చట్టపరమైన / న్యాయపరమైన వనరులు భారత రాజ్యాంగము గ్రామ న్యాయాలయాల చట్టం 2008 వార్తలు ఇ-గవర్నెన్స్ గ్రిడ్ ను సృష్టించండి : డా. ఏ.పి.జే. కలామ్ 15,000 న్యాయస్థానాలను అనుసంధించడానికి జాతీయ ఇ-గవర్నెన్స్ ప్రణాళిక హైకోర్టులను జిల్లా కోర్టులను కంప్యూటరీకరించడం ఇ-న్యాయవ్యవస్థ అభివృద్ధికెంతో కీలకం కొత్త ఢిల్లీ : రాష్ట్రపతి డా. ఎపిజే. కలామ్ సోమవారం , జులై 9, 2007 నాడు ఇ-న్యాయవ్యవస్ధ ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికై జిల్లా కోర్టులనుంచి సుప్రీమ్ కోర్టుకు ఒక " న్యాయస్థాన సంబంధ ఇ-గవర్నెన్స్ గ్రిడ్ ను ఏర్పాటుచేసి తద్వారా దేశం మొత్తానికి న్యాయవ్యవస్థను అందించాలని ఆయన అన్నారు. 3 అంచెలలో... సుప్రీంకోర్టు జాతీయ ఇ-గవర్నెన్స్ ప్రణాళిక(ఎన్ఇజిపి) కింద దేశంలోని 15000 కోర్టులను అనుసంధించడానికి 3 అంచెలలో ఇ-కోర్టు అనే ప్రాజెక్ట్ ను చేపట్టింది. అవసరమైన మౌలిక సదుపాయాలందించి, సామర్థ్య నిర్మాణం, కేసు ఫైలుచేయడం నించి పని చేయించడం దాకా న్యాయవ్యవస్థను పటిష్టంచేయడం, సమాచారాన్ని ఆన్ లైన్ గా ఇంటర్నెట్లో కోర్టులనించి ప్రాసిక్యూట్ చేసే, పరిశోధనలు చేసే సంస్థలకు, జైళ్లకు, భూరికార్టులకు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు లభ్యంచేయడం, తద్వారా సివిల్, క్రిమినల్ కేసులను సత్వరం పరిష్కరించడం దీని లక్ష్యం. సుప్రీంకోర్టు చేపట్టిన జాతీయ ఇ-కోర్టు ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంచేస్తూ, శ్రీ కలాం ఇలా అన్నారు - “గ్రిడ్ ఏర్పాటు చేయడంవల్ల జి2జి పద్ధతిలో వివిధ విభాగాల మధ్య కేసులకు సంబంధించిన సమాచారం నిలువుగా గ్రిడ్ లో చక్కగా లభ్యమౌతుంది. అదే సమాంతర గ్రిడ్ లో కేంద్రంనించి రాష్ట్రాలకు సంబంధిత కేసుల వివరాలు, సమాచారం న్యాయవ్యవస్థలో వివిధ స్థాయిలలో అందుబాటులోకి రావడంవల్ల పారదర్శకత, వేగం పెరుగుతాయి. అలాగే, వివిధ విబాగాలమధ్య డేటా ప్రవాహం పెరుగుతుంది. తద్వారా ఒకే పనిని పలుసార్లు చేసే అగత్యం ఉండదు. న్యాయం వేగంగా అందుతుంది.” సామర్థ్యాన్ని పెంచడం ఆయన ఇంకా ఇలా అన్నారు - హైకోర్టులను జిల్లా కోర్టులను కంప్యూటరీకరించడం అనేది ఇ-న్యాయవ్యవస్థ రూపకల్పనకెంతో అవసరం. ఒక కేసును నమోదు చేసినప్పటినించి అది పరిష్కారం అయి తీర్పు వచ్చే దాకా మొత్తం ప్రక్రియ ఎలక్ట్రానిక్ రూపంలో జరగాలి. దానివల్ల సులభంగా వెదకడం వెలికితీయడం పోగుచేయడం సమాచారాన్ని సరిచేయడం, న్యాయ రికార్డులను శుద్ధిచేయడం , కేసులని పరిష్కరించడంచేయవచ్చు. ఇపుడు ప్రతిపాదించిన 15000 కోర్టులను జిల్లా స్థాయినించి సుప్రీంకోర్టుదాకా ఒక వైడ్ ఏరియా నెట్ వర్క్ ద్వారా కలపడం వల్ల న్యాయవ్యవస్థ సమర్ధత మరింత మెరుగుపడుతుంది. మొత్తం న్యాయ విడుదల వ్యవస్థలో ఈ ఇ-న్యాయవ్యవస్థ చొరవవల్ల కోర్టు సేవలను ఒక మెరుగైన నిశ్చిత వ్యవస్థగా రూపొందించి తద్వారా ప్రజల అవసరాలను పారదర్శకంగా తీర్చగలగాలి. వేగంగా కేసులని పరిష్కరించాలి. భారత ప్రధాన న్యాయమూర్తి అయిన శ్రీ కే.