సమాచార హక్కు చట్టం మనం ఏ ఆఫీస్ లో కాలిడినా కావలిసిన సమాచారం పొందుట దుర్లభం. లంచం ఇచ్చుకోనిదే ఫైలు కదలదు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయుంచుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం చాలా కస్టo. భారత ప్రభుత్వం 2005 లో సమాచారహక్కుచట్టాన్ని రూపోందించినిది. ఇది నిజంగా వినియోగదారుని చేతిలో రామబాణం. వినియోగదారు అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని నిర్ధేశిస్తుంది. ఇది అవినీతిని అంతంచేసే ఒక ప్రక్రియ. ప్రముఖ ఉద్యమకారిణి అరుణారాయ్ చెప్పినట్లు “ప్రభుత్వయంత్రాగం స్వచ్చందంగా ప్రజలకు సమాచారం అందించాలన్నదే సహచట్టం ప్రధానోద్ధేశo”. అంతర్జ్జాలంలో జీవోల ప్రతులను ఈ వెబ్ నుంచి పొందవచ్చు. www.goir.ap.gov.in. రాష్ట్ర ప్రభుత్వం - www.apic.gov.in కేంద్ర ప్రభుత్వం - www.cic.gov.in ఇది కేవలం కేంద్ర ప్రభ్యుత్వ కార్యాలయాలలో సమాచారం కోసమే. ఆఫీసులకు వెళ్ళలేనివాళ్ళు అంతర్జాలంలో సమాచారాన్ని దీనిద్వారా పొందవచ్చు. www.rtionline.gov.in దరకాస్తుదారు ఏఅఫిస్నుంచైనా తనకవసరమైన సమాచారాన్ని 30 రోజులలోపు పొందవచ్చు. గడువులోగా సమాచారం రానియెడల ప్రజాసమాచార (P.I.O) అధికారికి రు.10/- రుసుం చెల్లించి ధరకాస్తు చేసి 30 రోజులలోపు సమాచారం పొందవచ్చు. ఫీజు ఆఫీస్లో చెల్లించి రశీదు పొందవచ్చు. లేదా పోస్టల్ ఆర్డర్ పోస్టాఫీసులో కొని జతపర్చాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ దరకాస్తునకు అంటించాలి. నాన్ జుడీష్యల్ స్టాంప్ కేంద్రప్రభుత్వ కార్యాలయాలల్లో చెల్లదు. 30 రోజులలోపు సమాధానం రానియెడల రాస్ట్రసమాచార కమిషన్ కు దరఖాస్తుచేస్తూ తను ఇంతకుముందు సమర్పించిన దరఖాస్తు నకళ్ళను జతపత్చవలెను. ప్రభుత్వంనుంచి లబ్ది పొడుతున్న జాతీయ పార్టీలకు కూడా ప్రభుత్వ సంస్తల్లంటివేనని, సమాచార హక్కుచట్టం వాటికి వర్తిస్తుందని జాతీయ సమాచార కమిషన్ తీర్పుయిచ్చింది. కానీ పార్టీలు దీని అమలుకు వ్యతిరేకిస్తున్నాయి. ఇది అమలుపర్చిననాడు దేశంలో ఎలాంటి ఇబ్బందులుఓడవు. అప్పడు సువర్ణభాతము అని గర్వంగా చెప్పుకోవచ్చు. వినియోగదారుల విజాయాలు గడ్డిఅన్నారం వినియోగదారుల సంఘం అద్య క్ష్యులు శ్రీ ఎన్. వెంకటేశ్వర్లు సాధించిన కొన్ని విజయాలు. రైలులో భోజనం పెడతామని డబ్బులు వసూలుచేసి భోజనం అందించనందుకు రైల్వయ్నుంది రు.500/- నష్టపరిహారం మరియు భోజనం డబ్బు వసూలుచేయటం అయినది. కొత్తబస్సులో షిర్డీ ప్రయాణం అనిచెప్పి డొక్కుబస్సువేసి యాత్రికులను ఇబ్బందిపెట్టిన ప్రైవేట్ ట్రావెల్ ఏజంట్ మీద వినియోగదారుల కోర్టులో కేసువేసి తనతోపాటు పదిమందికి పరిహారం ఇప్పించడం జరిగింది. బిల్లు కట్టినా టెలీఫోను కనెక్షన్ తీసివేసినందుకు ఆడిపాట్మెంట్ మీద కేసువేసి నష్టపరిహారం పొందారు. అధికబిల్లువేసి ఒకవృద్ధురాలుని క్షో భపెట్టినందుకు ఆమెతరపున కేసువేసి రు.10,000/- నష్టపరిహారం మరియు ఆఫీసుకు 20 సార్లు తిప్పినందుకు రు.2000/- మరియు కోర్టుఖర్చులకు రు.1000/- ఇప్పించడం జరిగింది. కనీసమొత్తం బ్యాంకు ఖాతాలో లేనందుకు ప్రతినెలా పెనాల్టీ రుసుము తగ్గించినందుకు కర్ణాటక బ్యాంకు నుండి నష్టపరిహారం రు.1500/-పొందాము. కనీస మొత్తం పెరిగినపుడు ఖాతాదారునకు తప్పక తెలపాలి తీర్పు వచ్చింది. 1994-99 ఆటిపన్ను రివిజన్ గడ్డిఅన్నారంలో ఒకేసారి 400% పెంచినందుకు న్యాయపోరాటం జరిపి పన్నుతగ్గించేవరకు ప్రభుత్యంమెడలువంచాము. దీనివలన 6500 భవనయజమానులకు షుమారు ఒక కోటి నలభై లక్షలు లబ్ధిపోందారు. ఆధారము: వికిపీడియా సమాచార హక్కు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information). 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈచట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది,. ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 16 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి. సమాచారం రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, నమూనాలు, తనిఖీ రికార్డులు మొదలైనవి. ఈ సమాచారం ఎలక్ట్రానిక్ రూపంలోనైనా వుండవచ్చు. ఉదాహరణకు, రేషన్ డీలరు కార్డులు, అమ్మకాల వివరాలు ప్రాథమిక ఆరోగ్యకేంద్రము వార్షిక నిధులు, ఖర్చులు, లబ్దిదారుల వివరాలు ముఖ్యమంత్రి సహాయనిధి లబ్దిదారులు, వారికి అందిన సహాయం జిల్లా ప్రజా ప్రతినిధులు (ఎంపీ, ఎమ్మెల్యే) నియోజకవర్గ అభివృద్ధి నిధులు వినియోగపు వివరాలు ఎన్నికల కమిషనర్ కార్యాలయంనుండి వివరాలు 'ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలు ఏ ప్రభుత్వ యంత్రాంగము వద్దనున్న సమాచారమునైనను సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము 2005 కల్పించుచున్నది. అంటే, సదరు సమాచారమును కలిగిన పనులు, పత్రాలు, రికార్డులు తనిఖీ చేసేందుకు, వాటి యొక్క నోట్సు తీసుకొనేందుకు, ధృవీకృత ప్రతులు పొందేందుకు, ఏదైనా పదార్ధము యొక్క ధృవీకృత నమూనాలు పొందేందుకు, కంప్యూటర్ లేదా ఏదైనా పరికరములో నిక్షిప్తము చేయబడిన సమాచారమును డిస్కెట్లు, ప్లాపీలు, టేపులు, వీడియో కేసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ రూపములో గాని లేదా వాటి ప్రింట్లు గాని పొందేందుకు లేదా సమాచారమును సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము అందుబాటులోకి తెచ్చినది. అన్వయింపులు ప్రభుత్వం, న్యాయ, శాసన వ్యవస్థల సంస్థలు, ప్రభుత్వం ఇచ్చే పాక్షిక నిధులతో నడిచే సంస్థలు పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వాలి. అంటే జిల్లాపరిషత్ లు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీలు, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఇతర రెవిన్యూ అధికార కార్యాలయాలు, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖ, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ బ్యాంకులు, సంస్థలు మొదలైనవన్నింటికి ఈ చట్టం అన్వయిస్తుంది. కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన భధ్రతా లేక గూఢచార సంస్థలకి మినహాయింపు వుంది. అయితే, అవినీతి ఆరోపణలు మరియు మానవ హక్కుల అతిక్రమణలకు సంబంధించిన సమాచార విడుదల సందర్భములో ఈ మినహాయింపు వర్తించదు. ఈచట్టము క్రింద కొన్ని నియమాల క్రింద సమాచారమును ఇచ్చేందుకు మినహాయింపు ఉన్నది. అయితే, వాటిలో బహుళ ప్రజా ప్రయోజనము దృష్ట్యా సమాచారము ఇచ్చేందుకు కూడా అవకాశము ఉన్నది. పద్ధతి సమాచారం అవసరమైన వారు, సంభందిత కార్యాలయం ప్రజా సమాచార లేక సహాయ ప్రజా సమాచార అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు తెల్ల కాగితంపై రాస్తే చాలు. వ్రాయటం తెలియకపోయినా సమాచారము సక్రమముగా కోరే అవగాహన లేకపోయినా సంబంధిత పౌర సమాచార అధికారి వారు తగిన సహాయము/ఏర్పాటు చేస్తారు. తెల్లకార్డున్న పేదలకు, గ్రామస్థాయి సంస్థల్లో అడిగే సమాచారానికీ దరఖాస్తు రుసుము లేదు. మండల స్థాయిలో రూ. అయిదు, జిల్లా స్థాయిలో రూ.పదికి మించి రుసుము వసూలు చేయరాదు. అడిగిన సమాచారం ఇవ్వడానికి అయ్యే ఖర్చు మాత్రం దరఖాస్తుదారు నుంచి వసూలు చేయవచ్చు. అడిగిన తరువాత నెల(30 మాత్రము) రోజులు దాటితే ఎంతటి సమాచారమైనా ఉచితంగా ఇవ్వాలి. దరఖాస్తు స్వీకరణ రసీదు తీసుకోవాలి. ఆ తేదినుండి 30 రోజులలోగా సమాచారాన్ని ఇవ్వాలి. ఇవ్వలేకపోతే లేక తిరస్కరించినట్లయితే దానికి కారణాలను తెలపాలి. ఏ సమాచారము ఇవ్వకుండా దరఖాస్తుకు ప్రతిస్పందించకుండా ఉంటే 30 రోజులు ముగిసిన తరువాత ఆ దరఖాస్తును తిరస్కరించినట్లుగా భావించబడును. అంతకుముందు, సమాచార ప్రతిని అందజేయటానికి అయ్యే ఖర్చు చెల్లింపమని దరఖాస్తుదారుని కోరవచ్చు. అటువంటప్పుడు, దరఖాస్తు దారుడు డబ్బు చెల్లించటానికి అవసరమైన, తీసుకొన్న సమయాన్ని గడువునుండి మినహాయిస్తారు. తిరస్కరించిన లేదా ప్రతిస్పందించని దరఖాస్తు విషయములో లేదా ఇచ్చిన సమాచారములో లోపాలు, వాస్తవ విరుద్దాలు లేదా తప్పులు ఉన్నవని భావించేటట్లయితె దరఖాస్తుదారు సంబంధిత అప్పిల్లేట్ అధికారి వారికి అప్పటికి సమాచారము సక్రమముగా లేదా అసలు అందకపోతే సంబంధిత సమాచార కమీషన్ వారికి విహిత రీతిన అప్పీలు చేసుకొవచ్చు. ఈ దిగువ సందర్భములలో ఏ వ్యక్తి అయిననూ సంబంధిత కేంద్ర సమాచార కమిషన్/రాష్ట్ర సమాచార కమిషన్ వారికి నేరుగా పిర్యాదు చేయవచ్చు: ఏదేని ప్రభుత్వ యంత్రాంగములో సమాచారము కొరకు దరఖాస్తు సమర్పించేందుకు గాని అప్పీలు స్వీకరించేందుకు గాని సంబంధిత పౌర సమాచార అధికారి లేదా సహాయ పౌర సమాచార అధికారి లేదా అప్పిల్లేట్ అధికారి వారిని నియమించలేదను లేదా ఖాళీగా ఉందను కారణముపై స్వీకరించుటకు తిరస్కరించిన దరఖాస్తు విషయములో సమాచారము ఇచ్చేందుకు చెల్లించ కోరిన ఫీజు అసంబద్ధముగా ఉన్నదని భావించినట్లయితే సమాచారము కోరుచూ నేరుగా సంబంధిత కేంద్ర సమాచార కమిషన్/రాష్ట్ర సమాచార కమిషన్ వారికి దరఖాస్తు చేయరాదు. సహ చట్టం వివరణలు అదనపు ఫీజు సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయకూడదని సమాచార ప్రధాన కమిషనర్ తేల్చి చెప్పారు.[2] సాధారణంగా దరఖాస్తు రుసుం 10 రూపాయలు వసూలు చేయాలి. ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి రూ. 2 చొప్పున ఫోటోస్టాట్ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు.కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుస్తకాలు, మ్యాప్లు, ప్లాన్లు, డాక్యుమెంట్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుంను దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేయవచ్చు. అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయ్యే ఖర్చుల్ని కూడా దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల ఆస్తి పాస్తుల వివరాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆలిండియా సర్వీసుల (విధుల నిర్వహణ) చట్టం -1968 లోని 16వ నిబంధన ప్రకారం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్ అధికారులు తమ స్థిరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. అధికారుల ఆస్తివివరాల గురించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ తీర్పులిచ్చింది. అమలుపై సమీక్ష, విమర్శలు దరఖాస్తు స్వీకరించక పొయిన, నిర్నీత సమయములొ సమాచారము ఇవ్వక పొయిన, దుర్బుద్దితో నిరాకరించినా, తెలిసి తప్పు సమాచారం ఇచినా, మరే విధంగనైన ఆపిన రోజుకు 250 రూపాయలు జరిమాన విధించాలని సెక్షన్ 20(1) చెప్థున్నది అమల్లో లోపాలు దరఖాస్తు రుసుం నగదు రూపంలో కూడా చెల్లించడానికి స.హ.చట్టం అవకాశం కల్పిస్తున్నా దరఖాస్తు తిరస్కరణతో చట్టాన్ని చట్టుబండలు చేస్తున్నారు. అధికారులు తాము ఇవ్వదలచుకున్న సమాచారాన్నే ఇస్తున్నారు. స్పష్టంగా అడిగినా కోరిన సమాచారాన్ని ఇవ్వడం లేదు. అడిగిన సమాచారంతో పాటు ఆ సమాచారం సకాలంలో పొందే హక్కు సమాచార హక్కు చట్టం కల్పించింది. దరఖాస్తు చేయడంలో లోపాలను, అస్పష్టతను ఆసరాగా తీసుకుని అధికారులు నెలల తరబడి తిప్పించుకుంటున్నారు. సుపరిపాలన కేంద్రం సహకారంతో చేసే ప్రయత్నాలు వెబ్సైట్కే పరిమితమయ్యాయి.పూర్తిస్థాయిలో దరఖాస్తు నింపలేదని, సరైన సమాచారం అందులో పేర్కొనలేదని 65 శాతం దరఖాస్తులను ముందుగానే తిరస్కరిస్తున్నారు. సమాచారం ఇవ్వడం ఇష్టంలేని అధికారులు కమిషన్ ముందు కూడా డొంక తిరుగుడు సమాధానాలతో సహనపరీక్ష పెడుతున్నారు. సమాచారం ఇస్తామని విచారణ సమయంలో అంగీకరించి తర్వాత మొండికేస్తున్నారు. అప్పీల్ చేస్తే షోకాజ్ నోటీసులిచ్చి రెండోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. స.హ. చట్టం అమల్లో రాష్ట్రాల కమీషనర్లే కీలకం ఒకప్పటి కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వజహత్ హబీబుల్లా అభిప్రాయాలు: ఏ రాష్ట్రమూ ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. అప్పీళ్ల విషయంలో చురుగ్గా వ్యవహరించే కొందరు కమిషనర్ల పర్యవేక్షణలో ఉన్న ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం మెరుగ్గా అమలు అవుతోంది.పాత్రికేయులు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడే పరిశోధనాత్మక జర్నలిజానికి పూనుకోవాలి. చట్టం గ్రామ స్థాయి వరకు వెళ్లలేదు. గ్రామీణ ప్రజల నిరక్ష్యరాస్యత, మీడియా ఎక్కువగా పట్టణాలకే పరిమితం కావడం ఇందుకు కారణాలు. సమాచార చట్టంపై గ్రామీణుల్లో అవగాహన పెరగాలి. అప్పుడే వారికి ఇతర చట్టాలపైనా అవగాహన పెరుగుతుంది. గ్రామీణులు ఎవరైనా సమాచారం అడిగితే పంచాయతీ అధికారులు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసివ్వాలి. దరఖాస్తు చేసిన 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలన్న గడువును కుదించాల్సిన అవసరం లేదు. పూర్తి సమాచారం అందివ్వాలంటే ఆమాత్రం సమయం అవుతుంది. తగ్గిస్తే అధికారులు ఒత్తిడిలో తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. సమాచార కమిషన్లు విశ్రాంత ఐఏఎస్ అధికారులకు పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణ నిజమే. కానీ, నాలుగైదు శాఖల్లో 20 ఏళ్లకు పైగా పని చేసిన అధికారులే సమాచారాన్ని సకాలంలో ఇవ్వలేకపోతే ఇతరులు ఇవ్వడం కాస్త కష్టమే. హక్కుల ఉద్యమకారులు అడుగుతున్నట్లు న్యాయమూర్తులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, పాత్రికేయులను నియమిస్తే మరింత పారదర్శకత ఉంటుంది. పీఐవోలు, అప్పిలేట్ అధికారుల్లో అవగాహన పెరగకపోవడానికి సమాచార అధికారికి దస్త్రాలు నమోదు చేయడం, వాటిని కార్యాలయాల్లో ప్రదర్శించడానికే సమయం సరిపోతోంది. కిందిస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వలేకున్నారు. ఆధారము: వికిపీడియా సమాచారం కోసం కోరడం ఎలా? సమాచార చట్టం-2005 ప్రకారం మీరు ఏ పబ్లిక్ అథారిటీనుంచి అయినా సమాచారం కోరవచ్చు (పబ్లిక్ అథారిటీ అంటే ప్రభుత్వ సంస్థ, లేదా, ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థ) దరఖాస్తు ఫారాన్ని