మిషన్ ఇంద్రధనుష్, డిసెంబర్ 25, 2014 న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం మొదలుపెట్టింది. 2009-2013 ల మధ్య ఇమ్యునైజేషన్ కవరేజ్ 61% నుంచి 65% కు పెరిగింది, ఇది ప్రతి సంవత్సరం కేవలం 1% పెరుగుదలను సూచిస్తుంది. దీనిని 5% నికి పెంచడాకి ఇంద్రధనుశ్ మిషన్ ప్రారంభించారు. ఇమ్యునైజేషన్ ప్రక్రియ వేగవంతం చెయడానికి మరియు 2020 నాటికి పూర్తి కవరేజ్ లక్ష్యంగా ఇది సాగుతుంది. లక్ష్యాలు మిషన్ ఇంద్రధనుశ్, ఇంద్రధనుస్సులో ఏడు రంగులు కనబడుతున్నట్టు, 2020 నాటికి డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, పోలియో, క్షయ, తట్టు మరియు హెపటైటిస్ బి లాంటి ఏడు జబ్బులకు వ్యాక్సీను తీసుకోని లేదా పాక్షికంగా తీసుకున్న అందరు పిల్లలకు అందించటం దీని లక్ష్యం. అమలు క్రమబద్ధమైన ఇమ్యునైజేషన్ డ్రైవ్ ఇమ్యునైజేషన్ తీసుకోని అందరు పిల్లలను "క్యాచ్-అప్" ప్రచారం మోడ్ ద్వారా ఉంటుంది. మిషన్ ఇంద్రధనుశ్ మొదటి దశ 201 గుర్తించిన జిల్లాలలో 7 ఏప్రిల్ 2015 నుంచి ఒక వారమంతా సాగింది. నాలుగునెలల పాటు జరిగింది. ఇందులో 75 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్ వేసారు. ఇందలో 20 లక్షల మంది పిల్లలకు పూర్తిగా వ్యాక్సిన్ చేసారు. మరియు 20 లక్షల కంటే ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు ధనుర్వాతం టీకాలను తీసుకున్నారు. రెండవ ఫేసులో ప్రభుత్వం దేశంలో ఎంపిక చేసిన 352 జిల్లాల్లో 279 తక్కువ కేంద్రీకృత జిల్లాలు మరియు మొదటి ఫేసులో మిగిలిన 73 అధిక కేంద్రీకృత జిల్లాలను ఎంపిక చేసుకుంది. మిషన్ ఇంద్రధనుశ్ రెండో దశ సమయంలో, వారం వ్యవధి నాలుగు ప్రత్యేక డ్రైవులను అక్టోబర్ 2015 నుంచి ప్రారంభించారు. డబ్ల్యుహెచ్ఒ, యునిసెఫ్, రోటరీ ఇంటర్నేషనల్ మరియు ఇతర దాత భాగస్వాముల సాంకేతిక మద్దతు మంత్రిత్వ శాఖకు ఉంటుంది. మాస్ మీడియా, ఇంటర్ పర్సనల్ కమ్యునుకేషను, మరియు పర్యవేక్షణ మరియు పథకం విశ్లేషించే వాటిని పరిశీలించటం మిషన్ ఇంద్రధనుశ్ కీలక భాగాలు. దృష్టి సారించిన ప్రాంతాలు మిషన్ ఇంద్రధనుశ్ 2015 సంవత్సరం మొదటి దశలో 201 అధిక ప్రాధాన్యత జిల్లాలను మరియు 297 జిల్లాలను రెండవ దశలో ఎంపిక చేసింది. మొదటి దశలో, 201 అధిక దృష్టి సారించిన జిల్లాలు, ఏవైతే సుమారు 50% వ్యాక్సినేషను చేసిన లేదా పాక్షికంగా వ్యాక్సిన్ చేసివని, ఉన్నాయి. 