অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

పంటకోత అనంతర పరిజ్ఞానాలు

పంటకోత అనంతర పరిజ్ఞానాలు

  1. రేగు తాండ్ర తయారుచేయుట
    1. రేగు తాండ్ర
  2. పెద్దసంఖ్యలో మామిడి, అరటి, బొప్పాయిపళ్ళను శాస్త్రీయంగా పండించడం
  3. నిల్వ ఉంచిన ధాన్యం పురుగుల, చీడల యాజమాన్యానికి పరికరాలు
    1. తమిళనాడు వ్యవసాయ విద్యాలయం (టీ.ఎన్.ఎ.యు) వారి పురుగులు పసిగట్టే వల
    2. తమిళనాడు వ్యవసాయ విద్యాలయం (టీ.ఎన్.ఎ.యు) వారి ఉచ్చు వల
    3. తమిళనాడు వ్యవసాయ విద్యాలయం (టీ.ఎన్.ఎ.యు) వారి టూ ఇన్ వన్ నమూనా వల
    4. సూచిక పరికరం
    5. తమిళనాడు వ్యవసాయ విద్యాలయం (టీ.ఎన్.ఎ.యు) వారి ఆటోమేటిక్ పురుగుల తొలగింపు కుండీ
    6. ధాన్యం గింజల గిడ్డంగుల కోసం అతినీలి లోహిత (యూవీ) కాంతి వల
    7. అపరాల విత్తనాలనుంచి పురుగు గుడ్లను తొలగించే ఒక పరికరం
    8. గిడ్డంగుల్లో నిల్వలను ఆశించే కీటకాల పర్యవేక్షణకు వల
    9. ధాన్యం నిల్వలనాశించే కీటకాల యాజమాన్యానికి తమిళనాడు వ్యవసాయ విద్యాలయం (టీ.ఎన్.ఎ.యు) వారి పరికరాలు
  4. ఆహార భద్రతా ప్రమాణాలు సూచికలు
    1. ఆహార భద్రతా ప్రమాణాలు ఎందుకు అవసరం?
    2. పౌష్టికాహార సంస్థ నియమం అంటే ఏమిటి?
    3. నియామాల సాధారణ పరిశీలన
    4. జాతీయ నియమాల స్మృతి పరిచయ కేంద్రం (NCCP)
    5. జాతీయ స్మృతి సంఘాలు (NCC)
    6. ఎఫ్ ఎ ఓ, (FAO) తోడ్పాటు

రేగు తాండ్ర తయారుచేయుట

రేగు (జిజిఫస్ మారిషియాన) వర్షాభావ,పాక్షిక వర్షాభావ పరిస్థితులలొ సాగు చేసే తక్కువగా ఉపయోగించబడే ముఖ్యమైన పండ్ల పంట. రేగు మంచి పోషకాలు ఉన్న పండు, దీనిలో విటమిన్ లైన బి ( తైమిన్, రైబోఫ్లావిన్, నియాసిన్), సీ, బేటా కేరోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఖనిజ లవణాలైన భాశ్వరం,ఇనుము,క్యాల్షియమ్ లు కూడా ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. రేగు పండు నుంచి వచ్చే పదార్ధాలు ఎక్కువ మన్నిక, ధర కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో ఒక పదార్ధం రేగు తాండ్ర.

రేగు తాండ్ర

ఆరోగ్యమైన రేగు పండ్లను నీటితో పండ్ల చర్మం పైన ఉన్న మురికిని కడగాలి. రేగు కాయలకు ఉన్న కాండం ను చేతితో తీసివేయాలి. పదునైన కత్తితో తోలును ఒలిచివేయాలి. ఈ పద్ధతులు అన్ని జరిగేటప్పుడు పరిశుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి. పండులో తినదగిన భాగాన్ని ముక్కలుగా కోసి, గింజలను తీసివేయాలి. రేగు పండ్ల ముక్కలను 0.2 % కే. ఎమ్. ఎస్ తో ప్రకాశవంతంగా, మంచి రంగు వచ్చేటట్లు తెలుపు చేయాలి. అవసరమైనంత పంచదార తీసికొని నీటిలో బాగా కలిపి పంచదార ద్రావణం (30,40,50,60 ౦ బీ) తయారు చేయాలి. పంచదార నీటిలో కరుగుటకు ద్రావణాన్ని 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాలి. ద్రావణం పరిశుభ్రత కొరకు వేడి చేసేటప్పుడు సిట్రిక్ ఆసిడ్(0.2%) కలపాలి. తయారైన ద్రావణాన్ని మస్లిన్ గుడ్డతో వడపోసి గది ఉష్ణోగ్రత వద్ద చల్లబర్చాలి. ఒక వంతు రేగు పండ్ల ముక్కలు,రెండు వంతుల పంచదార ద్రావణం ఒక పాత్రలో కలిపి 48 గంటలు అనుకూల పరిస్థితులలో ఉంచాలి. 48 గంటల తరువాత ద్రావణాన్ని తీసివేసి రేగు ముక్కలను ఒకటొకటిగా ట్రే లో క్రమ పద్ధతిలో పెట్టాలి. తరువాత ట్రే డ్రైయర్ లో 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 5 నుంచి 6 గంటలు ఆరబెట్టాలి.ఆరిన పండు ముక్కలను ప్యాకింగ్ కు ముందు చల్లబరచాలి.

రేగు తాండ్రలో పోషకాల మిశ్రమము తేమ, టీ. ఎస్. ఎస్ , అస్కార్బిక్ ఆసిడ్, ఆమ్లత్వం, టోటల్ సుగర్, రెడ్యూసింగ్ సుగర్ లు 10.08%, 48 ౦ బీ, 95.97 ఎమ్. జీ. /100 గ్రాములు, ౦.225%, 21.65%, 9.67%. వరుసగా ఉంటాయి.

తయారుచేసిన రేగు తాండ్ర పుష్టికరమైన తీపి పధార్ధము. తాండాలలో రేగు తాండ్ర మంచి కృత్రిమమైన వాసన, సారం కలిగినది.ఇది పిల్లలకు,పెద్దలకు అరోగ్యకారమైన, మంచి పోష్‌కాలు ఇచ్చే ఒక తినుబండారం వంటిది.

ఇతర వివరాలకు సంప్రదించవలసిన చిరునామా

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ.
లూధియాన -141004,పంజాబ్
ఫోన్:: 91-161-2308669
Email: ciphet@sify.com

పెద్దసంఖ్యలో మామిడి, అరటి, బొప్పాయిపళ్ళను శాస్త్రీయంగా పండించడం

సాధారణంగా మామిడి, అరటి, బొప్పాయి పళ్ళను పూర్తిగా పండకుండానే చెట్లనుండి కోసి, తర్వాత వాటిని మగ్గ బెడతారు . సహజసిద్ధంగా పండటానికి ఎక్కువ సమయం పడుతుంది. పండు బరువు తగ్గిపోతుంది, ఎండిపోతుంది మరియు పండటం కూడా సమంగా ఉండదు. ‘తైవాన్ రెడ్ లేడీ’ వంటి కొన్ని వాణిజ్యరకాల బొప్పాయిపళ్ళలో అంచుల్లోనేమో బాగా గట్టిగా ఉండి మధ్యలోనేమో మెత్తబడుతుంది.

