వరిసాగులో కొన్ని అపోహలు:
వరి జల సంబంధమైన మొక్క అని అందరికీ తెలుసు. నీటిలో పాతుకు పోతున్నప్పుడు బాగా పెరుగుతుంది. అలాగని వరి నీటి మొక్క కాదు. వేళ్ళల్లో గాలి బుడగ ఏర్పాటవడానికి వరి మొక్క ఎంతో శక్తిని వినియోగించుకోవలసి వస్తుంది. వరిలో పూత సమయంలో సుమారు 70% వేరు చివర్లు నాశనమైపోతాయు.
శ్రీ వరిసాగులో నిజంకాని అపోహలు:
శ్రీ వరిసాగు పొలంలో నీరు లోతుగా ఉండనవసరం లేదు. చేను పేరిగేటప్పుడు తడిగా ఉంటే చాలు. ఆ తరువాత 2.5 సెం.మీ వరకు నీరు ఉండాలి.శ్రీ వరిసాగుకు సాంప్రదాయ పద్ధతిలో వరి చేనుకు కావలసినంత నీటి లోతులో సగమయితే చాలు. ప్రపంచ వ్యాప్తంగా ఒక లక్ష మందికి పైగా ఈ శ్రీ వరిసాగు పద్ధతిని అనుసరించి లబ్దిపొందుచున్నారు. శ్రీ వరిసాగుకు కావలసిన నీరు తక్కువగా ఉండును. పైగా ఖర్చుకూడా తక్కువే. దిగుబడి మాత్రం ఎక్కువ. చిన్న రైతులకు శ్రీ వరిసాగు ఎంతో లాభదాయకం.
తూర్పు ఆఫ్రికా సమీపంలో ఉన్న మలగాసీ దీవి(మడగాస్కర్) లో శ్రీ వరిసాగు పద్ధతిని మొట్టమొదట అభివృద్ధి చేశారు. చైనా, ఇండోనేషియా, కంబోడియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, భారతదేశం వంటి అనేక ప్రపంచ దేశాల్లో ఈ శ్రీ వరి సత్తాను పరీక్షిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో 22 జిల్లాల్లో 2003 ఖరీఫ్ సమయంలో ప్రవేశ పెట్టగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించారు. శ్రీ వరిసాగు లో ప్రత్యేకంగా ఏవీ వాడనవసరం లేదు. శ్రీ వరిసాగు లో విత్తనాలను 25 సెం.మీ. విస్తిర్ణంలో తక్కువగా వరి మొక్కలు నాటిస్తే చాలు. సాంప్రదాయ పద్ధతిలో వరిసాగులో ఎకరానికి 20 కి.గా. విత్తనాలు వాడవలసి ఉంటుంది.
అంశాలు |
సాంప్రదాయ పద్ధతిలో |
శ్రీ |
మధ్య దూరం |
15x10 cm |
25x25 cm |
చదురపు మీటరు లో |
66 |
16 |
విత్తే మొక్కల సంఖ్య |
3 |
1 |
ఒక ఎకరంలో వచ్చే మొక్కల |
792000 |
64000 |
ఒక ఎకరానికి కావలసిన విత్తనాలు |
20 kg |
2 kg |
శ్రీ వరిసాగులో రసాయనిక ఎరువులు, సస్యరక్షణ ముందులు వంటి వాటికి అంతగా ఖర్చు ఉండదు. సుమారుగా శ్రీవరి సాగుకు 2 కిలోల విత్తనాలు సరిపోతాయి.
వేర్లు పెరుగుదల:
శ్రీ వరిసాగు పద్ధతిలో చేను ఏపుగా పెరుగుతుంది. సహజ పద్ధతిలో దాని వేర్లు పుష్కలంగా పెరుగుతాయి. లోపలి పొరల నుండి పోషకాలను వేర్లు గ్రహిస్తాయి. ప్రారంభ దశలో శ్రీ వరిసాగుకు ఎక్కువ మంది కూలీలు అవసరమవుతారు. ఊడ్పుకు, కలుపుతీతకు 50% శ్రామిక శ్రమ అవసరం.
- లాభం పొందడానికే ఎక్కువ మంది కూలీల అవసరం.
- కుటుంబంలోని అందరూ పని చేస్తే పేదరికానికి ప్రత్యామ్నాయమౌతుంది.
- ఇప్పటి వరిసాగు పద్ధతి కంటే ఒకసారి సరియైన నైపుణ్యాన్ని నేర్చుకుని పాటించిననాడు శ్రీ వరిసాగులో కూలీ ఖర్చు తగ్గుతుంది.
ఈ క్రింద వాటితో శ్రీ వరిసాగులో వరి మొక్క ఏపుగా పెరుగుతుంది.
- వేర్లు పుష్కలంగా ఉంటాయిపిలకలు వేయడం-బాగా పెరుగుతుంది:
పూత ప్రారంభంతో పిలకలు వేయడం కూడా ప్రారంభమౌతుంది. పాలు బాగా పోసుకొనడంతో పూత బాగా వచ్చి గింజ కడుతుంది. చేను పడిపోదు.
2002-2003 సంవత్సరంలో ప్రయోగస్థాయిలో లాంఛన ప్రాయంగా మొదలయింది. ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,పశ్చిమ బెంగాల్, జార్ఖండ్,ఛత్తీస్ఘడ్,గుజరాతు రాష్ట్రాల్లో శ్రీ వరిసాగు ప్రారంభమయింది.
ఆంధ్రప్రదేశ్ : డబ్యూ డబ్యూ ఎఫ్-ఆచార్య నాగార్జునా చార్య వ్యవసాయ విద్యాలయం సంయుక్త సహకారంలో వర్షాకాలం తరువాత వచ్చే రబీ సమయంలో శ్రీ వరిసాగు ప్రయోగాత్మకంగా ప్రారంభమయింది. డబ్యూ.డబ్యూ.ఎఫ్. వారి జూన్ 15, 2005 వార్తా పత్రికలో వినోద్గౌడ్ రాసిన వార్తా కథనం ప్రకారం 11 జిల్లాల్లో 250 మంది రైతులకు సహకారం అందింది. ఆయా పొలాలను సక్రమంగా సందర్శించడం వల్ల నీటి వాడకం తగ్గడంలోనూ, దిగుబడిలోనూ మంచి ఫలితాలు వెల్లడయ్యాయి. 2003 ఖరీఫ్ సమయంలో 22 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో శ్రీ వరిసాగు ప్రదర్శనా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మాండమైన స్పందన లభించింది. హెక్టారుకు 5 కి.గ్రా. వరి విత్తనం మాత్రమే వాడటం వల్ల 95% పొదుపు అయినట్లు ఫలితాలు చెబుతున్నాయి. పంటనీటిలో కూడా 50% పొదుపు అయింది. సగటున పంట దిగుబడి హెక్టారుకు 2 టన్నులు పెరిగింది. అయితే కలుపుతీతకు రోటరీ వీడర్ వాడటం వల్లనూ సన్నాకును ఊడ్పు చేయడంలోనూ వాటి యాజమాన్యంలో రైతులు కొన్ని ఇబ్బందులకు లోనయినారు. అయినా శ్రీ వరిసాగులో వరి మొక్కలు ఏపుగా ఉన్నాయని రైతులు పేర్కొనడం గమనార్హం. మహబూబ్వగర్ జిల్లా రైతు దామోదర్ రెడ్డి శ్రీ వరిసాగు చేపట్టి కేవలం మూడు వేల రూపాయిలు మాత్రమే కూలీగా యిచ్చి మామూలు దిగుబడి కంటే 30 బస్తాల ధాన్యం ఎక్కువ సాధించాడు. డబ్యూ. డబ్యూ. ఎఫ్. ఇక్రిసాట్ ప్రాజెక్టు విలేఖరి రమనపాడు రైతు సదస్సులో పేర్కొన్నట్లు ఈ జిల్లాల్లో శ్రీ వరిసాగు చేపట్టిన రైతులందరూ ఆనందంగా ఉన్నారు. ఈ విషయం డబ్యూ. డబ్యూ. ఎఫ్. వారి 2005 జూన్ 15వ వార్తా పత్రికలో ప్రచురితమైంది.
ఆంధ్రప్రదేశ్లో డబ్యూ.డబ్యూ.ఎఫ్. సహకారంతో వాసన్, సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఏ.) సుమారు వెయ్యి మంది రైతులకు శ్రీ వరిసాగులో మెళుకువలను నేర్పే నిమిత్తం మద్ధతునిస్తోంది. భారతదేశంలో శ్రీ వరిసాగు మేలును గ్రహించి ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మన రాష్ట్ర్రంలో శ్రీ వరిసాగును చేపట్టి ఫలప్రదమైన ఫలితాలు సాదధించడంతో శ్రీ వరిసాగు ప్రచారానికి 4 కోట్ల రూపాయిలు కేటాయించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి ప్రకటించారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న రైతు నాగరత్నం నాయుడుతో జరిగిన ఇష్టాగోష్ఠిలో శ్రీ వరిసాగు మంచి చెడ్డల వివరాలు వెల్లడయ్యాయి. ఫలితంగా ఈ ప్రకటన చేశారు.
(నవంబర్ 16, 2005 'ది హిందూ' పత్రిక).
తమిళనాడు:
తమిళనాడు లోని కిల్కులమ్ వ్యవసాయ కళాశాల పరిశొధన సంస్థలో 2003-2004లో జరిగిన ప్రయోగాల ఫలితంగా శ్రీ వరిసాగులో 53% పంట నీరు పొదుపు అవుతుందని తేలింది. 21 రోజుల ప్రాయంగల వరి మొక్కలను మామూలు పొలంలో 15-10 సెం.మీ విస్తీర్ణంలో పాతారు. శ్రీ వరిసాగులో 14 రోజుల ప్రాయంగల వరి మొక్కలను పాతారు. 2.5సెం.మీ లోతు నీరు పెట్టారు. పూత పూసేముందు తడి/పొడి ప్రత్యామ్న్యాయంగా ఉండటట్లు చూశారు. పంట కోత కాలం వచ్చేవరకు పంట నీటి సదుపాయం ఒకే విధంగా ఉండెటెట్లు చూశారు. మామూలు వరిసాగు పద్ధతిలో పంట కాలం అంతా 5 సెం.మీ లోతును పంట నీటిని ఉంచడం పరిపాటి. ఈ శ్రీ వరిసాగులో హెక్టారుకు 3892 కి.గ్రా దిగుబడి వచ్చింది. సాంప్రదాయ వరిసాగు కంటే ఇది 28% ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన ప్రయాగాలపై తమిళనాడు వ్యవసాయ విద్యాలయం వారు మూల్యంకనం చేసారు. దక్షిణ తమిళనాడు లోని తమిరపరణి నది ప్రాంతంలో శ్రీ వరి/సాంప్రదాయ కమతాల్లో వరి ప్రయోగాల మూల్యాంకణంలో దిగుబడులు క్రమంగా హెక్టారుకు 7227-5637 గా ఉన్నాయి. అంటే హెక్టారుకు 1570 కి. గ్రా. అత్యధికంగా ఉంది. శ్రీ వరిసాగు అత్యధిక దిగుబడి హెక్టారుకు 4036 కి. గ్రా. శ్రీ వరిసాగును చేపట్టిన రైతులు 31 మంది. శ్రీ వరిసాగు విధానాన్ని తమిళనాడు రాష్ట్రంలో ఒక సాంకేతిక (టెక్నాలజీ) సాగు విధానంగా చేపట్టవచ్చని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సిఫార్సు చేసింది. ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ శ్రీ వరిసాగును రాష్ట్ర రైతులకు అందజేయడానికి ప్రదర్శన (డెమో) కార్యక్రమాలు 2004లో చేపట్టారు.
పశ్చిమ బెంగాల్ :
పశ్చిమ బెంగాలు రాష్ట్రంలోని పురులియ జిల్లాలో ఝాల్దా, బల్రామ్పూర్ బ్లాకులలో 110 మంది రైతులు ఖరీఫ్ సమయంలో శ్రీ వరిసాగు చేసిన ప్రయోగాలపై ప్రధాన సంస్థ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం వల్ల శ్రీ వరిసాగు పద్ధతిని కొంతవరకైనా పాటిస్తే 32% అధిక దిగుబడిని సాధించ వచ్చునని తేలింది. బలరాంపూర్లో రైతులు 59 పొలం మడుల్లో సగటు దిగుబడి హెక్టారుకు 6282.65 కి. గ్రా. (49.5% అదధిక దిగుబడి) సాధించారు. సాంప్రదాయ సాగు పద్ధతిలో ఇది 4194.13 మాత్రమే అని గమనించాలి. ఎండుగడ్డి దిగుబడి శ్రీ వరిసాగులో హెక్టారుకు 5150 కి. గ్రా. కాగా సాంప్రదాయ సాగులో దిగుబడి 3456.87 కి. గ్రా. మాత్రమే. ఝాల్దు బ్లాకులో దిగుబడి 11.9% మాత్రమే. దానికి అనావృష్టి ఒక కారణమైతే ముదిరిన వరి మొక్కలు వాడటం వల్లనూ, ఒక్క సారి మాత్రమే కలుపు తీయడం వల్లకూడా కావచ్చు.
ఆనంద్ లోని గుజరాత్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిపిన పరిశోధనలవల్ల తేలినది ఏమిటంటే, సంప్రదాయ సాగుపద్ధతిలో దిగుబడి హెక్టారుకు 5840 కి. గ్రా.. శ్రీ వరిసాగులో 5813 కి. గ్రా. వచ్చింది. అధిక దిగుబడి లేకపోయినా నీటి వినియోగంలో 46% పొదుపు కనిపించింది.
పాండిచ్చేరి:
ఆరోవిల్లీలోని అన్నపూర్ణ పొలంలో శ్రీవరిసాగు ప్రయోగాలు చేశారు. బయోవిలేజ్లో ఎం.ఎస్.స్వామినాధన్ రీసెర్చ్ ఫౌండెషన్ చిన్నచిన్న మడులలో శ్రీసాగుపై ప్రయోగాలు చేసింది.
జార్ఖండ్:
శ్రీ సాగుపై ప్రధాన సంస్థ శ్రీవరిసాగు పద్ధతిని అవలంభించింది.
పంజాబ్:
లోధావాలా, లూధియానాలలో జె.డి.ఎం.ఫౌండేషన్ తక్కువ నీటితో వరిసాగును మరొక విధానాన్ని చేపట్టి ప్రయాగాలు చేస్తున్నట్టు డా. సుబిరేడర్ శర్మ చెప్పారు. వరిసాగు కాలంలో పంజాబ్ రాష్ట్రం నీటి సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి ఈవిధానం పరిష్కారమని శర్మ చెబుతున్నారు. ఈ పద్ధతివల్ల పొదుపు అవుతుందన్నారు.
ఆకుమడి యాజమాన్యం:
- ఎకరానికి రెండు కిలోగ్రాముల విత్తనం
- ఆకుమడి విస్తీర్ణం ఎకరానికి ఒక్క సెంటు నేల
- ఎత్తుగా తయారు చేసిన ఆకుమడిపై మొలకెత్తిన విత్తనాలు వేయాలి
- కూరగాయ పంట మడి వలె ఆకుమడిని తయారు చేసుకోవాలి
- సన్నగావున్న పెంట ఎరువును ఒక పొర వేయాలి
- మొలకెత్తిన విత్తనాలను పలుచగా విరజిమ్మాలి
- మళ్ళీ ఒక పొర పెంటను వేసి కప్పాలి
- పైన ఎండుగడ్డి వేసి కప్పాలి
- జగ్రాత్తగా నీటిని జల్లాల
- ఆకు తీత సమయాల్లోనూ, రవాణా సమయంలోనూ అరటిడొప్పను వాడ వచ్చు
పొలం తయారీ:
- మామూలు వరిసాగుకు పంట పొలాన్ని తయారు చేసుకొన్నట్లే పొలాన్ని తయారు చేసుకోవాలి.
- పంట నీరు ఒకే విధంగా పారేటట్టు నేల మట్టాన్ని తయారు చేయాలి.
సంబంధిత సమాచార వనరులు
http://apagrisnet.gov.in/sreevari2.jsp?mode=sree1
(తమిళనాడు, కావేరి డెల్టా ప్రాంతములో ఉన్న ఒక గ్రామములో ఎస్.గోపాల్ గారిచే అభివృద్ధి చేసి అభ్యాసం చేసిన విధానము)
దిగుబడి పెంచే శ్రీ ’ వరి సాగు (ఎస్. ఆర్. ఐ) పధ్ధతిలోని ఆలోచనా విధానాన్ని, అభ్యాసాల్ని మరియు ఉపాయాల్ని ఉపయోగించి అభివృద్ధి చేసిన ఈ విధానం కావేరి డెల్టా ప్రాంతపు పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా రూపొందించారు .
దిగుబడిని పెంచే శ్రీ వరి సాగు విధానంలో రైతుల సమస్యలు/బెంగలు : ‘శ్రీ’ (ఎస్. ఆర్. ఐ) విధానంలో తెలిపిన విధంగా రెండు ఆకుల లేత వరి నారుని నాటితే, తీవ్రమైన ఎండకి మరియు నిరంతర గాలివలన లేత వరి నారు ఎండి పోతుంది.
ఈ సమస్యకి అనువైన పరిష్కారం : మొదటి రెండు వారములు ఐదు వరి మొక్కల్ని కలిపి నాటడం వలన ఎండ మరియు గాలి వలన రక్షణ కల్గించవచ్చు. రెండు వారముల తరువాత బలంగా తయారైన వరి మొక్కల్ని ఒక్కటొక్కటిగా తిరిగి నాటాలి. దీని వలన వరి మొక్కలు చావ కుండా త్వరగా పెరుగుతాయి.
ఈ విధానములోని లోపం : రెండవసారి వరి మొక్కల్ని నాటడానికి కావలసిన అదనపు శ్రమ ఉన్నప్పటికిని, ఎక్కువ దిగుబడి ముందు ఈ అదనపు శ్రమ ఖర్చు పెద్దదేమీ కాదని రైతులు భావి స్తున్నారు.
ఫలితం : ఈ విధానములో ఒక హెక్టారుకి సగటున 7.5 టన్నుల దిగుబడిని ఇస్తుంది.
ఈ విధానంలో అనుసరించవలసిన సాంకేతిక మె ళ కువలు :
నారుమడి తయారుచేయు విధానము :
నారుమడి వేసే పద్ధతి :
మొదటిదశ వరి మొక్కల్ని నాటే విధానం :
రెండవ దశ వరి మొక్కల్ని నాటే విధానం / పద్ధతి :
రెండు సార్లు వరి నాటడం వలన ఉపయోగాలు :
కలుపు మొక్కల యాజమాన్యం :
రెండవ దశ వరి మొక్కల్ని నాటిన తరువాత, పదవరోజు మొక్కల వరుస వెంబడి మరియు అడ్డంగా కోనో-వీడరుని(యంత్రం) మూడు నుంచి నాలుగు సార్లు రెండు దిశలలో లాగాలి. ఈ కలుపు మొక్కలు తీసే విధానం ఒకసారే అవసరమవుతుండడంతో ఒక హెక్టారుకు పది శ్రమ రోజులు ఆదా అవుతుంది.
నీటి పారుదల :
మట్టిని ఆరనివ్వకుండా అప్పుడప్పుడు నీటిని పెడుతూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఎక్కువ నీటితో తడప రాదు. ఇది సుమారు ఐదు వందల మిల్లీ మీటర్ల సేద్యపు నీటి అవసరాల్ని తగ్గిస్తుంది.
ఎరువులు వేసే విధానం :
గమనిక : ప్రభుత్వము వ్యవసాయ సిబ్బంది అయిన రాజేష్ కుమార్ మరియు సౌరవ్ నాయక్ లు కదిరామంగళం గ్రామం నుంచి ఈ సమాచారాన్ని ఇచ్చారు. తమిళనాడు, కావేరి డెల్టా ప్రాంతములో నున్న ఒక గ్రామములో బి.ఎస్.సి (బ్యాచ్లర్ ఆఫ్ సైన్స్) పట్టభద్రుడైన ఎస్.గోపాల్ గారిచే అభివృద్ధి చేసి అభ్యాసం చేసిన వరి దిగుబడి పెంచే ఈ సవరించిన విధానం కావేరి డెల్టా ప్రాంతపు పరిస్థితులకు అనుగుణంగా ఉందని చెప్పారు.
ఆధారం: ciifad.cornell.edu
భారతీయ వ్యవసాయదారుల అనుభవాలు
శ్రీ గుల్లాని మహేష్ |
వయస్సు – 22 సంవత్సరాలు |
సంప్రదించవలసిన చిరునామా – మధుబాబు, డిఏఏటిటిసి, నల్గొండ, ఆంధ్రప్రదేశ్ , ఫోన్ నెంబరు-99896 23815 |
గులాని మహేష్ కు నాలుగు ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. అందులో మూడు ఎకరాలు వరి సాగు చేస్తున్నాడు. ఇతని పొలానికి నీరు, బోరు బావి నుండి లభిస్తుంది. ఇతను ఎకరానికి డిఏపి 75 కేజీలు, యూరియా 75 కేజీలు మరియు యంఒపి 25 కేజీలు వాడారు. ఇతను నీటిని ఎక్కువగా పెట్టే పద్ధతి అంటే సాంప్రదాయ పద్ధతిలో ఎకరానికి 2.2టన్నుల పంటను పండించాడు.