201 జిల్లాలలో 82 జిల్లాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఉన్నాయి. భారతదేశంలో వ్యాక్సినేషను చేయని లేదా పాక్షికంగా వ్యాక్సిన్ అయిన పిల్లలు సుమారు 25% ఈ 4 రాష్ట్రాల్లోని 82 జిల్లాల్లో ఉన్నారు. ఈ జిల్లాలలో, 400,000 అధిక ప్రమాద స్థావరాలను పోలియో నిర్మూలన కార్యక్రమం ద్వారా గుర్తించారు. ఇవి భౌగోళిక జనాభా, జాతి మరియు ఇతర ఆపరేషనల్ సవాళ్ళ వలన తక్కువ కవరేజ్ పాకెట్స్ ఉంటాయి. వ్యాక్సినేషను కాని మరియు పాక్షిక వ్యాక్సిన్ అయన చాలా మంది పిల్లలు ఈ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. క్రింది ప్రాంతాలు ప్రత్యేక ఇమ్యునైజేషన్ క్యాంపెన్ లక్ష్యాలు: పోలియో నిర్మూలన కార్యక్రమం ద్వారా ఎక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో నివసించే జనాభా కూడా ఇందులో లెక్కించారు: వలసల వలన పట్టణ మురికివాడలు సంచార జాతులు ఇటుక బట్టీలు నిర్మాణ ప్రదేశాలు ఇతర వలస దారులు (మత్స్యకారుల గ్రామాలు, నదీ ప్రాంతాల వలస దారులు మొ. ) మరియు పేద మరియు చేరుకోలేని జనాభా (అటవీ, గిరిజన జనాభా మొదలైనవి) తక్కువ సాధారణ ఇమ్యునైజేషన్ (RI) కవరేజ్ (తట్టు/టీకా నివారించగల వ్యాధి (VPD) వ్యాప్తి పాకెట్స్) ప్రాంతాలు. ఖాళీగా ఉప కేంద్రాలు: మూడు నెలల కంటే ఎక్కువ సమయం ANM పోస్ట్ లేనిది. రొటీన్ ఇమ్యునైసేషను (RI) సెషన్స్ తప్పిన ప్రాంతాలు. ANM దీర్ఘసెలవులో ఉండటం మరియు అలాంటి కారణాలు. చిన్న గ్రామాలు, పల్లెలు, ధనీస్ లేదా పూరబ్ లాంటివాటిని మరో గ్రామ (RI) సెషన్స్ తో కలిపి నప్పుడు మరియు స్వతంత్ర్య (RI) సెషన్స్ లేనప్పుడు. మిషన్ ఇంద్రదనుశ్ - పూర్తిచేసిన జిల్లాలు దశ I - 201 జిల్లాలు S.NO రాష్ట్ర వ.సం. జిల్లా వ.సం జిల్లా 1 ఆంధ్ర ప్రదేశ్ 1 తూర్పు గోదావరి 2 గుంటూరు 3 కృష్ణ 4 కర్నూల్ 5 విశాఖప ట్నం 2 అరుణాచల్ ప్రదేశ్ 1 చాంగ్లాంగ్ 2 తూర్పు కమెంగ్ 3 తూర్పు సియాంగ్ 4 లోహిత్ 5 అప్పర్ సియాంగ్ 3 అస్సాం 1 బొంగైగోన్ 2 డారింగ్ 3 ధుబ్రి 4 గోలాపర 5 కైలాకండి 6 కరీంగంజ్ 7 కోక్రాఝర్లో 8 నగావ్ 4 బీహార్ 1 అకారియ 2 బెగుసారై 3 చంపారణ్ తూర్పు 4 చంపారన్ వెస్ట్ 5 దర్భాంగా 6 గయా 7 జమూయ్ 8 కతిహార్ 9 కిషన్గంజ్ 10 ముజఫర్పూర్ 11 పాట్నా 12 సహారా 13 సమస్తిపూర్ 14 సితమరహి 5 ఛత్తీస్గఢ్ 1 బలోడాబజార్ భాటపర 2 బిజాపూర్ 3 బిలాస్పూర్ 4 దంతేవాడ 5 జష్ పూర్ 6 కోర్బా 7 రాయ్పూర్ 8 సర్గుజా 6 న్యూఢిల్లీ 1 ఈశాన్య 2 వాయువ్యం 7 గుజరాత్ 1 అహ్మదాబాద్ 2 అహ్మదాబాద్ కార్ప్. 