సాధారణంగా పళ్ళను మగ్గ బెట్టడానికి ఎథ్రెల్ స్ప్రే చేయడంగానీ, వాటిని ఎథ్రెల్ ద్రవంలో ముంచడంగానీ చేస్తారు. అయితే అది శ్రమతో కూడిన పని. అదీకాక బయట అమ్మే ఎథ్రెల్ లో కల్తీ రసాయనాలు ఉంటే సమస్యలొస్తాయి. దీనికి ప్రత్యామ్నాయంగా, పళ్ళను మగ్గబెట్టే గోదాములలో ఇథలీన్ గ్యాస్ ఉపయోగిస్తున్నారు. అయితే దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుంది...రైతులకు, చిన్న వ్యాపారులకు ఆర్ధికంగా గిట్టుబాటు అవదు. కాబట్టి తక్కువ పెట్టుబడితో పళ్ళను మగ్గించడానికి ప్లాస్టిక్ టెంట్లలో ఇథలీన్ గ్యాస్ ను వదిలి పళ్ళను పండబెట్టడం రూపోందించారు.

సాధారణ గది ఉష్ణోగ్రతలో మూడురోజులు ఉంచిన తర్వాత బొప్పాయి పండు

గది ఉష్ణోగ్రతలో ఇథలీన్ గ్యాస్(100పీపీఎమ్) వదులుతూ మూడురోజులు ఉంచిన తర్వాత బొప్పాయి పండు

ఈ విధానంలో ఇథలీన్ గ్యాస్ వదలడానికి ఎథ్రెల్ కు స్వల్ప పరిమాణంలో ఆల్కలీని కలుపుతారు. గాలి చొరబడటానికి వీలులేని... మోసుకెళ్ళగలిగే... ప్లాస్టిక్ టెంట్లలో ఈ గ్యాస్ వదులుతారు. పళ్ళను చిల్లులున్న ప్లాస్టిక్ క్రేట్లలో ఉంచి ఆ టెంట్లలో ఉంచుతారు. టెంట్ లోపల ఒక డబ్బాలో తగినంత పరిమాణంలో ఎథ్రెల్ ఉంచి...ఇథలీన్ గ్యాస్ వదలాలనుకున్నప్పుడల్లా కొద్దికొద్దిగా ఆల్కలీ(సోడియమ్ హైడ్రాక్సైడ్)ను ఎథ్రెల్ కు కలుపుతూ...వెంటనే టెంట్ లోకి గాలి వెళ్ళకుండా సీల్ చేసేస్తూ ఉంటారు. విడుదలయ్యే ఇథలీన్ గ్యాస్ టెంట్లో అన్నివైపులా వెళ్ళడంకోసం...లోపల బ్యాటరీతో నడిచే ఒక ఫ్యాన్ ఉంచుతారు. 18-24గంటలు అలా గ్యాస్ తగిలేలా ఉంచిన తర్వాత పళ్ళను బయటకు తీసి సాధారణ గది ఉష్ణోగ్రతలో పెడతారు. అప్పుడు పళ్ళు పూర్తిగా పండుతాయి.

సాధారణంగా మామిడికాయలను మగ్గబెట్టాలంటే పదిరోజులు పడుతుంది. అయితే 100పీపీఎమ్ ఇథలీన్ గ్యాస్ 24గంటలపాటు తగిలేలా చేస్తే అదే కాయలు ఐదురోజుల్లోనే పండుతాయి. పైగా నాణ్యత కూడా చెడిపోదు. అదేవిధంగా అరటి పళ్ళ హస్తాలను 100పీపీఎమ్ ఇథలీన్ గ్యాస్ తగిలేలా 18గంటలు ఉంచితే నాలుగురోజుల్లో పండుతాయి .20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచితే అవి పండటానికి ఆరు రోజులు పడుతుంది.

బొప్పాయి పళ్ళను ఇథలీన్ గ్యాస్ తగిలేలా చేస్తే రంగు, గట్టిదనం ఒకేరకంగా ఉండి నాలుగురోజుల్లో పండిపోతున్నాయి.

మరింత సమాచారం కోసం సంప్రదించండి.

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చరల్ రిసెర్చ్
హెస్సరఘట్ట, బెంగళూరు(కర్ణాటక) – 560 089
ఇ-మెయిల్:డైరెక్టర్@ఐఐహెచ్ఆర్.ఈఆర్ఎన్ఈటీ.ఐఎన్
మూలం: ఐసీఏఆర్ న్యూస్, వాల్యూమ్ 15, నంబర్ 4.

నిల్వ ఉంచిన ధాన్యం పురుగుల, చీడల యాజమాన్యానికి పరికరాలు

తమిళనాడు వ్యవసాయ విద్యాలయం (టీ.ఎన్.ఎ.యు) వారి పురుగులు పసిగట్టే వల

నిల్వ చేసిన ధాన్యాలకు నష్టం చేసే పురుగులను పసిగట్టడానికి ఎరలను ఉపయోగించడం ఒక కొత్త విధానము. టీ ఎన్ ఏ యూ పసిగట్టే వలలో మూడు ముఖ్యమైన భాగాలు ఉంటాయి: ఒక ప్రధాన గొట్టం, పురుగులను పట్టే గొట్టం మరియు కింది భాగంలో విడదీయడానికి వీలైన శంఖం.

ప్రధాన గొట్టంలో రెండు మి.మీ. వ్యాసంతో రంధ్రాలు సమాన దూరంలో చేసి ఉంటాయి.

అంత: సూత్రము

పురుగులు గాలికి ఆకర్షింపబడి, గాలివైపుకు తిరుగుతాయి. పురుగుల యొక్క ఆ ప్రవర్తనను ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటుంది.

పనిచేయువిధానం

బియ్యం, గోధుమలు మొదలైనటువంటి ధాన్యాలలో ఈ పురుగుల వలను నిలువుగా, తెల్ల ప్లాస్టిక్ శంఖాకృతి కిందకు ఉండేటట్లు బొమ్మలో చూపిన విధంగా పెట్టాలి. పైన ఉండే ఎర్ర మూత, ధాన్యం ఎత్తుతో సమానంగా ఉండాలి. పురుగులు ప్రధాన గొట్టంలోని గాలివైపుకు ఆకర్షించబడి రంధ్రాలగుండా లోపలికి ప్రవేశిస్తాయి. ఒక్కసారి పురుగు లోపలికి ప్రవేశించగానే కింద విడదీయడానికి వీలుగాఉన్న శంఖాకృతి గొట్టంలోకి పడిపోతుంది. ఇక తప్పించుకోడానికి అవకాశం లేక, పురుగులు లోపల చిక్కుకుపోతాయి. వారానికి ఒకసారి శంఖాకృతిని విడదీసి లోపలున్న పురుగులను తగలబెట్టాలి.

విశిష్టతలు

రసాయనాలు, పార్శ పరిణామాలు, నిర్వహణ ఖర్చు మొదలైనవేమీ ఉండవు.