గులాని మహేష్ కు శ్రీ వరిసాగు పద్ధతి గురించి వ్యవసాయ శాఖ, దిన పత్రికలు మరియు ఈటివి టెలివిజన్ ద్వారా తెలుసుకున్నాడు. 2006 సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ లో స్థానిక వ్యవసాయాధికారి సలహాలు-సూచనలు తీసుకుని ఈ వరిసాగు పద్ధతిని ఆచరణలో పెట్టాడు. శ్రీ వరిసాగు కోసం మొదటిగా ఒక ఎకరాన్ని ఎంచుకున్నాడు. శ్రీ వరిసాగు కోసం వివిధ రకాల విత్తనాలు ఐ.ఆర్-64, యంటియు-1010 మరియు యంటియు-1081 ను ఉపయెగించాడు. ఇతను డిఏపి-20 కేజీలు, వర్మీకంపోస్ట్ (ఎకరానికి –ఏడు క్వింటాల్స్), అజోల్లా (నాలుగు టన్నులు), పంచగవ్య ( నాటిన పదిహేనవ రోజు నుండి పుష్పించేవరకు 15 రోజులకొకసారి), కార్బెండజిమ్ తో విత్తన శుద్ధి చేయడం, జింకు సల్ఫేట్ ను చల్లడం (0.2%) వంటి పద్ధతులు పాటించాడు. పొలంలో కలుపు మొక్కలను తొలగించడానికి కోనోవీడర్ అనే కలుపుతీసే పరికరాన్ని వాడారు. ఎకరానికి 2.8 టన్నుల పంటను పండించాడు.
మధ్య వరుసలో ఫాంయార్డు మేన్యూరు (FYM) ను చల్లిన వెంటనే కలుపుతీత పరికరంను ఉపయోగించేవారు. ఈ పరికరం కలుపుమొక్కలను తొలగిస్తుంది. మరియు ఉప్పు చౌడు ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇతను వరి వంగడాలను నాటడానికి మార్కరు బదులుగా తాడును వాడాడు.
లాభాలు |
నేర్చుకున్న పాఠాలు |
|
|
వివరాలు |
సాగుకు అయ్యే ఖర్చు ( ఒక ఎకరానికి ) ( రూ. ) |
|
సాంప్రదాయ పద్ధతి |
శ్రీ వరి సాగు |
|
వ్యవసాయ సాగు పనులు |
||
దుక్కి దున్నడం |
1,800 |
1,800 |
విత్తనాలు |
400 |
50 |
నారుపోయడం, నాటడం |
1,000 |
800 |
కలుపు తీయడం |
1,200 |
500 |
పంటను కాపాడే రసాయనకాలు |
800 |
400 |
పంటకోత, పంటనూర్పిడి |
2,000 |
2,000 |
మొత్తం |
7,200 |
5,550 |
ఫలసాయం , పంట రాబడి, ఆదాయం |
||
ఫలసాయం (ఎకరానికి) |
2.24 |
2.80 |
మొత్తం ఆదాయం – క్వింటాల్ రూ.930 చొప్పున |
20,832 |
26,040 |
ఖర్చుపోను వచ్చిన ఆదాయం |
13,632 |
20,490 |
మర్రి వెంకన్న |
వయస్సు – 30 సంవత్సరాలు |
సంప్రదించవలసిన చిరునామా- మధుబాబు, డిఎఎటిటిసి, నల్గొండ, ఆం.ప్ర. ఫోను- 9989623815 |
మర్రి వెంకన్న తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని కల్గి ఉన్నాడు. అందులో రెండు ఎకరాలలో వరిసాగు చేస్తున్నాడు. వరిసాగుకు అవసరమైన నీటిని తన బోరు బావినుండి వాడుకుంటాడు. ఇతను సాంప్రదాయ పద్ధతిలో వరిసాగు చేయడం వల్ల ఎకరానికి 2.4 టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నాడు.
ఇరుగు పొరుగు రైతులు మరియు డిఎఎటిటిసి వారి ద్వారా శ్రీవరి సాగు గురించి తెలుసుకున్నాడు వెంకన్న. తరువాత డిఎఎటిటిసి అధికారులు ఇచ్చిన శిక్షణ తరువాత 2004 సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ లో ఈ వరిసాగును ప్రారంభించాడు. ఇతను శ్రీవరి సాగును ఆరు సీజన్లలో పంట పండించాడు. ప్రస్తుతం శ్రీవరి సాగు ద్వారా ఇతను ఎకరానికి 3.1 టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నాడు. ఇతను ధాన్యంలో వివిధ వెరైటీలైన బిపిటి-5204, యంటియు-1010 మరియు కృష్ణ హంస ధాన్యాన్ని పండించాడు. దానికి గాను డిఎపి-50 కేజీలు, యూరియా -100 కేజీలు మరియు జింకు సల్ఫేట్ -10 కేజీలు మరియు ఫామ్ యార్డ్ మాన్యుర్ (ఎఫ్ వై ఎమ్)/సేంద్రీయ ఎరువు -2.5 టన్నులు వాడాడు. శ్రీ వరి సాగు పద్థతులతో పాటు కోనో-కలుపుతీత పరికరాలు మరియు మార్కర్ ఉపయోగించాడు.
లాభాలు |
నేర్చుకున్న పాఠాలు |
శ్రీ వరిసాగు పద్ధతి లో వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, వివిధ రకాలై పెట్టుబడి ఖర్చు తగ్గింది, దానితో పాటు పంట ఉత్పత్తి పెరిగింది
|
|
కోనోవీడర్ –కలుపుతీసే పరికరం ఉపయోగించడం చాలా కష్టం మరియు మార్కరును ఉపయోగించడం చాలా కష్టం
వివరాలు |
సాగుకు అయ్యే ఖర్చు ( ఒక ఎకరానికి ) ( రూ. ) |
|
సాంప్రదాయ పద్ధతి |
శ్రీ వరి సాగు |
|
వ్యవసాయ సాగు పనులు |
||
దుక్కి దున్నడం |
1,200 |
1,500 |
విత్తనాలు |
450 |
50 |
నారుపోయడం, నాటడం |
1,000 |
700 |
కలుపు తీయడం |
1,200 |
500 |
పంటను కాపాడే రసాయనకాలు |
1,600 |
1,000 |
పంటకోత, పంటనూర్పిడి |
2,000 |
2,000 |
మొత్తం |
7,450 |
5,750 |
ఫలసాయం , పంట రాబడి, ఆదాయం |
|
|
ఫలసాయం (ఎకరానికి) |
2.45 |
3.15 |
మొత్తం ఆధాయం – క్వింటాల్ రూ.930 చొప్పున |
23,030 |
29,610 |
ఖర్చుపోను వచ్చిన ఆదాయం |
15,580 |
23,860 |
మెరుగు నారాయణ |
వయస్సు – 62 సంవత్సరాలు |
సంప్రదించవలసిన చిరునామా – శ్రీ అనిల్ కుమార్, ఏయంఇ, మహబూబ్ నగర్, ఆం.ఫ్ర., పోను- 9885682301 |
మెరుగు నారాయణ కు 11 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. అందులో నాలుగు ఎకరాలలో వరిసాగు చేస్తాడు. అతని వ్యవసాయానికి నీటి ఆధారం బావి, బోరు బావి. ఇతను రసాయనక ఎరువులు, డిఎపి వాడతాడు. ఇతను సాంప్రదాయ పద్ధతిలో వరిసాగు చేస్తే ఎకరానికి 18.6 క్వింటాళ్ళు పండించాడు.
ఇతను శ్రీ వరి సాగు గురించి మహబూబ్ నగర్ లో ఉన్న ఎ.యం.ఇ పౌండేషన్ వారి ద్వారా తెలుసుకున్నాడు. ఇతనికి శ్రీవరి సాగు గురించి మరింత ఆసక్తి పెంచుకున్నాడు. తనకున్న 0.5 వ్యవసాయ భూమిలో ప్రయోగాత్మకంగా శ్రీవరి సాగును ప్రారంభించాడు. అదే ప్రాంతంలో పని చేస్తున్న ఎ.యం.ఇ ఫౌండేషన్ వారు సమయానుకులంగా సాంకేతిక సలహాలు ఇచ్చారు. శ్రీవరి సాగులో ఈ క్రింద పేర్కొన్న పద్ధతులను అతను పాటించాడు :
పైన పేర్కొన్న పద్ధతులు పాటించుట వల్ల పంట ఎకరానికి 25.9 క్వింటాళ్ళు దిగుబడి వచ్చింది.
మార్కరు పరికరం బదులు స్థానికంగా తయారయిన తాడును మార్కరుగా ఉపయోగించాడు
లాభాలు |
నేర్చుకున్న అంశాలు |
|
సాంప్రదాయమైన నమ్మకం ఏమిటంటే వరి నీటిని ఎక్కువగా కోరుకుంటుందని, అయితే ఉష్ణమండల ప్రాంతంలో పరిస్థితులను బట్టి అంటే తక్కువ నీరు లభించే ప్రాంతంలో కూడా వరిని పండించవచ్చని మెరుగు నారాయణ అంగీకరించాడు. |
వివరాలు |
సాగుకు అయ్యే ఖర్చు ( ఒక ఎకరానికి ) ( రూ. ) |
|
సాంప్రదాయ పద్ధతి |
శ్రీ వరి సాగు |
|
వ్యవసాయ సాగు పనులు |
||
దుక్కి దున్నడం |
1,500 |
1,500 |
విత్తనాలు |
390 |
26 |
నర్సరీ నిర్వహణ |
250 |
100 |
నాటడం |
600 |
440 |
ఎరువులు |
1,500 |
1,250 |
కలుపు తీయడం |
600 |
480 |
పంటను కాపాడే రసాయనకాలు |
360 |
200 |
సాగునీటి కాల్వల ఖర్ఛులు |
750 |
250 |
పంటకోత, |
650 |
650 |
పంటనూర్పిడి, వేరు చేయడం |
300 |
300 |
రవాణా ఖర్చులు |
800 |
800 |
మొత్తం |
7,700 |
5,996 |
ఫలసాయం , పంట రాబడి, ఆదాయం |
|
|
ఫలసాయం (ఎకరానికి టన్నులు) |
1.86 |
2.59 |
మొత్తం ఆధాయం – క్వింటాల్ రూ.680 చొప్పున |
9,768 |
18,812 |
ఖర్చుపోను వచ్చిన ఆదాయం |
6,148 |
12,816 |
అనిల్ చాంగుమయి
అనిల్ చాంగుమయి |
వయస్సు – 42 సంవత్సరాలు |
సంప్రదించవలసిన చిరునామా – డా. ప్రదీప్ కుమార్ బోరా, సైంటిస్టు(ఇంజనీరింగు), డిపార్టుమెంట్ ఆప్ ఎగ్రికల్చరల్ ఇంజనీరింగు, అస్సాం ఎగ్రికల్చరల్ యూనివర్సిటి, జోర్హట్ -13, అస్సాం, ఫోనునెంబరు - 9435361070 |
అనిల్ ఆరు ఎకరాలు వ్యవసాయ భూమిని కల్గి ఉన్నాడు. అందులో 3.7 ఎకరాల భూమిలో వరిని పండిస్తాడు. ఇతను వర్షధార వ్యవసాయ పద్దతులు పాటిస్తాడు. రబీ పంటల కోసం ఇతను ఇటివల తన పొలంలో వాననీటి సంరక్షణ కోసం ఒక స్ట్రక్చర్ కట్టుకున్నాడు/ నిర్మాణం ఎర్పర్చుకున్నాడు . ఇతని వరి పంట మాత్రము వర్షధారంమీదనే ఆధార పడి ఉంది. సరియైన టోపోగ్రఫీ ఉండడం వలన వర్షకాలంలో వర్షం నీటిని ఇతను క్రమబద్ధికరించుకోగలడు. ఇతను ఫాంయార్డుమాన్యుర్(యఫ్.వై.యం)., యూరియా, యస్.యస్.పి., మరియు యం.ఒ.పి వంటి ఎరువులుఉపయోగించేవాడు. సాంప్రదాయ విత్తనాలకైతే ఎకరానికి ఆరు నుండి తొమ్మిది క్వింటాళ్ళు ధాన్యం అదే హైబ్రీడు వెరైటీ కైతే ఎకరానికి 12 నుండి 16 క్వింటాళ్ళు పండించేవాడు.
అనిల్ చాంగుమయి కి శ్రీవరిసాగు గురించి చెప్పారు మరియు శ్రీవరిసాగు గురించి స్థానిక భాషలో అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన డా.ప్రదీప్ కుమార్ బోరా రాసిన వ్యాసాన్ని కూడా అతనికి ఇచ్చారు. అంతేకాకుండా డా.మోహన్ శర్మ మరియు డా.ప్రదీప్ కుమార్ బోరా శ్రీవరిసాగు గురించి ఇచ్చిన రేడియో ప్రసంగాన్ని కూడా అనిల్ విన్నారు. వేసవి కాలం నుండి వర్షకాలం మధ్య కాలంలో అనిల్ స్వంతగా సివి లఛిట్ అనే వరి వంగడంతో శ్రీవరిసాగు చేశారు. కాని సరిగ్గా లేని నారుమడి నిర్వహణ తో ఇతను పంటను పండించుటలో విఫలుడయ్యాడు. విఫలమయిన అనుభవంతో డా.బోరా గారి దగ్గర శిక్షణ పొందాడు. 2008 ఖరీఫ్ సీజన్ లో సివి రంజిత్ అనే వరి వంగడంతో వర్షధార పరిస్థితులలో, మంచి నీటి క్రమబద్దీకరణతో, ఎకరానికి 0.6 టన్నుల ఇచ్చే భూమిలో శ్రీవరి సాగు చేశాడు . పది రోజులు వయస్సు గల వరి మొక్కను 30 సెంటీమీటర్లు అంతరం ఉండేటట్టు నాటాడు. ఇతను చేస్తున్న నూతన పద్ధతులను చూసి గ్రామస్తులందరు నవ్వారు, ఇతనికి పిచ్చి పట్టిందని ప్రచారం చేశారు. ఇతను శ్రీ వరిసాగును 1.5 బిగాస్ అంటే 0.48 ఎకరాలు భూమిలో వేశాడు. ప్రస్తుతం పంట పండుతున్న దశలో ఉంది. 32 నుండి 55 పిలకలు అతను గుర్తించాడు. శ్రీవరిసాగు చేస్తున్న పంట ప్రక్కనే అతను సాంప్రదాయ పద్ధతిలో రంజిత్ అనే వరి వంగడాన్ని సాగు చేస్తున్నాడు. అక్కడ పిలకలు చూస్తే 20 కంటే ఎక్కువ లేవు. అతను చాలా గర్వంగా ఆ తేడాను అందరికి చూపిస్తున్నాడు. మత పరమైన ఫంక్షన్ జరిగినప్పుడు చుట్టుప్రక్కల నాలుగు గ్రామాల నుండి వచ్చిన గ్రామస్తులు అతను సాగు చేస్తున్న శ్రీవరి పంటను సందర్శించారు. అంతేకాకుండా సాంప్రదాయ వరిసాగు కంటే శ్రీవరిసాగు పంట ముందే పండిది అని గమనించాడు (రెండు పొలాల్లో ఒకే సారి నాటు వేశాడు). ఇతను శ్రీ వరి సాగు పద్ధతులలో ప్రత్యక పరికరాలు, యంత్రాలు ఉపయోగించాడు. అస్సాం ప్రభుత్వం, వ్యవసాయ శాఖ వారి సహకారంతో జపానీస్ వారి కలుపు తీసే యంత్రంను తీసుకున్నాడు. దానినే తన పొలంలో ఉపయోగించాడు.
ఇతను 12 రోజుల వయస్సు గల వరి మొక్కలను కొన్ని ప్లాట్లలో 35 X 30 సెం.మీ నుండి 35 X 40 సెం.మీ అంతరం ఉండేటట్టు నాటారు. కలుపు మొక్కలకు ఉన్న తెగుళ్ళు వలన మొలకలకు ఎక్కువ లబ్థి జరుగలేదు. 25 సెంమీ X 25 సెం.మీ అంతరంతో మొక్కలు నాటడం వల్ల ఎక్కువ సంఖ్యలో మొలకలు ఉండి ఎక్కువ దిగుబడి ఇస్తాయని ఆశించడం జరిగింది.
ఈ పొలంలో ఇలాంటి ఆరోగ్యమైన పంటను ఇంతవరకు చూడలేదని గ్రామస్ధులు చెప్పారు. ఇలాంటి పౌష్టికత లేని భూమిలో , సాంప్రదాయ వరిసాగు బాగుండడంలేదు. గ్రామమంతా అంతగా పౌష్టికత లేని మధ్యమ రకం భూమిలోనే ఉన్నందువలన ఎకరానికి 6 నుండి 8 క్వింటాళ్ళు మాత్రమే పంట దిగుబడి వస్తుంది. ప్రస్తుతం రైతులు శ్రీవరిసాగు గురించి , అనిల్ లాగా వచ్చే సంవత్సరం నుండి తమ పోలాల్లో శ్రీవరి సాగు పద్దతులు ప్రారంభించడం గురించి చర్చించుకుంటున్నారు.
నాటు వేసేటప్పుడు మరియు కలుపు తీయడం లో అడ్డంకులు ఎదుర్కొనినట్లు చాంగుమయి చెబుతున్నారు. చాంగుమయి శ్రీవరి సాగుచేస్తున్న పొలంను చూసి అతనికి వరిసాగు గురించి చెప్పడానికి డా.బోరా వెళ్ళినప్పుడు తన కొడుకుకు మహిళలను కష్టపెట్టే వరి సాగు విధానం నేర్పించినందుకు చాంగుమయి తల్లి డా.బోరాను తిట్టినది. కాని తరువాత ఆమె తన మధ్యస్ధ , పౌష్టకత లేని భూమి పై మంచి పంట మరియు దిగుబడి వచ్చినందుకు తన సంత్రప్తిని వ్యక్తం చెసింది. చాంగుమయి కలుపు నియంత్రణ కొరకు జపానీస్ వారి కలుపు తీసే యంత్రాన్ని వాడాడు. కాని ఆ యంత్రం కలుపు ఎక్కువగా లేదా దట్టంగా ఉన్నప్పుడు సరిగ్గా పనిచేయలేదని అతను చెప్పాడు . అతను మిగతా రెండ ప్లాట్లలో మూడవ సారి కలుపుతీయకుండా వదిలేసాడు.
వ్యవసాయ పనులు |
సాంప్రదాయ వరిసాగు |
శ్రీవరిసాగు |
నారుమడి |
ఫాంయార్డుమన్యూర్ తక్కువ ఇచ్చారు |
ఫాంయార్డుమన్యూర్ ఎక్కువగా ఇచ్చారు |
విత్తనాలు -మెలకత్తడం |
30-35 రోజుల వయస్సు గల నారును బలంగా పీకడం, నారు వ్రేళ్ళను కడగడం, అన్నింటిని కలపడం, మూటలు కట్టి తీసుకెళ్ళడం |
విత్తనం చల్లిన 10-12 రోజలు తరువాత విత్తనంలో మొలకెత్తిన మొక్కను వ్రేళ్లు మరియు వ్రేళ్ళుతో పాటు ఉన్న మట్టితో సహ వేరు చేయడం, దానిని బుట్టల ద్వారా తీసుకెళ్ళడం |
మొక్కలను పొలంలో నాటడం |
ఒక రాత్రి తరువాత వరి నారు మొక్కలను మూటలు కట్టి, వాటిని పొలంలో ఒకే చోట రెండు లేదా నాలుగు మొక్కలు నాటతారు |
ప్రధాన వేళ్ళు దెబ్బతినకుండా మొక్కలు నాటతారు, 25 సెంమీ X 25 సెం.మీ అంతరం ఉండేవిధంగా, నారు నుండి వేరు చేసిన మొక్కను 30 నిమిషాలలో పొలంలో నాటతారు. |
నీటి నిర్వహణ |
సాంప్రదాయ పద్దతిలో సాగు చేస్తారు, నీటతో పొలం నింపుతారు, పొలంలో నీరు లేనప్పుడు నీటితో నింపుతారు |
పూర్తి పంట కాలంలో నీటితో పొలం నింపడం పూర్తిగా అంగీకరించరు. అలాగే పంట పూర్తిగా ఎండినట్టుగా ఉండటాన్ని అంగీకరించరు |
కలుపుతీయడం |
కలుపు తీసే యంత్రాలను ఉపయోగించలేదు |
పొలంలో మొక్కలు నాటిన 12 రోజుల నుండి ప్రతి సారి 10-15 రోజుల వ్యవధి ఉండే విధంగా మూడు సార్లు కలుపు యంత్రంతో కలుపు మొక్కలను తొలగిస్తారు. |
శ్రీ అమర్ సింగ్ పటేల్ - చత్తీస్ గఢ్
శ్రీ అమర్ సింగ్ పటేల్ |
వయస్సు - 52 సంవత్సరాలు |
సంప్రదించవలసిన చిరునామా – శ్రీ జాకబ్ నెల్లితనం, కో - ఆర్డినేటర్, రిచారియా క్యాంపెయిన్, బి -3, పారిజాత కాలనీ, నెహ్రూ నగర్, బిలాస్ పూర్, చత్తీస్ ఘర్495001 -, పోన్ నెంబరు -9425560950 |
అమర్ సింగ్ వరిసాగు చేసే రైతు, చలి కాలం మరియు వేసవికాలంలో ఇతను కూరగాయలు పండిస్తూ ఉంటాడు. ఇతనికి 4 ఎకరాలు వరిపండే భూమి ఉంది. అందులో ఒక ఎకరం కాలువ ప్రక్కన ఉంది. ఈ భూమి పూర్తిగా ఇసుక. దీనిలో పంటకు అవసరమైన నీరును ప్రక్కనే భావి నుండి తోడతారు. మిగతా భూమికి నీటిపారుదల లేదు. ఇతను నీటిపారదల వల్ల ఎకరానికి 10-12 క్వింటాళ్ళు పంట దిగుబడిని పొందుతాడు. తక్కువ రసాయనిక ఎరువులు (ఫెర్టిలైజర్స్) వాడుతాడు మరియు సేంద్రియ ఎరువులు (ఫామ్ యార్డ్ మాన్యూర్) వాడుతారు.
