ప్రాంతీయం రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా తెల్లకార్డు ఉంటే చాలు-ఉచిత చికిత్సలు లభ్యం ఆధునిక వైద్యసౌకర్యాలను పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం రూపొందించిన నూతన పధకం రాజీవ్ ఆరోగ్యశ్రీ. మన రాష్ట్రంలోని గ్రామీణ జనాభాలో అత్యధికులు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నది పేదలే.ఆధునిక చికిత్సా విధానాలు, సౌకర్యాలు అందుబాటులో లేని కారణంగా ఈ వర్గాలు ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు నిస్సహాయంగా ఉండిపోవల్సి వస్తోంది. ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు,మెదడు సంబంధిత శస్త్ర చికిత్సలు,క్యాన్సర్ చికిత్స(కీమో థెరపీ,రేడియో థెరపీ మరియు శస్త్ర చికిత్సలు ),కాలిన గాయాల చికిత్స,ఇతర గాయాల కు శస్త్ర చికిత్సలు (మోటార్ వాహనాల చట్టం పరిధిలోనివి కాకుండా) మరియు పూర్తి చెవుడు ఉన్న పిల్లలకు (ఆరు సంవత్సరములలోపు) శస్త్ర చికిత్స వీరికి అంతగా అందుబాటులో లేవు. ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు తగినంతగా లేకపోవడమే ఇందుకు కారణం. కార్పోరేట్ ఆసుపత్రులలో ఈ శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికి అవి ప్రధానంగా సంపన్న వర్గాలకే పరిమితం. గ్రామాల్లో దారిద్ర్యరేఖకు దిగువన జీవించే(బి.పి.ఎల్) వర్గాలకు ఇవి అందనంత ఎత్తులో ఉన్నాయి. ఏదన్నా అనారోగ్యం వస్తే తమకున్న కొద్దిపాటి ఆస్తుల్ని అమ్మేసుకోవడమో లేక అప్పుల పాలు కావడమో వీరికి తప్పడం లేదు. పర్యవసానంగా సమాజంలో ఆరోగ్య అసమానతలు ఏర్పడుతున్నాయి. నిరుపేద వర్గాలలో ఇవి తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బిపిఎల్ కుటుంబాలకు పైన తెలిపిన తీవ్ర అనారోగ్యాల శస్త్ర చికిత్స నిమిత్తం ఆరోగ్యబీమా ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పధకాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు గాను ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షతన 'ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్' ను ఏర్పాటుచేసింది. బీమా మరియు వైద్యరంగంలోని నిపుణుల సహాయంతో ట్రస్ట్ ఒక చక్కటి బీమా పథకాన్ని రూపొందించింది. పేదలకు అవసర సమయాల్లో శస్త్ర చికిత్సా సౌకర్యాలు సమకూర్చడం,వారు అప్పులబారిన పడకుండా చూడడమే 'రాజీవ్ ఆరోగ్యశ్రీ'బీమా పథకం లక్ష్యం. బీమా సౌకర్యాన్ని కల్పించే నిమిత్తం టెండర్ల ప్రక్రియ అనంతరం'స్టార్ హెల్త్ అండ్ ఎలైడ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ'ని ఎంపిక చేశారు. దీనికయ్యే ప్రీమియం మొత్తం ప్రభుత్వమే సమకూర్చింది. ఆసుపత్రి వ్యవహారాలలో మీ పనిని సులభతరం చేసేందుకు గాను అన్ని పి.హెచ్.సి.లలో మరియు మీకు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 'ఆరోగ్యమిత్ర'లను నియమిస్తారు. గౌ!! ముఖ్యమంత్రి డా!!వై.ఎస్ రాజశేఖరరెడ్డి గారు 31 మార్చి, 2007 న ఈ పథకం ప్రయోగాత్మకంగా మహబూబ్ నగర్, అనంతపురం,శ్రీకాకుళం జిల్లాలలో ప్రారంభించారు. ప్రారంభించిన ఏడు నెలల లోపలే సుమారు 8000 మంది రోగులకు ఆపరేషన్ నిమిత్తము వివిధ ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వబడింది. వీటికి అయ్యే ఖర్చు రూ.40 కోట్లు. ఈ ప్రయోగాత్మక పథకం యొక్క విజయాన్ని మరియు ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించి మరో ఐదు జిల్లాలలో (చిత్తూరు,తూర్పు గోదావరి,పశ్చిమగోదావరి,రంగారెడ్డి ,నల్లగొండ) 5 డిసెంబర్ 2007 నాటి నుండి రెండవ విడతగా ప్రవేశ పెట్టింది. మనమంతా కలిసి ఈ పథకాన్ని విజయవంతం చేద్దాం! నిరుపేద కుటుంబాలలో మళ్లీ చిరునవ్వులు పూయిద్ధాం! హరితాంధ్ర ప్రదేశ్ ను 'ఆరోగ్యాంధ్ర ప్రదేశ్' గా మారుద్దాం!. 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' సామూహిక ఆరోగ్య పథకం అంటే ఏమిటి? 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' సామూహిక ఆరోగ్య బీమా పథకం అనేది కుటుంబ బీమా పథకం.ఈ పథకం కింద గుండె,మూత్రపిండాలు,మెదడు సంబంధిత శస్త్ర చికిత్సలు,క్యాన్సర్ చికిత్స(కీమో థెరపీ,రేడియో థెరపీ మరియు శస్త్ర చికిత్సలు ),కాలిన గాయాల చికిత్స,ఇతర గాయాల శస్త్ర చికిత్సలు (మోటార్ వాహనాల చట్టం పరిధిలోనివి కాకుండా) మరియు పూర్తి చెవుడు ఉన్న పిల్లలకు (ఆరు సంవత్సరములలోపు) శస్త్ర చికిత్స పూర్తి ఉచితంగా కల్పించడం జరుగుతుంది. ఏ జిల్లాలలో ఈ పథకం అమలులో ఉంటుంది? చిత్తూరు,తూర్పు గోదావరి,పశ్చిమగోదావరి,రంగారెడ్డి , నల్లగొండ 5 డిసెంబర్ 2007 నాటి నుండి అమలులో ఉంటుంది. ఈ పథకానికి ఎవరు అర్హులు? చిత్తూరు,తూర్పు గోదావరి,పశ్చిమగోదావరి,రంగారెడ్డి , నల్లగొండ జిల్లాలలోని తెల్ల రేషన్ కార్డు (తెలుపు,అన్నపూర్ణ,అంత్యోదయ) కలిగి ఉన్న కుటుంబాల వారందరూ ఈ పథకానికి అర్హులే. వీరందరికి రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా హెల్త్ కార్డ్ ప్రభుత్వం ద్వారా ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ అర్హత పొందటం ఎలా? రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా హెల్త్ కార్డ్ కలిగి ఉన్న కుటుంబాల వారందరూ ఈ పథకానికి అర్హులే. తెల్లరేషన్ కార్డుల (తెలుపు, అన్నపూర్ణ, అంత్యోదయ) ప్రాతిపదికపై కార్డు ఇవ్వబడతాయి. మరి ప్రీమియం ఎవరు కడతారు? మీరు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రీమియం ప్రభుత్వమే కడుతుంది. ఈ పథకం కింద లభించే ప్రయోజనాలు ఏవి? కుటుంబసభ్యులలో ఎవరికైనా గుండె,మూత్రపిండాలు,మెదడు సంబంధిత శస్త్ర చికిత్సలు,క్యాన్సర్ చికిత్స(కీమో థెరపీ,రేడియో థెరపీ మరియు శస్త్ర చికిత్సలు ),కాలిన గాయాల చికిత్స,ఇతర గాయాల శస్త్ర చికిత్సలు (మోటార్ వాహనాల చట్టం పరిధిలోనివి కాకుండా) మరియు పూర్తి చెవుడు ఉన్న పిల్లలకు (ఆరు సంవత్సరములలోపు) శస్త్ర చికిత్స పూర్తి ఉచితంగా కల్పించడం జరుగుతుంది-అంటే ఆసుపత్రిలో చేరడం,శస్త్రచికిత్సలు చేయించుకోవడం- అయ్యే ఖర్చు మొత్తం ఈ పథకం కింద లభిస్తుంది. ఆసుపత్రికి ఏమీ చెల్లించకుండానే రోగికి ఆపరేషన్, తదితర చికిత్సలు లభిస్తాయి. ఈ పథకం క్రింద ఏయే ఆపరేషన్లు చేస్తారు? గుండె, మూత్రపిండాలు, మెదడు సంబంధిత శస్త్ర చికిత్సలు,క్యాన్సర్ చికిత్స(కీమో థెరపీ,రేడియో థెరపీ మరియు శస్త్ర చికిత్సలు ),కాలిన గాయాల చికిత్స,ఇతర గాయాల శస్త్ర చికిత్సలు (మోటార్ వాహనాల చట్టం పరిధిలోనివి కాకుండా) మరియు పూర్తి చెవుడు ఉన్న పిల్లలకు (ఆరు సంవత్సరముల లోపు) అవసరమయ్యే 210 రకాల పెద్ద ఆపరేషన్లు మరియు చికిత్సలు అన్నీ కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయి (జాబితా చూడండి).