సామర్థ్యం

టీ ఎన్ ఏ యూ పురుగుల వలలు ఆహార ధాన్యాలలో పట్టే పురుగులను పసిగట్టడంలో అద్భుతంగా పని చేసే పరికరాలు నిల్వ ఉంచిన ఆహారధాన్యాలకు ఉండే రైజోపెర్తా డొమినికా (ఎఫ్), సైటో ఫైలస్ క్రిజే (ఎల్), పేరుగల పురుగులను పసిగట్టడంలోనూ మరియు ట్రిబోలియమ్ కాస్టాన్యూమ్ (హెర్బస్ట్), పేరుగల పురుగులను పసిగట్టడంలోనూ, ఎక్కువ పురుగులను పట్టుకోవడంలోనూ ప్రామాణిక సాధారణ నమున సేకరణ విధానంలోకంటే ఈ విధానం(స్పియర్ స్యాంప్లింగ్ ద్వారా) లో ఇవి బాగా పనిచేస్తాయి. పురుగుల ను పసిగట్టే నిష్పత్తి (వల: సాధారణ స్యాంప్లింగ్) సాధారణ శాంప్లింగ్ విధానం వల విధానంతో పోలిస్తే 2:1 నుంచి 31:1 వరకు ఎక్కువగా ఉంటుంది. పురుగులను పసిగట్టే ఎరలో పట్టుబడే పురుగుల సంఖ్య సాధారణ స్యాంప్లింగ్ విధానంలో కంటే 20:1 నుంచి 121:1 ఎక్కువ. పరిమాణంలో ఉంటుంది.

25 కి.గ్రా. కుండీ (28 సెం.మీ. వ్యాసం మరియు 39 సెం.మీ. పొడవు) లో 2 – 3 వలల చొప్పున ఉపయోగించి నప్పుడు, అవి కూడా మంచి పెద్ద మొత్తంలో పట్టుకునే పరికరాలు. వీటిని ధాన్యం యొక్క పైమట్టానికి 6 అంగుళాలలో అమర్చాలి. ఎందుకంటే నిల్వ చేసిన ప్రారంభసమయంలో ఆ మట్టంలోనే పురుగులు ఎక్కువగా తిరుగుతుంటాయి. పది, ఇరవై రోజుల్లోపునే 80శాతం కంటే ఎక్కువ పురుగులను అవి నిర్మూలించగలవు.

తమిళనాడు వ్యవసాయ విద్యాలయం (టీ.ఎన్.ఎ.యు) వారి ఉచ్చు వల

ధాన్యం ఉపరితలంపైన, ఇతర ధాన్యపు పొరలలో తిరిగే పురుగులను పట్టుకోవడం కోసం ఉచ్చు వలలను ఉపయోగిస్తారు (పర్యవేక్షణ మరియు ఎక్కువసంఖ్యలో పట్టుకునే పరికరం).

ప్రామాణిక నమూనా

  • ప్రామాణిక పిట్ ఫాల్ నమూనా వలలో రెండు భాగాలు ఉంటాయి.తొలచబడిన మూత (2 మి.మీ. లేదా 3 మి.మీ) మరియు ఒక శంఖాకృతి అడుగు భాగం.

  • శంఖాకృతి గొట్టంలోపలి భాగంలో ప్రవేశించిన పురుగులను పట్టుకోవడానికి ప్రత్యేకమైన జిడ్డుగా ఉండే పదార్థంతో పూత పూయడం అవసరం.
  • ఈ పద్ధతి చాలా ఇబ్బంది కరమైనది.

టీ ఎన్ ఏ యూ నమూనా

  • టీ ఎన్ ఏ యూ నమూనాలో రంధ్రాలు చేయబడిన ఒక మూత, శంఖాకృతి కింది భాగము అంటే పురుగులు పట్టడానికి వీలుగా గరాటు ఆకృతి గొట్టం
  • అందువలన జిడ్డు పదార్థంతో లోపలిభాగంలో పూత అక్కర లేదు

  • ప్లాస్టిక్ తో, మామూలుగా, చౌకగా ఉండే వాణిజ్యపరమైన నమూనా (ఒక్కొక్క దానికి ఖర్చు రూ. 25/- మాత్రమే)
  • వాడడం చాలా తేలిక.

తమిళనాడు వ్యవసాయ విద్యాలయం (టీ.ఎన్.ఎ.యు) వారి టూ ఇన్ వన్ నమూనా వల

పురుగులను పసిగట్టే వల పరికరంలో రంధ్రాలు చేయబడిన గొట్టం, ఉచ్చు, సేకరించే గొట్టం, రంధ్రాలు చేయబడిన మూతతో గరాటు ఆకృతి వల మరియు గరాటు ఆకారపు అడుగు భాగము అనే భాగములు కలసి ఒకే యూనిట్ లాగా ఉంటాయి. పురుగులను పసిగట్టే, ఉచ్చులో పడేవేసే వ్యవస్థల వలన పురుగులను పట్టుకునే సామర్ధ్యం పెరుగుతుంది. ధాన్యాలపై మాత్రమే అక్కడ ఇక్కడ పైపైనే తిరుగుతూ కనిపించే పప్పుదినుసుల కుమ్మరి పురుగులకి ఇది చక్కటి పరికరం. కుమ్మరి పురుగు లను పట్టుకోడానికి లోపలి భాగంలో పూతపూయడం, గరాటు ఆకారం ఉచ్చు లోపలి భాగాన నూనె వంటి పదార్థంతో పూతపూయడం వంటి విసుగు పుట్టించే విధానాలేవీ అవసరంలేదు. కుమ్మరి పురుగులను ఈ ఉచ్చులో సజీవంగా పట్టు కోవచ్చు. ఇవి ఫెరొమోన్ విడుదల చేస్తాయి కనుక మరిన్ని పురుగులు ఆకర్షింప బడతాయి.

సూచిక పరికరం

ఈ పరికరంలో రంధ్రాలు చేయబడిన శంఖాకారపు ఒక గిన్నె (3 మి.మీ. రంధ్రం) పై భాగాన మూతతో సహా ఉంటుంది. ఈ గిన్నె కిందిభాగాన్ని ఒక పాత్రలో పెట్టి దానిని ఒక పళ్ళెంలో ఉంచుతారు. వీటినన్నిటినీ వేజలైన్ వంటి జిగురు పదార్థంతో పులుముతారు.

రైతులు తమ పప్పుధాన్యాలను నిల్వచేసేముందు, వాటిలోనుండి 200 గ్రాముల పప్పులను తీసుకుని ఆ గిన్నెలో పోయాలి. మిగిలిపోయిన కుమ్మరి పురుగులు పొలంనుండి తమ సహజ స్వభావరీత్యా బయటికి వచ్చినప్పుడు, రంధ్రాలలోకి ప్రవేశించి లోపలికి జారిపోయి చిక్కుకుపోయే భాగాలలో పడిపోతాయి. అవి జిగురు పదార్థాలకి అంటుకు పోతాయి కాబట్టి, రైతులు కుమ్మరి పురుగులను సులువుగా గుర్తించి పెద్ద మొత్తంలో నిల్వచేసిన పప్పుధాన్యాలను ఎండబెట్టడానికి బయటికి తీయవచ్చు. తృణధాన్యాలకోసం రెండు మి.మీ. రంధ్రాలున్న పరికరాన్ని ఉపయోగించవచ్చు.