జి. బాలకృష్ణన్ దేశంలో ఇ కోర్టుల స్థాపనకై అపెక్సు కోర్టు తీసుకున్న చొరవల గురించి ఈ సందర్బంగా వివరించారు. ఆధారము: Hindu న్యాయ సమాచార వ్యవస్థ జాబితా(లాబిస్) ఇది మరుసటిరోజు కోర్టుల్లో జరగాల్సిన విచారణల జాబితా వివరాలను అందిస్తుంది. దానివల్ల సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కాజ్ లిస్ట్లను మాన్యువల్ గా తయారుచేసే అగత్యం తప్పుతుంది. తద్వారా లోపాయికారీగా ఎవరో, ఎవరికోసమో ఈ జాబితాను మార్చేసే బెడద తప్పుతుంది. ఈ డేటాబేస్ కొత్త కేసులు, పెండింగ్, పరిష్కరించిన కేసులు కూడా ఉండి కోర్టులకు వెన్నెముకగా నిలుస్తున్నాయి ఫలితం : కాజ్ లిస్టును తనంతట తానుగా తయారుచేయడంవల్ల చేతితో వ్రాసి తయారీచేసే అగత్యం తప్పుతుంది. సత్వరం కాజ్ లిస్టు సకాలంలో తయారుచేసుకోవచ్చు. కాజ్ లిస్ట్ లను/ కారణ జాబితాలను ఖచ్చితంగా ఫైల్ చేసిన తేదీవారిగా తయారుచేసుకోవచ్చు. దీనివల్ల అవకతవకలను నివారించవచ్చు. కోర్టు నిర్ణయించిన విధంగా ఒకే రకమైన లా-పాయింటలున్న కేసులని ఒక సమూహంగా ఉంచవచ్చు. ఒకే బెంచికి కేటాయించవచ్చు. దీనివల్ల కేసులను త్వరగా పరిష్కరించే వీలు ఏర్పడింది. రివ్యూ పిటిషన్ ను ఎవరైనా వేస్తే, దాని తాలూకు అసలు కేసు ఎందుకు కొట్టి వేయబడిందో తెల్సుకోవడం చాలా సులభ మైపోయింది. ఎపుడు కావాలంటే అపుడు వెనువెంటనే గణాంక రిపోర్టులను తయారు చేస్తుంది. సుప్రీం కోర్టులో రిజిస్టరీ దానిద్వారా రోజువారీ కార్యకలాపాలని క్రమబద్ధీకరించగలిగింది. కోర్టిస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాల్లో ఇదొకటి. ఫైలింగ్ కౌంటర్ కంప్యూటరీకరణ సుప్రీంకోర్టు, అన్ని హైకోర్టుల్లో కంప్యూటరీకరించిన ఫైలింగ్ కౌంటర్లలోనే కేసులను ఫైల్ చేయాలి. అడ్వొకేట్లు క్యూలో వరసగా నిలుచొనుంటే, డేటా ఎంట్రీ ఆపరేటర్లు రిజిస్టరుచేయడానికి అవసరమయిన ప్రాథమిక సమాచారాన్ని అంటే పార్టీ పేరు, అడ్వొకేట్ వివరాలు వగైరాలను ప్రవేశింపచేయడం జరుగుతుంది. క్వెరీ కౌంటర్లో ఉండే కంప్యూటర్ టర్మినల్ ద్వారా లిటిగెంట్ల ప్రశ్నలకు సమాధానాలందివ్వవచ్చు. ఏవైనా పొరబాట్లుంటే వాటిని చూపించి, వాటిని సరిదిద్దుకోవచ్చని లిటిగెంట్లకు, అడ్వొకేట్లకు సూచించడంతోబాటు కాలపరిమితిని కూడా సిస్టం తనకు తానుగా చెక్ చేస్తుంది. ఫలితం ఫైలింగ్ పనులు సులభమైంది. అడ్వొకేట్లు/ లిటిగెంట్లువరసగా సుదీర్ఘకాలం నిల్చుకోనక్కరలేదు. జమ అయిన సొమ్మును కంప్యూటరే లెక్కగట్టడంవల్ల సంబంధిత అధికారుల సమయం ఆదా అవుతుంది. ఫైలింగ్ స్థితి తెల్సుకోవడానికి లిటిగెంట్లు వివిధ విభాగాల చుట్టూ తిరగక్కరలేదు. ఫైలింగ్ క్రమం తప్పకుండా