అన్ని వివరాలతో కూడిన జాబితా మీ పి.హెచ్.సి వైద్యుని వద్ద అందుబాటులో ఉంటుంది.' ఆరోగ్యమిత్ర 'ఈ విషయంలో మీకు సహాయాన్ని అందించగలరు. శస్త్ర చికిత్స ఎక్కడ పొందవచ్చు? నెట్ వర్క్ ఆసుపత్రులు అన్నింటిలోనూ శస్త్ర చికిత్స చేయించుకోవచ్చు. ఈ జాబితా మీకు ఇవ్వబడుతుంది మరియు పి.హెచ్.సి వైద్యునివద్ద అందుబాటులో ఉంటుంది.' ఆరోగ్యమిత్ర 'ఈ విషయంలో మీకు సహాయాన్ని అందించగలరు. నేను ఈ పథకం క్రింద లబ్ధి పొందాలంటే ఎవరిని సంప్రదించాలి? మీకు పైన ఉదహరించిన జబ్బులకు సంబంధించిన లక్షణాలు (సామాన్య లక్షణాల జాబితా చూడండి) ఉన్నట్టయితే మీరు మీ హెల్త్ కార్డ్ తో పాటు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం/ఏరియా ఆసుపత్రి/జిల్లా ఆసుపత్రులలోని ' ఆరోగ్యమిత్ర ' లేదా డాక్టర్ ను సంప్రదించాలి. లేదా మీకు దగ్గరలో నెట్ వర్క్ ఆసుపత్రి నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో సంప్రదించవచ్చు. ఆసుపత్రికి నేను ఏమైనా డబ్బులు కట్టాల్సి ఉంటుందా? లేదు.ఆసుపత్రి వారికి నయాపైస కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీకున్న ఆరోగ్యసమస్య పథకం పరిధిలోకి వస్తే ఎలాంటి చెల్లింపులు లేకుండానే చికిత్స జరుపుతారు. మీకు సంబంధించినంత వరకు ఆసుపత్రి సేవలన్నీ ఉచితమే! ఈ ఆసుపత్రులలో సరైన చికిత్స లభిస్తుందా? అవును. ఈ ఆసుపత్రులన్నింటిలోను మీపేరు నమోదు చేసుకొనేందుకు,మిమ్మల్ని చేర్చుకునేందుకు ప్రత్యేక ఆరోగ్య మిత్ర కౌంటర్లు ఉంటాయి. మీ శస్త్ర చికిత్సలకు ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో నాకు సహాయపడేది ఎవరు? అన్ని స్థాయిల్లో మీ ' ఆరోగ్యమిత్ర ' మీకు పూర్తి సహాయం అందిస్తారు. ఆరోగ్యపరీక్షల అనంతరం నాకు శస్త్రచికిత్స అవసరం లేదని రుజువైతే ఏంజరుగుతుంది? అప్పుడు కూడా మీరు ఆసుపత్రికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పైన తెలిపిన వ్యాధులు నాకున్నట్టు ఎలా తెలుసుకోవడం? మీలో వ్యాధి లక్షణాలు ఏవైనా ఉంటే (సామాన్య లక్షణాల జాబితా చూడండి) ఈ క్రింది ఆసుపత్రులకు వెళ్లవచ్చు. మీ సమీపంలోని పి.హెచ్.సి./ప్రభుత్వ ఆసుపత్రి - పరీక్షలు మరియు పెద్ద ఆసుపత్రికి పంపే నిమిత్తం. మీ వ్యాధి ఇదివరకే నిర్ధారణ అయి ఉంటే లేక అత్యవసర పరిస్థితుల్లో మీరు నేరుగా నెట్ వర్క్ ఆసుపత్రికి వెళ్లవచ్చు. మీకు సమీపంలోని నెట్ వర్క్ ఆసుపత్రి నిర్వహించే ఆరోగ్య శిబిరాలకు మీరు హాజరు కావచ్చు. ఈ విషయంలో మీకు సరైన సలహాలు, సూచనలు అందించేందుకు గాను ఆరోగ్య కేంద్రాలన్నిటిలోను ' ఆరోగ్యమిత్ర ' లను నియమించడమైనది. ఇందుకు సంబంధించి ఆరోగ్య శిబిరాలేమైనా నిర్వహిస్తుంటారా? అవును.నెట్ వర్క్ ఆసుపత్రులు సంవత్సరం పొడవునా మీకు దగ్గరలో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ శిబిరాలలో స్పెషలిస్ట్ వైద్యులు మీకు రోగానికి సంబంధించిన ప్రాథమిక పరీక్షలు (వైద్య పరీక్ష, ఇసిజి,ఇకో,అల్ట్రా సౌండ్ మొదలగున్నవి) నిర్వహించి ప్రాథమిక రోగ నిర్థారణ జరుపుతారు. ఇంకా అవసరమైన రోగులను ప్రత్యేక పరీక్షలకై/ఆపరేషన్ కొరకు రెఫరల్ కార్డు అందజేస్తారు. ఈ కార్డు సహాయంతో మీరు నెట్ వర్క్ ఆసుపత్రిలో చికిత్సకై చేరవచ్చు. ఈ శిబిరాలకు సంబంధించిన సమాచారం ఆరోగ్యమిత్ర వద్ద పొందవచ్చు. ఈ పథకం క్రింద బీమాకవరేజి ఏమేరకు లభిస్తుంది? ఈ పథకం క్రింద మీ కుటుంబానికి లక్షన్నర రూపాయల బీమా లభిస్తుంది. మరియు అవసరమైనచో అదనంగా యాబై వేల రూపాయలు ప్రత్యేక కమిటి సూచించినట్టయితే ఇవ్వబడుతుంది. ఇందులో కొంత మొత్తం కుటుంబంలోని ఒక వ్యక్తి పేర ఉపయోగించుకున్నట్టయితే మిగిలిన మొత్తం ఇతర కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. ఈ బీమా సౌకర్యం ఎన్నాళ్ల వరకు కొనసాగుతుంది? 05-12-07 నుండి ఈ పథకం అమలులో ఉంటుంది. బీమా ఒక సంవత్సరం పాటు అందుబాటులో ఉంటుంది. "ఆరోగ్యశ్రీ ట్రస్ట్" అంటే ఏమిటి? ఈ బీమా పథకాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఇది. అత్యవసర పరిస్థితుల్లో ఏమి చేయాలి? ఏ నెట్ వర్క్ ఆసుపత్రికైనా మీరు నేరుగా వెళ్లవచ్చు.తర్వాత ' ఆరోగ్యమిత్ర 'సహాయం తీసుకోవాలి. ఈ పథకం ఎవరి పర్యవేక్షణలో అమలవుతుంది? జిల్లాస్థాయిలో జిల్లా కలెక్టరు,రాష్టస్థాయిలో ట్రస్టు ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తారు. ఏదైనా వివాదం తలెత్తితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఆసుపత్రుల్లోని ' ఆరోగ్యమిత్ర ' ఈ విషయంలో మీకు సహాయమందిస్తారు.తదుపరి అవసరమైతే జిల్లా కో ఆర్డినేటర్ మీకు సహాయమందిస్తారు. అప్పటికి మీ సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా వైద్య ఆరోగ్య అధికారి లేక జిల్లా ఫిర్యాదుల విభాగం చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ ను సంప్రదించవచ్చు. ఈ పథకం క్రింద ప్రభుత్వం నాకు అందిస్తున్నది ఏమిటి? ఈ పథకం క్రింద ప్రభుత్వం మీ కుటుంబానికి ఖరీదైన శస్త్ర చికిత్సలకు సంబంధించిన బీమా సౌకర్యాన్ని సమకూరుస్తున్నది. మీకు అత్యుత్తమమైన వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నది. ప్రభుత్వం మీ ప్రీమియం ను చెల్లిస్తున్నది. ఈ పథకం సాఫీగా సజావుగా సాగేందుకు ఒక స్వతంత్ర ట్రస్టును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆధునిక మరియు నాణ్యమైన వైద్య సౌకర్యాలను మీకు చేరువలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఈ పధకం క్రింద బీమా కంపెనీ నాకు అందిస్తున్నది ఏమిటి? బీమా కంపెనీ మీ కుటుంబానికి బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. నెట్ వర్క్ ఆసుపత్రికి వెళ్లేందుకు వీలుగా ' ఆరోగ్యమిత్ర 'సేవల ద్వారా మీకు సలహాలు, సూచనల సౌకర్యం కల్పించింది.