సంపూర్ణ ఆరోగ్యముతో ఉండాలంటే మన ప్రతిదిన ఆహారంలో కూరగాయలు ప్రముకంగా అవసరం. కూరగాయలను నీటి వసతి క్రింద అన్ని కాలాలలో సాగు చేయవచ్చు. మార్కెట్ డిమాండ్ ను అనుసరించి కూరగాయల పెంపకం చేపడితే అది లాభాలను ఆర్జించవచ్చును వంగ, టమాటో, క్యాబేజి, కాలిఫ్లవర్ , బెండలో ఈక్రింద సాంకేతిక మెళకువలు ఆచరించి అధిక దిగుబడులు సాధించవచ్చు.
నెలలు: బాగా నీరు ఇంకే ఇసుక మరియు గరపా నెలలు మరియు మురుగు నీరు వసతి గల నల్ల నెలలు అనుకూలం. చేడు భూములు అనుకూలం కాదు.
నెలతయారీ: నేలను 4-5 సార్లు దున్ని చదును చేయాలి. వర్షాకాలపు పంటకు బోదెలు, కాలువలు ఏర్పాటు చేయాలి. ఆఖరి దుక్కిలో 6 -8 టన్నుల ఎరువును కలియదున్నాలి.
విత్తనశుద్ధి: రసం పీల్చే పురుగుల బెడద తట్టుకునే విధంగా ఇమిడాక్లోప్రిడ్ 5. గ్రా. కిలో విత్తనానికి మరియు వివిధ శిలింద్ర తెగుళ్ల నివారణకు ధైరమ్ లేదా మాంకోజెబ్ 3 గ్రా. మరియు ట్రెకోడర్మా విరిడి కల్చర్ 4 గ్రా. చొప్పున కిలో విధానానికి పట్టించి నీడలో ఆరబెట్టాలి.
నారుమడి పెంపకం: నేలను 4-5 సార్లు బాగా దున్నాలి. 4 మీ. పొడవు, 1 మీ. వెడల్పు మరియు 10-15 సేం.మీ. ఎత్తుతో నరు మడులు తాయారు చేసుకోవాలి. ఎకరానికి 10-12 నారుమళ్లు సరిపోతాయి. 10 -20 కిలోల వర్మీకంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు చల్లాలి. విత్తనాన్ని 10 సేం.మీ. ఎడంలో పలుచగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే రోజ్ క్యాన్ తో నీటిని చల్లి వరి గుడ్డతో నారుమళ్లు కప్పాలి. విత్తనాలు మొలకెత్తిన వెంటనే (7 -10 రోజులకు ) వరిగడ్డి తీసివేయాలి. 2-3 వారాల వయస్సులో నారుకుళ్లు తెగులు రాకుండా కాపర్ ఆక్సీక్లోరెడ్ (బైటాక్స్)ను 3 గ్రా. లీటరు నీటికి కలిపి నారుమళ్లు తడపాలి. రసంపీల్చే పురుగుల నుండి నివారణకు కార్బో ఫూరాన్ గుళికలు సెంటు (40 చ.మీ.) నారుమడికి 100 గ్రా. చొప్పున వేసి నీటి తడి ఇవ్వాలి. నారుమడిని పీకడానికి 2 -3 రోజులకు ముందుగా లీటరు నీటికి 2 మి.లీ. రోగార్ +1 గ్రా. భావిస్ట్ ను కలిపి నారుమడి పై పిచికారీ చేయాలి. నారుమడిలో మొక్కలు ధృడపడడానికి గింజ విత్తన 20 -30 రోజుల మధ్య రోజు విడిచి రోజు నీరు కట్టాలి. 25 -30 రోజుల వయసు ఉండి 3 -4 ఆకులు గల మొక్కల్ని నాటుకోవాలి.
నీటి యాజమాన్యం: తేలిక నెలల్లో వరం రోజులకు ఒకసారి, బరువైన నెలల్లో 10 రోజులకు ఒక సారి నీటి తడులు ఇవ్వాలి.
