మనిషి శరీర అంతర్భాగాల్లోకి చూడగల ఒక కొత్త కెమెరాను స్కాట్ ల్యాండ్ లోని ఎడిన్ బర్గ్ యూనివర్సిటీ, హేరియట్-వాట్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కెమెరా శరీరంలోపల ఏదైనా కాంతి జనకం ఉంటే దాన్ని కనిపెడుతుంది. సాధారణంగా రోగి శరీరంలోపల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వైదులు ఎండోస్కోప్ లనే పరికరాలను లోనికి చూపిస్తారు. ఈ పరికరాన్ని బయటినుంచి అనుసరిస్తూ ఆయా అవయవాల పని తీరును పరీక్షించాల్సి ఉంటుంది. ఇందుకు ఇప్పటి దాకా - కిరణాలను లేదా ఖరీదైన ఇతర పరికరాలను వైద్యులు ఉపయేగిస్తున్నారు. ఇక ముందు వీటితో పని లేకుండా ఈ కొత్త కెమెరా సాయంతో ఎండోస్కోప్ లను ట్రాక్ చేయవచ్చు. దీని ద్వారా ఎండోస్కోప్ ను శరీరంలో సైరైనా చోటికి చేర్చవచ్చు. ఎండోస్కోప్ గొట్టం కొనభాగం నుంచి వచ్చే కాంతిని ఈ కెమెరా గుర్తొస్తుంది. కాంతి ప్రోటాన్ నాలు గుర్తించే అధునాతన టెక్నాలజీ ని ఈ కెమెరా ఉపయోగించుకుంటుంది.
ఆధారం: చెకుముకి
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/21/2020