మీకు సమీపంలో తగిన సౌకర్యాలతో కూడిన నెట్ వర్క్ ఆసుపత్రిని ఎంపిక చేసి పెడుతుంది.ఆరోగ్యమిత్ర ద్వారా నెట్ వర్క్ ఆసుపత్రిలో మీకు తగిన చికిత్స, సక్రమంగా లభించేలా జాగ్రత్తలు తీసుకుంటుంది.నెట్ వర్క్ ఆసుపత్రులలో నగదు చెల్లింపుల అవసరం లేకుండా చూస్తుంది. ఈ పథకం గురించి ప్రచారం చేస్తుంది. ఈ పథకం క్రింద నెట్ వర్క్ ఆసుపత్రి నాకు సమకూర్చేదేమిటి? నెట్ వర్క్ ఆసుపత్రి మీకు తగిన సలహాలు,సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా రిసెప్షన్ మరియు రిజిస్ట్రేషన్ కౌంటర్ ను ఏర్పాటు చేస్తుంది. స్పెషలిస్టు ద్వారా మీకు వైద్య పరీక్షలు జరిపిస్తుంది. మీ వ్యాధి నిర్ధారణకు అవసరమైన అన్ని ఇతర పరీక్షలను నిర్వహిస్తుంది.మీకు ప్రత్యేక వార్డును సమకూరుస్తుంది.మీకు అవసరమైన శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుంది. మీ గ్రామానికి సమీపంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తుంది. శస్త్ర చికిత్సల జాబితా గుండె ఆపరేషన్ లు గుండెకు చేసే బైపాస్ సర్జరి గుండె కవాటాల మార్పిడి గుండె కవాటాలు బాగు చేయుట పుట్టుకతో వచ్చే గుండె లోపాలు యాంజియోప్లాస్టీ మూత్రపిండాల శస్త్ర చికిత్సలు మూత్రపిండాల మార్పిడి మూత్రపిండాలలో రాళ్లు తొలగించే ఆపరేషన్లు క్యాన్సర్ కీమో థెరపీ రేడియో థెరపీ అన్ని రకాల క్యాన్సర్ సంబంధిత ఆపరేషన్లు మెదడుకు సంబంధించి మెదడులో కంతి (బ్రైన్ ట్యూఅమర్) మెదడులో చేరిన నీటిని తొలగించే ఆపరేషన్ మెదడులో స్రవించిన రక్తాన్ని తొలగించే ఆపరేషన్ మెదడుకు అయ్యే గాయాల ఆపరేషన్ వెన్నెముక ఆపరేషన్లు మొదలగున్నవి. కాలిన గాయాలు 30 శాతం పైనవున్న కాలిన గాయాలకు చికిత్స గాయాలు ప్రమాదాలలో జరిగే గాయాలకు శస్త్ర చికిత్స (మోటర్ వాహానాల చట్టం పరిధిలోనివి కాకుండా) పిల్లల్లో పూర్తి చెవుడు (ఆరు సంవత్సరములలోపు) కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స ఆడిటరి వర్బల్ థెరపీ గుండె ఎడమ చాతీలో నొప్పి,చెమటలు పోయడం, ఎడమభుజంలోనూ నొప్పి రావడం కొద్ది దూరం నడవగానే ఆయాసం తల తిరగడం మెదడు తీవ్రమైన తలనొప్పి, వాంతులు వస్తువులు రెండుగా కనబడడం చిన్న పిల్లల్లో మూర్ఛ వ్యాధి ఫిట్స్ (మూర్ఛ) క్యాన్సర్ నాలుకపై నెలల తరబడి మానని పుండు శరీరంపై మానని పుండ్లు అతిగా పెరుగుతున్న నొప్పిలేని కంతి రొమ్ములో కంతి ఎడతెగని దగ్గు,కళ్లెలో రక్తం పడడం బహిష్టు నిలిచిపోయిన చాలాకాలం తరువాత మళ్లీ బహిష్టు రావడం మూత్రపిండాలు కాళ్లు,శరీరం,పొట్ట లావెక్కటం మూత్రం అతిగా లేక కొద్దిగా రావటం పిల్లలలో పూర్తి చెవుడు మూడు నెలల పిల్లవాడు వెలుతురు చూసినా కళ్ళు మిటకరించకపోవడం నాలుగు నెలల పిల్లవాడు శబ్దం విన్నా తల తిప్పకపోవడం మల్టీ స్పెషాలిటి ఆసుపత్రులు మల్టీ స్పెషాలిటి ఆసుపత్రులు(గుండె,మూత్రపిండాలు,న్యూరోసర్జరీ,కాలిన గాయాలు,ప్రమాద గాయాలు)హైదరాబాద్ ఆదిత్య హాస్పిటల్ కింగ్ కోటి మల్టీ స్పెషాలిటి(గుండె తప్ప) అపోలో హాస్పిటల్ డి.ఆర్.డి.వో మల్టీ స్పెషాలిటి అపోలో హాస్పిటల్ విక్రంపురి మల్టీ స్పెషాలిటి బాలాజీ హాస్పిటల్ మేడ్చల్,సికింద్రబాద్ మల్టీ స్పెషాలిట్(గుండె తప్ప) కేర్ హాస్పిటల్ నాంపల్లి మల్టీ స్పెషాలిటి కేర్ హాస్పిటల్సికింద్రాబాద్ మల్టీ స్పెషాలిటి కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్ మల్టీ స్పెషాలిటి దుర్గాబాయ్ దేశ్ ముఖ్హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ విద్యానగర్ మల్టీ స్పెషాలిటి గాంధి హాస్పిటల్ ముషిరాబాద్,సికింద్రాబాద్ మల్టీ స్పెషాలిటి జెనిసిస్ హాస్పిటల్బషీర్ బాగ్ మల్టీ స్పెషాలిటి(గుండె తప్ప) గ్లోబల్ హాస్పిటల్ లక్డికాపూల్ మల్టీ స్పెషాలిటి గ్లోబల్ హాస్పిటల్ బంజారాహిల్స్ మల్టీ స్పెషాలిటి ఇమేజ్ హాస్పిటల్ అమీర్ పేట్ మల్టీ స్పెషాలిటి ఇమేజ్ హాస్పిటల్ మాధాపూర్ మల్టీ స్పెషాలిటి ఇన్నోవ చిల్డ్రన్ హార్ట్ సెంటర్తార్నాక పిల్లల గుండె శస్త్ర చికిత్సలు కామినేని వాకార్డ్ హాస్పిటల్కింగ్ కోఠి,ఆబిడ్స్ మల్టీ స్పెషాలిటి కామినేని హాస్పిటల్ ఎల్.బి.నగర్ మల్టీ స్పెషాలిటి కామినేని వాకర్డ్ హార్ట్ సెంటర్, ఎల్.బి.నగర్ గుండె శస్త్ర చికిత్సలు కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మినిస్టర్ రోడ్ మల్టీ స్పెషాలిటి లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్ లక్డికపుల్ పిల్లల ఆసుపత్రి (గుండె తప్ప) మహావీర్ హాస్పిటల్ మాసాబ్ ట్యాంక్ మల్టీ స్పెషాలిటి మెడిసిటి హాస్పిటల్ సెక్రటేరియట్ రోడ్ మల్టీ స్పెషాలిటి మెడ్విన్ హాస్పిటల్ నాంపల్లి మల్టీ స్పెషాలిటి నిమ్స్ హాస్పిటల్ పంజాగుట్టమల్టీ స్పెషాలిటి రేయిన్ బో హాస్పిటల్ బంజారాహిల్స్ పిల్లల ఆసుపత్రి (గుండె తప్ప) ఉస్మానియా హాస్పిటల్, అప్జల్ గంజ్ మల్టీ స్పెషాలిటి ఉషా మోహన్ హాస్పిటల్ హైదర్ గూడ మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) పౌలోమిహాస్పిటల్ ఇ.సి.ఐ.యల్,సికింద్రాబాద్ మల్టీస్పెషాలిటి రెమిడీ హాస్పిటల్ బాలానగర్ మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) సాయి భవాణి హాస్పిటల్ షాపూర్ నగర్ మల్టీస్పెషాలిటి ఎస్.వి.ఆర్.సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ అమీర్ పేట్, మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) శ్రీ సాయి కమలా హాస్పిటల్ దిల్సుఖ్ నగర్ మల్టీ స్పెషాలిటి 33.సాయి వాణి హాస్పిటల్ లిమిటెడ్ దోమల్ గూడా మల్టీ స్పెషాలిటి (గుండెతప్ప) శ్రవణ మల్టి స్పెషాలిటిఎం.