ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఎన్ డి ఎం ఏ; వేసవి నెలల్లో ఆస్పత్రులలో అగ్నిప్రమాదాల నివారణపై చర్యలు చేపట్టాల్సిందిగా ఉమ్మడి సూచనలు జారీ
వేసవి నెలల్లో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు గణనీయమైన ముప్పుగా పరిణమిస్తాయి. దీనిని నివారించడానికి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ డి ఎం ఏ) అన్ని రాష్ట్రాలు/యుటిలకు ఉమ్మడి సలహాను జారీ చేశాయి, ఇటువంటి విధ్వంసకర సంఘటనలను నివారించడంలో ముఖ్యమైన క్రియాశీల చర్యల గురించి పేర్కొన్నాయి.