మన రాష్ట్రంలో ఖరీఫ్ లో సాగుచేసే అపరాలలో పెసర ముఖ్యమైన పంట సుమారు 1.5 లక్షల హెక్టార్లలో సాగులో ఉంది.ఎక్కువగా నల్గొండ, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మంజిల్లాల్లో సాగులో ఉంది.మినుము సుమారు 55000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. మెదక్ , నిజామాబాద్ మరియు అదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తారు.
ఎల్ జిజి 460: ఈరకం 70-75 రోజుల పంట కాలము కలిగిఉంటుంది కాయలు గుత్తులు గుత్తులుగా పైభాగములో ఉండికోయడానికి అనుకూలంగా ఉంటాయి. ఒకేసారి కోతకు వస్తుంది. గింజలు మరుపును కలిగి ఉంటాయి.మొవ్వు కుళ్ళను కొంతవరకు తట్టుకొనును వరి మాగాణుల్లో వేయుటకు అనుకూలంగా ఉంటుంది. ఎకరానికి 5-6 క్వింటాళ్ళ దిగుబడి నిస్తుంది. | యమ్ జి జి – 348 (భద్రాద్రి): మొక్కలు పొట్టిగా ఉండిఅంతర పంటకు అనుకూలంగా ఉంటుంది. 65 రోజులు పంట కాలము కలిగి రోజులు ఎకరానికి 4-5 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది.బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకొనును మరియు గింజలు సాదాగాఉంటాయి. |
టి యమ్ -96-2: బూడిద తెగులును తట్టుకొనే రకము 70-75 రోజుల పంట కాలము కలిగి ఎకరానికి 4-6 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. వరి మాగాణులకు కూడా అనువైనది. | డబ్ల్యు జి జి-37 (ఏకశిల): 60-65 రోజులు పంట కాలముకలిగి ఎకరానికి 5-6 క్వింటాళ్ళ వరకు దిగుబడినిస్తుంది. పల్లాకుతెగులును కొంతవరకు తట్టుకొనును. |
డబ్ల్యుజిజి-2: నల్లమచ్చ తగులును తట్టుకునే రకం గింజలు మెరుస్తుంటాయి. 65 నుండి 70 రోజుల పంటకాలము కలిగి ఎకరానికి 5-6 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది | ఎంజిజి-347: 65 నుండి 70 రోజులలో పక్వతకు వస్తుంది. 5-6 క్విఎకరానికి దిగుబడినిస్తుంది. బెట్టను మరియు ఆకుమచ్చ తెగులు ను.పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకొనును |
డబ్ల్యుజిజి-42 : 55 నుండి 60 రోజుల పంట కాలం కలిగి ఎకరాకు3 నుండి 5 క్వింటాళ్ళ దిగు బడినిచ్చి పల్లాకు తెగులును తట్టుకునేరకం, ప్రత్తిలో అంతర పంటకు మరియు వేసవి కాలానికిఅనువైనది.చిరు సంచుల దశలో ఉంది. | యంజిజి-351: రబి మరియు వేసవి కాలానికి అనువైనది65 రోజుల పంట కాలం కలిగి ఎకరాకు 4 నుండి 6 క్వింటాలదిగుబడినిచ్చును |
యమ్ జిజి-295: మొక్కలు నిటారుగా పెరుగుతాయి. గింజలు సాదాగా ఉంటాయి. కాపు పై భాగానే ఉంటుంది. నల్లమచ్చ తెగులును తట్టుకుంటుంది |
యమ్ జిజి-752: పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకముమెట్ట ప్రాంతాలలో మరియు వరి మాగాణుల్లో విత్తాడానికి అనువైన రకము. 75-80 రోజుల పంట కాలము కలిగి ఎకరానికి 6-7క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. | డబ్ల్యుబిజి-26: పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకునే సాదారకము. కాయల మీద నూగు ఉండదు.70-75 పంటకాలము కలిగి ఎకరానికి ఎకరానికి 4-5 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. |
యల్ బిజి-20 (తేజ): పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకునే పాలిష్ రకము.70-75 రోజుల పంట కాలము కలిగి ఎకరానికి 5-6క్వింటాళ్ళ వరకు దిగుబడి ఇస్తుంది. | యల్ బిజి -207 ( మధిర మినుము) : 75-80రోజులపంటకాలము కలిగి బెట్టను తట్టుకునే పాలిష్ రకము. ఎకరానికి 5-6 క్వింటాళ్ళ వరకు దిగుబడి ఇస్తుంది. |