3 బనస్కాంత 4 దాహోడ్ 5 దాంగ్స్ 6 కచ్ 7 పంచమహల్ 8 సబర్కాంత 9 వల్సాడ్ 8 హర్యానా 1 ఫరీదాబాద్ 2 గుర్గావ్ 3 మేవట్ 4 పల్వాల్ 5 పానిపట్ 9 జమ్మూ & కాశ్మీర్ 1 దోడ 2 కిస్టవర్ 3 పంచ్ 4 రాజౌరి 5 రాంబన్ 10 జార్ఖండ్ 1 డియోఘర్ 2 ధన్బాద్ 3 గిరిధ్ 4 గొడ్డా 5 పాకూర్ 6 సాహిబ్ గంజ్ 11 కర్ణాటక 1 బెంగళూరు (యు) 2 బెల్లారే 3 గుల్బర్గా 4 కొప్పల్ 5 రాయచూర్ 6 యాడ్గిర్ 12 కేరళ 1 కాసర్గోడ్ 2 మలప్పురం 13 మధ్యప్రదేశ్ 1 అలిజాపూర్ 2 అన్నుప్పూర్ 3 ఛత్రాపూర్ 4 దామోవ్ 5 జబువా 6 మండలా 7 పన్నా 8 రాయ్సేన్ 9 రేవా 10 సాగర్ 11 సతాన 12 షాడల్ 13 తిక్కాం గడ్ 14 ఉమారియా 15 విదీష 14 మహారాష్ట్ర 1 బీడ్ 2 ధూలే 3 హింగోలీ 4 జల్గావ్ 5 నాందేడ్ 6 నాసిక్ 7 థానే 15 మణిపూర్ 1 చురచంద్పూర్ 2 సేనాపతి 3 తమెంగ్లాంగ్ 4 ఉఖ్రుల్ 16 మేఘాలయ 1 ఈస్ట్ కాశీ హిల్ 2 పశ్చిమ గారో హిల్స్ 3 వెస్ట్ కాశీ హిల్ 17 మిజోరం 1 లవంగ్త్లై 2 లంగ్లేయ్ 3 మమిత్ 4 సైహ 18 నాగాలాండ్ 1 దిమాపూర్ 2 కిఫిరె 3 కోహిమా 4 సోమ 5 జునెబోటొ 6 వోఖా 19 ఒడిషా 1 బౌద్ 2 గజపతి 3 గంజాం 4 కంధమాల్ 5 ఖుర్దా 6 కోరాపుట్ 7 మలకంగిరి 8 నబారంగ్పూర్ 9 నువాపాడా 10 రాయగడ 20 పాండిచ్చెరి 1 యానాం 21 పంజాబ్ 1 గురుదాస్పూర్ 2 లూధియానా 3 ముక్తసర్ 22 రాజస్తాన్ 1 అల్వార్ 2 బార్మర్ 3 బుండి 4 ధౌల్ పూర్ 5 జైపూర్ 6 జోధ్పూర్ 7 కరౌలి 8 శవై మధోపూర్ 9 టాంక్ 23 తమిళనాడు 1 కోయంబత్తూరు 2 కాంచీపురం 3 మధురై 4 తిరువల్లూర్ 5 తిరుచిరాపల్లి 6 తిరునల్వేలి 7 వెల్లోర్ 8 విరుదునగెర్ 24 తెలంగాణ 1 ఆదిలాబాద్ 2 మహబూబ్నగర్ 25 త్రిపుర 1 దలై 2 త్రిపుర నార్త్ 3 త్రిపుర వెస్ట్ 26 ఉత్తరప్రదేశ్ 1 ఆగ్రా 2 అలిగర్ 3 అలహాబాద్ 4 అమేథీ 5 అంరోహ్ 6 ఔరాయ 7 ఆజంగఢ్ 8 బడావున్ 9 బదోహి 10 బహ్రైచ్ 11 బలరామ్పూర్ 12 బంద 13 బారాబంకి 14 బారెల్లీ 15 బలంద్ షహర్ 16 చిత్రకూట్ 17 ఈటా 18 ఇఠావా 19 ఫరూఖాబాద్ 20 ఫిరోజాబాద్ 21 ఘజియాబాద్ 22 గోండా 23 హాపుర్ 24 హర్దోయి 25 హత్రాస్ 26 కనౌజ్ 27 కాస్ గంజ్ 28 కుశంబి 29 ఖేరి 30 మణిపురి 31 మధుర 32 మీరట్ 33 మిర్జాపూర్ 34 మోరాడాబాద్ 35 ముజఫర్నగర్ 36 పిలిభిత్ 37 సంభాల్ 38 షాజహాన్పూర్ 39 షామిలి 40 సిధార్థ్ నగర్ 41 సీతాపూర్ 42 సొంభద్ర 43 స్రావస్తి 44 సుల్తాన్పూర్ 27 ఉత్తరాఖండ్ 1 హరిద్వార్ 28 పశ్చిమబెంగాల్ 1 24 పరగణాల నార్త్ 2 24 పరగణాల సౌత్ 3 బర్ధమాన్ 4 బీర్బుమ్ 5 ముర్షిదాబాద్ 