2006 సంవత్సరంలో జరిగిన గ్రామ సభ లో బిలాస్ పూర్ లోని జన స్వస్థ్య సహయోగ్ ( జె.యస్.యస్) అనే సంస్థ వారు సేంద్రియ వ్యవసాయ పధకం లో భాగంగా అమర్ సింగ్ కు శ్రీవరిసాగు గురించి చెప్పారు. జె.యస్.యస్ సంస్థ నుండి ప్రయోగం కోసం విత్తనాలు తీసుకుని ,వాటిని వదిలేశాడు. అదే గ్రామంలో ఇద్దరు రైతులను ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా ఉపయోగించి విజయం సాధిండం చూసాడు . అది చూచి, 2007 లో అమర్ సింగ్ తన 0.12 ఎకరాల భూమి లో మొదటి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నానికి డి.ఆర్.కె అనే వరి వంగడాన్ని ఎంపిక చేసుకున్నాడు. జె.యస్.యస్ సంస్థ వారు అమర్ సింగు కు పూర్తి సలహాలు, సూచనలు ఇచ్చారు. వారు చెప్పిన విధంగానే సింగు శ్రీవరి సాగుపద్ధతులన్ని పాటించాడు. జె.యస్.యస్ సంస్థ వారు అందించిన రోటరీ కలుపు యంత్రాన్ని రెండు సార్లు ఉపయోగించాడు. కొంచెం ఆలస్యంగా ఈ యంత్రాన్ని ఉపయోగించాడు. రెండు సార్లు యంత్రాన్ని, ఒకసారి కూలీలను పెట్టి కలుపు తీయించాడు. పంట అంతా ఒక ఎత్తులో లేదు. ఎందుచేతనంటే పొలంలోని మట్టంతా ఎగుడుదిగుడుగా ఉంది. ఐనప్పటికి, ఐదు బస్తాలు అంటే 3.5 క్వింటాళ్ళు పంట దిగుబడి వచ్చింది. పంటకోతకు కూలీల ఖర్చు పంట నూర్పిడి తరువాత ధాన్యంలో ఆరవ వంతు. అనుకున్న పంట దిగుబడి ఎకరానికి 3.2 -3.5 టన్నులు. సేంద్రీయ ఎరువులు (ఫాంయార్డు మాన్యూరు) మాత్రమే ఉపయోగించారు. పురుగుల నియంత్రణ కొరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
2008 ఖరీఫ్ సీజన్ లో ఒక ఎకరంలో శ్రీవరిసాగు పద్ధతులను వివిధ సమయాలలో వివిధ ప్లాట్లలలో వేశాడు. మొదటి ప్లాట్లలో 0.3 ఎకరాలలో మొక్కలను సరియైన సమయంలో నాటాడు. అలాగే కలుపు కూడా తీయించాడు. మిగితా ప్లాట్లలో బాగా ఆలస్యం జరిగింది. మొదటి ప్లాటులో పంట దిగుబడి ఎకరానికి 3.5-4 టన్నులు వచ్చింది. వర్షధార ప్లాట్లలో మొక్కలు నాటడం ఆలస్యమయినది, పురుగులు విపరీతంగా ఉన్నాయి. వర్షపాతం లేదు. ఈ ప్లాట్లలో ఎకరానికి 2.5 టన్నుల దిగుబడి వచ్చింది.
నేర్చుకున్న పాఠాలు
కలుపు తీసివేత మరియు వరి నాటే కొత్త పధ్ధతిని నేర్చుకున్నారు.
పొలంను సరిగ్గా చదును చేయకపోవడం వల్ల, సమాంతరంగా లేక పోవడం వల్ల పంట ఎగుడుదిగుడుగా వచ్చింది.
శ్రీ గిరీష్ మన్సిరావ్ చౌదరి |
వయస్సు – 28 సంవత్సరాలు |
సంప్రదించవలసిన చిరునామా - సచిన్ పఠ్వర్థన్, బైఫ్ డెవలప్ మెంట్ రిసెర్చి పౌండేషన్ |
గిరీష్ ఏడు ఎకరాల భూమిని కల్గి ఉన్నాడు. అందులోఒక ఎకరం భూమి లో వరిసాగు చేస్తున్నాడు. ఈ భూమి వర్షాధార భూమి, సాంప్రదాయ వ్యవసాయం చేస్తూ ఇతను హైబ్రిడు రకం మేలైన విత్తనాలు ఉపయోగిస్తూ ఉంటాడు. ఇతను ఎకరానికి 15 క్వింటాళ్ళు పంటను పండిస్తున్నాడు.
బైఫ్ డెవలప్ మెంటు రిసెర్చి పౌండేషన్ వారి సహకారంతో స్థాపించబడిన ధృవ సంస్థ వారి నుండి గిరీష్ శ్రీ వరి సాగు గురించి తెలుసుకున్నాడు. 2007 నైఋతి రుతుపవనాల సమయంలో ఒక సీజనులో మాత్రమే శ్రీ వరిసాగు పద్ధతిని పాటించాడు. ఐతే ఇతను భూమి చదునుచేయడానికి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించాడు. చెక్క నాగలి తో భూమిని దున్నాడు. కలుపును చేతితో తీసివేశాడు. ఈ కింది పద్ధతులను అతను శ్రీవరి సాగు లో ఉపయోగించాడు.
సురుచి అనే హైబ్రీడ్ విత్తనాలు గిరీష్ ఉపయోగించాడు. కొన్ని కీటకాలు కాండం తొలిచే పురుగులు, దోమపోటు, తెగుళ్ళు ను గుర్తించాడు. ఇవి అంత పెద్ద ప్రభావం చూపలేదు. అందువల్ల వరిమొక్క సంరక్షణ కొరకు ఎటువంటి సస్యరక్షణా చర్యలు చేపట్టలేదు. కీటకాలను తినే బ్లిస్టర్ బీటల్స్ (Blister beetles) మరియు లేడి బర్డ్ బీటల్స్ (Lady bird beetles) సహజంగా పొలం దగ్గరకు చేరి దోమలను, కీటకాలను తిన్నాయి.
గిరీష్ కి పంపు, డిసెల్ ఇంజిన్ మరియు పైపులైను కల్గి ఉన్నాడు. నీటి ఎద్దడి కాలంలో తన పొలానికి నీటిని అందించగలిగాడు. అది ఎప్పుడంటే ధాన్యం కంకికడుతున్న సమయంలో. ఫలితంగా అధిక స్థాయిలో పంట దిగుబడి అంటే ఎకరానికి 38 క్వింటాళ్ళు ధాన్యాన్ని పండించగలిగాడు. ఇలాంటి నీటి ఎద్దడి ప్రాంతాలలో, వర్షాధార మెట్టభూములలో శ్రీ వరిసాగు పద్ధతి మంచి ఫలితాలను ఇవ్వగలదు.
మొదటి సంవత్సరంలో శ్రీ వరి సాగులో వర్మికంపోస్టు వాడినప్పుడు ఎక్కువ సమయం పడుతుందని రైతులు గుర్తించారు. అంతేకాకుండా కుటుంబంలో ఎవరైతే వరిసాగులో వివిధ దశలలో పాల్గొంటారో వారికి వరిసాగు నైపుణ్యాలు అవసరమని అతను అనుకుంటున్నాడు.
వివరాలు |
సాంప్రదాయక పద్దతిలో వరిసాగు |
శ్రీ వరిసాగు |
నారుమడి |
బయోమాస్ కాల్చిన చోట కొంచెం వాలుగా ఉన్న చోట నారు దిబ్బ ఏర్పాటుచేస్తారు |
నాటు వేసే పొలంలోనే నారు మడి వేస్తారు. |
సేంద్రియ వ్యర్థ పదార్థాలు మరియు ఎరువులు |
సేంద్రియ ఎరువు కొంచెం లేదా అసలు వాడరు, అదే విధంగా రసాయనక ఎరువులు |
పంట చదును చేసేటప్పుడు వర్మి కంపోస్టు ఎకరానికి రెండు టన్నులు ఉపయోగిస్తారు. సేంద్రియ ఎరువులను కూడా ఉపయోగిస్తారు. |
మొలకెత్తిన మొక్కలు మరియు వాటిని నాటడం |
25-30 రోజులు |
12-15 రోజులు |
మొక్క దుబ్బుకు ఉన్న పిలకల సంఖ్య |
4-6 |
1 |
మొక్కకి మొక్కకి ఉన్న అంతరం |
15 X 15 చదరపు సెంటీమీటర్లు |
25 X 25 చదరపు సెంటీమీటర్లు |
నాటేటప్పుడు తీసుకోవలసిన ఇతర జాగ్రత్తలు |
నారు నుండి వేరు చేసిన మొక్కలను కడుగుతారు,బాగా లోతుకు నాటతారు |
మట్టితో ఉన్న మొక్కను పొలంలో మొక్కకి మొక్కకి అంతరం ఉంటేటట్టు, కొంచెం పైనే నాటతారు. |
కలుపుతీయడం |
కలుపు తీసే యంత్రాన్ని అసలు వాడరు |
రోటరి కలుపుతీసే యంత్రం లేకపోవడం వల్ల కూలీల చేత రెండుసార్లు కలుపుతీయించారు. మొదటిసారి మొక్క నాటిన 15 రోజుల తరువాత రెండవసారి మొక్కనాటిన 40 రోజుల తరువాత కలుపు తీయించారు. |
పంట దిగుబడి |
||
మొక్క ఎత్తు (సెం.మీ) |
84 |
90 |
రెండు మీటర్లకు మొక్కల సంఖ్య |
32 |
16 |
మొక్కకి పిలకలు |
12 |
17 |
మొక్కకి కంకులు |
08 |
13 |
ప్రతి కంకికి ఉన్న ధాన్యం |
102 |
144 |
ధాన్యం దిగుబడి (క్వింటాళ్ళు –ఎకరానికి) |
11.8 |
21.5 |
శ్రీ చమరు రామ్ హిమాచల్ ప్రదేశ్
శ్రీ చమరు రామ్ |
వయస్సు – 65 సంవత్సరాలు |
సంప్రదించవలసిన చిరునామా – శ్రీ దెబషిష్, డైరెక్టర్, (సి పి డబ్ల్యు డి) , |
చమరు రామ్ మొత్తం 20 కర్నాల్ భూమిని కల్గి ఉన్నాడు. హిమాచల్ ప్రదేశ్ లో భూమిని కర్నాల్ అని లెక్క కడతారు. అంటే సుమారుగా 2 ఎకరాలు కల్గి ఉన్నాడు . ఒక కర్నాల్ అంటే 400 చదరపు మీటర్లకు సమానం. 20 కర్నాల్ భూమిలో 8 కర్నాల్ , అంటే 0.8 ఎకరాలలో లో వ్యవసాయ సాగు చేస్తున్నాడు. ఇతని వ్యవసాయ సాగుకు రెండు నీటి వనరులు ఉన్నాయి. అవి ఒకటి వర్షాధారం కాగా, రెండవది కుహల్ –అనే కాలువ నుండి నీరు లభిస్తుంది, ఇతను వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు అంటే పంచగవ్య, అమృతగోల్, మత్కా ఖాధ్ మరియు రసాయనక ఎరువులు వాడారు. సాంప్రదాయక పద్ధతిలో ఇతను ఒక్కొక్క కర్నాల్ కు 90 కేజీలు (ఎకరానికి తొమ్మిది క్వింటాళ్ళు) పండించాడు.
చామరు రామ్ శ్రీ వరిసాగు పద్ధతి గురించి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కుండియన్ లో పనిచేస్తున్న సొసైటీ ఫర్ ఎన్విరాన్ మెంటు అండ్ రూరల్ అవేకనింగ్ (ఇఆర్ఏ) అనే సేవా సంస్థ నుండి వివరాలు తెలుసుకున్నాడు. ఈ ఇఆర్ఏ సంస్థ డెహ్రాడూన్ లో పనిచేస్తున్న పిపుల్ సైన్సు ఇనిస్టిట్యూట్ (పియస్ఐ) అనే సంస్థకు భాగస్వామ్య సంస్థ. 2006 లో పియస్ఐ మరియు ఇఆర్ఏ వారు ఇచ్చిన శిక్షణ మరియు సలహాలు అనంతరం రామ్ శ్రీ వరిసాగును ఆచరణలో పెట్టాడు. ;
వివరాలు |
2006 |
2007 |
2008 |
శ్రీ వరిసాగు చేస్తున్న స్ధలం |
0.5 కర్నాల్ |
4.0 కర్నాల్ |
8 కర్నాల్ |
వ్యవసాయ కాలాలు |
ఖరీఫ్ |
ఖరీఫ్ |
ఖరీఫ్ |
విత్తన రకాలు |
పర్మాల్ |
పర్మాల్ |
పర్మాల్ |
వ్యవసాయానికి ఉపయోగించిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు |
పంచగవ్య, అమృతజల్, మత్కా ఖాద్ |
పంచగవ్య, అమృతజల్, మత్కా ఖాద్ |
పంచగవ్య, అమృతజల్, మత్కా ఖాద్ |
పాటించిన పద్ధతులు |
కలుపు తీసే యంత్రాన్ని రెండుసార్లు ఉపయోగించారు |
కలుపు తీసే యంత్రాన్ని రెండుసార్లు ఉపయోగించారు |
కలుపు తీసే యంత్రాన్ని రెండుసార్లు ఉపయోగించారు |
అందుబాటులో ఉన్న ఉపయోగించిన వ్యవసాయ పరికరాలు, యంత్రాలు |
కలుపు తీసే యంత్రం మరియు మార్కరు, పి.యస్.ఐ వారు అందించారు. |
కలుపు తీసే యంత్రం, మరియు మార్కరు, ఇఆర్ఏ వారు అందించారు. |
కలుపు తీసే యంత్రం, మరియు మార్కరు ఇఆర్ఏ వారు అందించారు. |
పంట దిగుబడి |
కర్నాల్ కు 110 కేజీలు (ఎకరానికి 11 క్వింటాళ్ళు ) పండించారు. |
కర్నాల్ కు 160 కేజీలు (ఎకరానికి 16 క్వింటాళ్ళు ) పండించారు. |
కర్నాల్ కు 180 కేజీలు (ఎకరానికి 18 క్వింటాళ్ళు ) పండించారు. |
వివరాలు |
సాంప్రదాయ పద్ధతి |
శ్రీ వరిసాగు పద్ధతి |
వ్యవసాయ పనులు |
||
నారు మడి |
పొలం ఉన్న చోటే |
నారు మడి వేశారు |
భూమిని చదును చేయడం |
మార్కరు ఉపయోగించలేదు |
మార్కరు ఉపయోగించారు |
నారును పొలంలో నాటడం |
కొలతల ప్రకారం మొక్కను నాటలేదు |
10” x 10” అంతరంతో 10 రోజుల వయస్సు ఉన్న మొక్కను నాటారు |
కలుపు తీయడం |
కూలీల ద్వారా తీయించారు |
మాండ్వా కలుపుతీసే యంత్రాన్ని మూడుసార్లు ఉపయోగించారు. |
నీటి నిర్వహణ |
వర్షాధార |
ఒక అంగుళం నీటిని పెట్టారు. |
ఎరువులు, పచ్చిరొట్ట |
యూరియా, ఫాంయార్డు మాన్యూర్(యఫ్.వై.యం) |
పంచగవ్య, అమృతజాల్, మత్కా ఖాధ్, సేంద్రియ ఎరువు |
దిగుబడి మరియు రాబడి |
||
వరి మొక్కదిబ్బకు ఉన్న మొత్తం ఉన్న మొలకలు సంఖ్య |
6 |
17 |
సాధారణంగా వరి మొక్క ఎత్తు ( సెం.మీ) |
75 |
120 |
వరి మొక్కదిబ్బకు ఉన్న ఉత్పాదకత నిచ్చే మొలకల సంఖ్య |
4 |
15 |
సాధారణంగా వరికంకి పొడవు (సెం.మీ) |
21 |
23 |
సాధారణంగా ప్రతి మొక్కకు వచ్చే ధాన్యం సంఖ్య |
1,000 |
2,400 |
మొత్తం పండిన ధాన్యం |
90 కేజీలు/కర్నాల్(9 క్వి./ఎకరానికి) |
180 కేజీలు/కర్నాల్(18 క్వి./ఎకరానికి) |
మొత్తం పండిన గడ్డి |
175 కేజీలు/కర్నాల్ (17.5 క్వి./ఎకరానికి) |
278 కేజీలు/కర్నాల్(27.8 క్వి./ఎకరానికి) |
వరిసాగుకు ఐన ఖర్చు మొత్తం |
రూ. 550/కర్నాల్ (రూ. 5,500/ఎకరానికి) |
రూ. 500/కర్నాల్(రూ. 5,000/ఎకరానికి) |
ఖర్చులు పోనూ వచ్చిన లాభం |
రూ. 525/కర్నాల్(రూ. 5,250/ఎకరానికి) |
రూ. 1200/కర్నాల్(రూ. 12,000/ఎకరానికి) |
శ్రీమతి దమయంతి దేవి |
వయస్సు – 48 సంవత్సరాలు |
సంప్రదించవలసిన చిరునామా – శ్రీ దెబషిష్, డైరెక్టరు, (సిపిడబ్ల్యూడి), పిపుల్స్ సైన్స్ ఇనిస్టిట్యుట్ (పి.యస్.ఐ) డెహరాడూన్, ఉత్తరాఖండ్, ఫోను నెంబరు – 9897080579 |
దమయంతి దేవి కి ఎనిమిది బిగాల వ్యవసాయ భూమి ఉంది. అంటే సుమారు 1.6 ఎకరాలు ( ఒక్క బిగా అంటే 800 చదరపు మీటర్లు). ఇది ఆమె స్వంత భూమి. అందులో మూడు బిగాలు అంటే 0.6 ఎకరాలలో వరిసాగు చేస్తుంది. ఇమె వర్షధార వ్యవసాయం చేస్తుంది. ఈ వ్యవసాయానికి దుక్కిదున్నడం, ఫాంయార్డుమాన్యుర్ (యఫ్.వై.యం) మరియు యూరియా వంటివి ఉపయోగిస్తూ ఉంటుంది. ఇమె సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ సాగు చేస్తే ఒక్కొక్క బిగాకు 291 కేజీలు (ఎకరానికి 14.5 క్వింటాళ్ళు) పంట దిగుబడి పండిస్తుంది.
సాతి (సోషల్ అవేర్నెస్ త్రో హ్యూమన్ ఇన్వాల్మెంట్ ) అనే సేవాసంస్థ నుండి దమయంతి దేవి ఈ శ్రీవరిసాగు గురించి తెలుసుకున్నారు. ఈ సంస్థ పిపూల్స్ సైన్సు ఇనిస్టిట్యూట్, డెహ్రాడూన్ సంస్థకు భాగస్వామ్యసంస్థ. ఈ శ్రీవరిసాగు గురించి 2007 సంవత్సరంలో శిక్షణ పొందిన తరువాత డెహ్రాడూన్ లోని పియస్ఐ మరియు సిర్మూర్ లోని సాతి వారి సలహాలు, సూచనలతో దమయంతి దేవి శ్రీవరిసాగును ఆఛరణలో పెట్టింది.
