(ఈ ఉత్తరం 1928 నాటిది. అప్పటికి ఇందిరాగాంధీ వయస్సు పదేళ్లు. “Letters from a Father to his daughter”లోని మొదటి ఉత్తరమిది. తండ్రిగా తన బిడ్డకు, రచయితగా బిడ్డలందరికీ ఈ ప్రపంచం పట్ల ఎలాంటి జ్ఞానం అవసరమని నెహ్రూ తపనబడ్డారో ఈ ఉత్తరంలో మనం చూడొచ్చు) మనం కలిసి వున్నప్పుడు నువ్వు ప్రతి దాన్ని గురించి ప్రశ్నిస్తుంటావు. అడుగుతుంటావు. నేను జవాబులు చెబుతుంటాను. కానీ ఇప్పుడు నువ్వు ముస్సోరీలో వున్నావు. నేను అలహాబాద్ లో వున్నాను. మనం మాట్లాడుకోసం సాధ్యం కాదు. అందులోని జీవజాలం గురించి, మానవుల గురించి నేను వీటిలో చెబుతాను. మన చుట్టూ ఉన్న ప్రకృతే ఒక పెద్ద పుస్తకం. ఈ పుస్తకంలో నుంచే మనం ఈ భూమి ప్రాచీన చరిత్రను చదవాలి. మన చుట్టూ ఉన్న బండలు, కొండలు, లోయలు, నదులు, అగ్ని పర్వతాలు, సముద్రాలు ప్రతిదీ ఈ ప్రకృతి పుస్తకంలోనే ఉన్నాయి. ఎప్పుడూ కళ్ల ముందు ఈ పుస్తకం తెరిచి పెట్టే ఉంటుంది. అయితే మనలో ఎందరం దీన్ని పట్టించుకుంటున్నాం ఎందరం దీన్ని మనసు పెట్టి చదువుతున్నాం దీన్ని మనం చదవడం నేర్చుకోగలిగితే ఎన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయో ఓ రాయి కథకంటే ఒక మంచి జానపద కథ కంటే ఆసక్తిగా ఉంటుంది. చాలా చాలా కాలం కిందట ఈ భూమి మీద మనుషులు లేరు. జంతువులు లేరు. ఓపిగ్గా ఈ ప్రకృతి పుస్తకాన్ని చదివితే మొదట జంతువులు, తరువాత మానవులు ఈ భూమి మీదకు వచ్చారని మనకు అర్థమవుతుంది. అయితే ఆ జంతువులన్నీ ఇప్పటి జంతువుల్లాంటివి కావు. మనుషులు ఇప్పటి మనలాంటి వారూ కాదు. అప్పటి మనుషులకూ, అడవుల్లోని జంతువులకూ తేడా ఏమీ వుండేది కాదు. క్రమంగా అనుభవంలోంచి వాళ్లు ఆలోచనా శక్తిని సంపాదించుకున్నారు. ఈ శక్తి వాళ్లని పశువుల కంటే భిన్నంగా మార్చింది. ఈ శక్తితోనే వాళ్లు అతి క్రూరమైన మహామహా జంతువులకంటే బలవంతులయ్యారు. ఒక చిన్న మనిషి పెద్ద ఏనుగు మీద కూర్చొని తనకిష్టమొచ్చినట్లు దాన్ని నడిపించడం నువ్వు చూసి ఉంటావు. ఏనుగు మీద కూర్చున్న మావిటివాడెంత ఏనుగెంత మరి మావటివాడెలా దానికి యజమాని కాగలిగాడు. ఏనుగు ఎందుకు వాడికి సేవకులిరాగా మారింది. మనిషికి ఆలోచనా ఉంది. అందువల్ల మావటి వాడు యజమాని అయ్యాడు. ఈ ఆలోచన శక్తి పెరిగే కొద్దీ మానవుడు మరింత నిపుణుడయ్యాడు. మరింత తెలివిగలవాడయ్యాడు. క్రమంగా అతడు నిప్పునెలావాడుకోవచ్చో తెలుసుకొన్నాడు. వ్యవసాయం చేసి పంటలు పండించడం నేర్చుకున్నాడు. గుడ్డలు నేసి ధరించేది అలవాటైంది. ఇళ్ళు కట్టుకొని నివశించడం అలవాటయింది. ఒక గుంపుగా పురుషులు, స్త్రీలు నివశించడం మొదలైంది. తరువాత తరువాత పట్టణాలు వెలిశాయి. దీనికి ముందు మానవులు సంచార జీవులుగా ఉండేవారు. బహుశా గుడారాల్లాంటి వాటిల్లో ఉండేవారు. బహుశా గుడారాల్లాంటి వాటిల్లో ఉండేవారు కాబోలు. అప్పుడు వాళ్లకి నేల నుంచి దాన్యం పుట్టించడం తెలియదు. అప్పుడు వాళ్లకి బియ్యం లేవు. రొట్టె చేసుకొనే గోదుమలు లేవు. ఇప్పుడు నువ్వు తినే కూరగాయలు లేవు. దుంపలు, పండ్లు మానవులు తినేవారు. అయితే వేటాడిన జంతువుల మాంసమే వాళ్లకి అసలైన ఆహారంగా ఉండేది. జవాభా పెరిగే రొద్దీ మానవులు