కలుపు నివారణ: పెండిమీదలిన్ 30 % ఎకరానికి 1 .25 లీ. లేదా అలాక్లోర్ 1 .0 లీ. (తేలిక నెలలు) 1 .2 లీ. (బరువైన నేలలు) చొప్పున 200 లీ. నీటిలో కలిపి నాటిన 24 -28 గంటలలోపు పిచికారీ చేయాలి. నాటిన 20 -25 రోజులపుడు అంతర కృషి చేయాలి.
ఎరువులు: చివరి దుక్కిలో ఎకరాకు 4 -8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. వివిధ పంటలకు సిపారాసు చేసిన మోతాదులో రసాయన ఎరువులు వాడాలి.
కాయతొలుచు పురుగు: మొక్క పెరుగుదల దశలో మొవ్వను, పూత, కాయ దశలో కాయలను తొలచి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి కార్బరీల్ 3 గ్రా. లేదా క్వింటాల్ పాస్ లేదా ప్రొపైనోపాస్ 2 మి.లీ. చొప్పున 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు కాయలు కోసిన తరువాత పిచికారీ చేయాలి.
రసం పీల్చే పురుగులు (దీపపు పురుగులు, పేనుబంక, తెల్లదోమ): ఆకుల అడుగు బాగానే చేరి రసాన్ని పీల్చే ఏయడం వలన ఆకులు పసుపు రంగుకు మారిపైకి ముడుచుకొని ఎండిపోతాయి. వీటి నివారణకు డైమిదోయేట్ లేదా మిథైల్ డేమేతం లేదా పిప్రాణి లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపి చేయాలి.
ఎర్రనల్లి: సన్నని ఎర్ర పురుగులు ఆకాల అడుగు బాగానే చేరి రసాన్ని పీల్చి వేయడం వాళ్ళ ఆకులు తెల్లగా పాలిపోయి పండుబారుతాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రా. లేదా డైకోపాస్ 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.
క్యాబేజి రెక్కల పురుగు: ఈ పురుగు ఆకుల అడుగు బాగానే వుండి, ఆకులను తిని నాశనం చేస్తుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజి వరుసలు 2 వరసల చొప్పున ఆవాల మొక్కలను ఏరా పంటగా వేయాలి. గుడ్లను నాశనం చేసేటందుకు వేప గింజల ద్రావణాన్ని (5 %) పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే నాటిన తరువాత 30 ,40 రోజుల్లో బిటి మందులు 1 గ్రా. ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
బూడిద తెగులు: ఆకులపైనా మరియు అడుగు బాగానే బూడిద వుంది పొడిచే కప్పబడి ఉంటాయి. ఆకులు పంచబడి రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ. డైనోకాప్ లేదా 2 మి.లీ. హేక్స్ కొనజొన్ కలిపి పిచికారీ చేయాలి.
నారుమళ్లు తెగులు: నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్లిపోయి నారు గుంపులు, గుంపులుగా చనిపోతుంది కాఫర్ ఆక్సీక్లో రైడ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి నారుమడికి 10 రోజుల వ్యవధితో 2 -3 సార్లు తడపాలి.
ఆకుమడు తెగులు: (ఎర్లిబ్లేట్) : ఇది వంగ, టమాటోలో కనిపిస్తుంది. ఆకుల మీద, కాండం మీద మరియు కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి, క్రమేణా ఆకులు మాది ఎండి పోతాయి. దీని నివారణకు 3 గ్రా. కాప్టాన్ లేదా మాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 లేక 4 సార్లు పిచికారీ చేయాలి.
నల్లకుళ్ళ తెగులు: ఈ తెగులు క్యాబేజి , కాలిఫ్లవర్ లో కనిపిస్తుంది. ఆకులు పత్రహిరితాన్ని కోల్పోయి 'వి' ఆకారంలో వున్నా మచ్చలు ఏర్పడతాయి. ఈనెలు నల్లగా మారతాయి. 10 లీటర్ల నీటిలో స్ట్రెపోసైక్లిన్ 1 గ్రా + 30 గ్రా.ల. కాఫర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 5 కిలోల ఫౌండర్ భూమిలో వేసి కలియదున్నాలి.
చివరిసారిగా మార్పు చేయబడిన : 9/8/2023