ఈ వలల సహాయంతో మొదట వచ్చే పురుగులను నిర్మూలించవచ్చు. అసలు వీటినుంచే తర్వాత తర్వాత మరిన్ని పురుగులు వస్తాయి. ఇలా, నిల్వ చేసే సమయంలో, విలువైన తమ పప్పు ధాన్యాలని కాపాడ డానికి, తగిన సమయంలో పసిగట్టడం, రైతులకి దోహదపడుతుంది. ఈ పరికరం వాడుకలోకి వస్తుంది.

తమిళనాడు వ్యవసాయ విద్యాలయం (టీ.ఎన్.ఎ.యు) వారి ఆటోమేటిక్ పురుగుల తొలగింపు కుండీ

టి ఎన్ ఏ యూ పురుగల నిర్మూలన కుండీ పురుగులను తనంతటతానే తొలగిస్తుంది. ఈ పరికరంలో నాలుగు భాగాలు ఉంటాయి. బయట పాత్ర, రంధ్రాలున్న లోపలి పాత్ర, సేకరణ పాత్ర మరియు మూత. పురుగుల యొక్క నిల్వ ఉండే ఉత్పాదనల పైన తిరుగుతుండే ప్రవర్తనను మరియు బాగా గాలి తగిలే చోట్లకు ఆకర్షించబడే ప్రవర్తనను, ఈ పరికరం అనుకూలంగా మలుచుకుంటుంది. ధాన్యాలను ప్రత్యేకంగా రూపొందించబడిన రంధ్రాలతో కూడిన లోపలి పాత్రలో ఉంచుతారు. లోపలిపాత్రకు, బయటిపాత్రకు మధ్యన ఉన్న ఖాళీలో బాగా గాలి తగులుతుండటం వలన పురుగులు ఆకర్షింపబడతాయి. పురుగులు తిరుగు తూ, గాలి బాగా తగులుతున్న ఆ ఖాళీలోకి వెళ్ళడానికి రంధ్రంగుండా లోపలికి ప్రవేశిస్తాయి. అలా చేస్తూండగా సేకరణ పాత్రలో అమర్చిన ఉచ్చులోకి సేకరణ పాత్ర ద్వారా జారి పడిపోతాయి. ధాన్యంపై నుంచి అవిపైకి రాగానే వాటిని త్వరగా సేకరించడం కోసం, లోపలిపాత్రలో రంధ్రాలు చేయబడిన (రెండు మి.మీ) కడ్డీలను అమర్చాలి.

బియ్యం, గోధుమలు, బద్దలు చేయబడిన పప్పులు, ధనియాలు మొదలైనవాటిని నిల్వ చేయడానికి ఈ పాత్ర ఉపయోగ పడుతుంది. ధాన్యాలను ఈ పాత్రలో నిల్వ చేయడం ద్వారా, సాధారణంగా కనిపించే ధాన్యా ల నిల్వలపై దాడిచేసే బియ్యం పెంకె పురుగు, చిన్న ధాన్యం తొలిచే పురుగు, ఎర్ర పిండి పురుగు, రంపం పళ్ళు గల కుమ్మరి పురుగు వంటి పలురకాల పురుగులను, ఆటోమేటిక్ గా తొలగించవచ్చు. ధాన్యాల నుండి పది రోజుల స్వల్ప వ్యవధిలోనే ఎక్కువ భాగం (90 శాతం కంటే పైన) పురుగులను తొలగించవచ్చు. ఈ పాత్రలు 2 కి.గ్రా., 5 కి.గ్రా, 25 కి.గ్రా., 100 కి.గ్రా. మరియు 500 కి.గ్రా. సామర్ధ్యంతో లభిస్తాయి.

సామర్ధ్యం.

వరి, జొన్నలు వంటి ధాన్యాలను 10 నెలల నిల్వ ఉంచిన తర్వాత చూస్తే, పురుగుల వలన జరిగిన నష్టం సాధారణ తొట్టిలో 33 నుంచి 65 శాతం ఉంటే, ఆటోమేటిక్ పురుగుల తొలగింపు తొట్టి (100 కి.గ్రా. మరియు 500 కి.గ్రా.)లలో కేవలం 1-4 శాతం మాత్రమే ఉంది. పది నెలల నిల్వ తర్వాత మామూలు తొట్టిలో పురుగు (ఆర్.డొమినికా, ఎస్.ఒరిజే)ల సంఖ్య కిలోకు 5 – 191 ఉంటే, 100 కిలోల ఆటోమేటిక్ తొట్టిలో కిలోకు 0 – 2 వరకు ఉన్నాయి.

ధాన్యం గింజల గిడ్డంగుల కోసం అతినీలి లోహిత (యూవీ) కాంతి వల

యూవీ కాంతి వలలో ప్రధానంగా ఒక అతినీలిలోహిత కాంతి ప్రసారవ్యవస్థ (4 వాట్టుల పురుగులను చంపే దీపం) ఉంటుంది. ఈ దీపం సుమారు 250 నానో మీటర్ల సామర్ధ్యం కల అతినీలలోహిత కిరణాలను ప్రసారం చేస్తుంది. పైన 310 మి.మీ. వ్యాసం, కింద 35 మి.మీ వ్యాసం ఉన్న ఈ గరాటు మధ్యలో దీపం ఉంటుంది. వలకు చిక్కిన పురుగులను సేకరించడానికి, గరాటు కింది భాగాన్ని ఒక పారదర్శక ప్లాస్టిక్ పాత్రతో అమర్చుతారు. ఈ మొత్తం పరికరాన్ని కావాలసిన చోట వేలాడదీసుకోడానికి వీలుగా గరాటు చుట్టూ బయట మూడు కొక్కేలను ఏర్పాటుచేశారు. కింద నేలమీద పెట్టుకోవడానికి ఒక ముక్కాలిపీటని కూడా ఈ యూనిట్ కి అమర్చ బడినది.

ఈ అతినీలలోహితకాంతి వలలను ధాన్యం గిడ్డంగుల్లో నేలకు ఒకటిన్నర మీటర్ల ఎత్తులో, ముఖ్యంగా గిడ్డంగుల మూలల్లో పెట్టాలి. ఎందుకంటే పురుగులు సాయంత్రం వేళల్లో ఈ ప్రదేశాలకు చేరతాయని పరిశీలనలో తేలింది. ఈ వలను రాత్రివేళల్లో వాడాలి. చిన్న ధాన్యాన్ని తొలిచే పురుగు, రైజోపెర్తా డొమినికా, ఎర్ర పిండి కుమ్మరి పురుగు, ట్రైబోలియం కాస్టన్యూమ్, రంపం పళ్ళు గల కుమ్మరి పురుగు ఒరిజేఫిలస్ సుర్నామెన్సిస్ వంటి నిల్వ చేసిన వరి ఉత్పాదనల పురుగులను పెద్దసంఖ్యలో ఇది ఆకర్షిస్తుంది. గిడ్డంగు ల్లో పెద్ద బెడదగా ఉండే సోసిడ్స్ కూడా పెద్దసంఖ్యలో ఆకర్షించబడతాయి. ఐదు మీటర్ల ఎత్తు, 60 మీ x 20 మీ (పొడవుxవెడల్పు) వైశాల్యం ఉండే గిడ్డంగికి సాధారణంగా రెండు యూవీ కాంతి వలలు సూచిస్తున్నారు

ధాన్యాలను ఎక్కువకాలం నిల్వ ఉంచే గిడ్డంగులకు ఈ వల బాగా పనిచేస్తుంది. ఊహించని పరిమాణంలో భారీగా గిడ్డంగుల్లోకి ధాన్యం నిల్వలు వచ్చి చేరినపుడు మరియు గిడ్డంగుల్లో పొగబెట్టిన తర్వాత మిగిలే సూక్ష్మజీవులను పట్టుకోడానికి మరియు మిగిలిపోయిన పురుగులు మళ్ళీ వృద్ధి చెందకుండా చేయడానికి కూడా ఈ వల బాగా పనికొస్తుంది. నిల్వచేయడం, ఖాళీచేయడం ఎక్కువగా ఉండే గిడ్డంగుల్లో పర్యవేక్షణ చేయడానికి ఈ వల ఉపయోగించవచ్చు.