జరుగుతుంది. న్యాయవాదులకు , అధికారులకు శ్రమ, సమయం ఆదా అవుతుంది. మీ కేసు స్థితి తెలుసుకోవాలంటే, దయచేసి casestatus.nic.inపై క్లిక్ చేయండి. బీహార్ లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సత్యర న్యాయం ఇది సివిల్ కోర్టుల్లో పరిష్కారం అయ్యే కేసుల సంఖ్యను పెంచుతుంది, జైళ్లలో మగ్గే ముద్దాయిల సంఖ్యనూ తగ్గిస్తుంది. జైళ్లలో మగ్గే ముద్దాయిల సంఖ్య తగ్గడంవల్ల, అది జైళ్లలో జనాల రద్దీని తగ్గిస్తుంది. ముద్దాయిల సమస్యలగూర్చి వారితో ముఖాముఖీ విచారించడంవల్ల మానవ హక్కుల కమీషన్ విధించిన సాంఘిక విషయపరమైనదాన్ని కూడా అనుసరించినట్లౌతుంది. ముద్దాయిలపై అయ్యే రవాణా ఖర్చులు, వారు పారిపోయే అవకాశాలూ బాగా తగ్గుతాయి. ఆధారం :ఎన్ఐస్, బీహార్ యూనిట్ న్యాయ సేవల్లో ఐసిటి చొరవలు ఇంటర్నెట్ లో రోజువారీ తీర్పు ఆర్డర్లు సుప్రీం కోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు చెందిన రోజువారీ ఆర్డర్లు ఇకపై ఇంటర్నెట్ లో(dailyorders.nic.in), లభ్యమౌతాయి. న్యాయమూర్తులు సంతకం చేసిన వెంటనే లభ్యమయ్యే ఈ ఆర్డర్లు, ప్రజల సమాచార నిమిత్తం మాత్రమే పనికొస్తాయి. ఎటొచ్చీ ఆఫీసుపరంగా వచ్చే కాపీలు మామూలుగానే లిటిగెంట్లకు అందుతాయి. ఈ సేవ లిటిగెంట్లకు, అడ్వొకేట్లకు ఎంతో వినియోగపడుతోంది. సంబంధిత వివరాల డేటాబేస్ను ఆయా కోర్టులే నిర్వహించుకొంటాయి. ఒకే విషయానికి సంబంధించిన ఆర్డర్లను వెదకడానికి సెర్చి సౌకర్యం కూడా ఉంది. అలాగే కేసు సంఖ్య తెలీకపోయినా, పార్టీ పేరు తెలీకపోయినా కూడా సెర్చి చేసుకోవచ్చు. ఇక ఇంటర్నెట్లో హిందీలో జిల్లా కోర్టు ఆర్డర్లు ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలోని జిల్లా కోర్టు, కింది కోర్టులకోసం ఒక వెబ్సైట్ హిందీలో ఏర్పాటు చేశారు. హిందీ భాషను అమలు చేసే కార్యవాహన్ సమితి రూపొందించిన ఈ వెబ్సైట్ ను డిసెంబర్ 3, 2007 నాడు ఆరంభించారు. ఈ వెబ్ సైట్ ను Delhi district courtsఅనే అడ్రస్ తో నేరుగా యాక్సెస్ చేయవచ్చు. తొలి దశలో ఈ వెబ్ సైట్ కేసు వివరాలు, కోర్టు క్యాలెండర్, చరిత్ర, బార్ అసోసియేషన్ వివరాలు హిందీలో లభ్యం అవుతున్నాయి. రెండో దశలో సర్క్యులర్లు, ఫారమ్లు, ప్రొఫార్మాలు కూడా ఆన్ లైన్ లో హిందీలో లభ్యం అవుతాయి. ఈ హిందీ వెబ్ సైట్ తోబాటు జిల్లా కోర్టుకు చెందిన హిందీ అమలుచేసే సంఘం కోర్టుకొచ్చే వారి సౌకర్యార్థం హిందీ యూసర్ మాన్యువల్ ని కూడా ఏర్పాటు చేసింది. గ్రామ కోర్టుల బిల్లు కోసం ఇండియా యత్నం కింది కోర్టులలో పెండింగ్ కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించే ప్రక్రియలో భాగంగా కేంద్ర కేబినెట్ గ్రాం న్యాయాలయాస్ బిల్ 2007ను గురించి పార్లమెంట్ లో మరింత చొరవ చూపడానికి అంగీకరిస్తూ తీర్మానం చేసింది. ఈ బిల్లును కొద్దిపాటి