జే మార్కెట్ మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) సిగ్మా హాస్పిటల్, సికింద్రాబాద్, మల్టీ స్పెషాలిటి శ్రీ సాయి శ్రీనివాస స్పెషాలిటి హాస్పిటల్ నారాయణ గూడ మల్టీ స్పెషాలిటి (గుండెతప్ప) విజయా హెల్త్ కేర్, కుమ్మరిగూడ,సికింద్రాబాద్, మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) వుడ్ ల్యాండ్ హాస్పిటల్ బర్కత్ పుర మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) యశోద హాస్పిటల్, మలక్ పేట మల్టీ స్పెషాలిటి మెడిసిటి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఘనాపూర్,మేడ్చెల్ మల్టీ స్పెషాలిటి విశాఖపట్నం అపోలో హాస్పిటల్ సిరిపురం మెయిన్ రోడ్, మల్టీ స్పెషాలిటి కేర్ హాస్పిటల్ సిరిపురం మెయిన్ రోడ్ మల్టీ స్పెషాలిటి కళా హాస్పిటల్, ద్వారకానగర్, మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) కళావతి సర్జికల్,ల్యాప్రోస్కోపిక్ సెంటర్ విశాఖపట్నంమల్టీ స్పెషాలిటి(గుండెతప్ప) కింగ్ జార్జ్ హాస్పిటల్, జగదాంబ జంక్షన్, మల్టీ స్పెషాలిటి క్వీన్స్ ఎన్.ఆర్.ఐ హాస్పిటల్, గురుద్వారా రోడ్ మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) లాజరస్ హాస్పిటల్ విశాఖపట్నంమల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) సెవన్ హిల్స్ హాస్పిటల్ రాక్ డేల్ లేఅవుట్, మల్టీ స్పెషాలిటి శ్రీ సూర్య హాస్పిటల్ మహారాణి పేట్ మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) సింహాద్రి హాస్పిటల్మహారాణి పేట్విశాఖపట్నం తిరుమల హాస్పిటల్ విజయనగరం, మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) మహారాజ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, నెల్లిమర్ల మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) విజయవాడ కేర్ హాస్పిటల్, సిద్ధార్ధ నగర్ మల్టీ స్పెషాలిటి హెల్ప్ హాస్పిటల్ యం.జి రోడ్, మల్టీ స్పెషాలిటి చరితశ్రీ హాస్పిటల్ లిమిటెడ్, నక్కల్ రోడ్, మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) సిటీ కార్డియాక్ సెంటర్, విజయవాడగుండె శస్త్ర చికిత్సలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) నాగార్జున హాస్పిటల్ కానూరు మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) పూర్ణ హార్ట్ ఇనిస్టిట్యూట్ సూర్యారావు పేట గుండె శస్త్ర చికిత్సలు ఉషా కార్డియాక్ సెంటర్ లబ్బిపేట, గుండె శస్త్ర చికిత్సలు కర్నూల్ గౌరి గోపాల్ హాస్పిటల్ హంద్రిరివర్,కర్నూల్ మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) విశ్వభారతి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ గాయత్రి ఎస్టేట్ మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) ఆర్.ఆర్.హాస్పిటల్ కర్నూల్ మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) విజయ హాస్పిటల్ కర్నూల్మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) అనంతపురం పావని హాస్పిటల్ సాయినగర్,అనంతపురం మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) ఏలూరు ఆశ్రం హాస్పిటల్ ఏలూరు మల్టీ స్పెషాలిటి చిత్తూరు అపోలో హాస్పిటల్ అరగొండ. కాలిన,ప్రమాద గాయాలు నెల్లూరు బొల్లినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు మల్టీ స్పెషాలిటి నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, నెల్లూరు మల్టీ స్పెషాలిటి గుంటూరు లలితా హాస్పిటల్గుంటూరు మల్టీ స్పెషాలిటి కరుమారి మల్టీ స్పెషాలిటి హాస్పిటల్, గుంటూరు మల్టీ స్పెషాలిటి ఎన్.ఆర్.ఐ అకాడమి హాస్పిటల్ గుంటూరు మల్టీ స్పెషాలిటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుమల్టీ స్పెషాలిటి వీణ హాస్పిటల్ గుంటూరు గుండె శస్త్ర చికిత్సలు రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్రాజమండ్రి మల్టీ స్పెషాలిటి జి.యస్.ఎల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, రాజమండ్రిమల్టీ స్పెషాలిటి బొల్లినేని హార్ట్ సెంటర్, రాజమండ్రిమల్టీ స్పెషాలిటి రాజు న్యూరో,మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రాజమండ్రి మల్టీ స్పెషాలిటి (గుండెతప్ప) భీమవరం వర్మ హార్ట్ కేర్ నెంటర్ భీమవరం గుండె శస్త్ర చికిత్సలు మహబూబ్ నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహాబూబ్ నగర్ కాలిన గాయాలు మాత్రమే వరంగల్ జయ హాస్పిటల్, వరంగల్ మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) కాకినాడ అపోలో హాస్పిటల్, కాకినాడమల్టీ స్పెషాలిటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడమల్టీ స్పెషాలిటి శ్రీ సాయి రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ కాకినాడ మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) నల్లగొండ కామినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నార్కెట్ పల్లి మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిమల్టీ స్పెషాలిటి రష్ హాస్పిటల్, తిరుపతిమల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) ఎస్.వి.ఆర్.ఆర్.హాస్పిటల్, తిరుపతి మల్టీ స్పెషాలిటి శ్రీ రమాదేవి మల్టీ స్పెషాలిటి హాస్పిటల్ తిరుపతి మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) అమలాపురం కోనసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అమలాపురం మల్టీ స్పెషాలిటి (గుండె తప్ప) క్యాన్సర్ చికిత్స చేసే ఆసుపత్రులు హైదరాబాద్ అపోలో హాస్పిటల్, జుబ్లీ హిల్స్క్యాన్సర్ ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సోమాజిగూడ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ క్యాన్సర్ బిబి క్యాన్సర్ హాస్పిటల్ మలక్ పేట్, క్యాన్సర్ ఇండోఅమెరికన్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ బంజారాహిల్స్ క్యాన్సర్ మెడ్విన్ హాస్పిటల్, హైదరాబాద్ క్యాన్సర్ కామినేని హాస్పిటల్ ఎల్.బి.