వివరాలు |
2007 |
2008 |
శ్రీవరిసాగు పండిస్తున్న ఏరియా |
0.007 ఎకరాలు |
0.020 ఎకరాలు |
పంటలు పండించే కాలాలు |
ఖరీఫ్ |
ఖరీఫ్ |
విత్తనాల రకాలు |
పర్మాల్ |
పర్మాల్ |
వాడుతున్న ఎరువులు, పురుగుమందులు, యంత్రాలు |
పంచగవ్య, అమృతజాల్, మత్కా ఖధ్, పశువుల ఎరువు |
పంచగవ్య, అమృతజాల్, మత్కా ఖధ్, వర్మి కంపోస్టు |
పాటిస్తున్న పద్ధతులు |
కలుపు తీసే యంత్రాన్ని రెండు సార్లు ఉపయోగించారు |
కలుపు తీసే యంత్రాన్ని మూడు సార్లు ఉపయోగించారు |
స్ధానికంగా దొరుకుతున్న , వాడుతునయంత్రాలు |
కలుపుతీసే యంత్రం మరియు మార్కర్లు పి.యస్.ఐ సంస్థ వారు ద్వారా సమకూరాయి. |
కలుపుతీసే యంత్రం మరియు మార్కర్లు సాతి సంస్థ వారు ద్వారా సమకూరాయి. |
పంట దిగుబడి |
19.2 క్వి/ఎకరానికి |
23.76 క్వి/ఎకరానికి |
తక్కువ విత్తనాలు, నీరు, కూలీలతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని ఆమె నేర్చుకున్నది
వివరాలు |
సాంప్రాదాయ పద్ధతి |
శ్రీవరిసాగు పద్ధతి |
వ్యవసాయపనులు |
||
నారుమడి |
నాలుగుకేజీల విత్తనాలు /బిగా |
500 గ్రాములు విత్తనాలు / బిగా |
భూమినిచదును చేయడం |
మార్కరు ఉపయోగించలేదు |
మార్కరు ఉపయోగించారు |
నారు పొలంలో నాటడం |
మొక్కల మధ్య అంతరం లేదు |
10” x 10” అంతరం (పదిరోజుల వయస్సుగల మొక్కలను ) |
కలుపు తీయడం |
కూలీల ద్వారా ఒకసారి తీయించారు |
మూడు సార్లు మాండ్వా కలుపుతీసే యంత్రం వాడారు |
నీటి నిర్వహణ |
వర్షాధారం |
ఒక అంగుళం నీరు పెట్టారు మిగతా బయటకు పంపించేశారు. |
ఎరువులు, పచ్చిరొట్ట |
యూరియా, పశువుల పెంట |
పంచగవ్య, అమృతజాల్, మత్కా ఖాద్, వర్మీకంపోస్టు |
దిగుబడి రాబడి |
||
వరి మొక్కదిబ్బకు ఉన్న మొత్తం ఉన్న మొలకలు సంఖ్య |
6 |
49 |
సాధారణంగా వరి మొక్క ఎత్తు ( సెం.మీ) |
93 |
113 |
వరి మొక్కదిబ్బకు ఉన్న ఉత్పాదకత నిచ్చే మొలకల సంఖ్య |
3 |
21 |
సాధారణంగా వరికంకి పొడవు (సెం.మీ) |
17.5 |
22.5 |
సాధారణంగా ప్రతి మొక్కకు వచ్చే ధాన్యం సంఖ్య |
840 |
3150 |
మొత్తం పండిన ధాన్యం |
2.91 క్వి/బిగా(14.5 క్వి/ఎకరం) |
4.75 క్వి/బిగా(23.7 క్వి/ఎకరం) |
మొత్తం పండిన గడ్డి |
4.59 క్వి/బిగా(22.9 క్వి/ఎకరం) |
8.31 క్వి/బిగా(41.5 క్వి/ఎకరం) |
వరిసాగు ఐన ఖర్చు మొత్తం |
రూ. 1,364/బిగా |
రూ. 1,250/బిగా |
ఖర్చులు పోనూ వచ్చిన లాభం |
రూ. 2,000/బిగా |
రూ. 4,330/బిగా |
శ్రీమతి సరస్వతి దేవి - హిమాచల్ ప్రదేశ్
శ్రీమతి సరస్వతి దేవి |
వయస్సు – 73 సంవత్సరాలు |
సంప్రదించవలసిన చిరునామా – శ్రీ డెబాషిష్, డైరెక్టరు (సిపిడబ్ల్యూడి), పీపూల్ సైన్సు ఇనిస్టిట్యూట్ (పియస్ఐ), డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ , ఫోను నెంబరు -9897080579 |
సరస్వతి దేవి 0.45 కర్నాల్ భూమిని కల్గి ఉంది. (ఒక కర్నాల్ భూమి 400 చదరపు మీటర్లు) అంటే 0.45 ఎకరా కల్గి ఉంది. అందులో 2.5 కర్నాల్ అంటే 0.25 ఎకరా భూమిలో వరి పండిస్తుంది. ఈమె వర్షధార మీద ఆధారపడి, నాగలి, పారలు ఉపయోగిస్తూ, వర్మికంపోస్టు మరియు యూరియా పొలానికి వాడుతూ పంటలు పండిస్తుంది. ఇమె సాంప్రదాయ పద్ధతిలో కర్నాల్ కు 130 కేజీలు అంటే ఎకరానికి 13 క్వింటాళ్ళు పండిస్తుంది.
పీపూల్స్ సైన్సు ఇనిస్టిట్యూట్ (పియస్ఐ), డెహ్రాడూన్ వారి ద్వారా శ్రీవరి సాగు గురించి శ్రీమతి సరస్వతి తెలుసుకున్నది. 2007 సంవత్సరంలో శ్రీవరిసాగును ఆచరణలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇమె కొడుకు పియస్ఐ నుండి సూచనలు, శిక్షణ తీసుకోవడం జరిగింది. వివరాలు |
2007 |
2008 |
శ్రీవరి సాగు చేసిన ఏరియా |
0.5 కర్నాల్(0.05 ఎకరం) |
1.5 కర్నాల్ (0.15 ఎకరం) |
వ్యవసాయ పంట కాలాలు |
ఖరీఫ్ |
ఖరీఫ్ |
విత్తన రకాలు |
సార్వతి |
కస్తూరి - బాస్మతి |
వాడిన ఎరువులు, పురుగుమందులు |
పంచగవ్య, అమృతజాల్, మత్కా ఖాధ్, ఆవు పేడ |
పంచగవ్య, అమృతజాల్, మత్కా ఖాధ్, వర్మి కంపోస్టు |
పాటించిన పద్ధతులు |
కలుపు తీసే యంత్రాన్ని రెండు సార్లు ఉపయోగించారు |
కలుపు తీసే యంత్రాన్ని మూడు సార్లు ఉపయోగించారు |
వ్యవసాయ పరికరాలు అందుబాటు మరియు వాటి ఉపయోగం |
కలుపు తీసే యంత్రం, మార్కరు పియస్ఐ అనే సంస్థ దగ్గర దొరుకుతున్నాయి. |
కలుపు తీసే యంత్రం, మార్కరు సాతి అనే సేవాసంస్థ దగ్గర దొరుకుతున్నాయి. |
పంట దిగుబడి |
19.2 క్వి/ఎకరానికి |
23.76 క్వి/ఎకరానికి |
సేంద్రియ ఎరువులు |
ఆవుపేడ, యన్.పి.కె (12:32:16) |
పంచగవ్య, వర్మికంపోస్టు, ఆవు పేడ, యూరియా |
పద్ధతులు పాటించినవి |
మార్కింగు మరియు కలుపుతీసే యంత్రం తప్ప అన్ని పద్ధతులు పాటించారు |
మార్కింగు మరియు కలుపుతీసే యంత్రం తప్ప అన్ని పద్ధతులు పాటించారు |
వ్యవసాయ పరికరాలు అందుబాటు మరియు వాటి ఉపయోగం |
నాటేటప్పుడు మార్కింగు చేసుకోవడానికి తాడును ఉపయోగించారు. కలుపును కూలీలచేత తీయించారు |
నాటేటప్పుడు మార్కింగు చేసుకోవడానికి తాడును ఉపయోగించారు. కలుపును కూలీలచేత తీయించారు |
పంట దిగుబడి |
గేదేలు పాడుచేశాయి, పంట దెబ్బతిన్నది |
245 కేజీలు/కర్నాల్ కు (24.5 క్వి./ఎకరానికి) |
మార్కరు బదులు స్థానికంగా దొరికే తాడును వాడడం వల్ల ఖర్చుకు పెట్టే డబ్బు ఆదా అయింది.
భరత్ భూషణ్ - జమ్ము -కాశ్మీర్
శ్రీ భరత్ భూషణ్ |
వయస్సు – 30 సంవత్సరాలు |
సంప్రదించవలసిన చిరునామా – డా . అనూరాధ సాహ , అసిస్టెంట్ ప్రొపెసర్ , జూనియర్ సైటింస్టు , ఏఐసిఆర్ఐపి , రైస్ , డివిజన్ ఆఫ్ పి బి జి , మెయిన్ క్యాంపస్ , యస్ . కె . యు . ఎ . యస్ . టి - జె , చాతా , జమ్మూ . ఫోన్ -9419235884 |
భరత భూషణ్ 0.62 ఎకరాల వ్యవసాయ భూమిని కల్గి ఉన్నాడు. ఉన్న పొలంలో వరిసాగు చేస్తున్నాడు. వ్యవసాయ సాగు కోసం ఇతను కాలువ నీరు వాడుతూ ఉంటాడు. విత్తనాలు వ్యవసాయ శాఖ వారు అందించగా ఎరువులు స్థానిక ఎరువుల షాపులో తెచ్చుకున్నాడు. ఇతను కోర్స్ అనే వరి వంగడాన్ని ఉపయోగిస్తే ఎకరానికి 18 క్వింటాళ్ళు పండేది. అదే బాస్మతి అయితే ఎకరానికి 10 క్వింటాళ్ళు పండుతున్నది.
డబ్ల్యూ. డబ్ల్యూ.యఫ్ – ఇక్రీసాట్ హైదరాబాద్ వారు నిధులందిస్తున్న యస్.కె.యు.ఎ.యస్.టి-జె పధకం నుండి భూషణ్ శ్రీవరిసాగు గురించి తెలుసుకున్నాడు. అనూరాధ సహ మరియు డా. విజయ్ భర్తి వారుకూడా శ్రీవరి సాగుపై సూచనలు , సలహాలు భూషణ్ కు ఇచ్చారు. 2007, 2008 ఖరీఫ్ సీజన్ లో భూషణ్ 0.62 ఎకరాలు భూమిలో శ్రీవరిసాగు చేశాడు. ఇతను షర్బతి, పిసి-19 అనే వరి వంగడాలను పండించాడు. ఎకరానికి 3.2 కేజీల విత్తనాలు, రసాయనక ఎరువులు (యూరియా, డిఏపి, యంఒపి) ఉపయోగించాడు. పొలంలో ఎటువంటి కీటకాలు, తెగుళ్ళు లేవు. షర్బతి వంగడం ఎకరానికి 22 క్వింటాళ్ళు పండగా, పిసి-19 ఎకరానికి 30 క్వింటాళ్ళు పండినది.
ఇతను డబ్ల్యూ. డబ్ల్యూ.యఫ్ – ఇక్రీసాట్ హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో ఆచార్య యన్.జి.రంగా వ్యవసాయవిశ్వవిద్యాలయం హైదరాబాద్ వారి దగ్గర నుండి కోనోవీడర్ అనే కలుపు తీసే యంత్రాన్ని కొనుకున్నాడు. ఈ కింది పేర్కొన్న పద్దతులను శ్రీవరిసాగులో పాటించాడు.
ఎకరానికి 3.2 కేజీలు అనేది ప్రమాణికం అయింది
కోనోవీడర్ అనే కలుపు తీసే యంత్రం మరియు తక్కువ నీటి వాడకం
వివరాలు |
సాంప్రదాయ పద్ధతిలోవరిసాగు |
శ్రీవరిసాగు |
వ్యవసాయ పనులు |
||
నారుమడి |
వేరే చోట తెచ్చుకోవడం |
నారుమడి వేయడం |
నిర్వహణ |
నీటితో పొలం నింపడం, కలుపు, పురుగులు, తెగుళ్ళును రసాయనకాలతో నియంత్రించడం |
అవసరమైనంత నీరు మాత్రమే వాడడం, రసాయనకాలు వాడక పోవడం, కలుపు తీసే యంత్రాలను వాడడం |
దిగుబడి -రాబడి |
||
ధాన్యా నిచ్చే కంకులు సంఖ్య |
||
షర్బతి |
7-8 |
15-20 |
పిసి-19 |
10-12 |
20-25 |
కంకి లో వచ్చే ధాన్యం సంఖ్య |
||
షర్బతి |
130 |
145 |
పిసి-19 |
110 |
140 |
1000ధాన్యాల బరువు (గ్రాములలో) |
||
షర్బతి |
18 |
20 |
పిసి-19 |
21 |
22 |
జానేశ్వర్ సింగ్ - జార్ ఖండ్
జానేశ్వర్ సింగ్, |
వయసు : 55 సంవత్సరములు |
సంప్రదించవలసిన చిరునామా : మనోజ్ కుమార్ సింగ్, వికాస్ సహయోగ్ కేంద్రం, చాటర్ పుర్, పలమావ్, జార్ ఖండ్. ఫోన్ నెం 9431715087 |
సింగ్ అనబడే రైతుకు 9 ఎకరముల భూమి ఉంది. అందులో 2.5 ఎకరములు వరి పండే భూమి. అతని తండ్రి భిష్వంబర్ సింగ్ ఇచ్చిన జ్ఞానంతో అతడు ఎకరమునకు 10 క్వింటాళ్ళు చొప్పున పంట పండిస్తున్నాడు. పలమావ్ వర్షాభావ ప్రదేశం కావటం వలన వ్యవసాయం కొరకు వానల మీద ఆధారపడాలి.
అతని యొక్క పంటను పెంచుకొనుటకు గాను జూన్ 27, 2006 న, ఛాటర్ పుర్ కోక్రొ గ్రామంలో వికాస్ సహ యోగ్ కేంద్రం వాళ్ళు నిర్వహించిన, శ్రీ పద్ధతి మీద ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి హాజరైనాడు. మిగతా గ్రామాల నుంచి కూడా చాలా మంది రైతులు వచ్చారు. ఒక అరకేజి గింజలతో ఒక నారుమడిని తయారుచేశాడు. కొన్ని గింజలను మాత్రం అతని కోళ్ళు తినివేసినవి. కాని మిగతా విత్తనములు మాత్రం చాలా జాగ్రత్తగా 0.12 ఎకరంలో నాటి, ఒక క్వింటాల్ ఎరువును కలిపాడు. వికాస్ సహయోగ్ కేంద్రం వాళ్ళ పర్యవేక్షణలో ఈ క్రింద ఇచ్చిన సూచిక పద్ధతి ప్రకారం మొలకలను నాటాడు. పాత పద్ధతితో పోలిస్తే అతని పంట రెండింతలయ్యిందని అతను తెలుసుకున్నాడు. అదే విధంగా స్థానిక వ్యాధి అయిన ‘బంకి’ వ్యాధి నుండి శ్రీ వరి కాపాడబడింది.
వివరములు |
సాంప్రదాయ పద్ధతి |
శ్రీ పద్ధతి |
విత్తనములు నిష్పత్తి (2000 చ.అ.) |
రెండు కిలోలు |
200 గ్రాములు |
నారుమడి పరిమాణం |
10'×10' |
3'×4' |
10'×10' వైశాలంలో మొలకల సంఖ్య |
448 |
182 |
ఒక మొలకలకు టిలర్ల సంఖ్య |
6 |
25 |
ఒక గుత్తికి వచ్చుగింజలు |
184 |
296 |
మొలకలు వ్రేళ్ళతో తీసి వేరే చోట నాటటానికి (2000చ.అ.) పనివాళ్ళ సంఖ్య |
1 రోజుకి ఇద్దరు |
2 గంటలకు ఇద్దరు. |
ఎ.శశిధరన్ పిల్లై, కేరళ
ఎ.శశిధరన్ పిల్లై, |
వయస్సు : 53 సంవత్సరములు |
సంప్రదించవలసిన చిరునామా : జాన్ జొ వర్గీస్, సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్ (శాస్త్రీయ వ్యవసాయము) మిత్రానికేతన్ క్రిషి విజ్ఞాన్ కేంద్రం, తిరువనంతపురం , ఫోన్ నెం 9447010474. |
అతనికి 6 ఎకరాలు సాగు భూమిలో 3.5 ఎకరాల వరిసాగు భూమి ఉంది. అతడిది సాగునీరు ఉన్న భూమి. తన సారవంతమైన భూమిలో అతడు పచ్చి ఆకుల ఎరువు, ఎఫ్ వై యమ్, ఎరువులు, మొక్కలను కాపాడే రసాయనాలు మొదలైనవి వాడతాడు. ఎక్కువ నీరు పెట్టడం (ఫ్లడింగ్ మెధడ్) ద్వారా ఎకరానికి 3 నుండి 3.5 టన్నుల దిగుబడి వస్తుంది.
2003 సంవత్సరములో కజకుట్టోమ్ ప్రాంతీయ వ్యవసాయ శిక్షణ కేంద్రం వద్ద, వ్యవసాయ విభాగం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి అతడు హాజరైనాడు. తిరువనంతపురంలోనున్న మిత్రానికేతన్ క్రిషి విజ్ఞాన్ కేంద్రంలో, సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్/ పాఠ్యాంసం లోని నిపుణులు అయిన జాన్ జొ వర్గీస్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రసంగం విన్న తర్వాత కొత్త వ్యవసాయ పద్ధతి అయిన శ్రీ మీద ఆసక్తి చూపించాడు. 2003 రబీ లో, తన 1 ఒక ఎకరం వరి పొలంలో పరిక్ష నిమత్తం ఈ పద్ధతితో వరి పండిద్దామని తొలి ప్రయత్నం చేసాడు. గత 9 ఋతుకాలాల నుంచి, తన మొత్తం 6 ఎకరాలలో శ్రీ పద్ధతిని అభ్యసించాడు. అతడు ఉమ, జయ, హర్ష, పవిజొమ్,ఎమ్ టియు-1, ఐశ్వర్య వంటి రకాలను ఉపయోగించాడు.
శ్రీ పద్ధతులఅన్నింటిని పాటించాడు కానీ మొక్కలు పెరుగుతున్న సమయంలో నీటి పారుదలను నియంత్రించ లేకపోయాడు ఎందుకంటే అతని పొలంలో నీరటిని అంత సులువుగా అదుపు చేయలేము. మిత్రానికేతన్ కె.వి.కె వారు ఏర్పాటుచేసిన రోటరీ మార్కర్ మరియు రోటరీ వీడర్ ఉపకరణలను ఉపయో గించాడు.
శ్రీ పద్ధతిని అనుసరించే పొలం మిగతా పద్ధతులను అనుసరించే పొలాలతో పోలిస్తే చీడపురుగుల బాధ తగ్గింది. మొక్కల మధ్యఖాళీ ఉన్నందువలన పర్యవేక్షించడానికి కావలసిన ప్రదేశాన్నిచ్చి, ‘లీఫ్ ఫోల్డర్స్/ ఆకు మడత’ యాజమాన్యానికి దోహద పడింది. విత్తనాలని పరిపోషణ చేసినపుడు, నారుమడి వేసేటప్పుడు మరియు భూమిలో కూడా జీవాల్ని నియంత్రించే ప్రభావితమైన కారకం అయిన ‘సూడోమోనస్ ఫ్లోరొసెన్స్’ ఉపయోగించబడింది. దీని ద్వారా సూక్ష్మక్రిములు మరియు శిలీంధ్రము యొక్క జబ్బులను నియంత్రించారు. ‘సూడోమోనస్ ఫ్లోరొసెన్స్’ అవలంభించుట చాలా సులువు, ఎందుకంటే శ్రీ పద్ధతిలో తక్కువ విత్తనములు, తక్కువ నారుమడి అవసరము మరియు చల్లటానికి మొక్కల మధ్య ఖాళీ ఎక్కువ ఉంటుంది.
శ్రీ పద్ధతిని అనుసరించే 6 ఎకరాల పొలాల నుండి 6.5 నుంచి 7.5 టన్నుల పంటల దిగుబడిని ఇచ్చింది. ఈ దిగుబడి సాంప్రదాయ పద్ధతి కంటే రెండింతల వరకూ ఉంది.
రబ్బరు మొక్కల నుండి వచ్చే ద్రవాన్ని సేకరించడానికి వాడే అల్యుమినియం తబుకులను, నారుమడి నుండి పొలానికి మొక్కలను తీసుకెళ్ళడానికి వాడేవారు.రబ్బరు పెంపకం కేరళలో ఎక్కువ కాబట్టి మొలక లను తీసుకెళ్ళటానికి అల్యుమినియం తబుకుల వాడకం బాగుందని అనిపించింది.
కావలసిన విత్తనములు 1/10 వంతు వరకూ తగ్గింది. అలాగే ఇది వరకటి కన్నా, నారుభూమి 10 లో 1 వంతు వైశాల్యం మాత్రమే అవసరమయ్యింది. మొలకల మధ్య ఎక్కువ ఖాళీ ఉంచడం వలన మళ్ళీ మొలకలను తియ్యటంలోను, మొలకలను వేరేచోటకి మార్చి నాటటంలోను ఉన్న అధికశ్రమ తగ్గింది. రోటరీ వీడర్ ఉప యోగించి కలుపుతీయటం ద్వారా మట్టిని తిరిగవేయడానికి మరియు తక్కువ సమయంలో కలుపు తీయ డానికి దోహద పడుతుంది. శ్రీ పద్ధతిని అవలంభించే పొలంలో చీడపురుగులు మరియు జబ్బులు రావడం అనేవి తగ్గుముఖం పట్టాయి. శ్రీ పద్ధతి వలన, తక్కువ సరంజామాతో, అదే భూమిలో రెండింతల పంట దిగు బడి వచ్చింది.
శ్రీ పద్ధతిలో వ్యవసాయం చేసే నిర్ణయాన్ని అతని ప్రాంతం (నెలనాడ్ పదశేఖర సమితి) లో ఉన్న ఇతర వరి రైతుల మధ్య కోలాహలం సృష్టించింది. ఎందుకంటే అక్కడ వరి రైతులందరికి అతడు అధ్యక్షుడు. నాటిన తరువాత చిన్న మొలకలను అంత తొందరగా నాటడం చాలా మూర్ఖమైన నిర్ణయమని వారన్నారు. మిత్రానికేతన్ కెవికె సిబ్బంది యొక్క నిరంతర సహాయం మరియు పర్యవేక్షణ, మొదట్లొ వచ్చిన విమర్శలను ఎదుర్కోటంలో అతనికి దోహదపడ్డాయి. ఒకటి, రెండు నెలల తర్వాత విమర్శించినవారే తన పొలంలో వరి యొక్క ఎదుగుదలను చాలా దగ్గరగా పరిశీలించారు. సగటున సుమారుగా 40 టిల్లర్లు, గుత్తికి ఎక్కువ గింజలు ఉన్నాయి.
కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీ పద్ధతిని బాహాటంగా సిఫార్సు చేయలేదు మరియు ఈ పద్ధతిని బహిరంగంగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు . ఇది రైతుల మధ్య అస్పష్టతను మరియు వ్యవసాయ శాఖకు దీనిని ప్రచారం చేయటంలో వ్యతిరేకత ఎదురౌతుంది. కేరళలో శ్రీ పద్ధతిని బాగా విస్తరించడానికి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. సి.మోహన్ |
వయస్సు : 50 సంవత్సరములు |
సంప్రదించవలసిన చిరునామా : షన్ముగసుందరం, అసిస్టెంట్ ప్రొఫెసర్ రీజనల్ అగ్రికల్చరల్ రెసిడెన్సియల్ స్టేషన్, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పట్టాంబి, పాలఖడ్, కేరళ - 679306, ఫోన్ 9446239318. |
మోహన్ అనే రైతుకు 18 ఎకరాల సాగు భూమిలో 4.8 ఎకరాల వరిసాగు చేసే భూమి ఉంది. సాంప్రదాయ పద్ధతి ద్వారా సేంద్రియ ఎరువును మాత్రమే వాడి, కాలవ నీటితో ఎకరానికి 2 టన్నుల ఉత్పత్తిని పొందాడు.
వేరొక రైతునుండి శ్రీ పద్ధతి గురించి తెలుసుకుని, తమిళనాడులో శిక్షణ మరియు మార్గదర్శకము పొందాక, 2007లో 0.5 ఎకరంలో ఈ పధ్ధతి మొదలుపట్టాడు. సేంద్రియ ఎరువులను వాడి, శ్రీ పద్ధతులను పాటించి, ఐఆర్ - 50 అనే జాతిని పెంచాడు. నాల్గు చక్రముల మార్కర్ ను మరియు కలుపుతీయటానికి రోటరీ వీడర్ను ఉప యోగించాడు. వృక్ష సంబంధితమైనవి ఎరువులను వాడినందువలన చీడపురుగుల బాధ పడలేదు. |
తమిళనాడు రాష్ర్టంలోని రైతుతో సంప్రదించి మొలకలను మార్చడానికి కొత్త మార్కర్ను రూపొందించాడు.
వివరములు |
సాంప్రదాయ పద్ధతి |
శ్రీ పద్ధతి |
చేయు పనులు |
||
విత్తనములు |
ఎకరానికి 20-24 కిలోలు/ఎకరానికి |
ఎకరానికి 2 కిలోలు /ఎకరానికి |
మొలకలను తీసి తిరిగి నాటుట |
30 రోజుల మొలకలు |
12 రోజుల మొలకలు |
చదరపు మీటరుకి గుట్టల సంఖ్య |
30-40 |
20 |
గుట్టకి మొలకల సంఖ్య |
3-4 |
1 |
ఎరువులు |
రసాయన ఎరువులు, కీటక నాశని, కలుపు మొక్కల నాశని మొదలగు నవి ఉపయోగించాలి. |
సేంద్రియ ఎరువులకే ప్రాముఖ్యం. |
నీటి యాజమాన్యం |
నీరు ఎప్పుడూ పారుతూ ఉండాలి. |
తేమగా ఉంటే సరిపోతుంది |
కలుపు మొక్కల యాజమాన్యం |
కలుపు మొక్కలను మనుషులను ఉపయోగించి తీయవలెను. |
కోనోవీడర్ సహాయంతో కలుపు మొక్కలను భూమి లోపలికి పంపుతారు. |
దిగుబడి–ధాన్యం దిగుబడి |
ఎకరానికి 2 టన్నులు |
ఎకరానికి 3 టన్నులు |
లాభం వెల నిష్పత్తి |
2.10 |
2.71 |
మొహమద్ కె.పి, కేరళ
మొహమద్ కె.పి |
వయస్సు: 49 సంవతసరములు |
సంప్రదించవలసిన చిరునామ షన్ముగసుందరం, అసిస్టెంట్ ప్రోఫెసర్ (ఎక్సెటెన్షన్) రీజినల్ అగ్రికల్చరల్, రెసిడెన్షియల్ స్టేషన్ - కేరళ వ్యవసాయ విశ్వవిద్యలయం , పట్టాంబి, పాలఖడ్ , కేరళ -679306, ఫోన్ 9446239318 |
మొహ్మద్ అనే రైతుకు 21 ఎకరముల భూమి, అందులో 10 ఎకరముల వరిసాగు చేసే భూమి ఉంది. సేద్యపు నీటి కోసం నూతుల మీద ఆధారపడతాడు. పధ్ధతి ప్రకారం సేంద్రీయ ఎరువులను మరియు నత్రజని,భాస్వరము,పొటాషియం(యన్ పి కె)లను వాడతారు.
2005 సంవతసరములో అతని ప్రాంతీయ వ్యవసాయ అధికారి ద్వారా శ్రీ పద్ధతి గురించి తెలుసుకుని 2.5 ఎకరాలలో సాగును ప్రారంభించాడు. నావర మరియు బాసుమతి వంటి జాతులను ఒక కాలంపాటు శ్రీ పద్ధతి ని పాటించారు. ఎరువులను, వ్యాపపొడిని మరియు స్యూడోమోనస్ మొదలగునవి ఉపయోగించాడు. కేరళ లో (ప్రాంతీయ వ్యవసాయ కర్మాగారాల కోఆపరేటివ్ సంఘం) ఆర్ ఎ ఐ డి సి ఒ వారి దగ్గరున్న కోనోవీడర్ని ఉపయోగించాడు.మొక్కల సంరక్షణలో భాగంగా, ఆకులు ముడుచుకు పోయే వ్యాధిని నియంత్రించటానికి మోనోక్రోటోఫోస్ ను, ఇయర్ - హెడ్ అనే కీటకం నియంత్రించడానికి మాలాథియన్ ను ఉపయోగించాడు .
లాభములు |
అవలంభించుటలో కష్టములు |
|
|
వివరములు |
సాంప్రదాయ పద్ధతి |
శ్రీ పద్ధతి |
చేయు పనులు |
||
విత్తనములు |
ఎకరానికి 28 కిలోలు |
ఎకరానికి 2.4 కిలోలు |
మొలకలను తీసి తిరిగి నాటుట |
30 రోజుల మొలకలు |
15 రోజుల మొలకలు |
చదరపు మీటరుకి గుట్టల సంఖ్య |
30-40 |
సుమారు 16 |
గుట్టకి మొలకల సంఖ్య |
3 |
1 |
ఎరువులు |
రసాయన ఎరువులు, కీటక నాశని, కలుపు మొక్కల నాశని మొదలగునవి ఉపయోగించాలి. |
సేంద్రియ ఎరువులకే ప్రాముఖ్యం. |
నీటి యాజమాన్యం |
నీరు ఎప్పుడూ పారుతూ ఉండాలి. |
తేమగా ఉంటే సరిపోతుంది. |
కలుపు మొక్కల యాజమాన్యం |
కలుపు మొక్కలను మనుషుల ను ఉపయోగించి తీయవలెను. |
కోనోవీడర్ సహాయంతో కలుపు మొక్కలను భూమి లోపలికి పంపుతారు. |
దిగుబడి – ధాన్యం దిగుబడి |
ఎకరానికి 80 క్వింటాళ్ళు |
ఎకరానికి 1.2 టన్నులు |
లాభం వెల నిష్పత్తి |
1.58 |
1.88 |
రాంప్రసాద్ కార్తికేయ్ - మధ్యప్రదేశ్
రాంప్రసాద్ కార్తికేయ్
డేయ్
మధ్య ప్రదేశ్
వయస్సు : 42 సంవత్సరములు చదువు : 11 వ తరగతి ఉత్తీర్ణత వృత్తి : వ్యవసాయం |
|
సంప్రదించవలసిన చిరునామా - సందీప్ ఖన్ వల్కర్, మధ్య ప్రదేశ్ గ్రామీణ జీవనోపాధి పథకం (ఎమ్.పి. ఆర్.యల్ పి.) భోపాల్, మధ్య ప్రదేశ్, ఫోన్ - 9425303566 |
శ్రీ రాంప్రసాద్ సాంప్రదాయబద్ధమైన రైతు. అతని కుటుంబమంతా వారి కనీస అవసరాల కొరకు వ్యవసాయం మీదనే ఆధారపడ్డారు. అతనికి మొత్తం 4.5 ఎకరాల భూమి ఉంది. ఖరీఫ్ కాలంలో వరి ముఖ్యమైన పంట మరియు చలికాలంలో అన్నీ అనుకూలంగా ఉంటే గోధుమలు కూడా పండిస్తారు. మొత్తం భూమిలో 4 ఎకరాలలో వరిసాగు చేయగా మిగతా భూమిలో జొన్నలు, చిరు ధాన్యాల వంటివి పండిస్తారు. అతని భూమి కాలువకు దగ్గరలో ఉంది కాబట్టి ఇది సాగునీటి కోసం ఉపయోగపడుతుంది. సాంప్రదాయ పద్ధతి ద్వారా ఎకరానికి సగటు 6 నుండి 7 క్వింటాల్ ఉత్పత్తి వస్తుంది. విత్తనం వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టుబడి - తక్కువ రాబడి లాంటి ఫలితాలని ఇస్తుంది.
మధ్య ప్రదేశ్ గ్రామీణ జీవనోపాధి పథకం (యమ్ పి ఆర్ ఎల్ పి) టీమ్ శ్రీ పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు రైతులు దీని గురించి కొంచెం ఆందోళన చెందారు. శ్రీ పద్ధతి మీద అవగాహన కొరకు కొన్ని శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భూమినిచ్చి ప్రదర్శించి చూపుటకు అక్కడ ప్రగతి చెందిన రైతు ఎవరినైనా ఉంటే అతనిని ఎంపిక చేయవలసిందిగా మనవిచేసారు. దీనికోసం శ్రీరాం ప్రసాద్ కార్తికేయ్ ముందుకు వచ్చాడు. క్రిషి విజ్ఞాన్ కేంద్రం మరియు వ్యవసాయ విభాగం వారి సహాయంతో అతడనికి క్రమమైన శిక్షణ మరియు కమతాలు అందించారు. మొదటి మార్గదర్శకత్వం తరువాత శ్రీ పద్ధతి ప్రదర్శన కొరకు సుమారు అర ఎకరం భూమిని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సుమారు 0.35 ఎకరాల భూమిని సాంప్రదాయ పద్ధతిలో ఉంచి, రెండు పద్ధతుల ద్వారా వచ్చిన ఉత్పత్తిని పోల్చుకోవాలని నిర్ణయించారు. అశోక - 200 అనే జాతిని ఎంపిక చేశారు. పోలికల అధ్యయనానికి, వివిధ దశలలో సవిస్తారమైన సమాచారం సేకరించారు.
విత్తనములు జల్లిన తేది |
02.07.08 |
మొలకలను మార్చి నాటిన తేది |
13.07.08 |
కోతల తేది |
15.10.08 |
శ్రీ పద్ధతిని అవలంభించిన భూమి |
0.50 ఎకరం |
సాంప్రదాయ పద్ధతి అవలంభించిన భూమి |
0.35 ఎకరం |
శ్రీ పద్ధతిలో దిగుబడి |
7.20 క్వింటాళ్ళు (0.50 ఎకరం నుండి) |
సాంప్రదాయ పద్ధతిలో దిగుబడి |
2.10 క్వింటాళ్ళు (0.35 ఎకరం నుండి) |
లాభములు |
అవలంభించడంలో అవరోధములు |
|
|
వరి సాగులో ఉత్పత్తిని పెంచుట కొరకు ఇదే సరైన, ఉత్తమమైన పద్ధతి.
వివరములు |
వ్యవసాయము యొక్క ఖర్చు (రూ./ఎకరం ) |
|
సాంప్రదాయ పద్ధతి |
శ్రీ పద్ధతి |
|
చేయు పనులు |
||
పోలాన్ని తయారుచేయుట |
100 |
200 |
విత్తనము |
320 |
32 |
ఎఫ్ వై ఎమ్ |
0 |
50 |
డి ఎ పి |
0 |
150 |
యురియా |
0 |
90 |
పి యస్ బి |
0 |
20 |
ఎజొటో బ్యాక్టర్ |
0 |
16 |
కీటక నాశని |
0 |
28 |
నారు మడి తయారు చేయుట |
30 |
100 |
మొలకలను వేరేచోట నాటుట |
200 |
150 |
కలుపు మొక్కలను తీయుట |
0 |
150 |
ఐ పి ఎమ్ (మోనోక్రోటోఫస్) |
0 |
90 |
కోత కోయుట |
200 |
200 |
నూర్చుట |
150 |
150 |
మొత్తము |
1,000 |
1,426 |
దిగుబడి మరియు ఆదాయం |
||
దిగుబడి (క్వింటాళ్ళు / ఎకరానికి) |
6 |
14.4 |
స్ధూల లాభం (రూ.) |
4,800 |
11,520 |
వ్యవసాయ ఖర్చు |
1,000 |
1,426 |
నికర ఆదాయం (రూ.) |
3,800 |
10,094 |
నీటి పారుదల సౌకర్యం ఉండేటట్లు చూసుకోవాలి వివిధ దశలలో ‘ శ్రీ పద్ధతి’ ని అవలంభించే అతని పోలంలో రాంప్రసాద్.
శివాజి కుష్ రమ్ - మధ్యప్రదేశ్
శివాజి కుష్ రమ్ |
వయస్సు : 45 సంవత్సరములు |
సంప్రదించవలసిన చిరునామ: సందీప్ ఖన్ వల్ కర్, మధ్య ప్రదేశ్ గ్రామీణ జీవనోపాధి పథకం (ఎమ్. పి. ఆర్. యల్.పి.), భోపాల్, మధ్య ప్రదేశ్,ఫోన్ 9425303566 |
శివాజీకి మొత్తము 10 ఎకరముల సాగుభూమి కలదు. రెండు కాలాలలో వర్షం ఆధారంగా చేసుకొని వ్యవ సాయం చేస్తాడు. కుటుంబం మరియు పశువుల యొక్క ఆహారపు అవసరాల కోసం వ్యవసాయం చేయవలసి ఉంది. ఎక్కువ ఉత్పత్తి ఉంటే, మార్కెట్ లో అమ్ముకుంటాడు. మిగతా అవసరాల కోసం ఆ కుటుంబం అడవి ఉత్పత్తుల మీద ఆధారపడుతుంది. అన్నము అతని కుటుంబంవారికి ముఖ్యమైన ఆహారం. కావున వరిసాగు పెద్ద స్ధలంలో చేస్తారు. వరిసాగు కోసం సరైన భూమి లేకపోవటం వలన 10 ఎకరాలలో 4 ఎకరాలు మాత్రమే సాగుకోసం ఉపయోగిస్తాడు. పంటనీరు కోసం వర్షాల మీద ఆధారపడాలి. అద్దెకు తెచ్చిన డీజిల్ పంపు ద్వారా దగ్గరున్న ఏరునుండి నీరును తీసుకుంటాడు. అతని పల్లె బాగా దూరంగా ఉండటం వలన మంచి నాణ్యత గల వస్తువులను వాడే అవకాశం లేదు. ఎక్కువ నీటి పారుదలతో సగటు దిగుబడి ఎకరానికి 5 నుండి 7 క్వింటాల్ ఉంటుంది.చచకక్చచచచచచ
పంచాయితీ రాజ్ వ్యవస్థ ద్వారా, ఇక్కడ జీవనోపాధి సమస్యల్ని చూడడానికి, స్థానిక స్వచ్ఛంద సంస్థ అయిన మధ్య ప్రదేశ్ గ్రామీణ జీవనోపాధి పథకం (ఎమ్ పి ఆర్ ఎల్ పి) టీమ్ ఈ గ్రామంలో పనిచేస్తుంది. ఇక్కడ వ్యవసాయం ముఖ్య జీవనాధారం కాబట్టి, వ్యవసాయ ఉత్పత్తిని పెంచటానికి ఎక్కువ మరింతగా పాటుపడాలని నిర్ణయింపబడింది.
కొనసాగుతున్న వ్యవసాయ పద్ధతులను అర్ధం చేసుకోవటం కొరకు వ్యవసాయక్రమము యొక్క దృక్పధమును అవలంభించుట జరిగింది. తరువాత ఎమ్ పి ఆర్ ఎల్ పి ఒక పథకాన్ని రూపొందించింది. అతని వరి యొక్క ఉత్పత్తిని గురించి చర్చలు జరిగిన తర్వాత అది చాలా తక్కువని తేల్చబడింది. తర్వాత, వరిసాగు శ్రీ పద్ధతి గురించి అతనికి తెలిపారు. వ్యవసాయ విభాగం వారు క్రిందటి సంవత్సరమే దీనిని గూర్చి తెలిపారు, కాని అపజయం ఎదురౌతుందనే భయం వల్ల చేయలేక పోయారు. ఆ జట్టు శ్రీ పద్ధతి గురించి అతనిని ప్రశ్నించినప్పుడు, అతను సరిగ్గా వివరించ లేకపోయాడు. ధాన్యం సాగులో ఈ పద్ధతిని ‘ మెడగాస్కర్ పద్ధతిగా’ అతనికి తెలుసు. ఎమ్ పి ఆర్ ఎల్ పి జట్టు మొదటి సారిగా శ్రీ పద్ధతి గురించి అతనికి వివరించి, తెలియచేసి మరియు శిక్షణని ఇచ్చారు. శ్రీ పద్ధతి ద్వారా వచ్చే లాభాలను క్షుణ్ణంగా ఆ కుటుంబంతో చర్చించి వారికి నమ్మకాన్ని కల్గించారు. రెండు నుండి మూడు సార్లుగా వారితో చర్చిస్తే శ్రీ పద్ధతిని చిన్న స్థలంలో అవలంభించడానికి ఒప్పుకున్నారు. శ్రీ పద్ధతి ప్రదర్శించడానికి అర ఎకరాన్ని కేటాయించాడు.
అక్కడ దొరికే స్థానిక విత్తనాలను వాడతానని ఎమ్ పి ఆర్ ఎల్ పి తో చెప్పాడు. మొదట ప్రదర్శించి చూపటానికి ఈ ప్రాంతంలో మామూలుగా తెలిసిన ఉరయ్ బూంట్ అనే జాతిని వాడారు. అతనికి చాలా అనుమానాలు ఉండటం వలన శ్రీ పద్ధతిలో తన సొంత పద్ధతులను పాటిస్తానని అన్నాడు. తర్వాత చర్చించి శ్రీ పద్ధతినే మాత్రమే అవలంభించేటట్టు అతనిని ఒప్పించారు. పొలం పరికరము ఒక్కటి కూడా వాడలేదు, పొలంలో ఉన్న ఎరువు మాత్రమే వాడారు.
ఇంతకు ముందు విత్తనములను పొలంలో వెదచల్లేవాడు. కనుక మొత్తం మీద మొలకెత్తడం సరిగ్గా ఉండేది కాదు. ఎక్కువ విత్తనాలను వాడటానికి ఇదే ముఖ్య కారణం. కాని ఈ స్థలంలో నారుమడి తయారు చేసేటప్పుడు శ్రీ పద్ధతిని పాటించాడు.
లాభములు |
అవలంభించుటలో కష్టములు / అవరోధములు |
|
|
సాంప్రదాయ పద్ధతి ప్రకారం వరిసాగులో విత్తనాలను వెదచల్లుతారు. నారుమడి తయారు చేసినా సరిగ్గా ఉండేది కాదు. అలా మొలకలు సరిగా వచ్చేవి కాదు, ఆ మొలక నాణ్యత సరిగా ఉండేది కావు. విత్తనాల పరిపోషణ కూడా చేయబడేదికాదు. ఆధిక పెట్టుబడి పెట్టినా, ఉత్పత్తి తక్కువగా ఉండేది. (ఎకరానికి సుమారు 10 క్వింటాల్).
శ్రీ పద్ధతిలో నారుమడిని నాణ్యతగల భూమిలో వేస్తారు. విత్తనాలు వరుసగా నాటుతారు, కావున సరిగ్గా మొలకెత్తుతాయి. విత్తనాలు చల్లే ముందు విత్తనాలను పరిపోషణ చేస్తారు. సరైన ఖాళీతో మొలకలను నాటుతారు. 15-20 రోజుల తర్వాత కలుపు తీస్తారు. ఎక్కువ ఖాళీ ఉండటం వలన హ్యాండ్ వీడర్ అనే పరికర మును కూడా ఉపయోగించి కలుపు తీయవచ్చు. ఉత్పత్తి ఎకరానికి 20 క్వింటాల్ చేరుతుంది.