చాలా కళలు నేర్చుకున్నారు. రాయడం కూడా నేర్చుకున్నారు. అయితే మొదట వాళ్లకి రాయడానికి కాగితాలు. ఉండేవి కావు. భోజపత్రాల మీద రాసేవారు. తరువాత తాటాకుల మీద రాసేవారు. నువ్వు పాత గ్రంథాలుండే లైబ్రరీకి వెళితే ఇలాంటి తాటాకు పుస్తకాలను చూడొచ్చు. తరువాత కాగితాలోచ్చాయి. కానీ అచ్చు యంత్రాలు ఇప్పటిలా లేవు. వేలాది కాపీలు అచ్చు వేసే అవకాశం లేదు. ఒక పుస్తకం తయారయితే దాన్ని చూసి రాసి కాపీలు తయారు చేసేవారు. ఇప్పుడు పుస్తకం కావాలంటే నువ్వు షాపుకెళతావు. అప్పుడైతేనా ఎవరినో అడిగి పుస్తకం తెచ్చుకొని ఇంకొకరి చేత కాపీ చేయించుకోవాల్సిందే. అందుకే అప్పుడు చాలా పుస్తకాలుండేవి కావు. అయితే ఆ కాలంలో ఎంత అందంగా రాసేవారనుకున్నావు. ఆ చేతి రాత ఎంత ముచ్చటగా ఉండేదనుకున్నావు. మన లైబ్రరీల్లోని సంస్కృతం, పర్షియన్, ఉర్దూ పుస్తకాల్ని చూసే ఇది తెలుస్తుంది. ప్రతి పేజీ నాలుగు అంచుల్లో రకరకాల పూల జీగల డిజైన్లు మనకు కనిపిస్తాయి. నగరాలు ఏర్పడడంతో దేశాలు ఏర్పడ్డాయి. జాతులు ఏర్పడ్డాయి. పక్కపక్క ఉన్న దేశాల వారు ఒకరొకర్నిగురించి మరింతగా తెలుసుకున్నారు. మూర్ఖంగా ఒకరి కంటే ఒకరు గొప్పగా జీవిస్తున్నట్లు గర్వపడి ఒకరితో ఒకరు యుద్ధాలు చేసుకున్నారు. మానవులు చేసే హీనాతి హీనమైన పనుల్లో ఒకరినొకరు చంపుకోవడం కంటే మరొకటి లేదని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఈ దుర్మార్గం ఇప్పటికీ సాగుతోంది. దీనివల్ల ఎవరూ బాగుపడరు. ఈ ప్రాచీన నగరాల గురించి, దేశాల గురించి తెలుసుకోవాలంటే మనం ప్రాచీన గ్రంథాలు చదవాలి. అయితే అంతా చెప్పగల పుస్తకాలు లేవు. ఇతర మార్గాల ద్వారానే తెలుసుకోవాలి. పూర్వ రాజులు తమ పాలన గురించి రాళ్ల మీద, స్తంభాల మీద చెక్కించేవారు. పుస్తకాలయితే చాలా రోజులుండవు. కాగితాలను చెదలు తినేస్తాయి. అదే రాళ్లయితే చాలా చాలా కాలం ఉంటాయి. అలహాబాదు కోటలో అశోకుడి స్థూపం నువ్వు చూశావు. తన శాసనాలను చాటి చెప్పేందుకు అశోక చక్రవర్తి ఇలా రాతిమీద చెక్కించాడు. ఇది వందల ఏళ్ల క్రితం చెక్కిన శాసనం. నువ్వు లక్నో మ్యూజియంకెళితే రాళ్ల మీద చెక్కిన రాతల్ని ఇంకా చాలా చూడొచ్చు. మనం ప్రాచీన చరిత్రను తరిచి చూడాలంటే చైనా, ఈజిప్టు చరిత్రలను చదవాలి. అత్యంత ప్రాచీన కాలంలోనే అక్కడ ఎన్నో గొప్పగొప్ప ఆవిష్కరణలు జరిగాయి. నాగరికతలు వెలిశాయి. అప్పటికి యూరపు దేశాల ప్రతలు కేవలం అడవి మనుషులు మాత్రమే. రామాయణం, మహాభారతం లాంటి గ్రంథాలు వెలువడ్డ మన భారతదేశ ప్రాచీన వైభవం కూడా ఎంతో గొప్పది. ఇప్పుడు మనమెలా ఉన్నాం. దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నాం. పరాయి పాలకులు మనల్ని శాసిస్తున్నారు. మన దేశంలోనే మనకిప్పుడు స్వేచ్ఛలేదు. మనం కావాలన్నది చేసుకునే అదికారమూ లేదు. అవకాశమూ లేదు. అయితే ఈ దుస్థితి చాలా కాలం సాగదు. మనం కష్టపడితే మళ్లీ మన స్వాత్రంత్ర్యం మనకు లభిస్తుంది. అప్పుడు మన పేదలకు మనం ఎంతైనా చేయగలం. యూరప్ దేశాల్లోనే మన దేశమూ, జనం సుఖశాంతులతో ఉండే దేశంగా మారుతుంది. అడుగడుగునా ముగ్ధుల్ని చేసే తరతరాల భూమి కథను వచ్చే ఉత్తరంలో నీకు చెబుతాను.