వ్రాయాలి, లేదా టైప్ చేయాలి. వికాస్ పీడియా పోర్టల్ నుంచి దరఖాస్తుఫారాన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు దరఖాస్తు ఇంగ్లీషు, హిందీ, లేదా ఏదైనా రాష్ట్రానికి చెందిన భాషలోనే వుండాలి మీ దరఖాస్తులో ఈ కింది సమాచారాన్ని తెలియజేయండి సహాయ పౌర సమాచార అధికారి (ఏ పి ఐ ఓ) / పౌర సమాచార అధికారి (పి ఐ ఓ) పేరు , కార్యాలయం చిరునామా విషయం: దరఖాస్తు-సమాచార చట్టం-2005 సెక్షన్ 6(1) ప్రకారం పబ్లిక్ అథారిటీనుంచి మీకు కావలసిన సమాచారం వివరాలు దరఖాస్తుదారు పేరు తండ్రి / భర్త పేరు కేటగిరి: ఎస్సి / ఎస్టి / ఓబిసి దరఖాస్తు రుసుము మీరు పేద (బిపిఎల్) కుటుంబానికి చెందినవారా? అవును / కాదు మీ పోస్టల్ చిరునామా, మొబైల్ ఫోన్ నంబరు, ఇ-మెయిల్ ఐడి (అయితే, ఇ-మెయిల్ ఐడి ని పేర్కొనడం తప్పనిసరి కాదు) తేదీ, ఊరు దరఖాస్తుదారు సంతకం జతపరుస్తున్న పత్రాల జాబితా దరఖాస్తు దాఖలుచేసే ముందు సహాయ పౌర సమాచార అధికారి / పౌర సమాచార అధికారి పేరు, నిర్దేశించిన సుంకం, చెల్లించవలసిన తీరు సక్రమంగా వున్నది లేనిది సరిచూసుకోండి సమాచార హక్కు (ఆర్టి ఐ) చట్టం కింద, సమాచారం పొందడానికి దరఖాస్తు రుసుం చెల్లించవలసి వుంటుంది. అయితే, ఎస్ సి / ఎస్ టి / బి పి ఎల్ కుటుంబాలకు చెందినవారికి సుంకంనుంచి మినహాయింపు వుంది. సుంకం మినహాయింపు కోరేవారు ఎస్ సి / ఎస్ టి / బి పి ఎల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీని జతచేయవలసి వుంటుంది. దరఖాస్తును స్వయంగా, లేదా పోస్టు ద్వారా, లేదా ఇ-మెయిల్ ద్వారానైనా పంపవచ్చు. పోస్టుద్వారా పంపదలచుకుంటే, రిజిస్టర్డ్ పోస్టుద్వారానే పంపాలి. కొరియర్ ద్వారా పంపవద్దు. దరఖాస్తు పత్రాలకు (అంటే, దరఖాస్తు ఫారము, సుంకం చెల్లింపు రసీదు, స్వయంగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు సమర్పించినట్టు రసీదు) రెండు జిరాక్స్ కాపీలు తీయించుకుని తర్వాతి అవసరాలకు వీలుగా మీ వద్ద వుంచుకోండి మీరు స్వయంగా దరఖాస్తు అందజేస్తుంటే, ఆ కార్యాలయంనుంచి రసీదు తీసుకోండి. ఆ రసీదుపై తేదీ, ఆ కార్యాలయం ముద్ర స్పష్టంగా వుండేలా జాగ్రత్త వహించండి. దరఖాస్తును పోస్ట్ ద్వారా పంపదలచుకుంటే, దానిని రిజిస్టర్డ్ పోస్ట్లో పంపి ఆ రసీదును భద్రంగా వుంచుకోండి ఆ దరఖాస్తు పౌర సమాచార అధికారికి అందిన తేదీనుంచి , సమాచారం అందజేయడానికి గడువును లెక్కించడం జరుగుతుంది మీరు ఈ కింది అంశాలనుకూడా గుర్తుంచుకోవాలి క్రమ సంఖ్య పరిస్థితి సమాచారం అందజేయడానికి గడువు 1 సాధారణ పరిస్థితిలో 30 రోజులు 2 వ్యక్తి జీవితానికి, స్వేచ్చకు సంబంధించినదైతే 48 గంటలు 3 సహాయ పౌర సమాచార అధికారిద్వారా దరఖాస్తు అందితే అదనంగా 05 రోజులు కలుపుకోవాలి మొదటి అప్పీలు అప్లికేషన్ను దాఖలుచేయడం ఎలా? 1. మొదటి అప్పీలు దరఖాస్తును ఎప్పుడు దాఖలుచేయాలి మీరు కోరిన సమాచారాన్ని అందించకుండా, పౌర సమాచార అధికారి మీ దరఖాస్తును తిరస్కరిస్తే అధికార యంత్రాంగం నిర్ణీత గడువు, 30 రోజులు లేదా 48 గంటల లోగా, సమాచారాన్ని అందించలేకపోతే మీ దరఖాస్తును స్వీకరించవలసిన, లేదా మీరు కోరిన సమాచరాన్ని అందించవలసిన సహాయ పౌర సమాచార అధికారిని / పౌర సమాచార అధికారిని ప్రభుత్వ యంత్రాంగం నియమించివుండకపోతే దరఖాస్తును స్వీకరించడానికి, దానిని పౌర సమాచార అధికారికి పంపడానికి సహాయ పౌర సమాచార అధికారి నిరాకరిస్తే పౌర సమాచార అధికారి ఇచ్చిన తీర్పు మీకు సంతృప్తికరంగా లేకపోతే మీకు అందించిన సమాచారం అసమగ్రంగావున్నదనో, తప్పుదారి పట్టించేదిగా వున్నదనో, అసత్య సమాచారమనో మీరు భావిస్తే సమాచారహక్కు చట్టం -2005 ప్రకారం చూస్తే, మిమ్ములను చెల్లించమనికోరిన దరఖాస్తు రుసుము సహేతుకంగా లేదని మీరు భావిస్తే 2. మొదటి అప్పీల్కు గడువు నిర్దేశించిన గడువు ముగిసిన, లేదా , రాష్ట్ర పౌర సమాచార అధికారి (ఎస్పీఇఓ) / కేంద్ర పౌర సమాచార అధికారి (సిపీఇఓ) కార్యాలయంనుంచి ( మీ విజ్ఞప్తి పై తీర్పుచెబుతూ లేదా మీ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ) సమాచారం అందిన 30 రోజులలోగా దరఖాస్తుదారు అనివార్య కారణాలవల్ల 30 రోజులలోగా దరఖాస్తు చేయలేకపోయినట్టు మొదటి అప్పిలేట్ అధికారి సంతృప్తి చెందితే, 30 రోజుల తర్వాతకూడా, అప్పీలును అనుమతించవచ్చు 3. మొదటి అప్పీలును ఎలా వ్రాయాలి తెల్ల కాగితం మీద మీ దరఖాస్తును వ్రాసి సమర్పించవచ్చు లేదా వికాస్ పీడియా పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు, వ్రాసినదో టైప్ చేసినదో మాత్రమే అయివుండాలి దరఖాస్తును ఇంగ్లీషు, హిందీ లేదా రాష్ట్రానికి చెందిన ఏదైనా భాషలో మాత్రమే వ్రాయాలి