మార్పుచేర్పులతో ఎగువ సభ, రాజ్య సభకు పంపడానికి ఏర్పాటు చేసింది. చవకగా, సురక్షితమైన తక్కువ కార్యాచరణ క్రమంతో, అట్టడుగు స్థాయిలో న్యాయవ్యవస్థను పనిచేయించడం ఈ చట్టం ముఖ్యోద్దేశ్యం. దీని ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఏ చెప్పిన రీతిలో సామాన్యులకు ఈ కొత్త వ్యవస్థ మరింత సత్వర న్యాయాన్నందిస్తుందని భావిస్తున్నారు. ఇ - కోర్టుల ప్రాజెక్ట్ అమలు భారత ప్రభుత్వం ఇ - కోర్టు ప్రాజెక్టును ఫిబ్రవరి 2007లో ఆరంభించింది. దీని తొలి దశ ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసి) ద్వారా అమలు చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే దేశంలోని 12155 మంది జడ్జీలకు లాప్టాప్ కంప్యూటర్లు, 1300 లేజర్ ప్రింటర్లు అందజేయడం జరిగింది. 3నెలల వ్యవధిగల శిక్షణా కార్యక్రమాలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. 1210 మంది ఫ్యాకల్టీ సభ్యులు ఇప్పటికే 8700 న్యాయాధికారులకు, 32000 కోర్టు సిబ్బందికి శిక్షణనిచ్చారు. ఈ శిక్షణ ప్రధానంగా జిల్లా కోర్టులలో, కొన్ని తాలూకా కోర్టులలో ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించే కమిటీలు హైకోర్టులలో ఏర్పాటు చేశారు. చాలా హైకోర్టులలో స్థలాల ఏర్పాటును పర్యవేక్షించే కమిటీలను రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సాయంతో ఏర్పాటు చేశాయి. దాదాపు 13000 న్యాయముర్తులకు ఇ-మెయిల్ / ఇంటర్నెట్ సౌకర్యాలను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది. దీనిద్వారా దేశంలోని అన్ని కోర్టులను అనుసంధానం చేయడం జరుగుతుంది. ఫలితంగా అధీకృత డాక్యుమెంట్లను లిటిగెంట్లు చూసుకోగల వీలు ఏర్పడుతుంది.ఈ మొత్తం ప్రాజెక్ట్ (ఒరిస్సా రాష్ట్రంతో సహా), ఫిబ్రవరి 2009నాటికెల్లా పూర్తి అవుతుందని అంచనా.రాజ్య సభలో 19 నవంబర్ 2007న వచ్చిన ఒక ప్రశ్నకు సమాధారంగా చట్ట, న్యాయ శాఖ మంత్రి శ్రీ హెచ్.ఆర్. భరద్వాజ్ ఈ విషయాలని వివరిస్తూ లిఖితపూర్వక సమాధానాన్నిచ్చారు. భారతీయ హైకోర్టులలో అమలైన ఇ - లాక్ డిజిటల్ సంతకాల ప్రాడక్ట్ ఇ - లాక్ సంస్థ డిజిటల్ సంతకాల బహుళ లైసెన్సులను భారత హైకోర్టులకోసం అమలులోకి తెచ్చింది. డెస్క్ సీల్ డెస్క్ టాప్ అనేది ఒక డెస్క్ టాప్ కోసం ఎలాటి ఫైల్ ఫార్మేటులకైనా డిజిటల్ సంతకాల సౌకర్యాన్నిచ్చేది. ఇది పికెసిఎస్ 7 ప్రమాణాలకనుగుణంగా రూపొందింది. అంటే ఇ - సంతకాల ప్రపంచ ప్రమాణాలకనుగుణంగా పనిచేస్తాయన్నమాట. ఇ - లాక్ సంస్థ డిజిటల్ సంతకాల రంగంలో ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలకు సహకారాన్నందిస్తోంది. ఇ - కోర్టులు - వార్తలు భారత దేశ ఇ - కోర్టుల ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీ కాలపరిమితి పొడిగింపు ఇ - కోర్టుల అమలును