ఈ సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తిని సుమారుగా 17.23 లక్షల హెక్టార్లలో విత్తుకోవడం జరిగినది. ప్రస్తుతం ప్రత్తి సుమారు 50 నుండి 65 రోజుల దశలో ఉన్నది. ఆగస్టు మాసంలో కురిసిన అధిక వర్షాలకు ప్రత్తి పెరుగుదల చాలా చోట్ల కుంటుపడటం గమనించడం జరిగినది. దానికి తోడు అక్కడక్కడా వడలు తెగులు, పేనుబంక మరియు పచ్చదోమ ఆశించడం వలన మొక్కల పెరుగుదల తగ్గింది. కొన్నిచోట్ల అధిక వర్షాలకు పోషకాల లోపం వలన ఆకులూ పండుబారి ఎరుపు రంగులోకి మారడం గమనించడం జరిగింది. కావున ప్రస్తుత తరుణంలో ఈ కారింది సమగ్ర సస్యరక్షణ చర్యలను పఠించి ప్రత్తి పంటను కాపాడుకోవచ్చును.
జులై మొదటి పాషం వరకు నెలకొన్న వర్షాభావ పరిస్ధితులు, ఆ తర్వాత, జులై - ఆగస్టు మాసాల్లో కురిసిన అధిక వర్షాలకు ప్రత్తిలో చాలా చోట్ల వడలు తెగులును గమనించడం జరిగినది. ఈ తెగులు ఆశించినప్పుడు మొక్కలు ఆకుపచ్చ రంగులోనే ఉండి తలల వాల్చడం జరుగుతుంది. దీని నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ 1 లీటరు నీటికి కలిపి తెగులు ఆశించిన మొక్కల చుట్టూ మరియు చుట్టూ ఉన్న మంచి మొక్కల మెదళ్ళ వద్ద కూడా వేరు వ్యవస్ధ బాగా తడిచేటట్లుగా ద్రావణాన్ని పోయాలి లేదా నాజిల్ తీసిన పంపుతో పిచికారీ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే చాలా వరకు వడలు తెగులు వ్యాప్తిని తగ్గించుకోవచ్చును. తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు వారం లోపు రెండవ సారి కూడా ఈ ద్రావణంతో భూమిని తడపాలి.
ప్రస్తుతం ప్రత్తిలో చాలా చోట్ల పేనుబంక ఆశించి ప్రత్తిని బాగా నష్ట పరుస్తుంది. పేనుబంక తల్లి మరియు పిల్ల పురుగులు మొక్క లేత కొమ్మలు మరియు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన మొక్క పెరుగుదల చాలా చోట్ల కుంటుపడటం జరిగింది. ఈ ఆకుల అడుగు బాగానే ఉన్న పేనుబంకలలో కొన్నింటికి రెక్కలు ఉండటం కూడా గమనించవచ్చును. సాధారణంగా ఈ రెక్కల పేనుబంక అనేవి పేనుబంక గుంపు బాగా ఉన్నప్పుడు లేదా పంట నాణ్యత సరిగా లేనప్పుడు మనం గమనించవచ్చును.
ఈ పేనుబంక తేనెలాంటి జిగట పదార్ధాన్ని విసర్జించడం వలన కొన్ని చోట్ల ఆకులూ జిగటగా ఉండి మెరపడం కూడా గమనించడం జరిగింది. ఈ పేనుబంకతో పాటు ఆశింతల పురుగు పిల్ల, తల్లి పురుగులు సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం మనము గమనించవచ్చు. అయితే వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే పురుగు మందుల పిచికారీ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఆశింతల పురుగు తల్లి లేదా పిల్ల పురుగు రోజుకు 100-150 పేనుబంకలను తింటుంది. ఒకవేళ వీటి సంఖ్య లేనట్లయితే పురుగు ఉదృతిని బట్టి 0.2 గ్రా. ఎసిటమిప్రిడ్ లేదా 2 మీ.లి. పెఒరొనిల్ లేదా 2 మీ. లి. డైమిదోయేట్ లేదా 0.25 మీ.లి. ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రా. ప్లోనికండి లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలకు ఇప్పుడిప్పుడే ప్రత్తిలో చాలా చోట్ల పచ్చదోమ ఆశించి నష్టపరుస్తున్నట్లు గమనించడం జరిగింది. పచ్చదోమ తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన మీదట ఆకూ అంచు భాగాన పసుపు రంగులోకి మారి, క్రైందకు డొప్పలుగా మాదిరి ఎర్రబడటం గమనించవచ్చును. ఈ పచ్చదోమ ఉదృతి పంటకాలం మొత్తం ఉండే అవకాశం ఉంది. కావున తొలి దశలోనే 5% వేప కాషాయం లేదా వేపనూనె (1500 పి.పి.యమ్.) ను పిచికారీ చేసుకొని పచ్చదోమ గ్రుడ్లను నాశనం చేయవచ్చును. అలాగే ఖండానికి పైన ఉన్న లేత ఆకూ పచ్చ భాగంలో ప్లేనికండి, నీరు 1:20 నిష్పత్తిలో కలుపుకున్న మందు ద్రావణంతో కందం పూత పూసి కూడా సమగ్రంగా నివారించుకోవచ్చును. రసాయన మందుల పిచికారీ కొరకు 0.2 గ్రా. దయమీదకేసం లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
అధికంగా కురుస్తున్న వర్షాల వలన చాలా చోట్ల ఆకులు పండుబారి ఎర్రబడటం గమనించవచ్చును. మరియు కొన్ని చోట్ల మొక్కల క్రైంద బాగానే ఉన్న ఆకుల పూర్తిగా ఎరుపు రంగులోకి మారి ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉండటం గమనించవచ్చు. దీని నివారణకు లీటరు నీటికి 10 గ్రా. మెగ్నీషియమ్ సల్పేట్ + 10 గ్రా. యూరియా లేదా 10 గ్రా. 19:19:19 కలుపుకొని వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
ముందుగా విత్తుకున్న ప్రత్తిలో అలాగే మిల్లుల దగ్గరలో ఉన్న ప్రత్తి చేలల్లో పూతకు వచ్చిన ప్రత్తి పంటలో గులాబీ రంగు కాయతొలుచు పురుగును "గుడ్డి పూల" రూపంలో గమనించడం జరిగినది. కావున రైతు సోదరులందరు తక్షణమే ఈ క్రీంది జాగ్రత్తలను తీసుకున్నట్లయితే గులాబీ రంగు కాయతొలుచు పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకునే అవకాశమున్నది.
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020