అవసరమైన సమాచారాన్ని, నిర్దేశించిన రీతిలో స్పష్టంగా పేర్కొనాలి మీదరఖాస్తు ఫారానికి, స్వయంగా ధ్రువీకరించిన మీ విజ్ఞప్తి పత్రం జిరాక్స్ కాపీని, దరఖాస్తు రుసుము రసీదును, మీ విజ్ఞప్తి పత్రం అందినట్టు పౌర సమాచార అధికారినుంచి వచ్చిన అక్నాలెడ్జిమెంటు కార్డును, తీర్పు కాపీని జతపరచాలి దరఖాస్తు ఫారాన్ని, దానికి జతపరచిన అన్ని పత్రాలను ఒక కాపీ జిరాక్స్ తీయించుకొని మీవద్ద వుంచుకోండి 4. మొదటి అప్పీలు దరఖాస్తును ఎక్కడ సమర్పించాలి మీ విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించిన యంత్రాగ కార్యాలయంలోనే మొదటి అప్పిలేట్ అధికారికి మీ దరఖాస్తును సమర్పించాలి అధికార క్రమంలో, మొదటి అప్పిలేట్ అధికారి పౌర సమాచార అధికారికంటే పై అధికారి అయి వుంటూ; దరఖాస్తును స్వీకరించే, కోరిన సమాచారాన్ని అందించే లేదా దరఖాస్తును తిరస్కరించే బాధ్యత కలిగివుంటారు. మొదటి అప్పీలు దరఖాస్తును సమర్పించే ముందు, ఆ దరఖాస్తులో మొదటి అప్పిలేట్ అధికారి పేరును సరిగా పేర్కొన్నదీ లేనిది, నిర్దేశించిన రుసుమును, నిర్దేశించిన రీతిలోనే చెల్లించిందీ లేనిది, సరిచూసుకోండి ( కొన్ని రాష్ట్రాలు మొదటి అప్పీలు దరఖాస్తుకు రుసుము వసూలు చేయడం లేదు, మరికొన్ని రాష్ట్రాలు వసూలు చేస్తున్నాయి). 5. మొదటి అప్పీలు దరఖాస్తును ఎలా పంపాలి దరఖాస్తును స్వయంగా అందజేయాలి , లేదా పోస్టుద్వారా పంపాలి పోస్టు ద్వారా పంపదలచుకుంటే, రిజిస్టర్ పోస్టుద్వారా మాత్రమే పంపాలి. ఎట్టి పరిస్థితులలో కూడా కొరియర్ ద్వారా పంపకూడదు. స్వయంగా అందించినా, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపినా కూడా తప్పనిసరిగా రసీదు తీసుకోవడం మరువవద్దు 6. కోరిన సమాచారం అందించడానికి గడువు 1. సాధారణంగా, 30 రోజులలో నిర్ణయం ప్రకటించాలి, అయితే అసాధారణ సందర్భాలలో 45 రోజులదాకా మినహాయింపు వుంటుంది. 2. దరఖాస్తుపై నిర్ణయాన్ని తెలిపే గడువు, మొదటి అప్పిలేట్ అధికారికి దరఖాస్తు అందినరోజు నుంచి మొదలవుతుంది. రెండవ అప్పీలు అప్లికేషన్ను దాఖలుచేయడం ఎలా? 1. రెండవ అప్పీలు దరఖాస్తును ఎప్పుడు దాఖలుచేయాలి మొదటి అప్పీలు అధికారి తీర్పుతో మీరు సంతృప్తిచెందనపుడు యంత్రాంగం అందజేసిన సమాచారం సమగ్రంగా లేదనో, తప్పుదారి పట్టించేదిగా వున్నదనో, అసత్య సమాచారమనో మీరు భావిస్తే పౌర సమాచార అధికారి (పిఎఓ) గాని, లేక మొదటి అప్పిలేట్ అధికారి (ఎఫ్ఏఏ) గాని, లేదా ఇద్దరూ కూడా, దరఖాస్తులో మీరు కోరిన సమాచారాన్ని అందించడానికి నిరాకరిస్తే, నిర్ణీత గడువులోగా అప్పిలేట్ అధికారి ఎలాంటి తీర్పు ఇవ్వకపోతే మీ దరఖాస్తును స్వీకరించడానికి, లేదా దానిని కేంద్ర / రాష్ట్ర సమాచార అధికారికి, లేదా కేంద్ర / రాష్ట్ర సమాచార కమిషనర్కు పంపడానికి సహాయ పౌర సమాచార అధికారి నిరాకరిస్తే మీరు దరఖాస్తు చేయడానికి యంత్రాంగం అడిగిన ఫీజు, సమాచారహక్కు చట్టం-2005 ప్రకారం హేతుబద్ధంగా లేదని మీరు భావిస్తే 2. రెండవ దరఖాస్తు ఎక్కడ సమర్పించాలి రాష్ట్ర సమాచార కమిషనర్ (ఎస్ఐసి) కార్యాలయంలో (విషయం రాష్ట్ర యంత్రాంగానికి సంబంధించినదైతే) కేంద్ర సమాచార కమిషనర్ (సీఇసి) కార్యాలయంలో (విషయం కేంద్ర యంత్రాంగానికి సంబంధించినదైతే) 3. రెండవ అప్పీల్కు గడువు నిర్దేశించిన గడువు ముగిసిన, లేదా , మొదటి అప్పీల్ అధికార కార్యాలయంనుంచి (మీ దరఖాస్తుపై తీర్పు చెబుతూ లేక మీదరఖాసును తిరస్కరిస్తూ) సమాచారం అందిన 90 రోజుల లోగా దరఖాస్తుదారు అనివార్య కారణాలవల్ల 90 రోజులలోగా దరఖాస్తు చేయలేకపోయినట్టు రాష్ట్ర / కేంద్ర సమాచార కమిషనర్ సంతృప్తి చెందితే, 90 రోజుల తర్వాతకూడా, అప్పీలును అనుమతించవచ్చు. 4. రెండవ అప్పీలును ఎలా వ్రాయాలి తెల్ల కాగితం మీద మీ దరఖాస్తును వ్రాసి సమర్పించవచ్చు లేదా వికాస్ పీడియా పోర్టల్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తును వ్రాయవచ్చు లేదా టైప్ చేయవచ్చు కేంద్ర సమాచార కమిషనర్కు సమర్పించే దరఖాస్తు ఫారాన్ని హిందీ లేదా ఇంగ్లీషులోనే వ్రాయాలి, రాష్ట్ర సమాచార కమిషనర్కు సమర్పించే దరఖాస్తు ఫారం రాష్ట్రానికి చెందిన ఏదైనా భాషలో వుండవచ్చు 5. దరఖాస్తులో ఏమేమి వ్రాయాలి అవసవసరమైన సమాచారాన్ని నిర్దేశించిన పద్ధతిలో, స్పష్టంగా వ్రాయాలి దరఖాస్తుకు ఏఏ పత్రాలు జతచేస్తున్నది , పేజి నంబర్లతో సహా, పేర్కొంటూ విషయ సూచిక పేజీ వుండాలి అన్ని పత్రాలను ఐదు కాపీలు తయారుచేయాలి (అవి: రెండవ అప్పీలు దరఖాస్తు , సమాచారాన్ని అందించాలన్న వినతిపత్రం, మొదటి అప్పీలు దరఖాస్తు కాపీ, పీఇఓ కు చెల్లించిన ఫీజు రశీదు మొదలైనవి) , వాటిని స్వయంగా ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి లేదా వేలిముద్ర వేయాలి. మీ దగ్గర వుంచుకోవడంకోసం అదనంగా ఒక కాపీ తీయించుకోవాలి. 