సలహాలు
సురేష్ కుష్వాహ - మధ్యప్రదేశ్
సురేష్ కుష్వాహ |
వయస్సు : 32 సంవత్సరములు |
సంప్రదించవలసిన చిరునామా సందీప్ ఖన్ వల్ కర్, మధ్య ప్రదేశ్ గ్రామీణ జీవనోపాధి పథకం (ఎమ్ పి ఆర్ ఎల్ పి), భోపాల్, మధ్య ప్రదేశ్,ఫోన్ - 9425303566 |
అతడు 4 ఎకరాల భూమిలో వరిసాగు చేస్తున్నాడు. సేద్యపు నీరు కోసం వర్షం మీద ఆధారపడాలి. అతనికి ఎకరానికి సగటున 6 క్వింటాల్ పంట వచ్చేది.
ఆ గ్రామంలోని రైతులకు శ్రీ పద్ధతి చాలా కొత్తది. మొత్తం గ్రామం అంతా సాంప్రదాయబద్ధంగా వరిసాగుచేస్తారు. విత్తనాలు వెదజల్లుట అక్కడ అందరు రైతులు అవలంభించే పద్ధతి. కొంత మంది రైతులు మాత్రం నీటి పారుదల సహాయంతో మొలకలను మార్చి నాటుతారు. కనుక శ్రీ అనేది అందరికి కొత్త పద్ధతి. ఎమ్ పి ఆర్ ఎల్ పి వారు నడిపే రైతుల పొలం పాఠశాల (ఎఫ్ ఎఫ్ యస్) లో శ్రీ పద్ధతి ని అతను నేర్చుకున్నాడు. ఈ పాఠశాల అతనికి కొత్త పద్ధతులను సాంకేతిక విద్యలను నేర్పింది. ఖరీఫ్ కాలానికి ముందు నిర్వహించబడిన శిక్షణలో శ్రీ పద్ధతిమీద శిక్షణని పొందాడు. కొంతమంది రైతులు ఈ సంవత్సరం ఈ పద్ధతిని చిన్న భూ భాగంలో అవలంభించాలని నిర్ణయించారు. వారిలో ఇతడు కూడా ఒకడు. ప్రాజెక్టు జట్టు యొక్క సభ్యుల సహాయంతో శ్రీ పద్ధతిని ఇతని స్థలంతోపాటు అన్ని స్థలాల్లో మొదలు పెట్టారు మొదటి సారికావటం వలన తన దగ్గర ఉన్న 4 ఎకరాలలో 1.5 ఎకరంలో మాత్రమే మొదలు పెట్టాడు. సాధారణంగా వాడే జాతి అయిన ఐ ఆర్ - 64 జాతిని ఎన్నుకున్నాడు. ప్రతి కిలోకి, 3 గ్రాముల ట్రైకోడెర్మాను ఉపయోగించి విత్తన పరిపోషణ జరిపారు. అతను భూమిలో మంచి ఉత్పత్తి కోసం డి.ఎ.పి, యూరియా మరియు జింక్ ను కూడా ఉప యోగించాడు.
క్వినాల్ఫాస్ వేసేవారు . కొన్ని మొక్కలకి ఖైరా తెగులు వచ్చేది. దీనిని ఎకరానికి 8 కిలోల చొప్పున జింక్ సల్ఫేటు వేసి నియంత్రించేవారు. సాంప్రదాయబద్దమైన నాగలి, చదునుబల్ల మరియు త్రాడు మొదలగునవి వ్యవసాయ పనిముట్లను ఉపయోగించేవారు. ఎకరానికి మొత్తం 13 క్వింటాళ్ళ ఉత్పత్తి వచ్చేది.
కొనసాగుతున్న వ్యవసాయ పద్ధతులను అర్ధం చేసుకోవటం కొరకు వ్యవసాయక్రమము యొక్క దృక్పధమును అవలంభించుట జరిగింది. తరువాత ఎమ్ పి ఆర్ ఎల్ పి ఒక పథకాన్ని రూపొందించింది. అతని వరి యొక్క ఉత్పత్తిని గురించి చర్చలు జరిగిన తర్వాత అది చాలా తక్కువని తేల్చబడింది. తర్వాత, వరిసాగు శ్రీ పద్ధతి గురించి అతనికి తెలిపారు. వ్యవసాయ విభాగం వారు క్రిందటి సంవత్సరమే దీనిని గూర్చి తెలిపారు, కాని అపజయం ఎదురౌతుందనే భయం వల్ల చేయలేక పోయారు. ఆ జట్టు శ్రీ పద్ధతి గురించి అతనిని ప్రశ్నించినప్పుడు, అతను సరిగ్గా వివరించ లేకపోయాడు. ధాన్యం సాగులో ఈ పద్ధతిని ‘ మెడగాస్కర్ పద్ధతిగా’ అతనికి తెలుసు. ఎమ్ పి ఆర్ ఎల్ పి జట్టు మొదటి సారిగా శ్రీ పద్ధతి గురించి అతనికి వివరించి, తెలియచేసి మరియు శిక్షణని ఇచ్చారు. శ్రీ పద్ధతి ద్వారా వచ్చే లాభాలను క్షుణ్ణంగా ఆ కుటుంబంతో చర్చించి వారికి నమ్మకాన్ని కల్గించారు. రెండు నుండి మూడు సార్లుగా వారితో చర్చిస్తే శ్రీ పద్ధతిని చిన్న స్థలంలో అవలంభించడానికి ఒప్పుకున్నారు. శ్రీ పద్ధతి ప్రదర్శించడానికి అర ఎకరాన్ని కేటాయించాడు.
అక్కడ దొరికే స్థానిక విత్తనాలను వాడతానని ఎమ్ పి ఆర్ ఎల్ పి తో చెప్పాడు. మొదట ప్రదర్శించి చూపటానికి ఈ ప్రాంతంలో మామూలుగా తెలిసిన ఉరయ్ బూంట్ అనే జాతిని వాడారు. అతనికి చాలా అనుమానాలు ఉండటం వలన శ్రీ పద్ధతిలో తన సొంత పద్ధతులను పాటిస్తానని అన్నాడు. తర్వాత చర్చించి శ్రీ పద్ధతినే మాత్రమే అవలంభించేటట్టు అతనిని ఒప్పించారు. పొలం పరికరము ఒక్కటి కూడా వాడలేదు, పొలంలో ఉన్న ఎరువు మాత్రమే వాడారు.
ఇది మొత్తానికి అందరికీ కొత్త అనుభవం కావడంతో,ఈ పద్ధతిని అనుసరించడానికి అతను ఉత్తేజితుడైనాడు. విత్తనాల పరిపోషణకి ఉప్పుని ఉపయోగించాడు. ఇది తక్కువ నాణ్యతగల విత్తనాల్ని తొలగించడానికి దోహద పడింది. తన జీవితంలో నారుమడిని తయారుచేయడం ఇదే మొదటిసారి. సరియైన మురుగునీటి పారుదల కొరకు నారుమడి చుట్టూ మురుగునీరు వెళ్ళేదారిని తయారుచేసారు. సాంప్రదాయపద్ధతితో పోలిస్తే విత్తనాల అవసరం చాలా తక్కువ. మొక్కల సంఖ్య బాగా ఉంచేవారు.
లాభములు |
అవలంభించుటలో కష్టములు |
|
శ్రీ పద్ధతిని అవలంభించుటప్పుడు మొక్కకు మొక్కకు మధ్య మరియు వరుసకు వరుసకు మధ్య సమానమైన దూరం ఉంచడం పెద్ద సమస్యగా ఉండేది. రైతులు పూర్తిగా అవలంబించడానికి విముఖత చూపేవారు. వాళ్ళకి తెలిసినంతవరకు దూరాన్ని ఉంచేవారు. |
సలహాలు
సాంప్రదాయ పద్ధతి ప్రకారం వరిసాగులో విత్తనాలను వెదచల్లుతారు. నారుమడి తయారు చేసినా సరిగ్గా ఉండేది కాదు. అలా మొలకలు సరిగా వచ్చేవి కాదు, ఆ మొలక నాణ్యత సరిగా ఉండేది కావు. విత్తనాల పరిపోషణ కూడా చేయబడేదికాదు. ఆధిక పెట్టుబడి పెట్టినా, ఉత్పత్తి తక్కువగా ఉండేది. (ఎకరానికి సుమారు 10 క్వింటాల్).
శ్రీ పద్ధతిలో నారుమడిని నాణ్యతగల భూమిలో వేస్తారు. విత్తనాలు వరుసగా నాటుతారు, కావున సరిగ్గా మొలకెత్తుతాయి. విత్తనాలు చల్లే ముందు విత్తనాలను పరిపోషణ చేస్తారు. సరైన ఖాళీతో మొలకలను నాటుతారు. 15-20 రోజుల తర్వాత కలుపు తీస్తారు. ఎక్కువ ఖాళీ ఉండటం వలన హ్యాండ్ వీడర్ అనే పరికర మును కూడా ఉపయోగించి కలుపు తీయవచ్చు. ఉత్పత్తి ఎకరానికి 20 క్వింటాల్ చేరుతుంది.
సలహాలు
దేవహరి గౌడ - ఒరిస్సా
దేవహరి గౌడ |
వయస్సు : 45 సంవత్సరాలు |
సంప్రదించు చిరునామా : డాక్టర్ ఎ. ఘోష్ , సీనియర్ శాస్త్రవేత్త, ఆగ్రోనమీ, పంట ఉత్పత్తి విభాగము, |
అతని మొత్తం సాగు భూమి నాలుగు ఎకరాలు, దానిలో 3.5 ఎకరాలు వరి భూమి. అతను వర్షపాతాన్ని మరియు కాల్వలను సాగునీటి వనరులుగా ఉపయోగించుకుంటున్నాడు. అతను ఒక ఎకరానికి ఉపయోగించే విత్తనాలు 60 కేజీలు, ఎరువులు [ప్రాథమిక మోతాదుః గ్రోమోర్ (28 శాతము నైట్రోజన్ మరియు 28 శాతము ఫాస్ఫరస్ ల మిశ్రమ ఎరువు) 50 కేజీలు, మొదటి విడత రసాయనిక ఎరువుల మోతాదు: యూరియా 50 కేజీలు, పొటాష్ లవణ ద్రావణం 50 కేజీలు, రెండవ విడత రసాయనిక ఎరువులుః యూరియా 25 కేజీలు, ఇదంతా నీటి / వర్షపాత సౌలభ్యము మీద ఆధారపడి ఉంటుంది. నీటిపారుదల విధానము ద్వారా ఎకరానికి 2.1 టన్నుల దిగుబడి వచ్చింది.
దేవహరి గౌడ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సి ఆర్ ఆర్ ఐ) మరియు బేసిక్స్, స్థానిక స్వచ్ఛంద సంస్థ నుండి శ్రీ వరిసాగు విధానము గురించి నేర్చుకున్నాడు. బేసిక్స్ మరియు సి ఆర్ ఆర్ ఐ ద్వారా శిక్షణ మరియు సలహాలను తీసుకుని 2007 లో శ్రీ వరిసాగు విధానములో సాగుచేయడం మొదలుపెట్టాడు. 2008 లో 0.6 మరియు 2007 లో 0.1 ఎకరాల భూమి శ్రీ వరిసాగు విధానములో సాగు చేశాడు. జె కె ఆర్ హెచ్ 401 రకాన్ని ఉపయోగించుకుని రెండు సీజన్లు శ్రీ వరిసాగు పద్ధతిలో సాగు చేశాడు. అతడు ఈ క్రింది పద్ధతుల ను ఉపయోగించాడుః విత్తనాలు 3 కేజీలు, ఎరువులు (ప్రాథమిక మోతాదుః గ్రోమోర్ 60 కేజీలు , పొటాష్ లవణ ద్రావణం 35 కేజీలు. మొదటి విడత ఉపయోగించే రసాయనిక ఎరువులుః యూరియా 25 కేజీలు, పొటాష్ లవణ ద్రావణం 15 కేజీలు). అతడు ఈ క్రింది విధమైన 15 రోజుల వయస్సుగల పైరుతో వరి నాట్లు వేయుట, 25 X 25 చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణములో ఎడంగా ఉండేటట్లు పైరును నాటుట, నాట్లు వేసిన ఒక నెల తర్వాత కలుపు తీయుట, వరినాట్లు వేసిన ఒక నెల వరకు ఎక్కువగా ఉన్న నీటిని తీసివేయుట, వంటి శ్రీ వరిసాగు విధానాలననుసరించాడు. 2008 లో ఎటువంటి వ్యాధులకు/తెగుళ్ళకు గురి అవలేదు. కాని 2007 లో కాండం తొలిచే పురుగులకు విరుద్ధంగా ఫెరోమోన్ ను ఉపయోగించాడు. సుమారుగా ఎకరానికి 3.85 టన్నుల దిగుబడిని పొందాడు.
ప్రయోజనాలు |
సాగులోపరిమితులు |
|
వరినాట్లు ఎక్కువ ఎడంగా ఉండుట వలన కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. |
తక్కువ సాగు ఖరీదు తో అధిక దిగుబడి పొందవచ్చు.
రకము :జె కె ఆర్ హెచ్ 401 |
||
వివరములు |
సాంప్రదాయ పద్ధతి |
శ్రీ పద్ధతి |
చదరపుమీటరుకి గుత్తుల సంఖ్య |
315 |
400 |
సెంటీమీటర్లలో గుత్తుల పొడవు |
30.8 |
31.8 |
ఒక్కొక్క గుత్తికి ఉన్న ధాన్యము సంఖ్య |
195 |
220 |
గ్రాములలో 1000 ధాన్యపు గింజల బరువు |
25 |
33 |
దిగుబడి |
ఎకరానికి 2.43 టన్నులు |
ఎకరానికి 3.72 టన్నులు |
దేవ్ రాజ్ దాస్ - ఒరిస్సా
దేవ్ రాజ్ దాస్ |
వయస్సు : 45 సంవత్సరాలు |
సంప్రదించు చిరునామా: డాక్టర్ ఎ. ఘోష్ , సీనియర్ శాస్త్రవేత్త, ఆగ్రోనమీ, పంట ఉత్పత్తి విభాగము,సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సి ఆర్ ఆర్ ఐ), కటక్, ఒరిస్సా. ఫోన్ నెం : 9437271328 |
అతని మొత్తం సాగు భూమి రెండు ఎకరాలు, దానిలో 1.4 ఎకరాలు వరి భూమి. అతను వర్షపాతాన్ని ముఖ్య సాగునీటి వనరులుగా ఉపయోగించుకుంటున్నాడు. అతను ఒక ఎకరానికి ఉపయోగించే విత్తనాలు 35 కేజీలు, ఎరువులు [(ప్రాథమికమోతాదుః గ్రోమోర్ (ఒక్కొక్కటి 28 శాతము నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ ల మిశ్రమ ఎరువు) 25 కేజీలు, మొదటి విడత రసాయనిక ఎరువుల మోతాదుః యూరియా 25 కేజీలు, పొటాష్ లవణ ద్రావణం 15 కేజీలు, రెండవ విడత రసాయనిక ఎరువులమోతాదుః యూరియా 15 కేజీలు)]. ఎకరానికి 1.4 టన్నుల దిగుబడి నీటిపారుదల విధానము ద్వారా లభించింది.
దేవ్ రాజ్ దాస్ బేసిక్స్ మరియు సి ఆర్ ఆర్ ఐ, స్థానిక స్వచ్ఛంద సంస్థ నుండి శ్రీ వరిసాగు విధానము గురించి నేర్చుకున్నాడు. బేసిక్స్ మరియు సిఆర్ ఆర్ ఐ ద్వారా శిక్షణ మరియు సలహాలను తీసుకుని 2005 లో శ్రీ వరిసాగు పద్ధతిలో సాగుచేయడం మొదలుపెట్టాడు. 0.6 ఎకరాల భూమి శ్రీ వరిసాగు విధానములో చేశాడు. సరళా రకాన్ని ఉపయోగించుకుని మూడు సీజన్ల శ్రీ వరిసాగు పద్ధతిలో సాగు చేశాడు. అతడు ఈ క్రింది విధమైన పద్ధతులను ఉపయోగించాడుః విత్తనాలు 2.5 కేజీలు, ఎరువులు (ప్రాథమిక మోతాదుః గ్రోమోర్ 40 కేజీలు , పొటాష్ లవణ ద్రావణం 15 కేజీలు. మొదటి విడత ఉపయోగించే రసాయనిక ఎరువులుః యూరియా 40 కేజీలు). అతడు ఈ క్రింది విధమైన 15 రోజుల వయస్సుగల పైరుతో వరి నాట్లు వేయుట, వరినాట్లు వేసిన ఒక నెల వరకు ఎక్కువగా ఉన్న నీటిని తీసివేయుట, నాట్లు వేసిన ఒక నెల తర్వాత కలుపు తీయుట, వంటి శ్రీ వరిసాగు విధానాలననుసరించాడు. అతను తాడు ఉపయోగించి ఒక వరుసలో విత్తనాలను నాటి రోటరీ హో వీడరుని ఉపయోగించాడు. వృక్ష సంబంధిత క్రిమిసంహారక మందులను ఉపయోగించుట ద్వారా మొక్కలకు పట్టే తెగుళ్ళను ఎదుర్కొన్నాడు. సుమారుగా ఎకరానికి 2.8 టన్నుల దిగుబడిని పొందాడు.
నాట్లు నాటిన 15 రోజుల తర్వాత కలుపుతీయుట సాధ్యము కాదు. అందువలన అది 25 రోజుల తర్వాత చేయబడుతుంది.
తక్కువ మంది కూలీలు సరిపోతారు: ఈ పద్ధతిలో నారు తీయడానికి ఇద్దరు మాత్రమే పనివారు అవసరమవగా సాంప్రదాయ పద్ధతిలో 12 మంది పనివాళ్ళు అవసరమవుతారు. ఎకరానికి వరినాట్లు నాటడానికి 15 మంది పనివారు సరిపోగా సాంప్రదాయ పద్ధతిలో 35 మంది పనివారు అవసరమవుతారు.
తులనాత్మక విశ్లేషణ
సూచనలు
రకము: సరళా |
||
వివరములు |
సాంప్రదాయపద్ధతి |
శ్రీ పద్ధతి |
చదరపుమీటరుకి గుత్తుల సంఖ్య |
252 |
448 |
సెంటీమీటర్లలో గుత్తుల పొడవు |
29 |
30.4 |
ఒక్కొక్క గుత్తికి ఉన్న ధాన్యము సంఖ్య |
215 |
314 |
గ్రాములలో 1000 ధాన్యపు గింజల బరువు |
28 |
29 |
దిగుబడి |
ఎకరానికి 2.0 టన్నులు |
ఎకరానికి 3.8 టన్నులు శ్రీ వరిసాగు పద్ధతిలో అన్ని రకాల నేల స్వభావాలకు అనుగుణంగా మార్పులు అనివార్యము. |
కపిల్ బెహాల్ - పంజాబ్
కపిల్ బెహాల్ |
వయస్సు : 34 సంవత్సరాలు |
సంప్రదించు చిరునామా: డా. అమ్రిక్ సింగ్ , ఉప పథకం దర్శకుడు మరియు వ్యవసాయ వికాస అధికారి , గురుదాస్ పూర్, పంజాబ్, ఫోన్ నెం. : 9872211194 |
అతని వ్యవసాయభూమి 17 ఎకరములు, అందులో వరి సాగు 15 ఎకరములు. అతను గొట్టపు బావులను వ్యవసాయమునకు ఉపయోగించుచున్నాడు . ఫలసాయము ఎకరానికి 18-20 క్వింటాళ్ళు వస్తుంది.
ఏప్రిల్ 2006న ఉప పథకం దర్శకుడు మరియు వ్యవసాయ వికాస అధికారి, ఏ టి ఎమ్ ఏ అయిన డా. అమ్రిక్ సింగ్ ద్వారా కపిల్ బెహాల్ శ్రీ వరిసాగు విధానము గురించి నేర్చుకున్నారు. అతను 4 ఎకరములు తీసుకుని శ్రీ వరిసాగు విధానములో 3 సీజన్లు పూర్తిచేసాడు. అతను క్రింది తెలిపిన రకాలను సాగు చేసాడు. షరబతి- పుస్సా 1121, పిఎయు 201, రైస్ 6129, పిఎచ్ బి 71 మరియు ఎఫ్ వై ఎమ్.,25 కేజీలు డిఏపి మరియు యూరియా 50 కేజీలు ఉపయోగించి సూపర్ బాసుమతి,.
బేరింగు జతచేయబడిన ఏ ఎన్ జి ఆర్ ఏ యు కోనోవీడర్ సైకిలు ఇరుసుచే మార్చబడినది. ఇది పనితనము పెంపొందించుటలో దోహదపడినది.
పని వారి లభ్యత, వరి నాట్లు నాటడం వంటి పనులు ఉత్తర్ ప్రదేశ్ మరియు బీహార్ వంటి ఇతర ప్రాంతముల నుంచి వచ్చే వలస కూలీలచే చేయబడతాయి. వలస కూలీలు శ్రీ వరిసాగు పద్ధతిలో సాగు చేయటానికి ఇష్టడరు. ఎందువలనంటే వరినారుని నాటేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలి.
శ్రీ వరిసాగు విధానములో సాగు చేయుట వలన రైతులకు అధికముగా నీరు, విద్యుత్తు మరియు సహజవనరులు ఆదా అవడమే కాక వరి ఉత్పత్తి పెరుగుతుంది.
వివరములు |
సాంప్రదాయపద్ధతి |
శ్రీ పద్ధతి లో వరిసాగు |
విత్తనమలు చల్లిన తేది / |
30/5/2008 |
30/5/2008 |
వరి నారు నాటిన తేది |
3/7/2008 |
11/6/2008 |
పంట కోత కోసిన తేది |
25/10/2008 |
13/10/2008 |
కలుపు నివారణ |
1200మి.లీ.బుటాక్లోర్ |
మూడు సార్లు కోనోవీడర్ తో కలుపు మొక్కలను తీయడం |
ఎఫ్ వై ఎమ్ (టన్ను /ఎకరానికి) |
లేదు |
4 |
ఎరువు (ఎకరానికి యూరియా కేజీలలో) |
110 |
25 |
ఒక చదరపు మీటరుకు ఉత్పత్తి చేయగల కంకుల సంఖ్య |
240 (శ్రద్దగా చూసిన 10 పరిశీలనల సరాసరి) |
376 (శ్రద్దగా చూసిన 10 పరిశీలనల సరాసరి) |
గుత్తికి ధాన్యపుగింజల సంఖ్య |
130 |
225 |
గ్రాములలో ఒక్కొక్క గుత్తికి ఉన్న ధాన్య పు గింజల బరువు |
`3.65 |
7.35 |
గుత్తి యొక్క పొడవు (సెంటీ మీటర్లలో) |
28.70 |
32.12 |
ఊక దాన్యం (%) |
26 |
21 |
మొక్కల సంఖ్య/చదరపు మీటరుకు (10 పరిశీలనల సరాసరి) |
14 |
16 |
ధాన్యపు దిగుబడి (టన్ను/ ఎకరానికి) |
1.86 |
2.52 |
పంట కాలము(రోజులు) |
139 |
136 |
జగథాంబల్ - తమిళనాడు
జగథాంబల్ |
వయస్సు : 50 సంవత్సరములు |
సంబంధిత చిరునామా : శ్రీమతి పుష్పలత, అధ్యక్షురాలు, ఇకోవెంచర్ , పాండిచ్చేరి, ఫోన్ నెంబర్: 0413-2275812 |
వ్యవసాయదారురాలైన జగథాంబల్కి 2.5 ఎకరాలభూమి ఉంది. అందులోని రెండెకరాలలో ఆమె(2.0) వరి పండిస్తోంది. ఆమెకు ఆయిల్ ఇంజన్తో కూడినబోర్ బావియే నీటి వినియోగానికి వనరుగా ఉపయోగపడుతోంది. పంట కొరకు వ్యవసాయ సాగుభూమికి ఆనుకునియున్న పశువులదొడ్డిలోగల ఎరువును మరియు రసాయన ఎరువుల ను వెల్లువ మాదిరిగా( ఫ్లడ్డింగ్ ప్రక్రియ) వాడి ఎకరానికి, 7.5-9.0 క్వింటాళ్ళవరిని పొందుతోంది.
గ్రీన్ కోస్ట్ ప్రోజెక్ట్ కింద గల స్వఛ్చంద సంస్థ ఇకోవెంచర్ నుండి జగథాంబల్ గారు ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ ( శ్రీ ) పద్ధతి నేర్చుకుని 2006 సంవత్సరంలో సాంబ పంట కొరకు ఒక (1.0) ఎకరం లో ‘శ్రీ’ ను అమలు పరచారు. ఇకోవెంచర్ (స్వఛ్చంద సంస్థ) బృందం ఆమెకు శిక్షణను, మార్గదర్శకాన్ని అందించింది. గడచిన మూడు ఋతువులలోను 99001, ఎడిటి-39 వంటి రకాలను పెంచింది. వైట్ పొన్ని ని మెరుగు పరచుకోవడానికి వ్యవసాయ సాగుభూమికి ఆనుకునియున్న పశువుల దొడ్డిలో గల ఎరువు (ఐదుబండ్ల-ఎఫ్ వై ఎమ్) ను, ఇఎమ్ (ప్రభావిత పరచు సూక్ష్మ సేంద్రియ పదార్ధం), అమృత కరాయిసాల్, వెర్మికంపోస్ట్ (వానపాముల ఎరువు-స్వయంగా తయారుచేసిన) 500 గ్రాములు, అలాగే రసాయన ఎరువులను (యూరియా 25 కిలోగ్రాములు, భాస్వరం 25 కిలోగ్రాములు, జీవ సంబంధిత ఎరువులు మరియు సూడోమోనాస్) ఉపయోగించడం జరిగింది. సాగు చేస్తున్న పంటలో ఆకుముడుత పురుగు, కాండం తొలిచే పురుగు, మరియు పసుపుదనం ఉండడం గమనించి ఎఫ్పిఇ (పులిసినమొక్కల వ్యర్ధాలు-ఫెర్మెంటెడ్ ప్లేంట్ ఎక్స్ట్రేక్ట్), నీమజల్ మరియు మోనోక్రొటోఫాస్, కరాటే వంటి రసాయన తెగులు నివారణ మందులను ఒకసారిగా మాత్రమే పొలంలో చిమ్మడానికి వినియోగించింది.
ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ లో ఆచరించవలసిన అన్ని విధానాలను అనుసరించి గ్రీన్ కోస్ట్ ప్రోజెక్ట్ నుండి కోనోవీడర్ ని (శంకు ఆకారంలోగల కలుపు తీసే యంత్రాన్ని) తన స్వంతం చేసుకుంది. ఎకరానికి 1.1టన్నుల (సాంప్రదాయ పద్ధతిలోకన్నా ఐదు సంచులు ఎక్కువ) ని పొందింది.
చేతితో కలుపును తీసే పార/బొరుగు సాధనాల తో రెండు ఋతువులలోను కలుపు తీయడం జరిగింది. కోనో వీడర్ తో పని చేసే టప్పుడు నీటి సమస్య వచ్చింది.
వివరాలు |
సాంప్రదాయ పద్ధతి |
ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ – ‘శ్రీ’ పద్ధతి |
విత్తనం |
600 |
50 |
చిన్నమొక్కలను పెంచే క్షేత్రం సంసిద్ధత |
350 |
150 |
ప్రధాన వ్యవసాయానికి సిద్ధపరచడం |
1,500 |
1,500 |
మొలకలను తొలగించడం |
1,000 |
120 |
ఎరువులకు |
1,500 |
800 |
మరొకచోటుకి నారుమార్చడం (గుర్తించదగునట్లు (మార్కర్) చేసే వినియోగానికి రూ|| 800 మరియు అల్లిక తాడుకి రూ||840) |
1,200 |
800 |
కలుపు మొక్కలను తొలగించడం |
1,200 |
1,0000 |
తెగుళ్ళ నివారణకు(కూలితో కలుపుకొని) |
800 |
-- |
పంట కోతకు |
1,500 |
1,500 |
మొత్తం |
9,650 |
7,020 |
కె.స్వామినాథన్ - తమిళనాడు
కె.స్వామినాథన్ |
వయస్సుః 45 సంవత్సరాలు |
సంబంధితచిరునామాః |
35 ఎకరాల మొత్తం వ్యవసాయ క్షేత్రంలో 22 ఎకరాల భూమిని వరి సాగునిచేస్తున్నారు. నీటి వనరులుగా బోరు బావులను, కావేరి నది నీటిని వినియోగిస్తున్నారు. అతని నల్లని బంక మట్టి నేలలో సేంద్రీయ ఎరువును, వ్యవసాయ క్షేత్రంలోగల పశువుల ఎరువును భూమిని సారవంతంచేయడానికి వాడతారు.
ఈయన ప్రసార మాధ్యమం నివేదికల ద్వారా వ్యవసాయదారుల (ఫార్మింగ్ కమ్యూనిటీ) నుంచి ఎస్ ఆర్ ఐ-‘శ్రీ’ గురించి తెలుసుకున్నారు. దానిని 2006సం||లో అమలుపరచారు. ఆయన స్వంతంగా పరీక్షించి, ప్రయోగం చేసి నేర్చుకుంటూ, తన కుటుంబం తన ప్రాంతంలోని కార్మికులు ఎంత నిరోధించి నప్పటికీ ఆయన తండ్రిగారు వరుస మొక్కల పెంపకానికి, నారుదశలోనే మొక్కలను మార్చడానికి ప్రారంభించినప్పటికిని ఎస్ ఆర్ ఐ - ‘శ్రీ’ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వ సబ్సిడీ/ రాయతీ రూపం లో ఆర్ధిక సహాయం 3 ఎకరాలకు అందివ్వడం జరిగింది, కానీ ఈ సహాయం లభిస్తుందనే విషయాన్ని మనస్సులో పెట్టుకుని ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ పద్ధతిని అమలు చేయలేదని ఆయన చెప్పారు. రాయితీ అందనప్పటికినీ ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ పద్ధతిని ఆపివేయనని చెప్పారు. ఆయన గ్రామంలొ, ఆయన అన్నదమ్ముల పిల్లలిద్దరూ కూడ ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ నే అవలంబిస్తూ మొత్తం 50 ఎకరాలలోను ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ పద్ధతినిచేస్తున్నారు.
ప్రస్థుతం, స్వామినాథన్ ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ పద్ధతిలో 22 ఎకరాలు సాగు చేస్తున్నారు. పొన్ని, ఎడిటి 36/43/46,పి.ఎస్ 44, సి.ఆర్ 1009, కొన్ని సంకర రకాలను కూడ సాగు చేస్తున్నారు. ఆయన పొలానికి ఆనుకునియున్న పశువుల దొడ్డిలో గల సేంద్రియ ఎరువును, సూక్ష్మపోషకాలను మరియు జీవ సంబంధిత ఎరువులను, ఆవుపేడ కంపోస్ట్, అమృత కరాయ్సల్ మొదలగు పంటకు కావలసిన వాటిని వినియోగిస్తున్నారు. కోనోవీడర్ , రోప్ మార్కర్ (గుర్తింపు కొరకు అల్లిక తాడు), విత్తులను వెదజల్లే పీపా (సీడ్ డ్రమ్), పంటకోసే యంత్రం, పత్రం-రంగు పత్రాలు (లీఫ్-కలర్ కార్డులు )వంటి వీలున్న ప్రతీ పనిముట్టును ఉపయోగిస్తున్నారు.
స్వామినాథన్ గారు అవలంబించిన ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ విధానాలుః
ఆయన వేసిన పంటలో మొక్కలు పెరుగుదల దశలో తెల్ల బూజు ( వైట్ ఫంగస్) ఏర్పడింది. దానిని నివారించడానికి ఆవు మూత్రం, చేదు ఆకులను నీటితో ద్రావణాన్ని స్వయంగా తయారు చేసుకుని వాటిపై జల్లారు. ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ అమలుపరచినప్పటి నుంచి ఇటువంటి అంశాలు సంభవించడం తగ్గినది.
చేతితో కలుపును తీసే పార/బొరుగు సాధనాల తో రెండు ఋతువులలోను కలుపు తీయడం జరిగింది. కోనో వీడర్ తో పని చేసే టప్పుడు నీటి సమస్య వచ్చింది.
దీర్ఘ కాలపు సాగులో ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ పద్ధతి, పంటలు ఫలవంతం కావడానికి, నేల సారవంతమగుటకు సరైనదని స్వామినాథన్ కి విశ్వాసం ఏర్పడింది. ఆయన పొందిన లాభాలు ఏమిటంటేః
వివరాలు |
సాంప్రదాయ పద్ధతి |
ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ పద్ధతి |
సంగ్రహ పాఠం |
విత్తనాల ధర ( ఎకరానికి / కి||గ్రా|| ) |
16-20 కి||గ్రా|| |
0.8-1.6కి||గ్రా||(ఒక్కదానికి-ఏకదళబీజ) |
- |
గింజల/ధాన్యం దిగుబడి/ఎకరానికి ఒక బస్తాకి = 60కిలోలు |
36-40 సంచులు |
30 సంచులు |
నిర్దిష్టమైన(5)ఋతువులలోఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ వలన సరాసరిగా 18 ధాన్యం సంచుల నుంచి 30సంచులకు పెరిగింది. |
ఎండు గడ్డి ఉత్పాదన/ ఎకరానికి |
ఈ-- |
4-5టన్నులు |
2006 సం|| నుండి ఇది స్థిరంగా ఉంది. |
కూలీలు/ఎకరానికి |
విత్తనములు చల్లడానికి(సీడ్ బెడ్): ఇద్దరు |
విత్తనములు చల్లడానికి(సీడ్ బెడ్): ఒక్కరు |
|
మొత్తంనిర్దిష్ట కాలానికి |
5,000 |
4,600 |
|
ఒక చ||మీ||కు అంకురాలకు/టిల్లర్ల సంఖ్య |
250 కన్నా తక్కువ |
250కన్నా ఎక్కువ |
|
టిల్లరుకు / గుత్తుల సంఖ్య |
10-15 |
40-60 |
|
ఒక గుత్తికి గింజల సంఖ్య |
100 |
200-300 |
|
విత్తనాలు మొలకెత్తే శాతం |
80శాతం |
90శాతం |
చాలా బాగుంది,ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ’, గింజకట్టని గుత్తిలేనే లేదు |
నీటి నిర్వహణ పంటకునీరు పారించే రోజుల సంఖ్య, నీరు నిల్వఉండేస్థాయి |
12రోజులు |
7-8 సార్లు పంట కాలానికి |
ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ లో నీటి ఆదా 40శాతం ఉంటుంది. |
వి కెవి రవిచంద్రన్ - తమిళనాడు
వి కెవి రవిచంద్రన్ |
వయస్సుః 50సం|| |
సంబంధిత చిరునామాః శ్రీ రామసుబ్రహ్మణియం, ప్రధానాధికారి,సమన్వయ,మైలాపూర్ ,చెన్నయ్,600004. ఫోన్: 9444957781 |
రవిచంద్రన్ గారి మొత్తం వ్యవసాయ భూమి 60 ఎకరాలు. కాని ప్రతీ ఋతువులోను సాగు చేసే భూమి వేర్వేరుగా ఉంటుంది. (ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ అమలు గల పట్టికలో వివరాలను చూడండి). కావేరినది నీటిని, బోరు బావి నీటిని ఆయన ఉపయోగించుకున్నారు. నేల రకం, సముద్రాల, నదుల నుంచి కొట్టుకు వచ్చిన వండ్రు బంకమట్టి.
రవిచంద్రన్ గారికి టి.ఎన్ .ఎ.యు (తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం)ద్వారా ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ పరిచయమైంది.
ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ ని 2003 సం||లో అమలుపరచారు. శిక్షణ, మార్గదర్శకత్వాలను టి.ఎన్.ఎ.యు, ఎస్.ఆర్.ఐ - ‘ శ్రీ ’ బృందం ద్వారా తీసుకున్నారు. పట్టికలో చూసినట్లయితే భిన్నఋతువులలో వరిని ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ లోసాగుచేసారు. క్రింది వరి రకాలను సాగుచేసారుః కురువాయ్ -టికెఎమ్-9, సిఒఆర్ హెచ్1; సాంబ -సిఆర్ 1009 ల తలాడి-ఎడిటి 39, పొన్ని రకాలు. పశువుల దొడ్డిలో గల పశువుల ఎరువుని, డిఎపి మరియు యూరియా ను పంట కొరకు ఉపయోగించారు.
సంవత్సరం |
ఋతువులు |
ప్రదేశం(ఎకరం) |
2003 |
సాంబ |
55.20 |
2004 |
సాంబ |
55.50 |
2005 |
సాంబ |
60.70 |
2006 |
సాంబ |
60.70 |
2007 |
కురువాయ్ |
10.00 |
2008 |
కురువాయ్ |
12.00 ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ ఆచరణలో అనుసరించిన అంశాలుః
ఈయన క్రింద ఇచ్చిన పనిముట్లను సాగులో ఉపయోగించారు; |
రిడ్జెస్ (ఉబ్బెత్తు భాగం నుండి పైకి మొనదేలిన అంచులు)గా కలుపుతీత యంత్రాన్ని రవిచంద్రన్ మార్పు చేసారు .
రవిచంద్రన్ గారి ఉద్దేశం ప్రకారం, ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ లో ఉన్న (పేకేజి)అంశాల నుంచి సంపూర్ణంగా ఏ ఒక్క దానిని వదలివేయకుండా పాఠిస్తూ, దానిలోని సూత్రాలను గనక అనుసరిస్తే మంచి దిగుబడి వస్తుంది. ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ పద్ధతిలో పంట సాగుచేస్తే విత్తనాలు వృద్ది అవుతాయి.
ఐదు సంవత్సరాలబట్టి ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ ని అవలంబిస్తున్నప్పటికినీ కొన్ని ముఖ్యమైన అంశాలను రవిచంద్రన్ గారు గుర్తించారు.అవి ఏమిటంటే, విత్తే మెక్కల సంఖ్య తగ్గింది, దీనికి కొద్దిపాటి మొలకల చొప్పున లేత మొలకలను వేరుచేసి నాటడం, మధ్య మధ్యలో ఎడం ఎక్కువగా ఉంచడం, నీటి పారుదలను నియంత్రించడం, కలుపు తీసే వర్తుల యంత్రాన్ని(రోటరీ వీడర్ )ని వినియోగించి ఆక్కడక్కడ తన గ్రామంలో ఆయన చిన్నాన్న/మామయ్య వి.కె. జానకీరామన్ 1970 సం||నికి పూర్వమే అమలుచేసారు. అయినప్పటికి అన్ని విధానాలని కలిపి కలిసికట్టుగా సమతుల్యంగా పాఠించలేకపోవడం , లాభాలున్నప్పటికినీ అప్పటికాలంలో దీని గురించి శాస్త్రీయ అధ్యయనాలు లేవు గనుక చివరికి ఈ విధానాలని విడిచిపెట్టడం జరిగింది. ఇది ఇప్పుడు రైతు సోదరులకు దీవెన వంటిదని, శాస్త్రీయ అనుసంధానంతో ఎస్ ఆర్ ఐ- ‘శ్రీ’లోని ప్రతీ అంశాన్ని చేయడం జరిగిందని ఆయన చెప్పారు.
ఆయన తోటి రైతులు ఎక్కడైనా కన్పించి, ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ ని క్లుప్తంగా వివరించమంటే ఈ విధంగా చెప్పేవారు. అన్నీ చక్కగా ఉన్నప్పుడు రెండు చక్రాల మోటారు సైకిలు అంటే బండి తగిన విధంగా ఉండి, గాలి పీడనం సరిపోయేటంతగాను, రోడ్దుబాగుండి, గాలిదిశ పరిస్థితులు , మొదలగున వన్నీ బాగున్నప్పుడు మైలేజి (ప్రయాణించిన మైళ్ళ చొప్పున ఇచ్చు బత్తా) ఎక్కువ ఇస్తుంది. అదేవిధంగా, చక్కటి ప్రణాళికతో రైతులు తగిన పరిస్థితులను కల్పించినప్పుడు ఎస్ఆర్ ఐ – ‘శ్రీ’పద్ధతి కూడ విజయవంతమౌతుంది.
అభ్యాసంచేసే టప్పుడు, ఈయన, పొరపాట్లుచేస్తున్న ప్రతీసారి ఆశావాదిగానే ఉండి వాటిని అధిగమిస్తున్నారు. తనతోటివారు కూడా ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ ని అమలుపరచేటప్పుడు కొన్ని సమస్యలు ఏర్పడతాయని భావించారు. వాటిని దృష్టిలో ఉంచుకొనిసరిదిద్దే విధానాలను అమలుచేసారు.
వివరాలు |
సాంప్రదాయ పద్ధతి |
ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ పద్ధతి |
సంగ్రహ పాఠం |
విత్తనం ధర - కి||గ్రా| /ఎకరానికి |
25 |
3-3.5 |
- |
ధాన్యం దిగుబడి |
3.2 |
4.4(2007 కురువయ్) |
ఈ సంఖ్యాలు రెండు పద్ధతులలోను చాలా మంచి ఫలసాయం పొందినప్పటివి. |
మొత్తం వేతనం |
4,000 |
2,500 |
వేతనం |
కూలీల సంఖ్య |
10 మంది (కోయడానికి) |
ఒక స్త్రీ(కోయడానికి) |
వేర్వెరుగా నాటేపద్ధతిలో ,ఒకేరకమైన సంఖ్యఉంది-ఒక ఎకరానికి 15మందిస్త్రీలు అవసరం.పంటకోతకు, కంబైనర్ ని వాడుతున్నారు.ఇవి రెండు విషయాలు ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ మరియు సాంప్రదాయ విధానంలోను ఉపయోగించారు. |
పిలకల (టిల్లర్ల) సంఖ్య |
12-14 |
40-45 |
ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ పద్ధతిలో పిలకల/ టిల్లర్ల సంఖ్య 60 దాకా ఉంటుంది. |
నీటి నిర్వహణ |
5 ఎకరాలలో నీటిస్థాయి నిర్వహణకు రోజుకి 12గం|| చొప్పున మూడు మోటార్లు వాడవలసి వస్తుంది. |
10 ఎకరాలనేలలో రోజుకి12గం|| చొప్పున తేమ ఉండేటట్లుచేయడానికిరెండు మోటార్లు కావాలి. |
155రోజులపంటకు సంఖ్య ఇవ్వబడింది.ఆచరణలో ఏర్పడిన అనుభవాన్ని బట్టిసాంప్రదాయపద్ధతిలో ఒక కి||గ్రా|| వరి ఉత్పత్తికి 2400 లీ|| ఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ లో 1200లీ|| నీరు అవసరమౌతుంది. |
నీటినిర్వహణ |
135-140రోజులకన్నా ఎక్కువ గా 3 అంగుళాలవరకు నీరు ఉండేటట్లుచేసి పారుదల అవసరంలేకుండానే చేయడం.155 రోజుల వరకు ఫలసాయం వచ్చేటంత వరకు సరిపోతుంది. |
కంకి ఏర్పడే దశవరకు ఎక్కువతేమను ఉంచడానికి నీటిని మూడంగుళాల వరకు చేరేటట్లు చూడాలి. |
మొత్తంనీటివినియోగంలోఎస్ ఆర్ ఐ - ‘ శ్రీ ’ లో |
హృదయ్ రంజన్ దేబ్ నాథ్
హృదయ్ రంజన్ దేబ్ నాథ్ |
వయస్సు : 63సం|| |
సంబంధిత చిరునామాః శ్రీ బహరుల్.ఐ.మజుమ్ దార్ , సీనియర్ అగ్రానో మిస్ట్, వ్యవసాయ విభాగం, త్రిపుర ప్రభుత్వం, అగర్తల-799003, త్రిపుర. ఫోన్ : 9436123659. |
వ్యవసాయదారుడైన హృదయ్ రంజన్ దేబ్ నాథ్గారికి గల 1.25 ఎకరాల వ్యవసాయ భూమిలో మొత్తం వరి పండిస్తారు.బోలుగా ఉండే ఇనుప గొట్టం(భూమిలోపలి నుంచి నీటిని తీసుకోవడానికి ఉపయోగించే వాడిమొనగల ఇనుప గొట్టం), పొలానికి ఆనుకునియున్న పశువుల దొడ్డిలోని ఎరువు(ఎఫ్ వై ఎమ్- ఒక టన్ను), యూరియా(10-12కి||గ్రా||/కని 0.4 ఎకరానికి) ఇంకను రాక్ ఫాస్ఫేట్ రసాయనాలు ఆయన వినియోగిస్తారు. వరి ధాన్యం 1.4 నుండి1.7టన్నులు/ఎకరానికి దిగుబడి లభిస్తోంది.