నగర్, క్యాన్సర్ నిమ్స్ హైదరాబాద్ పంజాగుట్టక్యాన్సర్ సౌమ్య హాస్పిటల్ ఖార్ఖాన,సికింద్రాబాద్, క్యాన్సర్ యశోద హాస్పిటల్సికింద్రాబాద్, క్యాన్సర్ గవర్నమెంట్ మెటర్నిటి హాస్పిటల్ సుల్తాన్ బజార్,కోఠి స్త్రీల క్యాన్సర్ గవర్నమెంట్ మెటర్నిటి హాస్పిటల్ నయాపుల్ స్త్రీల క్యాన్సర్ కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మినిస్టర్ రోడ్ క్యాన్సర్ నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, నెల్లూరు క్యాన్సర్ విశాఖపట్నం మహాత్మగాంధి క్యాన్సర్ హాస్పిటల్, విశాఖపట్నం, క్యాన్సర్ కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం క్యాన్సర్ లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్, విశాఖపట్నంక్యాన్సర్ విజయవాడ సిటి క్యాన్సర్ సెంటర్ విజయవాడక్యాన్సర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, విజయవాడ క్యాన్సర్ మణిపాల్ సూపర్ స్పెషాలిటి హాస్పిటల్, విజయవాడ క్యాన్సర్ గుంటూరు బాలాజి క్యాన్సర్ కేర్ సెంటర్ గుంటూరుక్యాన్సర్ గుంటూర్ క్యాన్సర్ కేర్ సెంటర్, గుంటూరుక్యాన్సర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు క్యాన్సర్ రాజమండ్రి జి.యస్.ఎల్.మెడికల్ కాలేజ్ హాస్పిటల్ రాజమండ్రి క్యాన్సర్ వరంగల్ సేయింట్ ఆన్స్ క్యాన్సర్ సెంటర్, వరంగల్ క్యాన్సర్ కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడక్యాన్సర్ క్రిస్టియన్ క్యాన్సర్ హాస్పిటల్, కాకినాడ క్యాన్సర్ భీమవరం మహాత్మా గాంధి క్యాన్సర్ హాస్పిటల్ భీమవరంక్యాన్సర్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యాట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిక్యాన్సర్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్, తిరుపతి స్త్రీల క్యాన్సర్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్లు చేసే ఆసుపత్రులు హైదరాబాద్ అపోలో హాస్పిటల్, జుబ్లీ హిల్స్ చెవుడు వాసవి హాస్పిటల్ ఖైరతాబాద్ చెవుడు గుంటూరు ఇ.యన్.టి నర్సింగ్ హొంకొత్తపేట ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్మున్సిపల్ కాంప్లెక్స్,3వ అంతస్తు,మెటర్నిటి హాస్పిటల్ పక్కన,సుల్తాన్ బజార్,కోఠి,హైదరాబాద్ - 500 095ఫోన్:040-24652478,24652540 ఫ్యాక్స్:24657715http://www.aarogyasri.gov.inహెల్ప్ లైన్ టోల్ ప్రీ:1800 - 425 - 7788 జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమము వైద్య,ఆరోగ్య శాఖ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం“కార్నియా అంధత్వం వలన నిమిషానికి ఒక శిశువు కంటి చూపు కోల్పోతుంది,దీనికి పరిష్కారంమీవద్దే ఉంది”.“నేత్ర దానంచేయండి. చేయించండి “. కార్నియల్ (కంటి నల్లగ్రుడ్డు పైన పారదర్శకంగా ఉండే పొర) అంధత్వం అంటే ఏమిటి? కంటి కనుపాప పైన అద్దంలాగ ఉండే పొరని 'కార్నియా' అంటారు. వ్యాధి లేదా గాయం వంటి ఏ కారణం చేతనైనా కార్నియా స్వచ్చత పాడై పోయినట్టయితే, కంటి చూపు ఆశ్చర్యం కలిగించేంతగా తగ్గిపోవడం లేదా పూర్తిగా పోవడం జరుగుతుంది. కార్నియా దృష్టిహీనతకి ముఖ్య కారణాలు దెబ్బ లేదా గాయం కావడం పోషకాహార లోపం అంటువ్యాధి సంభవించటం రసాయనిక చర్యల వల్ల జరుగు ప్రమాదాలు వంశపారంపర్యత వలన ఆపరేషన్ తరువాత కాంప్లికేషన్స్ లేదా ఇన్ ఫెక్షన్ వలన అదృష్టవశాత్తు,పోగొట్టుకున్న కంటి చూపును చికిత్స చేయడం ద్వారా తిరిగి పొందవచ్చును. దీనికి గాను దానం చేయబడిన నేత్రం ద్వారా కార్నియా మార్పిడి చేయబడుతుంది. మీరు నేత్రదానానికి సంబంధించి మద్దతు ఇవ్వవచ్చును. నేత్రదానాన్ని మీ కుటుంబపు సంప్రదాయంగా చేసుకోండి. మీకు అత్యంత ప్రేమ పాత్రులైన వారి కళ్ళను దానం చేయండి. వీటిని దానం చేయడానికి వయసుకి సంబంధించి ఎటువంటి పరిమితులు లేవు. ఏ వ్యకి అయినా స్త్రీ కానీ, పురుషుడు కానీ ఏ మతానికి చెందిన వారైనా సరే నేత్రదానం చేస్తున్నట్టు ప్రకటించినా, ప్రకటించకపోయినా కళ్ళని దానం చేయవచ్చు, నేత్రదానం చేసేందుకు సమీపంలోని కంటి బ్యాంక్ వారిని సంప్రదించండి. కళ్ళజోడు పెట్టుకొనేవారు, మధుమేహం, అధిక బ్లడ్ ప్రెషర్,ఉబ్బసం వ్యాధులతో బాధపడేవారు కూడా నేత్ర దానం చేయవచ్చు. కంటి శుక్లాల(కెటరాక్ట్) ఆపరేషన్ చేయించుకొన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చును.ఈ దానం చేసేందుకు గల ఒకే ఒక షరతు ఏమిటంటే కార్నియా స్వచ్చంగా ఆరోగ్యంగా ఉండాలి. మరణించిన మీకిష్టమైన వ్యక్తుల కళ్ళని దానం చేయండి. ఒకరు నేత్రదానం చేయడంవల్ల,ఇద్దరికి కంటి చూపు లభిస్తుంది. నేత్రదానాన్ని అన్ని మతాలు ఆమోదించాలి. మరణించిన 6 నుండి 8 గంటల లోపు నేత్రాలను తీయవలసి ఉంటుంది. అందుచేత దగ్గరలోని కంటి బ్యాంక్ వారికి కబురు పెట్టడంలో జాప్యం చేయకండి. మీరు సకాలంలో నేత్రదానం జరిగేలా చూడటంలో ముఖ్య భూమిక నిర్వహించగలరు. మీ కుటుంబంలో గానీ లేదా మీకు బాగా తెలిసిన కుటుంబంలో గానీ దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తె,అతి దగ్గరలోని కంటి బ్యాంక్ వారికి తెలియచేయడం మర్చిపోకండి.మరణించిన వ్యక్తి తన నేత్రాలను దానం చేస్తున్నట్టు ఇదివరకే ప్రతిజ్ఞ చేసినా, చేయకపోయినా సరే, ఆ కుటుంబం వారి అనుమతితో కూడా కళ్ళను తీసుకోవచ్చును. కంటి బ్యాంక్ సిబ్బంది డాక్టర్ ని లేదా శిక్షణ పొందిన టెక్నీషియన్ ని తీసుకొని దానకర్త ఇంటికి వస్తారు. ఇది ఉచితంగా లభించే సేవ. మరణించిన వ్యక్తివద్ద ఫ్యాన్ లు ఆపేయండి. ఇంటిలో ఎయిర్ కండిషనర్ గానీ కూలర్ గానీ ఉంటే ఆన్ చేసే ఉంచండి.తడిపిన దూదిని, ఐస్ తో బాటు మూయబడిన కంటి మీద ఉంచండి. తలక్రింద తలగడ పెట్టి తల ఎత్తుగా ఉండేలా చూడండి.దీనివల్ల టిష్యూ తడిగా ఉంచడంలో సహాయపడుతుంది. నేత్రదానం చేసిన వ్యక్తినుండి రక్త పరీక్షకుగాను 10 మి.లీ. రక్తాన్ని తీస్తారు. శిక్షణ పొందిన వ్యక్తి స్టెరైల్ పద్ధతి ద్వారా కళ్ళను బయటకు తీస్తారు. దీని వల్ల ముఖం పైన ఎలాంటి మచ్చపడదు, ముఖం వికృతంగా మారదు. నేత్రదానం వల్ల ఇద్దరు దృష్టిహీనులకు నేత్రజ్యోతి లభిస్తుంది.ఎందుకంటే అంధత్వంగల ఒక వ్యక్తికి, దానంగా లభించిన ఒక కన్నుని మాత్రమే దానంగా ఇవ్వడం జరుగుతుంది. కంటిబ్యాంక్ లో టిష్యూని పరీక్ష చేసిన పిదప సముచిత చర్య తీసుకొంటారు. వీలైనంత త్వరలో కార్నియా మార్పిడి కోసం ఉపయోగిస్తారు. కంటి బ్యాంక్ లో గల వెయిటింగ్ లిస్ట్ ప్రకారం అవసరమున్న రోగికి కబురు పెట్టడం జరుగుతుంది. అత్యవసర కేసులలో నిర్ణీత నిబంధనల ప్రకారం చర్యతీసుకోవడం జరుగుతుంది. దానం చేయబడిన నేత్రాలను ఎన్నడూ అమ్మడం జరగదు.