పర్యవేక్షణ చేస్తున్న కమిటీ కాలపరిమితిని ఫిబ్రవరి 2009 దాకా లేదా ఆ ప్రాజెక్టు పూర్తయ్యేదాకా కొనసాగేలా పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకొంది. దేశంలో ఉన్న వివిధ కోర్టులను అనుసంధఆనం చేసి లిటిగెంట్లకు త్వరితగతిన కేసుల డాక్యుమెంట్లు పొందడానికి వీలునివ్వడమే ఇ - కోర్టుల ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్టు కింద నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్ఐసి) ఇప్పటికే 12,155 మంది న్యాయమూర్తులకు లాప్టాప్లను అందజేసింది. 12,000 లేజర్ ప్రింటర్లను ఏర్పాటు చేస్తోంది.రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తిని ఈ కమిటీ ఛైర్మెన్ గా నియమించడానికి భారత దేశ ఉన్నత న్యాయ మూర్తి(సిఐజె) కి అధికారాన్నిస్తూ సవరణనీ కేబినెట్ అంగీకరించింది. దీనివల్ల భారత దేశ ఉన్నత న్యాయ మూర్తికి ఛైర్మెన్ ని నియమించడంలో, కాంట్రాక్టు పద్ధతిలో లేదా డిప్యుటేషన్ లో సభ్యుల నియమించడంలో స్వేచ్ఛగా వ్యవహరించే హక్కు ఏర్పడింది. ఆధారము: igovernment.in భారతీయ కోర్టులను, జైళ్లను అనుసంధానించిన టెలిజస్టిస్ టెలిజస్టిస్ అనేది దేశంలోని అన్ని భారతీయ కోర్టులను, జైళ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన జాతీయ ప్రాజెక్ట్. ఐ.ఎస్.డి.ఎన్ ద్వారా ఏర్పాటుచేసిన ఈ విడియో లింకు ద్వారా కోర్టు సముఖానికి ఖైదీలు జైలులోనుండే విచారణకు హాజరయ్యే వీలు ఏర్పడుతుంది.టెలిజస్టిస్ ద్వారా న్యాయ నిపుణులు, కోర్టు అధికారులు, దోషులు, సాక్ష్యులు - అందరూ ఎలాటి బాదరబందీ లేకుండా నేరుగా ముఖాముఖీ చర్చించుకోవచ్చు. ఒక విచారమ జరిగే సమయంలో ఒకటికిమించి కోర్టులను అనుసంధించవచ్చు. ఒక దరాఖాస్తుకు మించి విచారించవచ్చు. దీని యూజర్ ఇంటర్ఫేస్ ఎంతో సులబంగా ఉండి ఎలాటి పరిజ్ఞానం లేని వారుకూడా ఎంతో సులభంగా వాడుకొనేలా రూపొందింది. ముఖ్యంగా న్యాయమూర్తులు, కోర్టులోని సిబ్బంది అందరూ దీన్ని సులభంగా వాడగలరు. న్యాయ విడియో వ్యవ స్థను నిర్వహించగలరు.మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే టెలి జస్టిస్ ను ప్రవేశపెట్టడం జరిగింది. మహారాష్ట్రలో 40కి పైగా ముంబై పరిసరాలలోని జైళ్లను జిల్లా కోర్టులకు విడియో కాన్పరెన్సింగ్ ద్వారా కలిపారు. ప్రభుత్వం 300 జైళ్లను, 2000 కోర్టులను విడియో కాన్పరెన్సింగ్ ద్వారా కలపడానికి యోచిస్తోంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోకీ ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుంది. ఇప్పటికే 15 జిల్లా కోర్టులను జైళ్లతో కలిపి 31 విడియో కేంద్రాలను నెలకొల్పింది.పాలీకామ్ అనే సం స్థ భారతదేశంలోని అన్నిరాష్ట్రాల్లోని కోర్టుల్లో, జైళ్లలో విడియో కాన్ఫరెన్సింగ్ సామగ్రిని నెలకొల్పుతోంది. ఆధారము: i4donline.net