ఆడ శిశువుల హత్య అనేది ఆడ సంతానంకన్నా మగ సంతానానికి విలువనెక్కువ ఇవ్వడమనే కారణంగా, కావాలనే పుట్టబోయే ఆడ గర్భస్థపిండాన్ని చంపివేయడం. సాంస్కృతిక కట్టుబాట్లు గల ప్రాంతాలలో మగ పిల్లలకిచ్చే విలువ వల్ల ఇలాం టి దురాచారాలు జరుగుతున్నాయి. స్త్రీ భ్రూణ హత్యలోగల వాస్తవాలు ఐక్య రాజ్య సమితి పిల్లల నిధి(యుని సెఫ్) యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం, భారతదేశంలో గల లింగ వివక్ష ఫలితంగా 50, 00000 మంది( 50 మిలియన్ల) బాలికలు , స్త్రీలు భారత జనాభా నుండి తప్పిపోతున్నారని తెలుస్తోంది. ప్రపంచంలో గల చాలా దేశాలలో ప్రతి వంద మగ శిశువులకు దాదాపుగా 105 మంది స్త్రీ శిశువులు జన్మిస్తు న్నారు. భారత దేశంలో ,ప్రతీ వంద మంది మగ వారికి 93 మంది కన్నా తక్కువ స్త్రీలు జనాభాలో ఉన్నారు. భారత దేశంలో ప్రతీ రోజూ చట్ట విరుద్ధంగా 2,000 స్త్రీ శిశు గర్భ స్రావాలు జరుగుతున్నట్లు అంచనాగా ఐక్య రాజ్య సమితి దేశాలు తెల్పుతున్నాయి. పొంచి ఉన్న ప్రమాదం భారత దేశంలో స్త్రీ భ్రూణ హత్యలు పెరగడంతో జనాభా సంక్షోభంలో పడుతుం ది. సమాజంలో స్త్రీలు తగ్గిపోవడం ఫలితంగా లైంగిక హింసలు, పిల్లలపై అప ప్రయోగాలు అంతేగాక భార్యలను పంచుకోవడాలు ఎక్కువ అవుతాయని ఐక్యరాజ్యాలు హెచ్చరిస్తున్నాయి . దీని వలన సాంఘిక విలువల వ్యవస్థ క్షీణించి సామాజిక పరిస్థితులు సంక్షోభానికి లోనౌతాయి. కారణాలు సాంస్కృతిక విశ్వాసాలు, సామాజిక కట్టుబాట్లతో లింగ వివక్ష ఏర్పడింది. పేద కుటుంబాలలో కూడ స్త్రీ వ్యతిరేక, మగ పిల్లలు కావాలనే పక్షపాతంతో ఉండడమనేదానికి హద్దు లేకుండ పోయింది. ఆ కట్టుబాట్లనే సవాళ్ళను ఎదుర్కొని, ఈ ఆచారాలను తప్పని సరిగా రూపుమాపాలి. ఆడశిశువులను వద్దనుకోవడం అనే అభ్యాసాలు భారతదేశంలో గల సామాజిక ,ఆర్ధికపరమైనవిగా ఆపాదించడం జరుగుతోంది. భారత దేశంలో జరిగిన అధ్యయనాలు ఆడ శిశువులను వద్దనుకోవడానికి మూడు కారణాలను సూచిస్తున్నాయి. అవి, ఆర్ధిక వినియోగం, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనం, మతపరమైన కార్యక్రమాలు. కుటుంబ భారాన్ని మోయడంలోను, లేదా కుటుంబ పరంగా వచ్చే వ్యాపారంలోను, వేతనాన్ని సంపాదించడంలోను, మరియు తల్లిదండ్రులను ముసలి తనంలో ఆదుకోవడంలోనూ అబ్బాయిలు , అమ్మాయిలకన్నా ఎక్కువ గా చేయగలరనే విషయం ఆర్ధిక ప్రయోజనమనే కారణంగా అధ్యయనం చేసినపుడు సూచింపబడింది. వివాహానంతరం, కొడుకు కోడలితో బాటు ఇంటిపనిలో చేదోడు వాదోడుగా ఉండడంతోబాటు వరకట్నంవలన ఆర్ధికలాభం ఉంటుందని, కూతుళ్లపెళ్ళికి, వరకట్నం ఇచ్చుకోవడమనేది ఆర్ధిక జరిమానాగా ఉండడం. చైనాలోను, భారత దేశంలో పితృ వంశానుక్రమం, పితృ స్వామికకుటుంబ విధానమనేది ఉండడం వలన కనీసం ఒక మగసంతానమైనా కుటుంబ పరంపరకు తప్పని సరిగాను, ఎక్కువ మంది కొడుకులున్నట్లయితే కుటుంబాలకు హోదాగాను స్త్రీ శిశువు వద్దు అనేది కారణంగా సామాజిక ప్రయోజన పరంగా తెలుస్తోంది. హిందూ మతపరంగా తల్లిదండ్రుల దహన సంస్కారాలకు ఆత్మ విముక్తికి హిందూ ఆచారాల ఆధారంగా కొడుకులు మాత్రమే చేయదగ్గవారనీ, స్త్రీలు మతపర కార్యక్రమాలు చేయరాదనేది కారణంగా స్త్రీ శిశువు వద్దు అనుకోవడం. ప్రభుత్వం చేపట్టిన చర్యలు సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి సమాజంలో గల ప్రజల వైఖరులలో మార్పు తేవడం కోసం చాలా చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఈ దిశలో చాలా శాసనాలను , చట్టాలను , పథకాలను ప్రవేశ పెట్టింది. అవి ఏమిటంటే - వరకట్న వ్యతిరేక శాసనాలు-వరకట్న నిషేధ చట్టం 1961 లింగ నిర్ధారణ వ్యతిరేక శాసనాలు- పి సి పి ఎన్ డి టి చట్టం బాలికా విద్య పరంగా శాసనాలు మహిళా హక్కుల పరంగా శాసనాలు ఆడపిల్లకు అనుకూలంగా ఆస్తిపంపకాలలో సమాన హక్కుల శాసనాలు ఆధారము: ఇండియన్ చైల్డ్, వికిపీడియా