కార్నియా పొందిన వ్యక్తి పేరు ఎల్లప్పుడు రహస్యంగా ఉంచుతారు. అయితే,నేత్రదానం చేసిన కుటుంబం వారు ఈ కళ్ళని,కంటి చూపు లేని ఇద్దరు వ్యక్తుల నేత్రజ్యోతిని వెలిగించేందుకు వినియోగించబడ్డాయని తెలుసుకుని మరింత సంతోషించాలి. కంటి దానం చేయండి - కలకాలం జీవించండి! Eye Banks/ eye Donation Centres in Andhra Pradesh Hyderabad: T.L. Kapadia Eye Bank, c/o Sarojini Devi Eye Hospital. Ph (040) 23317274 Ramayamma International Eye Bank , Ph: (040) 2354266, 2608262 S.L. Mishra Memorial Eye Bank. Ph: (040) 23221094 Chiranjivi Eye & Blood Research & Dev. Center ,Ph: (040) 23533214 Lakshmamma Eye Bank c/o Dr. R.R. Lions Eye Hospital,Ph:040- 27706497 Kakinada: Sri Kiran Institute of Ophthalmology. Ph: (0884) 2306801 Khammam : The Khammam Eye Bank, Ph: (08742) 223756 Karimnagar : Lions club of Karimnagar Eye Bank, Ph: (08722) 282273 Nizamabad : V.T. Thaakur Memorial Lions Eye Bank, Ph: (08468) 222646 Mahabubnagar: Kakatiya Eye Clinic,Ph: (08542) 242505, 243989 West Godavari: R.R. Lions Eye Hospital, Palkol , Ph: 08814-222879/225299Smt. Rajeswari Ramakrishnan Eye Bank, NidadavolePh : 08813 - 222000 Ongole : Ongole Eye Bank, Ph:(08592)233767,231488Lions Citizens Society Eye Bank, Ph:(08592)239069 Puttaparthi : Sri Satya Sai Institute of higher Medical Science,Ph: (08555) 287388, 287551-3 Suryapet : Lions Club of Suryapet Eye Hospital, Ph(08684) 220389 Vijayawada : Aravind Eye Bank, Ph : (0866) 2433018Swetcha Gora Eye Bank, Ph : (0866) 2470966, 2472330 Visakhapatnam : Netra Eye Bank Rotary Netra Eye HospitalPh: (0891) 2546915, 2546413Mohisin Eye Bank, Ph: (0891) 2714000Visakha Eye Hospital, Ph: (0891) 2566383, 2566385 Kadapa : Kadapa Eye Bank, Kadapa. Ph: (08562) 257089 Eye Donation centersGovernment Distric Head Quarter Hospitals & Teaching Institutions"నేత్రదానం"మీ కుటుంబ సాంప్రదాయంగా చేసుకోండివివరాలకు:National Programme for Control of Blindness, Ph: 040-2354 5454Director of Health, Koti, Hyderabad, Ph: 040-2460 6892, 2460 0287 మాతా శిశు ఆరోగ్యానికి కుటుంబ సంక్షేమ పథకాలు కుటుంబ సంక్షేమ శాఖ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుఖీభవ జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం ఆరోగ్య రక్ష నెల వయస్సు లోపు పిల్లల ఆరోగ్య సంరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఏటా జన్మించే ప్రతి 1000 మంది శిశువులలో 53 మంది ఏడాది వయస్సులోపల చనిపోతున్నారు. వారిలో 43 మంది ఒక నెల వయస్సు లోపల చనిపోతున్నారు. ఈ మరణాలను అరికట్టడానికై అప్పుడే పుట్టిన బిడ్డల ఆరోగ్యం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు తల్లిదండ్రులకు తెలియజేయడం కోసం ప్రత్యేక అవగాహనా కార్యక్రమం రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో 29 జనవరి - 3 ఫిబ్రవరి 2007 తేదీలలో నిర్వహించబడుతుంది. నెల వయస్సు లోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణాలు పుట్టిన బిడ్డ చాలా తక్కువ బరువుతో పుట్టడం నెలలు నిండక ముందే కాన్పు జరగడం పుట్టిన వెంటనే బిడ్డ శ్వాస తీసుకోలేకపోవడం లేదా ఏడవలేకపోవడం పుట్టిన వెంటనే బిడ్డకి ముర్రుపాలు త్రాగించకపోవడం. కాన్పు సమయంలో తగిన శుభ్రతలు పాటించకపోవడం వలన, పుట్టిన బిడ్డ ఇన్ ఫెక్షన్ (వ్యాధి కలిగించే సూక్ష్మజీవులు)బారినపడడం కాన్పు సమయంలో ఏర్పడిన కష్టమైన పరిస్దితుల వలన పుట్టబోయే బిడ్డ దెబ్బతినడం దాని వలన మరణించడం. తక్కువ బరువుతో పుట్టిన బిడ్డలకు తల్లి పాలు త్రాగించేటప్పుడు, సరియైన పద్దతిలో తాగించకపోవడం వలన పొలమారి, శ్వాస ఆడక మరణించడం. బిడ్డను పుట్టినప్పటి నుంచి వెచ్చగా ఉంచకపోవడం, దీని వలన బిడ్డ శరీరం వేడి కోల్పయి, ప్రాణాపాయం కలగడం. గర్బిణీ సమయంలో తల్లిలో పౌష్టికాహార లోపం. కాన్పు కై ఆసుపత్రికి తీసుకువెళ్ళక పోవడం,ఇంటిలోనే కాన్పును జరిపించడం. నెల వయస్సు లోపు పిల్లల మరణాలను నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు పుట్టినప్పుడు 1.5 కిలోలు కన్నా బరువు తక్కువ ఉండే పిల్లల ను వైద్య నిపుణలు ఉండే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి. బిడ్డ పుట్టిన అరగంటలోపు బిడకు తల్లి రొమ్ము అందించి ముర్రుపాలు పట్టాలి. నెలల వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. బిడ్డ అనారోగ్యంగా ఉన్నా తల్లి పాలు పట్టండి. పాలు పట్టక ముందు సాధారణంగా గ్లూకోజు నీరు, చక్కెర నీరు, తేనేలాంటివి త్రాగిస్తారు. అవి చాలా ప్రమాదకరం. ఇవి అవసరం లేదు. వీటిని త్రాగించవద్దు. స్త్రీలకు ఆముదం త్రాగించవద్దు. బిడ్డలకు చెవుల్లో, ముక్కుల్లో నూనె వేయవద్దు. నుదుటి పైన , శరీరంలో ఇంకెక్కడ కూడా చుట్ట / కడ్డీ, సూది వగైరాలతో కాల్చవద్దు.ఎలాంటి నాటు మందులు త్రాగించవద్దు. తల్లిదండ్రులు పసిపిల్లల్లో జాగ్రత్తగా గమనించవలసిన కొన్ని ప్రమాదకరమైన అనారోగ్య లక్షణాలు పుట్టిన 24 గంటలలో మల విసర్జన చేయకపోవడం పుట్టిన 48 గంటలలో మూత్ర విసర్జన చేయకపోవడం శరీరం పసుపు పచ్చగా ఉండడం, నీలం రంగు లో ఉండడం, ఫిట్స్ వస్తూండడం. శ్వాస వేగంగా తీసుకుంటూ పక్కటెముకలు ఎగరేయడం. శ్వాస తీసుకోవడం అప్పుడప్పుడు ఆపేస్తుండడం తాకితే చల్లగా ఉండడం.ముఖ్యంగా పాదాలు ( చేతి వెనుక వైపు తాకి చూసినప్పుడు) చల్లగా ఉండడం. బిడ్డ అకారణంగా బాగా ఏడుస్తూ ఉండడం.