పియు -31 ; పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. 70-75రోజుల పంట కాలము గల సాదారకము. ఎకరానికి 5-6 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. | యల్.బి.జి -645: ఎండు తెగులును తట్టుకునే లావుపాటి పాలిష్ రకము 80-90 రోజుల పంటకాలము కలిగి ఎకరాకు 8-9 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది. |
యల్.బిజి – 685: పాలిష్ రకము ఎండు తెగులును తట్టుకుంటుంది.85-90 రోజుల పంట కలము కలిగి ఉంటుంది, తీగ వేస్తూ విస్తరించి పెరుగుతుంది. ఎకరానికి 7-8 క్వింటాళ్ళ దిగుబడి ఇస్తుంది.కాయలుకాండం పై కూడ వస్తాయి. గింజలు మెరుపును కలిగి ఉంటాయి | యల్ బిజి-678: పైరు తీగ వేస్తూ పెరుగుతుంది. కాయలపైన నూగు ఉంటుంది. బూడిద, ఆకుమచ్చ, తుప్పు తెగుళ్ళను తట్టు కుంటుంది. 90-95 రోజుల పంట కాలము కలిగి ఎకరానికి 8క్వింటాళ్ళ వరకు దిగుబడి ఇస్తుంది.. గింజలు మెరుపును కలిగి ఉంటాయి |
పై రకాలు అన్నికూడా రబికి మాత్రమే అనువైనవి.
నేలలు: నీరు బాగా ఇంకి తేమను పట్టి ఉంచే, మధ్యస్థ బరువైన నేలలు అనుకూలమైనవి. చౌడు భూములు పనికి రావు.
నేల తయారీ: ఒకసారి నాగలితోను, రెండు పర్యాయములుగొర్రుతోను, మెత్తగా దున్ని గుంటక తోలవలెను
పెసర: మెట్ట ప్తాంతాలకు 6-7 కిలోలు మరియు వరిమాగాణుల్లో 10-12 కిలోలు ఎకరానికి అవసరమవుతాయి
మినుము : మెట్ట ప్తాంతాలకు 6-7 కిలోలు వరి మాగాణుల్లో 16కిలోలు ఎకరానికి అవసరమవుతాయి.
కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్పాన్ లేదాఇమిడాక్లోప్రిడ్ 5 మి. లీ. లేదా ధయోమిధాక్సామ్ 5 గ్రా లేదా మోనోక్రోటోఫాస్ 5.మి.లీ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు15-20 రోజుల వరకు రసము పీల్చు పురుగుల బారి నుండి రక్షించు కోవచ్చు కొత్తగా పండించేటప్పుడు ఎకరాకు 200గ్రా రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించాలి.
ఖరీఫ్: జూన్ 15 నుండి జులై 15, రబి: సెప్టెంబర్ లేదా అక్టోబర్ లోవిత్తుకోవచ్చు. వరి మాగాణుల్లో నవంబర్, డిసెంబర్ మొదటివారంలో విత్తుకోవచ్చు. వేసవిలో జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 వరకు వేసుకోవచ్చు.
విత్తుదూరము: సాలుకు సాలుకు మధ్య 30 సెం.మీ ఉండేలాగొర్రుతో/నాగలితో వరుసలలో విత్తవలెను.
ఎరువులు : తొలకరి పంటకు 8 కిలోల నత్రజని 20కిలోల భాస్వరం రబిలో ఎకరానికి 16కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం ఇచ్చే రసాయనికి ఎరువులు చివరి దుక్కిలో వేయాలి. వరి మాగాణుల్లోవేయ వలసిన అవసరం లేదు. 2% యూరియా ద్రావణాన్నిపిందె మరి యు గింజనిండే దశలో పిచికారి చేసినచో దిగుబడులు పెరుగును.
విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు ఎకరానికి 1.2 లీటర్లు పెండిమిథాలిన్ మందును 200 లీటర్ల నీటిలోకలిపి పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజుల మధ్యలో కలుపు లేత దశలోఉన్నప్పుడు ఎకరాకు 300 మి.లీ. ఇమజితాఫిర్ (పర్సూట్)లేదా కేవలం గడ్డిజాతి కలుపు నివారణకు ఎకరాకు 400 మి.లీ క్విజలాఫాప్ ఇథైల్(టర్గాసూపర్) పిచికారి చేయాలి. తర్వాత 30-35రోజుల వ్యవధిలో అంతరకృషి ద్వారా కలుపు నివారించవలెను.
