగస్వాములనుచేసేలా విజన్ డాక్యుమెంటు ఒక ప్రత్యేకమైనవిభాగం కింద కార్యాచరణ కోసం పిలుపునిచ్చింది. భారతదేశ సాంకేతికత సామర్థ్యంసుస్థిరంగా వుండడానికిగాను చేయాల్సిన పనులను సూచించింది. భారీస్థాయిలోఅత్యున్నతస్థాయి పరిశోధనల్ని సాంకేతిక విద్యాసంస్థలు చేపట్టాలి. తద్వారావిశిష్టమైన నూతన వస్తువులు, ఆలోచనలుఆవిష్కృతం కావాలి. ప్రభుత్వం తనవైపు నుంచి చేస్తున్న ఆర్థిక సహాయాన్ని పెంచాలి. జిడిపిలో 1 శాతం నిధులను ప్రస్తుతం ఖర్చు పెట్టడం జరుగుతోంది.దీన్ని రెండు శాతం చేయాలి. ప్రధానమైన పరిశోధనారంగాల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తల సంఖ్యను పెంచాలి. వీరు పూర్తికాలం (ఫుల్టైమ్) విధులను నిర్వహించాలి. సిద్ధంగా ఉన్నసాంకేతికతల్ని ల్యాబ్ నుంచి క్షేత్రానికి తరలించడానికి వీలుగా ప్రైవేటు రంగంభాగస్వామ్యం, పెట్టుబడులుండేలాచూడాలి. తద్వారా సాంకేతికత సామర్థ్యం పెరిగి ఆర్థికపరంగా ఆదాయం వస్తుంది. విద్యాసంస్థలు-మేధావులు-పరిశ్రమలు... ఈ మూడింటికి మధ్య సంబంధాన్ని ఏర్పరచాలి.ఆలోచనల్ని పంచుకోవడం ద్వారా, వైవిధ్యమైనపాఠ్యప్రణాళిక డిజైన్ ను రూపొందిచండం ద్వారా, పరిశ్రమల అవసరాలను తీర్చడం ద్వారా,స్టూడెంట్లను పరిశ్రమలుస్పాన్సర్ చేయడం ద్వారా, పరిశోధనలకుఫెలోషిప్పులు ఇవ్వడం ద్వారా ఇలా పలు విధాలుగా ఈ సంబంధం ఏర్పడాలి. పరిశోధనలకుఅనువైన వాతావరణాన్ని నెలకొల్పాలి. ఇది ఎలా ఉండాలంటే విద్యార్థులను, పరిశోధకులను, ఔత్సాహిక వ్యాపారవేత్తలను కలుపుతూ పరిశోధననుఫలవంతమైన ఉత్పత్తి లేదా విధానంగా మార్చగలిగేలా ఉండాలి. కార్యాచరణ కోసంఇచ్చిన పిలుపు (కాల్ టు యాక్షన్) విభాగంలో మూడు ప్రధానమైన కార్యక్రమాల్ని డాక్యుమెంటుపేర్కొంది. మొదటిది విజ్ఞాన సృజన. విజ్ఞాన విప్లవ సాధనలో- అది అప్లయిడ్ కావచ్చు,ప్యూర్ కావొచ్చు - భారత దేశం తప్పకుండా ముందుండాల్సిన సమయమిది. రెండోకార్యాచరణ ఏదంటే..నూతన వస్తువులు, విధానాలను కనిపెట్టడం, అభివృద్ధి చేయడానికివీలుగా వాతావరణం (ఎకోసిస్టమ్) ఏర్పరుచుకోవాలి. ఈ డాక్యుమెంటు పేర్కొంటున్న ఒక అంశాన్ని ఇక్కడప్రత్యేకంగా ప్రస్తావించాలి..అది ఏదంటే ఎకోసిస్టమ్ డిజైన్ బాధత్యలు తప్పకుండాప్రభుత్వ అధికారులవేనని డాక్యుమెంటు స్పష్టంగా పేర్కొంది. ఇక మూడవ కార్యాచరణఏదంటే సాంకేతికతను అమలులోకి తీసుకురావడం. ప్రత్యేకమైన లక్ష్యాలతో జాతీయస్థాయిమిషన్లను ప్రవేశపెట్టడానికి సాంకేతికతను ఉపయోగించుకోవాలి. నిర్దేశించిన సమయాలప్రకారం పనులు కావాలంటే జాగ్రత్తగా గుర్తించిన వ్యక్తులు, సంస్థలే ఆయా సాంకేతికతల్ని అమలులోకితీసుకురావాలి లేదా ఉపయోగించాలి. దేశం మొత్తాన్నిదృష్టిలో పెట్టుకొని ఈ విజన్ డాక్యుమెంటును దేశ భవిష్యత్ కోసం తయారు చేయడం జరిగింది.ప్రతి రంగానికి గల సాంకేతికత రోడ్డు మ్యాపు ద్వారా భవిష్యత్ సాంకేతికతల స్వరూపస్వభావాలుతెలుసుకోవచ్చు. వాటి పరిశోధనలు, అభివృద్ధి, పరిశోధనలు చేయగలిగేప్రత్యేక అంశాలు, రాబోయే సవాళ్లు,ప్రతి రంగానికిసంబంధించిన విధానపరమైన తప్పనిసరి అంశాలు ఈ రోడ్డుమ్యాపులో చూడవచ్చు. ఆధారము: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) హైదరాబాద్