అసలు ఏడవకపోవడం. పాలు త్రాగలేక పోవడం,మగతగా ఉండడం. కడుపు ఉబ్బరంగా ఉండడం. బొడ్డు ఎర్రగా ఉండడం. బొడ్డు నుంచి చీము వస్తూ ఉండడం. వీటిల్లో ఒక్క లక్షణం బిడ్డలో కనిపించినా వెంటనే అన్ని వసతులున్న ఆసుపత్రికి తీసుకెళ్ళండినెల వయస్సు లోపు ఉన్న మీ పసిబిడ్డల ప్రాణాలను కాపాడుకోండి. సుఖీభవ ఈ స్కీము వివరాలు తెలియ చేస్తారా? రాష్ట్రంలో జన్మించే పిల్లల్లో సగం మంది మాత్రమే ఆసుపత్రుల్లో పుడుతున్నారు. మిగితావారు డాక్టర్ల పర్యవేక్షణ, అవసరమైన ప్రసూతి పరికరాలు లేకుండానే ఇళ్లలో ఊపిరి పోసుకుంటున్నారు.దీనివల్ల కాన్పు సమయంలో ఎందరో తల్లులు,బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు, ఈ తరహా మరణాలు ఆపాలంటే కాన్పులు ఆసుపత్రుల్లోనే జరగాలి. అదే ' సుఖీభవ 'లక్ష్యం. మాతా శిశుమరణాలను ఆసుపత్రి ప్రసవాల ద్వారా నివారించవచ్చును. దీనివల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు? దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన నిరుపేద మహిళలకు ఈ పథకం ఓ వరం. ప్రయాణ ఖర్చులకు,కానుపు సమయంలో ఇతర ఖర్చులకోసం రూ.300/- ఈ పథకం ద్వారా అందిస్తారు. ఈ డబ్బును ఎలా ఇస్తారు? మొదటి రెండు కానుపులకు మాత్రమే రూ.300/- నగదు ఇస్తారు. మూడో బిడ్డనుంచి ఈ పథకం కింద డబ్బు చెల్లించరని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ వైద్య కేంద్రాలు, ఆసుపత్రుల్లోనే ఈ డబ్బు చెల్లిస్తారు.ఆసుపత్రిలో కానుపుకు చేరగానే లేదా డిశ్చార్జికి ముందు ఈ డబ్బును చెల్లిస్తారు. ఈ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఈ పథకం కింద సకాలంలో నగదు చెల్లింపుకు వైద్య కేంద్రం/ఆసుపత్రి ఉన్నతాధికారి బాధ్యులు. డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన వెంటనే ఉన్నతాధికారిని లేదా సంబంధిత అధికారిని సంప్రదించండి. ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు తెల్లరేషన్ కార్డు అవసరం లేదు. వీరు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన వారమని మొదటి లేదా రెండవ కానుపుకు ఆసుపత్రిలో చేరినట్లు లిఖిత పూర్వకంగా డాక్టరుకు ఇవ్వాలి. ఈ పథకం ద్వారా డబ్బు పొందటంలో ఏదైనా ఇబ్బంది కలిగితే? అలాంటి భయం అక్కర్లేదు,సమీపంలోని ప్రభుత్వ వైద్య సంస్థల్లో మెడికల్ ఆఫీసరును సంప్రదించండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది. జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం ఈ పథకం వివరాలు చెప్పండి? మన రాష్ట్రంలోని గర్భిణీ స్త్రీలు కానుపు సమయంలో పోషక విలువల లోపంతో బాధపడుతుంటారు.దీని ప్రభావం తల్లి పైనే కాక పుట్టబోయే శిశువుపైన కూడా ఉంటుంది.దీంతో పాటు బిడ్డ జన్మించిన తర్వాత ఆ శిశువును రోగాల బారి నుంచి కాపాడేందుకు ఆరు టీకాలు ఇవ్వాలి.దురదృష్టవశాత్తూ వీటిని సక్రమంగా ఇవ్వటం లేదు. ఈ దుస్థితి నుచి తల్లి,పిల్లల్ని కాపాడేందుకు ప్రభుత్వం రూపొందించిన పథకమే జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం. దీని ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతారు? దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేద మహిళలు వారి,మొదటి,రెండవ బిడ్డలు ఈ పథకం వల్ల లబ్ది పొందుతారు.వారికి రెండు విడతలుగా ఆర్థిక సహాయం అందుతుంది. ఏడు నెలల గర్భిణీ ఉన్న ఆ స్త్రీ పోషకాహారం తీసుకునేందుకు మొదటి విడతలో ప్రభుత్వ పరంగా రూ.300/- అందుతుంది.శిశువు జన్మించిన తర్వాత తొమ్మిదో నెలలో శిశువుకు తట్టు టీకా ఇచ్చిన తర్వాత రెండో విడతగా మొత్తం రూ.200/- అందజేస్తారు.శిశువు అపాయస్థితి నుంచి బయట పడి ఆరోగ్యంగా ఉండాలన్నదే ఈ పథకం లక్ష్యం. జాతీయ ప్రసూతి ప్రయోజన పథకం ద్వారా ప్రయోజనం పొందటం ఎలా? మొదటి రెండు కానుపులకే ఈ పథకం ద్వారా రూ.500/- చెల్లిస్తారు. అయితే రెండు సందర్భాల్లోనూ శిశువు సజీవంగా జన్మించి ఉంటే మూడో కానుపుకు ఈ ప్రయోజనం వర్తించదు. పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లోనూ రెండు వాయిదాల్లో నగదు అందిస్తారు. ఈ పథకాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? మొదటి,రెండవ శిశువు గర్భ నిర్ధారణ తర్వాత గర్భం దాల్చిన(12 వారాలలోపే) తాము పేద కుటుంబానికి చెందినవారమని తెలుపుతూ గ్రామాల్లో అయితే,సర్పంచ్ నేతృత్వంలోని జనని బృందం దగ్గర,పట్టణాల్లో అయితే ప్రజా వైద్యశాల/పోస్ట్ పార్టం యూనిట్ మెడికల్ ఆఫీసర్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. పైన తెలిపిన వ్యక్తుల నుంచే దరఖాస్తు ఫారం పొందవచ్చు. పట్టణాల్లో,గ్రామాల్లో జనని బృందం ఆ దరఖాస్తును పరిశీలించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ కు పంపుతుంది. మెడికల్ ఆఫీసర్ నుంచి ఆమోదం లభించిన తర్వాత,తల్లి ఏడో నెల గర్భిణీగా ఉన్నపుడు లేదా కానుపుకు ముందు జనని బృందం తొలి వాయిదా మొత్తం చెల్లిస్తుంది. గర్భిణీ కానుపు కోసం పుట్టింటికి వెళ్తున్న సందర్భంలో,ముందుగానే ఆ డబ్బు ఇచ్చే సదుపాయమూ ఉంది. పిల్లలకు తట్టు టీకా ఇప్పించిన తర్వాత, తాము పేద కుటుంబాలకు చెందినవారమనీ,తమబిడ్డ అన్ని టీకాలూ వేయించుకున్నాడని తెలుపుతూ సర్పంచ్ నేతృత్వంలోని జనని బృందం వద్ద ఆ విషయాన్ని నమోదు చేసుకోవాలి.అందుకోసం టీకా కార్డు నకలును దాఖలు చేయాలి. జనని బృందం దరఖాస్తును పరిశీలించి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ కు పంపుతుంది. మెడికల్ ఆఫీసర్ నుంచి ఆమోదం లభించగానే జనని బృందం,బిడ్డకు మొదటి సంవత్సరం నిండకముందే రెండో వాయిదా మొత్తాన్ని చెల్లిస్తుంది. మీరు తొలి వాయిదా సొమ్మును పొందకపోయినా, మీ మొదటి లేదా రెండవ బిడ్డకు తట్టు టీకా వేయించిన తర్వాత రెండవ వాయిదా సొమ్ము రూ.200/- పొందే వీలు ఉంది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే? భయపడాల్సిందేమీ లేదు. సమీప ప్రభుత్వ వైద్య సంస్థల మెడికల్ ఆఫీసర్ ను సంప్రదించండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్య రక్ష ఈ పథకం లక్ష్యమేమిటి? తమబిడ్డ మనుగడకు ఎలాంటి ఆటంకమూ ఉండదన్న నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కల్పించటం,వారు చిన్న కుటుంబాల దిశగా సాగేందుకు ప్రోత్సహించటం ' ఆరోగ్య రక్ష ' ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో కుటుంబ నియంత్రణను పాటించే వారికి ఐదేళ్ల పాటు బీమా ప్రయోజనం కల్పిస్తారు. ఎవరు ప్రయోజనం పొందుతారు? ఒకరు లేక ఇద్దరు పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్న వ్యక్తి,వారి మొదటి,రెండవ సంతానం ఈ ప్రయోజనం పొందుతారు. ఈ ప్రయోజనాల్ని పొందటం ఎలా? కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తేదీ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఆపరేషన్ చేయించుకున్నవారికి, వారి మొదటి,రెండవ సంతానానికి ఈ పథకం కింద ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తారు. ఏడాదికి రూ. 4000/- చొప్పున ఐదేళ్ల కాలానికి రూ.20,000/- వరకు బీమా సౌకర్యం లభిస్తుంది. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు గుర్తించిన ప్రైవేటు నర్సింగ్ హొంలలో ఇన్ పేషెంట్ చికిత్స సౌకర్యం ఉంటుంది.పిల్లలకు ప్రమాద బీమా సౌకర్యం కూడా వర్తిస్తుంది. ఈ ప్రయోజనాల్ని పొందే మార్గం ఏమిటి? ఒకరు లేదా ఇద్దరు పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేయించుకున్నవారు జిల్లా వైద్య,ఆరోగ్య అధికారి నుంచి బీమా సర్టిఫికేట్ పొందేందుకు అర్హులు. ఈ సర్టిఫికేట్ తో పాటు ఈ పథకాన్ని వినియోగించుకోవటానికి వీలున్న ప్రైవేటు సర్సింగ్ హొం జాబితా కూడా ఉంటుంది. సర్టిఫికేట్ ను జాగ్రత్తగా ఉంచుకుని అవసరమైన సందర్భంలో ఆయా నర్సింగ్ హొంలను సంప్రదించవచ్చు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స తేదీ నుంచి ఐదేళ్ళలో మీరు, మీ ఇద్దరు పిల్లలు ఇన్-పేషెంట్ వైద్య సేవలు పొందేందుకు ఈ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. సర్టిఫికేట్ చెల్లుబాటు కాలం దానిపై స్పష్టంగా రాసి ఉంటుంది. బీమా కాలంలో అవసరం అయినప్పుడు గుర్తించిన ప్రైవేట్ నర్సంగ్ హొంలలో ఒక్క రూపాయి కూడా చెల్లించే అవసరం లేకుండానే ఏడాదికి రూ.4000/-కు మించకుండా ఇన్ పేషెంట్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందటంలో ఇబ్బందా? మీ సమీపంలోని ప్రభుత్వ వైద్య సంస్థల్లో మెడికల్ ఆఫీసర్ ను సంప్రదించండి. ఇతర వివరాలకు: కమీషనర్ కార్యాలయం,కుటుంబ సంక్షేమ శాఖ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,(DM&HS) క్యాంపస్,సుల్తాన్ బజార్, కోఠి,హైదరాబాద్.ఫోన్ : 040 - 246503652, 24653771,e-mail: cfwhyd@pol.net.in సురక్షిత నీటి పద్ధతులు జల వనరులు అనేవి మానవులకు ఉపయోగపడే లేదా మూలాధార నీటి సముదాయాలు. వ్యవసాయక, పారిశ్రామిక, గృహ, పునరుత్పాదక మరియు పర్యావరణ సంబంధిత కార్యకలాపాలు సహా నీటి వల్ల పలు ప్రయోజనాలున్నాయి. నిజానికి అన్ని రకాల మానవ అవసరాలకు స్వచ్ఛమైన నీరు అవసరం. సురక్షిత నీటి పద్ధతులు కొరకు ఈ పిడిఎఫ్ ను క్లిక్ చేయండి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు ఆరోగ్య లక్ష్మీ పథకం తెలంగాణ ప్రభుత్వం తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. జనవరి 1, 2015 నుంచి అమల్లోకి తెచ్చిన తెలంగాణ సర్కార్ దానికి ఆరోగ్య లక్ష్మీ అని నామకరణం చేసింది. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాలతో భోజనం ఈ పథకలక్ష్యం, తెలంగాణా రాష్ట్రంలోని 31,897 అంగన్ వాడి కేంద్రాలు, 4,076 మినీ అంగన్ వాడి కేంద్రాలలో ఈ పథకం అమలు కానుంది. మూడేళ్ల వయస్సున పిల్లలకు నెలకు 16 కోడిగుడ్లు అందించనున్నారు. గోధుమలు, పాలపొడి, శనగపప్పు, నూనెతో కూడిన ప్యాకెట్లను ప్రతి నెల1వ తేదీన అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్యమే మహా భాగ్యం కాబట్టి తెలంగాణలోని తల్లి బిడ్డలు అరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆకాక్షించారు. తల్లి బిడ్డల ఆరోగ్యంకోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అందుకోవాలని పిలుపునిచ్చారు. అంగన్ వాడి కేంద్రాలద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతి రోజు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్యలక్ష్మి అనే పేరు పెట్టారు, ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం ద్వారా గర్బిణీలు, బాలింతలకు మంచి ఆహారం అందే విధంగా చర్యలు తీసుకుంటారు. పథకం యొక్క ముఖ్యాంశాలు : ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం గతంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించే కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చాలా మార్పులు తెచ్చింది. ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలకు గతంలో నెలకు 8 కోడి గుడ్లు అందించేవారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకు 16 కోడిగుడ్లు అందివ్వాలని సిఎం నిర్ణయం తీసుకున్నారు. గుడ్లతోపాటు గోదుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్ను ప్రతి నెల మొదటి తేదీన అందిస్తున్నారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు గతంలో నెలకు 16 గుడ్లు అందించేవారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకు 30 రోజుల పాటు రోజుకు ఒక గుడ్డు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. గుడ్లతో పాటు ప్రతి రోజు పిల్లలకు అన్నం, పప్పు, కూరగయాలు, స్నాక్స్ అందివ్వాల్సి ఉంటుంది. గర్భిణీలు, బాలింతలకు గతంలో నెలకు మూడు కిలోల బియ్యం, ఒక కిలో కందిపప్పు, అరకిలో నూనె అందించేవారు. 68 ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టుల పరిధిలో నెలకు 16 గుడ్లు, 81 ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టుల పరిధిలో నెలకు 25 గుడ్లు అందించేవారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 149 ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టులో నెలకు 30 రోజుల పాటు గుడ్లు అందిస్తున్నారు. గుడ్లతో పాటు కనీసం 25 రోజుల పాటు సంపూర్ణ భోజనం, 200 మిల్లీ లీటర్ల పాలు అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా తెలంగాణలోని 5,90,414 మంది గర్భి ణీలు, బాలింతలకు, 18,20,901 మంది పిల్లలకు ప్రభుత్వం ద్వారా పౌష్టికాహారం అందుతుంది. ఆధారము : తెలంగాణా సి.ఎం.ఓ.