సూర్యుడు మధ్యలో ఉండి దాని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. వీటిని అన్నింటిని కలిపి సూర్యకుటుంబం అంటారు. మన భూమి సూర్యుడి నుండి లెక్క వేస్తే మూడవ గ్రహం. సూర్యుడు భూమి నుండి దాదాపు 9 కోట్ల 30 లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాడు. సూర్యకుటుంబంలో సూర్యునితో పాటు అన్ని గ్రహాల ద్రవ్యరాశి కలిపి చూస్తే అందులో 99.86% సూర్యుడిదే అవుతుంది. అంటే సూర్యకుటుంబంలో ఉన్న అన్ని గ్రహాల ద్రవ్యరాశి కేవలం 0.14% మాత్రమే అన్నమాట. సూర్యుడులో దాదాపు 74% హైడ్రోజన్ వాయువుతో నిండి వుంది. 24% హీలియంతో నిండివుంది. సూర్యుడి ఉపరితలంపై దాదాపు 5500°C ఉష్ణోగ్రత ఉంటుంది. సూర్యుడి లోపల అంటే మధ్యలో 13600000°C ఉష్ణోగ్రత ఉంటుంది. ఇంత వేడిని వెదజల్లే సూర్యుడు మనకు దాదాపు 15 కోట్లు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి మనకు దాదాపు సగటున 35°C ఉష్ణోగ్రత సూర్యరశ్మి ద్వారా అందుతుంది.
భూమి మీద జీవం పుట్టుక, పుట్టిన తరువాత జీవం అభివృద్ది చెందుటకు సూర్యుడు కూడా ఒక కారణం అంటారు శాస్త్రజ్ఞులు. సూర్యుడు ఉంటేనే మన భూమి మీద చెట్లు బ్రతకగలవు. చెట్లు (పంటలు) ఉంటేనే జంతువులు జీవించగలవు. కాబట్టి భూమి మీద జీవి(వృక్ష, జంతు) మనుగడకు ప్రధాన కారకుడు సూర్యుడు అని మనం ఒప్పుకోవలసిందే. ఉదయం, సాయంత్రం సూర్యరశ్మిలో విటమిన్ 'డి' ఉంటుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరగడం వల్ల మనకు ఋతువులు వస్తున్నాయి. సూర్యుడు ఇంకా దాదాపు 450 కోట్ల సంవత్సరాలు అలా వెలుగుతూ ఉంటారు. అప్పటిదాకా భూమి మీద జీవులకు ఆహారం దొరుకుతుంది. ఆ తరువాత సూర్యుడు ఉండడు, భూమి ఉండదు కాబట్టి మన భూమి మనుగడకు సూర్యుడే మూలాధారం అని ఒప్పుకొంటారా?
చివరిసారిగా మార్పు చేయబడిన : 6/26/2020