పనితీరు

ఒక గిడ్డంగి (60 మీ. X 20 మీ. X 5 మీ.)లో మూలల్లో ఉంచిన రెండు యూ వీ కాంతి వలలు రోజుకు సుమారు 200 పురుగులను పట్టుకోగా, మామూలు పర్యవేక్షణలో అసలు ఒక్క పురుగు కూడా ఉన్నట్లు చూపలేదు. యూ వీ కాంతి వల ఆ విధంగా పర్యవేక్షణకు, పురుగులను పట్టుకోడానికి కూడా సమర్ధ వంతంగా పనిచేస్తుందని అర్థమవుతుంది. ఒక వరి ధాన్యపు గిడ్డంగిలో ఉంచిన యూ వీ కాంతి వల ఒక్క రోజులో 3000 రైజోపెర్తా డొమినికా పురుగులను పట్టుకున్నట్లు నమోదయింది.

అపరాల విత్తనాలనుంచి పురుగు గుడ్లను తొలగించే ఒక పరికరం

తృణధాన్యాలకంటే అపరాలను నిల్వచేయడం కష్టంతో కూడుకున్న పని, ఎందుకంటే అపరాలను నిల్వ చేసినప్పుడు కల్లోసోబ్రూచస్ అనే కీటకం నిల్వలను బాగా నష్టపరుస్తుంది. పప్పు దినుసుల కుమ్మరి పురుగు ఉపద్రవానికి ముఖ్యమైన మూలం. అవి పొలం నుండి గిడ్డంగులకి రావడమే కారణం అని అందరి కీ తెలిసిన విషయమే. నిల్వచేసిన అపరాలను ఆశించే కల్లోసోబ్రూచస్ చినెన్సిస్ మరియు కల్లోసోబ్రూచస్ మేక్యులేట్స్ అనే కీటకాల గ్రుడ్లను రూపుమాపడానికి ప్రస్తుతం కనుగొన్న పరికరం ఒక నమూనా పరికరం. ఈ పరికరంలో బయట ఒక పాత్ర, లోపల ఒక రంధ్రమున్న పాత్ర ఉంటాయి. లోపలిపాత్ర మధ్యలో ఒక కడ్డీ ఉంటుంది. దానికి చుట్టూ అన్ని వైపులా ప్లాస్టిక్ కుంచెలు ఉంటాయి. కీటకాల గుడ్లు ఉన్న విత్తనాలను రంధ్రాలు ఉన్న పాత్రలో ఉంచి మధ్యలోని కడ్డీని ముందుకు, వెనుకకు పది నిమిషాల పాటు రోజుకు మూడుసార్లు (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) పూర్తిగా ఒకసారి చుట్టూ తిప్పాలి. త్రిప్పుతున్న కడ్డీకి ఉన్న కుంచెలు చేసే పనితో గుడ్లు నాశనమయి ఆ విధంగా నష్టం నివారించబడుతుంది. దీనివలన విత్తనాల అంకురోత్పత్తికి ఏ విధమైన నష్టమూ జరగదు.

కొత్త కల్పన వలన ప్రయోజనాలు

  • అంకురోత్పత్తి దెబ్బతినకుండానే విత్తనాలమీద ఉన్న గుడ్లను తొలగించడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది.
  • ఒకసారి పురుగుల గ్రుడ్లను తొలగిస్తే, నిల్వ సమయంలో తర్వాత అవి పెరిగే అవకాశం ఉండదు.
  • కుమ్మరి పురుగులు పెట్టిన గ్రుడ్లను తొలగించడంద్వారా అపరాల నిల్వలలో వాటి సంతానం పెరగ కుండా ఆపడం మీద విశేషమైన ప్రభావం ఉంటుంది.
  • రైతులు సాధారణంగా అపరాలకు ఆశించే ఈ బీటిల్ పురుగులకు భయపడి అపరాలను నిల్వ చేయడానికి భయపడతారు. ఇప్పుడు కనుగొన్న ఈ పరికరం రైతులనుంచి ఆ భయాన్ని పోగొట్టి వారు “తమ సొంత విత్తనాలను తయారు చేసుకోడానికి” ప్రేరణ కల్పిస్తుంది.
  • ఈ పరికరానికి పేటెంట్ హక్కులు పొందారు మరియు దీనిని వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారు.

గిడ్డంగుల్లో నిల్వలను ఆశించే కీటకాల పర్యవేక్షణకు వల

అప్లికేషన్ లో కొత్తగా కనుగొనబడిన ఈ పరికరం బస్తాల్లోని ధాన్యాన్ని ఆశించే పురుగులను పట్టుకోవ డానికి సంబంధించినది. దీనిలో వ్యాసం 1.8 నుంచి 2.0 సెం.మీ మధ్య ఉండే ఒక ప్రధాన గొట్టం ఉంటుంది. ఇది బోలుగా ఉంటుంది. దీనిపై భాగాన 1.8 నుంచి 2.0 మి.మీ వ్యాసంలో సమాన దూరంలో రంధ్రాలు ఉంటాయి. ఈ గొట్టం ఒక చివరన వంపు తిరిగి ఉంటుంది. ఇది ఒక పారదర్శక పాత్రకు కలుపబడి ఉంటుంది. వంపునుంచి కిందకు పడే పురుగులు ఈ పాత్రలోకి చేరతాయి. ఈ ప్రధాన గొట్టం రెండో చివర మూసివేయబడి ఉంటుంది.