6 ఉత్తర దినాజ్పూర్ రెండో దశ - 352 జిల్లాలు మిషన్ ఇంద్రధనుశ్ రెండో దశ భాగంగా ఉన్న జిల్లాల పూర్తి జాబితా కోసం, ఇక్కడ క్లిక్ చేయండి. మిషన్ ఇంద్రధనుశ్ వ్యూహం మిషన్ ఇంద్రధనుశ్ తక్కువ ఇమ్యునైజేషన్ కవరేజ్ ఉన్న జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధతో దేశవ్యాప్తంగా అధిక కవరేజ్ భరోసా కోసం ముఖ్య ఇమ్యునైజేషన్ ప్రాంతాలను బలోపేతం చేయడానికి జాతీయ టీకా కార్యక్రమము. ఇది విస్తృత వ్యూహం, ఆధారాలు మరియు ఉత్తమ విధానాల ఆధారంగా, నాలుగు ప్రాథమిక అంశాలను కలిగి ఉంటుంది- అన్ని స్థాయిలలో ప్రచారాలు/సెషన్ల ఖచ్చితమైన ప్రణాళిక: నియమిత చర్యగా చేసే ఇమ్యునైజేషన్ సెషన్స్ సమయంలో తగిన వాక్సీనులు మరియు అన్ని టీకాల లభ్యతను నిర్ధారించడానికి అన్ని బ్లాక్స్ మరియు ప్రతి జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మైక్రోప్లాన్ కూర్పులను ముందుగా చూడాలి. పట్టణ మురికివాడలు, నిర్మాణ ప్రదేశాలు, ఇటుక బట్టీలు, సంచార సైట్లలో ఉన్న 400,000 మంది అధిక ప్రమాదంలోని పిల్లలను చేరుకోవడానికి ప్రత్యేక ప్రణాళికలు అభివృద్ధి చేయాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మరియు సామాజిక సమీకరణ ప్రయత్నాలు: మాస్ మీడియా, మధ్య మీడియా, ఇంటర్ పర్సనల్ కమ్యునికేషను (ఐపిసి), పాఠశాల మరియు యువ మరియు కార్పోరేట్లతో రొటీన్ ఇమ్యునైజేషన్ కార్యకలాపాల ద్వారా అవగాహన మరియు ఇమ్యునైజేషన్ సేవల డిమాండ్ పెంపొందించాలి. వైద్య అధికారులకు మరియు ఫ్రంట్లైన్ అధికారులకు లోతైన శిక్షణ: రొటీన్ ఇమ్యునైజేషన్ కార్యకలాపాల ఆరోగ్య అధికారులు మిరియు కార్మికుల నాణ్య ఇమ్యునైజేషన్ సేవా సామర్థ్యాన్ని పెరిగేలా చేయాలి. టాస్కు ఫోర్సు ద్వారా జవాబుదారీ తనం రూపాన్ని నెలకొల్పాలి: జిల్లాల్లోని ఇమ్యునైజేషన్ టాస్క్ఫోర్సులను అన్ని జిల్లాలలో బలోపేతం చేసి జిల్లా పరిపాలనా మరియు ఆరోగ్య యంత్రాంగాల జవాబుదారీతనం/యాజమాన్యాన్ని పెంచాలి. సెషన్ పర్యవేక్షణ డేటాను ఉపయోగించి సమకాలిక నిజ సమయ సమస్యలను భర్తీ తీర్చాలి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, దేశంలో రొటీన్ ఇమ్యునైజేషన్ కవరేజ్ పెంచడానికి, ఇతర మంత్రిత్వశాఖలు, ఇప్పటికే కొనసాగుతున్న కార్యక్రమాలు మరియు అంతర్జాతీయ భాగస్వామ్యన్ని ఏర్పరచ టానికి ఒక సమన్వయ మరియు సంఘటిత పద్ధతిని ఏర్పాటు చేస్తుంది. మూలం: ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