ప్రయోగాత్మకంగా ఎస్ ఆర్ ఐ –‘ శ్రీ ’ లో హజరి పయ్జెమ్ రకపు వరిని నేరుగా విత్తనాలు వేసి పండించారు. మంచి ఫలితాలు వచ్చాయి. పెద్ద వడ గండ్ల వాన వల్ల వచ్చే ఆపద తప్పిస్తే నారును వేరు చేసి నాటే పద్ధతితో పోలిస్తే ఎస్ ఆర్ ఐ – ‘శ్రీ’ లోవరిని నేరుగా విత్తనాలు వేసినప్పుడు వచ్చిన మొలకల, అంకురాల పెరుగుదల శ్రేష్ట మైనదిగా ఉంది.
సమయానికి సాగుబడికి అందుబాటులో లేకపోవడం.
• రసాయన ఎరువులతో బాటు జీవసంబంధితమైనవి కూడ సమయానికి అందుబాటులో ఉండకపోవడం.
• సేంద్రియ ఎరువు కొరత ఏర్పడడం.
• వివిధ సమవర్ధితప్రక్రియలు చేపట్టేవిషయంలో కూలీలనుపెట్టుకోవడం సమస్య అవుతుంది.
• వ్యవసాయపనిముట్లు, అదనపు భాగాలు, యంత్రాలను బాగుచేసే సాధనాల కొరత.
• నీటికొరత.
• 10 రోజుల ఎడంతో 30 రోజులలో మూడు సార్లుగా కలుపుకోత చేయడం సమస్యగా మారినది.
సాంప్రదాయపద్ధతితోచూస్తే ఎస్ ఆర్ ఐ -‘ శ్రీ ’ లో విత్తనాలు, ఎరువులు,నీరు, కూలీలు,కావలసిన సమయం అన్నీ
కూడ తక్కువగానే ఉంటాయి.
• 30శాతం లేదా అంతకంటే ఎక్కువ దిగుబడి ఇందులో నమోదవుతున్నది.
• ఎడం ఎక్కువగా ఉండడం వలన కలుపు తెగుళ్లు అధికంగా ఉంటాయి.అయినప్పటికినీ తగిన సమయంలో కలుపు తీయడం వలన కలుపు తెగుళ్లు తగ్గడంకూడ కనిపించింది.
• అధికంగా గల అంకురాలు, పూత పెద్దదిగా ఉండడం , తునుకుగా ఉన్న ఎండుగడ్డి, స్ఫుటమైన- కాంతివంతంగా గల ఎక్కువ బరువుగల గింజలు ఏర్పడడం గమనించడమైనది.
వివరాలు |
సాంప్రదాయ పద్ధతి |
ఎస్ ఆర్ ఐ –‘ శ్రీ ’పద్ధతి |
||
చేసే ప్రక్రియలు |
|
|
||
చిన్నమొక్కల(నర్సరీ)మడిని పెంచడం |
తడిగా ఉన్న మడి |
పొడిగా |
||
చిన్నమొక్కల( నర్సరీ) నిర్వహణ |
సరిగా లేనిది |
సరిగా నిర్వచించబడినది |
||
నేలను ఎత్తుపల్లాలు లేకుండా చేయడం. |
సామాన్యంగా అనుసరించరు |
తప్పనిసరిగా అనుసరిస్తారు |
||
ఎరువుల వినియోగం |
32: 16 : 16/ఎకరానికి
2-2.5టన్నులు/ఎకరానికి |
8.4: 2.8:9.6/ఎకరానికి
5టన్నులు/ఎకరానికి |
||
జీవ సంబంధిత ఎరువు |
లేదు |
1.4కి||గ్రా||/ఎకరానికి |
||
మొలక వయస్సు |
25-35 రోజులు |
8-12రోజులు నారును నాటడం వేళ్ళతో పెళ్ళగించడం |
వేర్లు దెబ్బ తింటాయి |
వేర్లుదెబ్బతినవు |
వేర్లతో పెకిలించిన మొలకలను ప్రధానక్షేత్రంలోనాటడానికి పట్టే కాలవ్యవధులు. |
1నుండి24 గంటలు |
30 నిమిషాలలోగా |
||
నారును నాటే లోతు |
1-2 సెం||మీ|| కన్నా ఎక్కువ లోతుగా |
పైపైన |
||
3-4 రోజుల తర్వాత నాటిన మొలక రంగు |
పసుపుదనంతోగల ఆకుపచ్చని రంగు |
ఆకుపచ్చ |
||
నాటిన మొలకల సంఖ్య |
2-3 మొలకలు |
ఒకటి |
||
మధ్య మధ్య ఎడం |
10 నుంచి 15 సెం||మీ|| |
నీటినిర్వహణ అంతరంగా, మడులమధ్య/నీటిపారుదల/మురుగుకాల్వ |
లేదు |
ఉంది ( 50 సెం||మీ|| వెడల్పుతో) |
మురుగుకాల్వ మధ్య దూరం |
- |
4 మీటర్లు కలుపుతీత నిర్వహణ రసాయనికంగా కలుపు తీయడం |
జరుగుతుంది |
లేదు |
యాంత్రికంగా కలుపుతీత (కలుపుతీత యంత్రంతో) |
చేయరు |
చేస్తారు |
||
విత్తనం ధర / ఎకరానికి |
12 కిలోలు |
2కిలోలు/ఎకరానికి దిగుబడి మరియు ఆదాయం దిగుబడి ( టన్ను/ ఎకరానికి ) |
1.5 |
2.5 |
సాగు ఖర్చు(రూ||/ఎకరానికి) |
6,375 |
5,750 |
||
ఫలితంగా వచ్చే ఆదాయం మొత్తం(రూ||/ఎకరానికి) |
9,500 |
18,750 |
||
తిరిగిరాని మొత్తం(రూ||/ఎకరానికి) |
3,124 |
13,000 |
సాగు భూమి చాలా పెద్దదైనప్పుడు , సాంప్రదాయ నాటు-ఆ పద్ధతిలో చేసే ప్రక్రియలలో ఎక్కువగా నీటిని నిలబెట్టుకునే నారు, అడ్డదిడ్డంగా నాటడంలోను సులభతరంగా ఉంటుంది.
• పోలిథీన్ షీట్లను నివారించాలి. కట్టె ల బూడిదను, కుళ్లిన పశువుల ఎరువు(ఎఫ్ వై ఎమ్)ను ఎక్కువగా వినియోగించడం. ఇంకను, విత్తనాలను నాటడంలో ఎక్కువ ఎడం ఉంచడం చేయాలి.
• మొక్కలు ఆరోగ్యకరంగా ఉండాలి. అందువల్ల ప్రధాన క్షేత్రంలో నాటబడిన మొలకలు బాగా నిలదొక్కుకుంటాయి.
• తగిన సమయంలో సంవర్ధిత ప్రక్రియలు అధిక దిగుబడికి చాలా దోహదంచేస్తాయి.
తపన్ సేన్
తపన్ సేన్ |
వయస్సుః 40 సం|| |
సంబంధిత చిరునామాః శ్రీ బహరూల్ ఐ మజువ్దూర్ , సీనియర్ అగ్రోనోమిస్ట్, వ్యవసాయ శాఖ, త్రిపుర ప్రభుత్వం,అగర్తల- 799003,త్రిపుర, ఫోన్:9436123659 |
తపన్ సేన్, తన మొత్తం 0.64 ఎకరాల భూమిలో వరి సాగు చేస్తున్నారు. దీనికి వర్షపాతమే ప్రధానమైన నీటి వనరు. ఎకరానికి /6 క్వింటాళ్ల దిగుబడి సరాసరిగా వస్తుంది.
2002 సం||లో త్రిపుర ప్రభుత్వ, వ్యవసాయ శాఖలో, ఉప డివిజినల్ వ్యవసాయ కార్యాలయం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఎస్ ఆర్ ఐ – ‘ శ్రీ ’ గురించి ఆయన తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను 2003 సం|| లో 3.2 ఎకరాలలో (ఖరీఫ్: 1.6 ఎకరం, రబీ : 1.6 ఎకరం ) విత్తడం చేసారు త్రిపుర ప్రభుత్వ వ్యవసాయశాఖ అగ్రికల్చర్ సెక్టార్ అధికారి హృష్యముఖ్ ద్వారా శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం పొందారు. తొమ్మిది ఋతువుల కాలాల దాకా ఎస్ ఆర్ ఐ – ‘ శ్రీ ’ వ్యవసాయాన్ని చేసారు. ఆయన పొందిన దిగుబళ్ళు కింద ఇవ్వబడ్డాయి.
సంవత్సరం |
ఋతువులు |
ఎస్ ఆర్ ఐ – ‘ శ్రీ ’ క్రింద చేయబడిన సాగుభూమి |
దిగుబడి |
2003 |
రబీ/బోరొ |
0.4 |
3.8 |
2004 |
ఖరీఫ్ |
1.2 |
3.2 |
2005 |
ఖరీఫ్ |
1.6 |
3.0 |
2006 |
ఖరీఫ్ |
1.2 |
3.1 |
2007 |
మొదటి,రెండవ ఖరీఫ్ |
2.4(1.2+ 1.2) |
0.9, |
2008 |
మొద టి ఖరీఫ్( తక్కువ కాలపు రకం) |
0.8 |
1.8 విత్తనాలు,రసాయనిక ఎరువు, జీవ సంబంధిత ఎరువు మరియు వర్మి కంపోస్ట్ను పంటకొరకు ఉపయోగించారు. ఎస్ ఆర్ ఐ –‘ శ్రీ ’లోగల అన్నివిధానాలను అనుసరించారు. పూజా ,ఎమ్ టి యు7029, ఎన్ డి ఆర్-97, మరియు బి ఆర్-29 రకాలను సాగుచేసారు. ఎస్ ఆర్ ఐ – ‘ శ్రీ ’ సంబంధిత సాధనాలతోబాటు జపానీయుల వరి కలుపుతీత యంత్రాన్ని ఉపయోగించారు. ఒక సారి మాత్రం, ఆయన పంటకు కాండం తొలిచే పురుగు సోకింది దాని నియంత్రణ కు తెగుళ్ల మందులను వాడారు. |
వివరాలు |
సాంప్రదాయ రీతి |
ఎస్ ఆర్ ఐ – ‘ శ్రీ ’ పద్ధతి |
న ర్సరీ ఎదుగుదలలో |
10 పని దినాలు |
3 పనిదినాలు |
నర్సరీ మడిలో నాటడానికి |
2 పని దినాలు |
ఒక పనిదినం |
ఎరువుల వినియోగం |
32: 16: 16 2.4 టన్నులు |
08: 04: 04 4 టన్నులు |
మొలకల వయస్సు |
21-30రోజులు |
8-12రోజులు |
అ)వేళ్లతో బాటు పెకిలించిన మొలకలు |
- |
పారతో |
||
ఆ) వేళ్లతో బాటు పెకిలించిన మొలకలను ప్రధాన క్షేత్రంలో నాటడానికి మధ్య గల కాలావధి |
1-2 రోజులు |
30 నిమిషాలు |
||
ఇ)నాటే లోతు |
5-7 సెం|| మీ|| |
ఉపరితలం నుండి 2-3 సెం||మీ|| |
||
ఈ)నాటిన 3-4 రోజుల తర్వాత మొక్కల రంగు |
పసుపు రంగు |
ఆకుపచ్చదనం |
||
ఉ)ప్రతీ మట్టి కుప్పతో బాటు ఉండే మొలకలు |
3-5 |
1 |
||
ఊ) మధ్య ఎడం |
15(x)15 చదరపు సెం||మీ|| లేదా అక్కడక్కడా |
25X25 చదరపు సెం||మీ నీటి నిర్వహణ అ)మడిలో ఆంతర,అంతర్గతంగా నీటి పారుదల మురుగు కాల్వల ద్వారా |
లేదు |
జరుగుతుంది |
ఆ)మురుగు కాల్వల మధ్య దూరం |
- |
4 మీటర్లు |
||
ఇ)వెడల్పు మరియు లోతు |
- |
25సెం||మీ||వెడల్పు మరియు 25సెం||మీ||లోతు కలుపు నిర్వహణ అ)చేతితో కలుపు తీయడం |
2 సార్లు |
ఒకసారి |
ఆ)యంత్రం సహాయంతోకలుపుతీత(వీడర్ ) |
- |
రెండు సార్లు |
||
ఇ)విత్తనం ధర |
20కిలోలు |
2 కిలోలు |
||
ఈ)రకం |
ఐ ఆర్ - 64 |
ఐ ఆర్- 64 |
||
ఉ)దిగుబడి |
2.0 టన్నులు |
2.7 టన్నులు సూచనలు |
చేయిన్ సింగ్
చేయిన్ సింగ్ |
వయస్సు : 52 సంవత్సరాలు |
సంప్రదించ వలసిన చిరునామాః శ్రీ దేబ్ షిష్ , డైరెక్టర్ |
చేన్ సింగ్ గారి మొత్తం వ్యవసాయ భూమి 30 నలీలు(ఆంటే1.5 ఎకరాలు; 1 నలీ= 200 చదరపు మీటర్లు ) ఉంటాయి. అయితే దీనిలో వరి సాగు కోసం 8 నలీలు ఆంటే 0.4 ఎకరాల భూమిని కేటాయించారు. నీటి వనరుగా గుల్ (నీటిపారుదల కాల్వ) పనిజేస్తుంది. ఆవుపేడ, యూరియాలను ఎరువుగా వినియొగిస్తున్నారు. ఫ్లడ్డింగ్ పద్ధతితో 110కిలోగ్రాములు/ నలికి(22 క్వింటాళ్ళు/ఎకరానికి దిగుబడిని సాధిస్తున్నారు.
ఉత్తరాఖండ్ లోని నైన్ భాగ్ లోగల ఘర్ వాల్ వికాస్ కేంద్రం(గివికె)ద్వారా ఎస్ ఆర్ ఐ - ‘శ్రీ’ గురించి తెలుసుకున్నారు.గివికె(ఘర్ వాల్ వికాస్ కేంద్రం)అనేది డెహ్రాడూన్ లోని పీపుల్స్ సైన్స్ ఇనిస్టిట్యూట్ లో భాగస్వామ్యంగల సంస్థ. 2007 సం|| నుండి చెయిన్ సింగ్ గారు ఎస్ ఆర్ ఐ - ‘శ్రీ’ ని అమలుచేస్తున్నారు.జివికె నుండి శిక్షణను, మార్గరశకత్వాన్ని పొందారు. వివరాలు |
2007 |
2008 |
ఎస్ ఆర్ ఐ - ‘శ్రీ’ కింద సాగు ప్రాంతం |
1 నలి (0.05ఎకరం) |
2.5నలి (0.13ఎకరం |
ఋతువులు |
ఖరీఫ్ |
ఖరీఫ్ |
రకము |
స్థానికం |
స్థానికం |
వాడిన పదార్ధాలు |
పంచ గవ్యం, అమృతజల్,మట్క ఖాద్, వెర్మి కంపోస్ట్ |
పంచ గవ్యం, అమృతజల్, మట్కా ఖాద్, వెర్మి కంపోస్ట్ |
అనుసరించిన ఆచరణలు |
అన్నింటిని అనుసరించారు,వీడర్ ని రెండు సార్లు వినియోగించారు. |
అన్నింటిని అనుసరించారు, వీడర్ ని మూడు సార్లు వినియోగించారు. |
అందుబాటులోగల సాధనాలు వాటి ఉపయోగం |
జి వి కె ద్వారా వీడరు, మార్కరు ఇవ్వబడ్డాయి. |
జి వి కె ద్వారా వీడరు, మార్కరు ఇవ్వబడ్డాయి. |
దిగుబడి |
180 కి లో లు / ఒక నలికి ( 36 క్వింటాళ్ళు / ఎకరానికి) |
220 కిలోలు/నలికి (44 క్వింటాళ్ళు / ఎకరానికి |
నారును విడదీసి వేరొక చోటులో నాటడమనేది ఎస్ ఆర్ ఐ - ‘శ్రీ’ లో సులభమౌతుంది వివరాలు |
సాంప్రదాయ పద్ధతి |
ఎస్ ఆర్ ఐ - ‘శ్రీ’విధానం |
ప్రక్రియలు |
|
|
నర్సరీ |
స్థిరమైన కొలతలు లేవు |
కొలతలు స్థిరమైనవి, 3 చదరపు మీటర్లు |
క్షేత్రాన్ని సంసిద్ధం చేయడం |
మార్కర్ ని వినియోగించరు |
మార్కర్ ని వినియోగిస్తారు |
నారు నాటడం |
30 రోజుల మొలకలను నాటుతారు |
10 రోజుల మొలకలను నాటుతారు |
కలుపు తీత |
మనుషుల ద్వారా (చేతితో) |
కలుపుతీత యంత్రాన్ని మూడు సార్లు ఉపయోగిస్తారు. |
నీటినిర్వహణ |
2 అంగుళాల నుండి 4 అంగుళాల వరకు నీటిని ఎల్లప్పుడు వినియోగించడం |
1అంగుళం నుంచి 2ఆంగుళాల వరకు 10రోజుల ఎడంతో నీటిని వినియోగించడం. |
ఎరువు/సహజ ఎరువులు |
ఎన్ పి కె(నత్రజని, భాస్వరం, పొటాషియం), యూరియా |
పంచగవ్యం, అమరితాజల్ మట్కాఖాద్, వెర్మికంపోస్ట్ |
దిగుబడి/ఆదాయం |
|
|
సాగుబడిచేసే మొత్తం టిల్లర్ల సంఖ్య |
10 |
40 |
మొక్క సరాసరి ఎత్తు (సెం||మీ||) |
62 |
97 |
ఉత్పాదక టిల్లర్లు |
8 |
30 |
పిలకలు (పానికల) పొడవు (సెం||మీ||) |
16 |
29 |
సరాసరి సంఖ్య గింజలు/ పిలకలు (పానికల్) |
80 |
190 |
మొత్తం ధాన్యం రాబడి |
110 కిలో గ్రాములు/నలికి (2.2 టన్నులు / ఎకరానికి |
180 కిలో గ్రాములు/నలికి (3.6 టన్నులు/ఎకరానికి |
మొత్తం ఎండుగడ్డి రాబడి |
137కిలోగ్రాములు/నలికి(2.74టన్నులు/ఎకరానికి |
270కిలోగ్రాములు/నలికి(5.4 టన్నులు/ ఎకరానికి |
సాగుకయ్యే మొత్తం ఖర్చు |
రూ|| 1.048/నలికి (రూ || 20.960/ ఎకరానికి |
రూ|| 731/నలికి (రూ||14,620 / ఎకరానికి |
సంపాదించిన నికరాదాయం |
రూ|| 3,780/ ఎకరానికి |
రూ|| 26,780/ఎకరానికి |
నాణ్యమైన విత్తనాలు అందించాలి. వీడర్ యొక్కపరిమాణం/ బరువు తగ్గించినట్లైతే సులభంగా మోయడానికి, రవాణాకి సాధ్యమవుతుంది.
ఆధారం:
ఇక్రిసాట్-డబ్ల్యు డబ్ల్యు ఎఫ్ ప్రోజెక్ట్
పాక్షికంగా బీడువారిన(నిస్సారమైన) ఉష్ణమండలపు అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమి-ఏరిడ్ ట్రాపిక్స్
పటాన్చెరు 502324, ఆంధ్రప్రదేశ్,ఇండియా