కొత్త కల్పన వలన ప్రయోజనాలు

  • ఆహారధాన్యాల గిడ్డంగుల్లోని బస్తాలలోపల చేరే పురుగులను గోధాములకు ఏ విధమైన నష్టం లేకుండా పట్టుకోడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది.
  • పురుగులను పట్టుకోడానికి ఈ పరికరంలో ఏ విధమైన ఎరనూ ఉంచాల్సిన అవసరంలేదు.
  • బస్తాలలోని వివిధ పొరలలో కీటకాలు ఏ విధంగా ఆశ్రయం ఏర్పరుచుకుంటాయో అధ్యయనం చేయడానికి ఈ పరికరం బాగా ఉపయోగిస్తుంది.
  • బస్తాలలోని వివిధ పొరలలో పొగబెట్టిన వెంటనే తర్వాత బస్తాలలోని ధాన్యాలపై దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి ఈ పరికరం పనికొస్తుంది.
  • పొలం స్థాయిలోనే రైతులు తమ పంటను బస్తాలలో నిల్వచేసేటప్పుడు కూడా ఈ పరికరం ఉపయోగపడుతుంది

ధాన్యం నిల్వలనాశించే కీటకాల యాజమాన్యానికి తమిళనాడు వ్యవసాయ విద్యాలయం (టీ.ఎన్.ఎ.యు) వారి పరికరాలు

ప్రజలకు సమానంగా, సమతూకంలో పంపిణీ చేయడంకోసం ఆహారధాన్యాలను గిడ్డంగులలో వివిధ సమయాలలో సంవత్సరమంతా నిల్వచేస్తారు. నిల్వ చేసిన ధాన్యాలు/విత్తనాలను దెబ్బతీసే సజీవ, అజీవ ప్రాణులలలో కీటకాలు ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాయి. ఇవి ధాన్యాలు/విత్తనాలను పరిమాణాత్మకం గానూ, గుణాత్మకంగానూ కూడా దెబ్బతీస్తాయి. తరచుగా గిడ్డంగుల్లో ఈ కీటకాలు ఎగురుతూ తిరుగుతూ కనిపించినప్పుడు మాత్రమే వాటి ఉనికి తెలుస్తుంది. కాని అప్పటికే వాటి జాతి తామరతంపరగా వృద్ధిచెంది తీవ్ర నష్టం జరిగిపోయి ఉంటుంది. అందువల్లనే ఈ కీటకాలను సరైన సమయంలో పసిగట్టడం వలన భారీ నష్టాలను నివారించవచ్చు.

కీటకాలు తిరిగే స్వభావాన్ని ఉపయోగించుకుని ఆహారధాన్యాల నిల్వల్లో వాటి జాడను పసిగట్టి సరైన సమయానికి వాటిని అదుపుచేసే పరికరాలను టీ ఎన్ ఏ యూ రూపొందించింది. వీటిలో టీ ఎన్ ఏ యూ పసిగట్టే వల, టీ ఎన్ ఏ యూ ఉచ్చు వల, టూ ఇన్ వన్ నమూనా వల, సూచిక పరికరం, ఆటోమేటిక్ పురుగుల నిర్మూలన కుండీ, అతి నీలి లోహిత (యూ వీ) దీపం వల టెక్నాలజీ, గ్రుడ్ల నిర్మూలన పరికరం మరియు కుప్ప వల వంటి పరికరాలు ఉన్నాయి. ఈ పరికరాలని పలుచోట్ల విస్తృతంగా వాడుతునారు రాష్ట్ర, జాతీయస్థాయిలో మంచి గుర్తింపు లభించింది.

కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం (టీ ఎన్ ఏ యూ)వారి వ్యవసాయ కీటక శాస్త్ర విభాగం, మొక్కల సంరక్షణ అధ్యయన కేంద్రం కలసి పై పరికరాలన్నిటినీ అభివృద్ధి చేసి, వాటిని ఉపయోగించే విధానాలను తెలిపే సీడీ-రామ్ తో సహా ధాన్యం నిల్వలనాశించే పురుగుల యాజమాన్య కిట్ పేరుతో రూపొందించారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్నిదేశమంతటా వ్యాప్తి చేయడంలో ఈ కిట్ బాగా ఉపయోగపడుతుంది. విద్యాకేంద్రాలు, విస్తరణ కేంద్రాలు (కృషి విజ్ఞాన కేంద్రాలు, ప్లాంట్ క్లినిక్, ధాన్యాలని కాపాడే కేంద్రాలు) మరియు ప్రైవేటు గిడ్డంగులకి కూడా ఎవరికి వారే నేర్చుకోవడానికి ఈ కిట్ ఆదర్శవంతంగా ఉంటుంది.

మూలం: www.ppqs.gov.in

ఆహార భద్రతా ప్రమాణాలు సూచికలు

అనేక దశాబ్దాలకు పూర్వం నుండి ఆహారోత్పత్తి, ఎగుమతి మరియు ఆరోగ్య విభాగాలలో భారతదేశాన్ని ప్రాముఖ్యతాముద్రలున్నాయి. పాలు, చెరకు, జీడిపప్పు, సుగంధద్రవ్యాల ఉత్పత్తిలొ ప్రథమ స్థానాన్ని, బియ్యం, గోధుమ, అపరాలు, పండ్లు(బ్రెజిల్‌తర్వాత) మరియు కాయగూరల లో (చైనా తర్వాత) రెండవ ప్రధాన ఉత్పాదక దేశము. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతిలో మూడుశాతంకన్నా తక్కువ భాగస్వామ్యం ఉంది. చాలా కీలక అంశాలను పరిగణలోనికి తీసుకోవలసిన అవసరముంది. సంస్థాగతసమన్వయం, సాంకేతిక నైపుణ్యం లేకపోవడం, పరికరాల కొరత, ఎప్పటికప్పుడు ప్రమాణాలు పెంచలేకపోవడం, ప్రతిస్పందించే నియంత్రణా విధానం లేకపోవడంతో బాటు వ్యవస్థీకరింపబడిన, వ్యవస్థీకరింపబడని విభాగాలతో కూడిన పరిశ్రమలో ఆహారాన్ని భద్రపరచే చోట నాణ్యతా ప్రమాణాల విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడంలో అవగాహనలోపం వలన, ఆహారంతో వచ్చే జబ్బులు ఎక్కువవుతాయి. రోగకారక సూక్ష్మ జీవుల పుట్టుక ఎక్కువ వేగవంతమౌతుంది. ప్రపంచ వాణిజ్య సంస్థననుసరించి జన్యుపరంగా మార్పుచెందిన ఆహారం, ఆహారోత్పత్తులలో దిగుమతి పెరుగుదల ఉంటుంది. పరిశోధన, అభివృద్ధి, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇచ్చే తాజా సమాచారవ్యవస్థలు బలహీనంగా ఉండడంవలన తోడ్పాటు కావాలి . ఇంకను కేంద్రం నుండి రాష్ట్రానికి అదేవిధంగా రాష్ట్రం నుంచి కేంద్రానికి వేగవంతంగా సమాచారం అందాలి.

ఆహార భద్రతా ప్రమాణాలు ఎందుకు అవసరం?

అంతర్జాతీయ ఆహారవాణిజ్యం అతి సంక్లిష్టతతో, సాంకేతికత, పరిపాలన ప్రక్రియలతో ప్రపంచీకరణ పురోగతితో కూడి ఉంటుంది. అధికమొత్తంలో వైవిధ్యమైన ఆహారోత్పత్తిఉంటుంది. ఆహారోత్పతి శాస్త్రీయపద్దతిలో చేయ వలసి వుంటుంది. ఆహారాన్ని ఆరోగ్యకరమైన స్థితిలో చెప్పుకోదగ్గ నాణ్యతాలోపం లేకుండా ఎంత దూర ప్రదేశానికైన రవాణా చేయవచ్చు. గతంలోలాగాకాక, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు, బహుళ వైవిధ్యంతో, అధికనాణ్యతతో, ఎక్కువ పరిమాణంలో గల ఆహారం అందుబాటులోఉంటున్నది. అంతర్జాతీయ వాణిజ్యంలో గుర్తించదగిన పరిమాణం, వైవిధ్యంలో పెంపుదల అనే రెండు అభివృద్ధులు సంచలనం కల్గించాయి. మొదటిది, అనేక దేశాలలో ముఖ్యంగా అభివృద్ధిచెందుతున్న దేశాలు నాటకీయంగా పరిమాణపరంగా ఆహార ఎగుమతులను చేపట్టాయి. రెండవది అంతర్జాతీ యపరంగా రుచులు, అలవాట్లు. మొదటిది ఆర్ధికాభివృద్ధి, వాణిజ్యసరళి, విదేశీద్రవ్యమారకాన్ని కలిసి సంపాదించుకోవడం. రెండవది వివిధ దేశాల ప్రజలు ఒకరి ఆహారపు రుచులు వేరొకరు ఇష్టప డడం.