నేల స్వభాన్ని బట్టి 2-3 తడులు ఇవ్వవలెను పూత మరియు కాయ తయారయ్యే సమయంలో పిందెలను కూడా తింటాయి.వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలనుపాటించాలి పంట బెట్టకు గురి కాకుండాచూడాలి. బెట్ట పరిస్థితులలో2శాతం యూరియాద్రావణాన్ని అవసరాన్ని బట్టి 2 లేదా3సార్లు పిచికారి చేయాలి.
తెల్లదోమ: పెసరలో తెల్లదోమ వలన అపారమైన నష్టం వాటిల్లుతుంది. ఇది ఆకుల నుండి రసం పీల్చడమే కాకుండా ఎల్లోమొజాయిక్ వైరస్ ను వ్యాపింపచేయుట వలన పెసర పంటలో గణనీయంగా దిగుబడి తగ్గుతుంది దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీలేదా ట్రైజోఫాస్`2.0 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా ఒక లీటరు కలిపిపిచికారి చేయాలి. | |
తామర పురుగులు : ఈ పురుగులు తొలి దశలోలేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. వీటివల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపింస్తుంది. వీటి నివారణకు గాను మోనోక్రోటోఫాస్ 1.5 మి.లీ ఎసిఫేట్ 1గ్రా లేదా ఫిప్రోనిల్ 1.0 మి.లీ ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి. |
|
లద్దె పురుగు: ఈపురుగులు ఆకులను తీసివేసి ఈనెలనువదిలివేస్తాయి.ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పువ్వులను పిందెలను కూడా తింటాయి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాయి. • గ్రుడ్ల సముదాయాలను ఏరిచేయాలి. |
కాండపు ఈగ: కాండంలోకి ఈ పురుగు చేరి తినడం వలన మొక్క ఎండిపొతుంది. దీని నివారణకు గాను, మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ.లేదా ఎసిఫేట్ 1.0 గ్రా. లేదా డైమిథోమేట్ 1.5 మి.లీ లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి. | |
మరుకా మచ్చల పురుగు: ఈ పురుగు మొగ్గ, పూత పిందెల దశలో ఆశించి ఎక్కువ నష్టం కలుగ జేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరకు చేసి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగు తుంది. దీని నివారణకు గాను మొగ దశలో ఎసిఫేస్ 1.0 గ్రా లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలిపంటలో గూళ్లు గమనిస్తే పై మందులతోపాటు ఉదర స్వభావం గలడైకోల్ వాస్ 1 మి.లీ./ లీటరుకు చొప్పున కలిపి పిచికారి చేయాలి. ఉదృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోశాడ్ 0.3మి.లీ ఒక లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి. |
ఆకుమచ్చతెగులు • ఆకుల మీద చిన్న మచ్చలు ఏర్పడును. • ఈ మచ్చలు చల్లని వాతావరణంలో అభివృద్ధి చెంది ఆకు అంతటా వ్యాపించి పండుబారి రాలిపోవును. • 2.5 గ్రాముల మాంకోజెబ్ మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. |
|
బూడిదతెగులు • చిన్న తెల్లని మచ్చలు ఆకుల పైన ఎర్పడును. • ఈ తెగులు చలికాలంలో ఎక్కువ వచ్చును. • 1 లీటరు నీటిలో 3 గ్రాముల నీటిలో కరిగే గంధకంను కలిపి పిచికారి చేయాలి. |
|
పల్లాకు తెగులు • ఆకుల మీద చిన్న మచ్చలు పసుపు రంగులో ఏర్పడును. |
పంట కోత : మొక్కలను మొదలు వరకు కోసి ఎండిన తరువాత నూర్చుకోవాలి. ఆ తర్వాత ఎండబెట్టి శుభ్రపరిచి, నిలువ చేసుకోవాలి.
మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి, మొక్కజొన్న పరిశోధనా స్థానం, రాజేంద్రనగర్ , హైదరాబాద్ , ఫోన్ నెం. 040-24018447
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/10/2021
మన దేశం అపరాలు (పప్పుధాన్యాలు) ఉత్పత్తిలో ప్రపంచంల...