6. దరఖాస్తును ఎలా పంపాలి దరఖాస్తు 5 కాపీలు రిజిస్టర్ పోస్టు ద్వారా మాత్రమే పంపాలి దరఖాస్తు ఫారానికి, అది అందినట్టు తెల్పడంకోసం, అక్నాలెడ్జిమెంటు కార్డునుకూడా జతచేయాలి కేంద్ర సమాచార కమిషనర్కు సమర్పించే దరఖాస్తును ఆన్ లైన్లో, అంటే కంప్యూటర్ ద్వారా కూడా క్లిక్ చేసి, సమర్పించవచ్చు 7. సమాచారం అందింఛడానికి గడువు సాధారణ పరిస్థితులలో 30 రోజులలోగా నిర్ణయాన్ని ప్రకటించాలి ; అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో 45 రోజుల వరకు అనే మినహాయింపు వుంది కేంద్ర / రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయానికి దరఖాస్తు అందిన తేదీనుంచి గడువును లెక్కిస్తారు. 8. కేంద్ర / రాష్ట్ర సమాచార కమిషన్ తీర్పుకు ఉభయ పక్షాలు కట్టుబడివుండాలి. అయితే, ఆ నిర్ణయంపై యంత్రాంగం అసంతృప్తిచెందితే, కేంద్ర / రాష్ట్ర సమాచార కమిషన్ కు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. ఆర్ టి ఐ అప్లికేషన్ ఫారం ఎక్కడ లభిస్తుంది? అర్ టి ఐ (RTI) ద్వారా సమాచారము పొందేందుకు కావలిసిన దరాఖాస్తు మొడటి అపీలు (వినతి) - దరఖాస్తు ఫారం రెండవ అపీలు (వినతి) - దరఖాస్తు ఫారం ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు నమూనా ఆర్.టి.ఐ. అప్లికేషను ఫారం వి.ఆర్.ఏ. మరియు వి.ఆర్.ఓ. వ్రాత పరీక్షలకు హాజరైన ఒక అభ్యర్థి సమాచార హక్కు చట్టం ద్వారా నియామకం పొందిన వారి సమాచారం కోసం దరఖాస్తు చేసిన దరఖాస్తు ఫారం కొరకు ఇక్కడ చూడండి. చట్టం అమలులో సమాచార కమిషన్లు సమాచార హక్కు చట్టం కింద సంక్రమించిన అధికారాలను వినియోగించేందుకు, అప్పగించిన కార్యాలను నిర్వహించేందుకు కేంద్ర సమాచార కమిషన్ అనే సంస్థను కేంద్ర ప్రభుత్వం అధికార గజిట్లో నోటిఫికేషన్ద్వారా ఏర్పాటు చేసింది. కమిషన్లో కేంద్ర సమాచార కమిషనర్తోపాటు పదిమందికి మించకుండా అవసరమయిన సంఖ్యలో కేంద్ర సమాచార కమిషనర్లు ఉండవచ్చు. ప్రధాన సమాచార కమిషనర్ను, కేంద్ర సమాచార కమిషనర్లను ఒక కమిటీ సిఫార్సు మేరకు రాష్టప్రతి నియమిస్తారు. సిఫార్సు చేసే కమిటీలో లోక్సభ ప్రతిపక్ష నేత, ప్రధాన మంత్రి నామినేట్ చేసే ఒక కేంద్ర క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. కమిటీకి అధ్యక్షుడుగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. కేంద్ర సమాచార కమిషన్ కార్యకలాపాల సాధారణ పర్యవేక్షణ, దిశా నిర్దేశం, నిర్వహణ అధికారాలు ప్రధాన సమాచార కమిషనర్కు సంక్రమిస్తాయి. ఈ అధికారాల వినియోగంలో ప్రధాన సమాచార కమిషనర్కు కేంద్ర సమాచార కమిషనర్లు సహాయపడతారు. కేంద్ర సమాచార కమిషన్ ఈ చట్టం కింద స్వతంత్ర ప్రతిపత్తితో మరే అధికారానికీ, ఆదేశాలకు లోబడకుండా వినియోగించే అన్ని అధికారాలను, నిర్వహించే అన్ని పనులను కేంద్ర సమాచార కమిషనర్ వినియోగించవచ్చు. నిర్వహించవచ్చు. ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు ప్రజా జీవనంలో సుప్రసిద్ధులై ఉండాలి. వారికి విశాలమైన విషయ పరిజ్ఞానం, చట్టం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, మేనేజ్మెంట్, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనలో అనుభవం ఉండాలి. ఆర్థికంగా లాభం చేకూర్చే ఏ ఇతర పదవిలోనూ ఉండకూడదు. ఏ రాజకీయ పార్టీతోను సం బంధం కలిగి ఉండకూడదు. ఏ ఇతర వ్యాపారాన్ని గానీ వృత్తిని గానీ నిర్వహిస్తూ ఉండకూడదు. కేంద్ర సమాచార కమిషన్ కేంద్ర కార్యాలయ ఢిల్లీలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంనుంచి ముందుగా ఆమోదం పొందిన తర్వాత కేంద్ర సమాచార కమిషన్ ఇండియాలోని ఇతర ప్రాంతాలలో కార్యాలయాలను నెలకొల్పవచ్చు. ప్రధాన సమాచార కమిషనర్ పదవీ స్వీకారం చేసిన నాటినుంచి అయిదు సంవత్సరాలపాటు పదవిలో ఉంటారు. ప్రధాన సమాచార కమిషనర్ పునర్నియామకానికి అవకాశం లేదు. ఏ సమాచార కమిషనర్ కూడా 65 ఏళ్లు వచ్చిన తర్వాత పదవిలో ఉండేందుకు వీలులేదు. రాష్ట్ర సమాచార కమిషన్: అన్ని రాష్ట్రాలలో తీరుగానే మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ను, రాష్ట్ర సమాచార కమిషనర్లను ఒక కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి అధ్యక్షులుగా వ్యవహరించే ఈ కమిటీలో శాసనసభ ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి నామినేట్ చేసే ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర సమాచార కమిషన్లో ప్రధాన సమాచార కమిషనర్తోపాటు పదిమందికి మించకుండా అవసరమైన సంఖ్యలో రాష్ట్ర సమాచార కమిషనర్లను