సఫలీకృత ఎగుమతిదారులు ఎవరంటే, దిగుమతి చేసుకునే దేశాల వినియోగదారులకు ఆమోదకరమైన ఆహారాన్ని, దిగుమతి దేశం శాసనాలకనుగుణంగా పాటించి ఎగుమతి చేసేవారు. దిగుమతి దేశం విధించిన తప్పని సరి అవసరాలను షరతులను ముందుగానే పాటించి ఆహారాన్ని ఎగుమతి చేయడం లాభదాయకం. అయినప్పటికి ఆహార భద్రత విషయంలో ప్రపంచ జనాభా యావత్తు అవసరాలను షరతులను పాటించాల్సిందిగా కోరుతోంది. దీనితో బాటు దిగుమతి చేసుకొనే దేశాల సంఖ్య పెరిగిన కొద్దీ వారు ఆమోదించిన ఉత్పత్తులపై తనిఖీ, పరీక్ష విధానాలతో బాటు, ఆహార నాణ్యత, భద్రతలపై ఎగుమతి దేశాల ప్రభుత్వాల ధృవీకరణ కావాలి.

పౌష్టికాహార సంస్థ నియమం అంటే ఏమిటి?

ఆహారఉత్పత్తిని పొందడం లోసూత్రీకరణ ప్రమాణాలు మార్గదర్శక సూత్రాలు ఇతర సూచనలు పౌష్టికాహార సూత్రాలు (అనగా లేటిన్‌ భాషలో ఆహార నియమం లేదా ఆహార సూత్రం) అంటే ఆహార ప్రమాణముల సముదాయం. ఒకేరీతిలో ఉండే నియమాల ఆచరణ మరియు ఇతర సూచనలు. నియమాల ప్రమాణాలు, మార్గదర్శకాలు మరియు ఇతర సూచనల పాటించడం వల్ల ఆహారోత్పత్తులు వినియోగదారులకు హానికల్గించవని దీనివల్ల దేశాలమధ్య వాణిజ్యభద్రత ఉంటుంది.

1940 మరియు 1950 సం||ల ప్రపంచ యుద్ధాల తర్వాత ఎగుమతిదారులకు ప్రభుత్వాలకు మద్య సామరస్య విధానంలో జాతీయ ఆహార సూత్రాలు, నియమాలను అనుసరించి అన్నిదేశాలు స్వేచ్చా వాణిజ్యం సాగించే వీలు ఏర్పడింది. అనేక అపజయాల అనంతరం ప్రామాణికత కల్గిన అంతర్జాతీయ ఆహారనియమాలు మరియు దీనితో బాటు ప్రపంచ వ్యాప్తంగా ఆహార అవసరాలు నియమబద్ధంగా ఏర్పడడం జరిగింది. చివరికి ఇంతకృషి ఫలితంగా పౌష్టికాహార సంస్థ (CAC)నియామకం 1962 సం||లో జరిగి ఆహార వ్యవసాయ సంస్థ, యునైటెడ్‌ నేషన్స్‌ (FAO) మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థలు (WHO) కలిసి (FAO)/ (WHO) ఆహార ప్రమాణాల కార్యక్రమం అమలు చేసింది. ఈకార్యక్రమ ఉద్ధేశం క్లుప్తంగా, వినియోదారుల ఆరోగ్యాన్ని కాపాడడం, అనుకూల వ్యవహారాలతో ఆహార వాణిజ్యంలోను మరియు అంతర్జాతీయ ఆహార ప్రమాణాల పై సమన్వయంతో కృషిచేయడం. 168 ప్రభుత్వాల సభ్యులతో కలిసిన అంతర్గత ప్రభుత్వకూటమిగా (CAC) ఉన్నది .

నియామాల సాధారణ పరిశీలన

ఈ పౌష్టికాహార సంస్థ (CAC) ఆహార అమ్మకాలలో, ఉత్పత్తి వ్యవహారాలలో, వినియోగదారుల రక్షణకు సంబంధించి ప్రమాణలను, నిపుణుల స్పష్టమైన అభిప్రాయాలను సమన్వయ పరచి ఆహారంలోని ప్రతీ అంశానికి విశ్వవ్యాప్త నాయకత్వం వహిస్తుంది. ఈ విషయంలో నియమాల సరళి(కోడెక్స్‌)ఏంచేస్తుంది? అనే ప్రశ్నతో ప్రతీచోట వర్తకులు, వినియోగదారులు, శాస్త్రవేత్తలు, నియంత్రణాధికారులు, శాసన సభ్యులు, ప్రతి ఒక్క ఖాతాదారుడు నేడు అడుగుతున్నాడు.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO’s) ఒప్పందంలోని ఆహార రక్షిత ప్రమాణాల నిర్వచనంలో పారిశుద్ధ్యం, మొక్కల ఆరోగ్య పరిరక్షణ ప్రమాణాల (SPS) నియోజనంలో సంబంధిత ఆహారంతో చేర్చబడిన పదార్ధాలు, జంతువుల మందులు, మరియు తెగుళ్ల నివారణ మందుల అవశేషాలు, కలుషితాలు, విశ్లేషణ మాదిరి విధానాలు, సరుకుల వివరాలను తెల్పే లేబుల్స్‌, సంకేతాలు, ఆరోగ్యసాధనకు మార్గదర్శకాలు ఉంటాయి. ప్రపంచ వాణిజ్య సంస్థలో నిర్ధేశిత అంశంగా ఆహార భద్రతా ప్రమాణ నియమాల వినియోగం ఉంటుంది.

ఆహార పరిశుభ్రత అనేది సంఘం ఏర్పడినప్పటినుంచి CAC లోని ప్రధాన కార్యక్రమ విభాగం. యునైటెడ్‌ నేషన్స్‌ ప్రభుత్వం 1963లో ఏర్పరచినప్పుడే ఆహార పరిశుభ్రతపై సంఘ నియమాలు ఏర్పడ్డాయి. ఎగుమతి చేసే దేశాలకు ఉత్తమ క్రమబద్ధమైన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తి, ప్రక్రియ దశలోను, సంఘానికి ఆరోగ్య సాధనా నియమాలతో తయారై న ఉత్పత్తి ప్రమాణాలు సూక్ష్మ జీవ ప్రమాణాలకన్నా ప్రధానమైనది. విపత్తు విశ్లేషణ, క్లిష్టమైన నియంత్రణా అంశ (HACCP) విధాన నియోజన మార్గదర్శకాలను ఆరోగ్యకరమైన ఆహార విషయంలో CAC స్వీకరిస్తుంది. ఇలా చేయడం ద్వారా HACCP పనిముట్టుగా విపత్తును అంచనావేసి నియంత్రణ విధానాన్ని ఏర్పరచి, తయారైన ఉత్పత్తి పరీక్షలపై ప్రాథమికంగా ఆధారపడకుండా నివారణ చర్యలపై దృష్టిసారించడం.

