వేరియేషన్ క్లాజులోని అంశములకు లోబడి నిర్దేశితసాంకేతిక ప్రమాణాలకు లోబడి వున్న శీతల గిడ్డంగి ప్రాజెక్టులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అర్ హత లభించును. దీనిని నిర్ధారించుకొను టకు ఈ క్రింది ప్రాతిపకికను అనుసరించవలెను
శీతల గిడ్డంగి నిర్మాణమును చేపట్టుటకు ముందే వ్యవస్థాపకునిచే అంగీకారపత్రం పొంద వలెను. నిర్ధేశింపబడిన యితర పత్రములతో బాటు ఈ క్రింది పత్రములను అంగీకార పత్ర దరఖాస్తుకు జతపరచవలెను.
సివిల్ నిర్మాణము విషయంలో వ్యవస్థపకునిచే ఈ క్రింది పత్రములు సమర్పింప బడవలెను.
ఉద్దేశ్యం: అనుమతింపబడిన స్థలమునందు మరియు అన్ని విభాగాలతో సంతృపికరంగా, నాణ్యంగా, అనుమతింపబడిన శ్రామిక ప్రమాణాల ప్రకారం పని నిర్వహింప బడినదని, మొదటి ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయబడినదని నిర్ధారించుకొనుట తణిఖీ/ఉమ్మడి తణిఖీ యొక్క ప్రధాన ఉద్దేశ్యము. విభాగం వారీగా లబ్దిదారుచే చేయబడిన అసలు ఖర్చుకు ఆధారంగా ఉన్న్ ఓచర్లు, కార్డులను పరిశీలించి ప్రాజెక్టు యొక్క వ్యయాన్ని మదింపు చేయుటకు ఈ తనిఖీ ఉద్దేశింపబడినది. సృష్టింపబడిన ఆస్తుల మనుగడకు సాక్ష్యంగా జాతీయ ఉద్యానవనబోర్డు వారి ఆదేశాల ప్రకారం ప్రాజెక్టు యొక్క్ ఫోటోలు/ వీడియోలు కూడా అందచేయబడాలి
పరపతితో ముడిపెట్టబడిన ఏ ప్రాజెక్టుకయితే జాతీయ ఉద్యానవనబోర్డు వారిచే అనుమతి పత్రం జారీ చేయబడినదో ఆ ప్రాజెక్టు పూర్తయిన తరువాత వ్యవస్థాపకుడి సంబంధిత ఆర్ధిక సహాయ సంస్థ/ బ్యాంకు వారు జాతీయ ఉద్యానవన బోర్డు వారి రాష్ట్ర ఇన్ ఛార్జిని సంప్రదించిన మీదట ఉమ్మడి తణిఖీకి ఒక తేదీని నిన్ణయించును.ఆ ప్రాజెక్టులు లబ్దిదారు సమక్షంలో జాతీయ ఉద్యానవన బోర్డు ప్రతినిధి మరియు ఆర్దిక సహాయ సంస్థ/ బ్యాంక్లు యొక్క ప్రతినిధిచే ఉమ్మడిగా తణిఖీ చేయబడును. జాతీయ ఉద్యానవన బోర్డు వారి ఆదేశాలమేరకు రాష్ట్ర ఉద్యానవన డైరెక్టరేట్ యొక్క ప్రతినిధి కూడా ఈ తణిఖీలో పాల్దొనును. తణిఖీ రిపోర్టు యొక్క ముఖ్య లక్షణాలు
నిర్దేశింపబడిన నమూమ్ఆలో సంబంధిత ఆర్ధిక సహాయ సంస్థ/ బ్యాంకు వారిచే జాతీయ ఉద్యానవన బోర్డుకు బ్యాంకు తణిఖీ రిపోర్టు / ఉమ్మడి తణిఖీ రిపోర్టు సమర్పింపబడాలి.ప్రజెక్టు విభాగాఅల వివరణతోను, ప్రాజెక్టు స్థలం, నిధుల లభ్యత, ప్రాజెక్టు విభాగాలు అన్నియు క్రొత్తగా మొదలగు విషయాలతో తణిఖీ రిపోర్టు వ్రాతపూర్వకంగా సమర్పింపబడాలి. జాతీయ ఉద్యానవన బోర్డు వారి ఆదేశాల ప్రకారం ఆ రిపోర్టుకు సంబంధిత ఫోటోలు/ వీడియో గ్రాపులను జతపరచవలెను.
ప్రాజెక్టు పూర్తయిన పిదప ప్రాజెక్టు మరియు ప్రాజెక్టు విభాగాల యొక్క వ్యయాన్ని అంచనావేయుట ప్రాజెక్టు మొత్తంగాను మరియు ప్రాజెక్టు విభాగాలవారీగా వ్యయాన్ని మదింపు చేయువల సిన బాధ్యత తణిఖీ అధికారి/ ఉమ్మడి తణిఖీ బృందంపై ఉన్నది. పొందిన సేవలు/ సేకరణకు సంబంధించిన ఓచర్లు /నగదు రశీదులు మొదలగు పత్ర సంబంధమైన సాక్ష్యాధారాలను పరిశీలించుట జరుగును. ఒక్కొక్కపుడీ ఓచర్లు /నగదు రశీదుల క్రమబద్ధత సరిగా లేనపుడే స్థానిక రేట్లను పరిగణనలోనికి తీసుకొనుట ద్వారా వ్యయాన్ని మదింపు చేయవచ్చును. చార్టర్డు అకౌంటెంట్ చే విలువకట్టబడిన మొత్తాన్ని కూడా పరిగణనలోనికి తీసుకొనవచ్చును. చార్టర్డు అకౌంటెంట్ యొక్క సర్టిఫికెట్ ఆధారంగా పూర్తయిన పని విలువలను బట్టి ఆర్ధిక సహాయ సంస్థ/ బ్యంకులు అప్పు తాలూకు తదుపరి మరియు అంత్య వాయిదాలను విడుదల చేయును .ప్రాజెక్టు మొత్తంగాను మరియు విభాగాల వారీగా వ్యయ నిర్ధారణ చేయుటకు ఆ పత్రాలు ఆధారం కావచ్చును.
సూచన: తన ప్రజెక్టుకు సంబంధించిన సబ్సిడీ క్లెయిమును పంపించుటకు నిర్ణీత నమూనాలో క్రొత్త ధృవ పత్ర సమర్పణ ఆవస్యకత మొదలగు విషయాలను లబ్దిదారుకు తెలియపరచాలి.
ఆదారము:జాతీయ ఉద్యానవన బోర్డు వారి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/20/2020