నియమించవచ్చు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ వేతనాలు, ఎలవెన్సులు ఇతర సర్వీసు నిబంధనలు అన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్తో సమానంగా ఉంటాయి. సమాచార కమిషన్ల అధికారాలు సమాచార హక్కు చట్టంలోని నిబంధనలకు లోబడి ఏ వ్యక్తినుంచి అయినా ఫిర్యాదు స్వీకరించి విచారణ జరపడం కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ విధి. ఆ ఫిర్యాదులు కింది విధంగా ఉండవచ్చు కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర పౌర సమాచార అధికారి నియామకం జరగని కారణంగా సమాచారం కోసం అభ్యర్థన అందించలేని పక్షంలో కేంద్ర పౌర సమాచార సహాయ అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార సహాయ అధికారి సమాచారం కోసం వచ్చిన దరఖాస్తునో, అప్పీలునో స్వీకరించకుండా, దీనిని కేంద్ర పౌర సమాచార అధికారి లేదా రాష్ట్ర సమాచార అధికారి లేక సెక్షన్ 19లోని సబ్ సెక్షన్ (1)లో పేర్కొన్న సీనియర్ అధికారికి లేదా కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్కు పంపని పక్షంలో సమాచార కమిషన్లకు ఫిర్యాదు చేయవచ్చు. సమాచార హక్కు చట్టం కింద అభ్యర్థించిన సమాచారాన్ని అందించేందుకు నిరాకరించిన పక్షంలో నిర్దేశించిన కాలపరిమితిలోగా జవాబురాని పక్షంలో సమాచార కమిషన్లకు ఫిర్యాదు చేయవచ్చు. సమాచారం కోసం చెల్లించాల్సిన రుసుము సహేతుకంగా లేదని దరఖాస్తుదారు భావించినపుడు ఈ చట్టం కింద తనకు అసంపూర్తిగానో, తప్పుదోవ పట్టించే విధంగానో, తప్పుడు సమాచారం అందించారని దరఖాస్తుదారు భావించినపుడు సమాచార కమిషన్లకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును విచారించేందుకు తగిన కారణాలున్నాయని కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ భావించిన పక్షంలో దానిపై విచారణకు ఆదేశింవచ్చు. వ్యక్తులకు సమన్లు జారీ చేసి వారు హాజరయ్యేట్టు చేయడం, వౌఖికంగా లేదా లిఖిత పూర్వకంగా వారు సాక్ష్యం ఇచ్చేట్టు చేయడం, పత్రాలు లేదా ఇతర వస్తువులను సమర్పించేట్టు చేయడం, పత్రాలు వెలికి తీసి వాటిని తనిఖీ చేయడం, అఫిడవిట్ రూపంలో వాంగ్మూలం స్వీకరించడం, ఏ కోర్టునుంచి అయినా లేదా కార్యాలయం నుంచి అయినా ప్రభుత్వ రికార్డులు, లేక వాటి కాపీలను తెప్పించడం, సాక్షులను విచారించేందుకు లేక పత్రాలను పరిశీలించేందుకు సమన్లు జారీ చేయడం వంటివి చేసే అధికారం సమాచార కమిషన్లకు ఉంది. పార్లమెంట్ లేక రాష్ట్ర శాసనసభలు చేసిన ఏ ఇతర చట్టంలోని నిబంధనలు అడ్డుగా ఉన్నప్పటికీ కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ ఈ చట్టం కింద ఒక ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న సందర్భంలో అధికార యంత్రాంగం నియంత్రణలో ఉండి ఈ చట్టం వర్తించే ఏ రికార్డునైనా పరిశీలించవచ్చు. అలాంటి రికార్డులను ఏ కారణంతో అయినా సమాచార కమిషన్ ముందు ఉంచకపోవడం కుదరదు. ఆధారము: ఆంధ్రభూమి సమాచారహక్కు సామాన్యుల ఆయుధం ప్రభుత్వ పాలనకు సంబంధించిన, వెలుగులోకిరాని అనేక అంశాలను గూర్చి తెలుసుకోవడానికి సమాచారహక్కు సామాన్య ప్రజలకు సైతం ఆయుధంగా మారింది. దానిని గూర్చి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో ప్రకరణ 19లో అంతర్గంగా పొందుపరిచారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పాలకులు తీసుకొనే నిర్ణయాలు, వాటిని ఏ ప్రాతిపదికన తీసుకున్నారనే సమాచారం తదితర విషయాలు ప్రజలకు తెలియాల్సి ఉంటుంది. అలా తెలపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలను సమాచార హక్కు ద్వారా ప్రజలు తెలుకునే అవకాశం ఉండాలి. అంటే ప్రభుత్వానికి సంబంధించిన వివిధ ఫైళ్లు, డాక్యుమెంట్లు, రిపోర్టులు, నిర్ణయాలు, ప్రభుత్వ పనితీరు మొదలైన అంశాలకు సంబంధించిన అన్ని విషయాలను ప్రభుత్వం పారదర్శకతతో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేకపోతే అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి అవకాశం ఉంటుంది. సమాచార హక్కు చట్టం-2005 సమాచార హక్కు చట్టాన్ని పార్లమెంటు 2005లో రూపొందించింది. జూన్ 15, 2005లో రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేశారు. అదే ఏడాది అక్టోబర్ 12 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. పాలనలో పారదర్శకతను సాధించడమే ఈ చట్ట ప్రధాన ఉద్దేశం. ముఖ్యాంశాలు: ఈ చట్టం ప్రకారం ప్రతి శాఖలో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను నియమిస్తారు. ప్రజలు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులో అందించడమే ఆయన ప్రధాన బాధ్యత. సాధారణ సమాచారమైతే 30 రోజల్లోగా, జీవించే హక్కుకు, వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన సమాచారం అయితే 48 గంటల్లో ఇవ్వాలి. దీనికోసం నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించడంలో అధికారులు విఫలమైతే వారిపై వచ్చే ఫిర్యాదులను సమాచార కమిషన్లు విచారిస్తాయి. చట్టం నిర్దేశించిన మేరకు సమాచారం అందించని అధికారులకు నిర్ణీత గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 25 వేల వరకు జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశం ఉంది. మినహాయింపులు: సమాచార హక్కు చట్టానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అవి దేశ సార్వభౌమత్వం, సమగ్రత, ఆర్థిక ప్రయోజనాలు, విదేశీ సంబంధాలు దెబ్బతినే అవకాశమున్న అంశాలు కోర్టు ధిక్కార సమాచారాలు, సభాహక్కులను భంగపరిచే అంశాలు, వ్యాపార రహస్యాలు, సమాచార వనరు (సోర్స్) అయిన వ్యక్తికి ముప్పు కలిగే అంశాలు, పరిశోధన నిరోధించే అంశాలు క్యాబినెట్ చర్చలు, ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ), రెవెన్యూ ఇంటలిజెన్స్, పారామిలటరీ, సైనిక వ్యవహారాల వంటి అంశాలపై సమాచారం కోరే హక్కు ఉండదు. నోట్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం, దానికి సంబంధించిన సమాచారం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర సమాచార కమిషన్-నిర్మాణం కేంద్ర సమాచార చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో చట్టబద్ధమైన కమిషన్లు ఉంటాయి. కేంద్ర సమాచారహక్కు కమిషన్లో ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, 10 మందికి మించకుండా ఇతర కమిషనర్లు ఉంటారు. ప్రధానమంత్రి అధ్యక్షతలోని సలహా కమిటీ సూచనతో రాష్ట్రపతి వారిని నియమిస్తారు. ఈ సలహా కమిటీలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి సూచించిన ఒక క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్లోని సభ్యులు న్యాయశాస్త్రం, శాస్త్ర, సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, పత్రికారంగం, పరిపాలన, మాస్ మీడియా వంటి వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉండాలి. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ్యులను కమినర్లుగా నియమించరాదు. రాష్ట్ర సమాచార కమిషన్ నిర్మాణం కేంద్ర సమాచార కమిషన్ లానే ఉంటుంది. అయితే వీరిని రాష్ట్ర ముఖ్యమంత్రి నేతత్వంలోని సలహా కమిటీ సూచన మేరకు గవర్నర్ నియమిస్తారు. ఈ సలహా కమిటీలో శాసనసభ ప్రతిపక్షనాయకుడు, ముఖ్యమంత్రి సూచించిన ఒక క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. పదవీకాలం: వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. అయితే వీటిలో ఏది ముందైతే అది పరిగణలోకి తీసుకుంటారు. చీఫ్ కమిషనర్ను మళ్లీ నియమించకూడదు. ఇతర కమిషనర్లను చీఫ్ కమిషనర్గా నియమించొచ్చు. వీరిని తొలగించే అధికారం కేంద్రంలో రాష్ట్రపతికి, రాష్ట్రంలో గవర్నర్కు ఉంటుంది. అవినీతి, అసమర్ధత, దివాళ తీయడం మొదలైన కారణాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. వారి సలహా మేరకు రాష్ట్రపతి/గవర్నర్ తొలగిస్తారు. కేంద్ర సమాచార కమిషన్ జీతభత్యాలు కేంద్ర ఎన్నికల, రాష్ట్ర సమాచార కమిషన్ జీతభత్యాలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్తో సమానంగా చెల్లిస్తారు. పదవిలో ఉండగా వీరి జీతభత్యాలను తగ్గించడానికి వీలులేదు. అధికార విధులు: కేంద్ర సమాచార కమిషనర్ విధులను రాష్ట్ర కమిషనర్ విధులను పోలిఉంటాయి. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదులను తీసుకొని వాటిని సంబంధిత శాఖలకు తెలపాలి. వారు సమాచారాన్ని తెలిపే విధంగా చర్యలు తీసుకుంటుంది. వివిధ శాఖలు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ను నియమించేలా చర్యలు తీసుకుంటుంది. సమాచారం ఇవ్వకుండా నిరాకరించిన సంబంధిత శాఖపై/ అధికారిపై చర్యలకు సిఫారసు చేస్తుంది. సంబంధిత శాఖ ఇచ్చిన సమాచారం అసంపూర్ణంగా ఉన్నా, తప్పుదోవపట్టించే విధంగా ఉన్నా వాటిపైన చర్యలు తీసుకుంటుంది. విచారణ సమయంలో సివిల్కోర్టుకు ఉన్న అధికారాలు ఈ కమిషన్కు ఉంటాయి. అంటే సంబంధిత అధికారిని హాజరవ్వమని, వివిధ రికార్డులను తనిఖీ చేయడం, అఫిడవిట్లు స్వీకరించడం మొదలైన అధికారాలు ఉంటాయి. కమిషన్ ఇచ్చిన ఆదేశాలను వివిధ శాఖలు ఏ విధంగా అమలు చేశాయే తెలుసుకోవడానికి ఆయా శాఖల నుంచి సంబంధిత నివేదికలను కోరుతుంది. సమాచారహక్కుకు, సమాచార వర్గీకరణకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఆ నివేదికను పార్లమెంటు పరిశీలనకు ఉంచుతారు. ఆధారము: నమస్తే తెలంగాణా