జాతీయ నియమాల స్మృతి పరిచయ కేంద్రం (NCCP)

ఈ జాతీయ నియమాల స్మృతి పరిచయ కేంద్రం (NCCP) కేంద్ర స్థానంగా ఉండి దేశాల అధికార సభ్యుల జాతీయ అధికార స్మృతి (కోడెక్స్‌) కి ఆహార, వ్యవసాయ సంస్థ FAO ప్రధాన కార్యస్థానం గల సచివాలయ స్మృతికి అనుసంధానంగా ఉంటుంది. స్మృతి ప్రతులను ప్రచురణలు, ఇతర సమాచారాలను ప్రారంభక గ్రహీతగా అందుకుంటుంది. స్మృతి ప్రమాణములతో గ్రంధాలయాన్ని నిర్వహిస్తూ, నియమాల సాధన మరియు మార్గదర్శకాలను కలుపుకొని ప్రతులతో సహా సానుకూల చర్యతో ప్రారంభకంగా CAC దాని ఉపసంఘాల గురించి, ఉద్దేశాలు, లక్ష్యాలు, వాటి పనిపై అవసరమగు చోట్ల ప్రేరణను కల్గించడం.

జాతీయ స్మృతి సంఘాలు (NCC)

చాలా దేశాల స్మృతి సభ్యులకు వేదికను ఏర్పరచి, స్మృతి విషయాలు, ముసాయిదా ప్రమాణాలు , స్మృతి, ఇతర వ్రాతప్రతుల పై చర్చ మరియు స్మృతికి లోబడి జాతీయ స్థితిలో గల అన్ని విషయాలను చర్చించడం. NCCP లో ప్రభుత్వ సంస్థలను, విద్యా కేంద్రాలను, పరిశ్రమలను మరియు వినియోగదారు సంస్థలను అదనముగా కలుపుకోవడం.

ఎఫ్ ఎ ఓ, (FAO) తోడ్పాటు

యునైటెడ్‌ నేషన్స్‌ ఆహార, ఆరోగ్యసంస్థ వ్యవసయం (FAO) యొక్క ప్రధానమైన, ప్రత్యేకమైన కార్యక్ర మం ఆహార ఆరోగ్య విషయాలన్నింటి పైన పనిచేయడం. ఆహార నాణ్యత, ప్రమాణాలసేవ, సామర్ధ్యతా నిపుణత మరియు విధానసలహాలను అందించడంలో సాంకేతిక తొడ్పాటుతో ఆహారం, పోషణ విభాగం పనిచేస్తుంది. ఆహారపరిశ్రమ కొరకు ఆహార నాణ్యత నియంత్రణ, ఆహార ప్రమాణాల అభివృద్ధి మరియు సాంకేతికతా నిబంధనలు, ఆహారనాణ్యత భద్రతనివ్వడంలో జరిగే కార్యక్రమాలను కలుపుకొని ఆహారనాణ్యతా నియంత్రణ మరియు భద్రతా అభివృద్ధి పథకాలను అమలుపరచడం. జాతీయ ఆహారఎగుమతి ధృవీకరణ కార్యక్రమాలు, పర్యవేక్షక కార్యక్రమాలను, కలుషితమైన ఆహారం తెలుసుకోవడం కొరకు ఏర్పరచింది. ఇది ఆహార నియంత్రణాం శాలపై ప్రాంతీయ, జాతీయ చర్చా వేదికలను నిర్వహించడం, కృత్యశాలలను ఆహార, వ్యవసాయ సంస్థలోగల వివిధ దేశ సభ్యుల తోడ్పాటుతో అన్ని కార్యక్రమాలను తీసుకొని ఆహారనియంత్రణా సామర్ధ్యతా నిపుణత కొరకు ఆహార నియంత్రణా కార్యక్రమాలను, కార్యకలాపాలను బలోపేతం చేయడం.
దీనిలోనిఅంశాలుః

  • ప్రత్యేక అంశాల పై విధాన సలహాలు
  • సంస్థాగత అభివృద్ధి లేదా సంస్థలను బలోపేతంచేయడంలో; సమీక్షలు, ఆహారంలో తాజా శాసనాలు
  • స్మృతి మరియు ఇతర అంతర్జాతీయ నియమ, నిబంధనలతో ఆహార నిబంధనలను, ప్రమాణాలను పొందడం
  • సాంకేతిక, నిర్వాహక సిబ్బందికి వివిధ ఆహార భద్రతా సంబంధించిన విషయాలపై శిక్షణనివ్వడం.
  • ప్రత్యేక ఆహార సంబంధిత విషయాలపై అధ్యయనాలు, అనువర్తిత పరిశోధనలను చేయడం.

సామర్ధ్యతా నిపుణత కొరకు ప్రాంతీయ, జాతీయ కృత్యశాలలు నిర్వహించడం. ఆహార భద్రతా సంబంధిత అంశాలపై చర్చా వేదికలను నియమ సంపుటీలను, మార్గదర్శకాలను సమాచారం కొరకు అందివ్వడం. ఇతరసాధనాలతో ఆహార నియంత్రణ, ఆహారభద్రతాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం.

వ్యక్తిగతంగా ఆహార నియంత్రణ సమర్ధతను పెంచడము FAO యొ క్క ప్రధానాంశం. దీనికి ప్రభుత్వ అధినేతలు, ఆహారపరిశ్రమసిబ్బంది లో ఎవరైతే ఆహారాన్ని అందిస్తారో వారికి ఆహార నాణ్యత, భద్రతను పొందడంలో కార్యక్రమాలను నిర్వహిస్తారు. FAO లోభాగంగా అభివృద్ధి చెందుతున్నదేశాల కొరకు సాంకేతిక సహకార కార్యక్రమం చేయడం. ఈపథకం TCP/ IND/0067- నేషనల్ కోడెక్స్ కాంటాక్టు పాయింటు (NCCP) బలోపేతం చేయడంలో భారతదేశంలోగల FAO మరియు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, NCCP లు అమలుచేస్తాయి. ఈపథకం క్రింద ఆరోగ్య మంత్రిత్వశాఖ యొక్క ఆహర విభాగంలొ NCCP ఏర్పాటైంది. అత్యాధునికమైన సమాచార వ్యవస్థతో ఆధునాతన సౌకర్యాలతో పరస్పర చర్చలకు ఆహారనాణ్యత, భద్రతాంశాలపై పని చేసే ప్రతీ మౌలిక వ్యక్తికి అవకాశాన్ని ఇవ్వడం. మరిన్ని వివరాలకు నేషనల్ కోడెక్స్ కాంటాక్టు పాయింటు వారి వెబ్ సైటును సందర్శించండి.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 4/11/2023



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate